sales growth
-
ఆ కంపెనీల ఆదాయం పెరిగింది: ఆర్బీఐ
ముంబై: ప్రైవేట్ రంగంలో ఉన్న ఆర్థికేతర లిస్టెడ్ కంపెనీల ఆదాయం 2024-25 ఆర్థిక సంవత్సరం మూడవ త్రైమాసికంలో 8 శాతం పెరిగిందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) వెల్లడించింది. గత ఏడాది ఇదే కాలంలో ఇది 5.5 శాతంగా ఉందని తెలిపింది. జూలై–సెప్టెంబర్ కాలంలో అమ్మకాల వృద్ధి 5.4 శాతం నమోదైంది.డిసెంబర్ త్రైమాసికంలో ప్రైవేట్ కార్పొరేట్ రంగం పనితీరుపై 2,924 ఆర్థికేతర లిస్టెడ్ కంపెనీల సంక్షిప్త త్రైమాసిక ఆర్థిక ఫలితాల ఆధారంగా ఆర్బీఐ నివేదిక రూపొందించింది. ఆటోమొబైల్స్, రసాయనాలు, ఆహార ఉత్పత్తులు, విద్యుత్ యంత్రాల పరిశ్రమలలో అధిక అమ్మకాల జోరు కారణంగా 1,675 లిస్టెడ్ ప్రైవేట్ తయారీ కంపెనీల ఆదాయ వృద్ధి 7.7 శాతానికి మెరుగుపడింది.పెట్రోలియం, ఇనుము, ఉక్కు, సిమెంట్ పరిశ్రమల ఆదాయం వార్షిక ప్రాతిపదికన తగ్గింది. ఐటీ కంపెనీల టర్నోవర్ 6.8 శాతం ఎగిసింది. గత ఏడాది ఇదే కాలంలో ఇది 3.2 శాతంగా ఉంది. ముడి పదార్థాలపై తయారీ కంపెనీల ఖర్చులు 6.3 శాతం దూసుకెళ్లాయి. వేతనాల ఖర్చు అధికంగా 9.5 శాతం పెరిగింది. ఇది ఐటీలో 5 శాతం, ఐటీయేతర సేవల కంపెనీల్లో 12.4 శాతం అధికమైంది. 2024 అక్టోబర్–డిసెంబర్లో లిస్టెడ్ నాన్–ఫైనాన్షియల్ కంపెనీల ప్రాఫిట్ మార్జిన్ వరుసగా 50 బేసిస్ పాయింట్లు వృద్ధి చెంది 16.2 శాతానికి చేరుకుందని ఆర్బీఐ తెలిపింది. -
భారత్లో ఐఫోన్ టాప్
న్యూఢిల్లీ: ‘భారత్లో అత్యధికంగా అమ్ముడవుతున్న స్మార్ట్ఫోన్ మోడల్గా ఐఫోన్ అవతరించింది. రికార్డు స్థాయిలో వ్యాపారాన్ని నమోదు చేసిన భారత్పై కంపెనీ చాలా ఆసక్తిగా ఉంది’ అని యాపిల్ సీఈవో టిమ్ కుక్ శుక్రవారం తెలిపారు. కౌంటర్పాయింట్ రిసర్చ్ ప్రకారం భారత స్మార్ట్ఫోన్ విపణిలో 2024లో విలువ పరంగా 23 శాతం వాటాతో యాపిల్ అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. అలాగే స్మార్ట్ఫోన్స్ సంఖ్య పరంగా టాప్–5గా నిలిచింది. ‘అభివృద్ధి చెందుతున్న మార్కెట్లో గొప్ప ఫలితాలను సాధించాం. ముఖ్యంగా భారత్పై నేను ఆసక్తిగా ఉన్నాను. డిసెంబర్ త్రైమాసికంలో భారత్ రికార్డును నెలకొల్పింది. ఈ త్రైమాసికంలో ఐఫోన్ అత్యధికంగా అమ్ముడైంది. ప్రపంచంలో స్మార్ట్ఫోన్లకు రెండవ అతిపెద్ద, పర్సనల్ కంప్యూటర్స్, టాబ్లెట్ పీసీలకు భారత్ మూడవ అతిపెద్దది మార్కెట్. కాబట్టి ఇక్కడ భారీ మార్కెట్ ఉంది. మరిన్ని యాపిల్ ఔట్లెట్లను ప్రారంభించే యోచనలో ఉన్నాం. యాపిల్ ఇంటెలిజెన్స్ను విస్తరిస్తున్నాం. స్థానికీకరించిన ఇంగ్లీష్ వెర్షన్ను భారత్లో ఏప్రిల్లో విడుదల చేస్తాం’ అని టిమ్ కుక్ వివరించారు. కాగా, డిసెంబర్ త్రైమాసికంలో యాపిల్ మొత్తం ఆదాయం రికార్డు స్థాయిలో 4 % వృద్ధితో 124.3 బిలియన్ డాలర్లు నమోదైందని వెల్లడించారు. లాభం 7 శాతం క్షీణించి 33.91 బిలియన్ డాలర్లకు చేరింది. -
వచ్చే ఏడాదిపై ఆడి కంపెనీ ఆశలు
న్యూఢిల్లీ: వచ్చే ఏడాది అమ్మకాలు తిరిగి పుంజుకుంటాయని ఆశిస్తున్నట్లు లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆడి ఇండియా తెలిపింది. సరఫరా అంతరాయాలతో ప్రస్తుత సంవత్సరంలో కంపెనీ పనితీరుకు ఆటంకం కలిగింది. 2024 మొదటి రెండు త్రైమాసికాల్లో ఎదుర్కొన్న సరఫరా సవాళ్ల నుండి కోలుకుని వచ్చే సంవత్సరంలో అమ్మకాలు 8–10 శాతం పెరుగుతాయని ఆడి అంచనా వేస్తోంది.‘భారత్లో 2024లో లగ్జరీ కార్ల పరిశ్రమ వృద్ధి 8–10 శాతం శ్రేణిలో ఉంటుందని అంచనా వేస్తున్నాం. కంపెనీ సైతం ఇదే విధమైన వృద్ధిని ఆశిస్తోంది’ అని ఆడి ఇండియా హెడ్ బల్బీర్ సింగ్ ధిల్లాన్ వెల్లడించారు. గత మూడేళ్లలో భారీ వృద్ధిని కనబరిచిన తర్వాత పరిశ్రమ విక్రయాల వృద్ధి క్షీణించిందని పేర్కొన్నారు. ఈ సంవత్సరం జనవరి–సెప్టెంబర్లో పరిశ్రమ వృద్ధి దాదాపు 5 శాతంగా ఉంది. గత మూడేళ్లలో 30 శాతం వార్షిక వృద్ధిని సాధించిందని తెలిపారు. అత్యధిక వార్షిక విక్రయాలు.. లగ్జరీ కార్ల పరిశ్రమ ఈ సంవత్సరం ఎన్నడూ లేనంత అత్యధిక వార్షిక విక్రయాలు 50,000 యూనిట్ల మార్కును దాటుతుందని విశ్వసిస్తున్నామని బల్బీర్ సింగ్ ధిల్లాన్ అన్నారు. మొదటి రెండు త్రైమాసికాల్లో కార్ల సరఫరా తగినంతగా లేనందున 2024 ఆడి ఇండియాకు కఠిన సంవత్సరంగా మారిందని పేర్కొన్నారు. కాబట్టి ఈ ఏడాది ఎదగలేమని, వచ్చే సంవత్సరం బలంగా తిరిగి పుంజుకుంటామని వివరించారు.కాగా, ఎస్యూవీ క్యూ7 కొత్త వెర్షన్ను సంస్థ పరిచయం చేసింది. కంపెనీ ఇప్పటి వరకు భారత్లో 10,000 యూనిట్లకు పైగా క్యూ7 మోడల్ కార్లను విక్రయించింది. ఈ ఫ్లాగ్షిప్ మోడల్ను కలిగి ఉండాలనే కస్టమర్ల నిరంతర కోరిక ఇందుకు నిదర్శనమని ధిల్లాన్ పేర్కొన్నారు. క్యూ7 రెండు వేరియంట్లలో లభిస్తుంది. ధర ఎక్స్షోరూంలో రూ.88.66 లక్షల నుంచి ప్రారంభం. -
ఏసీల డిమాండ్ ఎలా ఉండనుందంటే..
కోల్కతా: ఉష్ణోగ్రతల్లో తీవ్ర అస్థిరతల నేపథ్యంలో దేశంలో రూమ్ ఏసీల వినియోగం ఏటా గణనీయంగా పెరుగుతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2024–25) పరిశ్రమ అసాధారణ వృద్ధిని చూడనుందని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అంచనా వేసింది. క్రితం ఆర్థిక సంవత్సరం కంటే 20–25 శాతం అధికంగా 1.2–1.25 కోట్ల రూమ్ ఏసీ యూనిట్లు అమ్ముడుపోవచ్చని పేర్కొంది. అంతేకాదు వచ్చే ఆర్థిక సంత్సరంలోనూ (2025–26) రూమ్ ఏసీల అమ్మకాలు 10–12 శాతం మేర పెరుగుతాయని అంచనా వేస్తున్నట్టు తెలిపింది. ఉష్ణోగ్రతలు పెరిగిపోతుండడం, ఒక ఇంట్లోనే ఒకటికి మించిన గదుల్లో ఏసీలను ఏర్పాటు చేసుకుంటుండటం, పట్టణీకరణ, ఖర్చు చేసే ఆదాయంలో వృద్ధి, సులభతర కన్జ్యూమర్ ఫైనాన్స్ (రుణాలపై కొనుగోలు) సదుపాయాలు... ఇవన్నీ వచ్చే కొన్నేళ్ల పాటు రూమ్ ఏసీల డిమాండ్కు మద్దతుగా నిలుస్తాయని ఇక్రా తన నివేదికలో పేర్కొంది. ‘‘దేశీ రూమ్ ఏసీ పరిశ్రమ కరోనా ముందు నాటి విక్రయాల పరిమాణాన్ని 2023–24లోనే అధిగమించింది. వాతావారణంలో వచి్చన మార్పులు, సానుకూల వినియోగ ధోరణులు మద్దతుగా నిలిచాయి’’అని ఇక్రా కార్పొరేట్ రేటింగ్స్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ శ్రీకుమార్ కృష్ణమూర్తి వివరించారు. ఏడాదిలో అధిక వేడి ఉండే సగటు రోజులు గడిచిన మూడు దశాబ్దాలుగా పెరుగుతూ వస్తున్నట్టు చెప్పారు. ఈ ఏడాది వేసవి సీజన్లో అయితే రూమ్ ఏసీలకు సంబంధించి కొన్ని కంపెనీలు (ఓఈఎంలు) 40–50 శాతం వరకు అధిక అమ్మకాలను నమోదు చేయడం గమనార్హం. సామర్థ్యాల పెంపుపై దృష్టి.. ‘‘సరఫరా వైపు చూస్తే దేశీ రూమ్ ఏసీ సామర్థ్యం వచ్చే మూడేళ్లలో 40 శాతం పెరగనుంది. పెరుగుతున్న డిమాండ్కు అనుగుణంగా ఓఈఎంలు, కాంట్రాక్టు తయారీదారులు రూమ్ ఏసీల తయారీ సామర్థ్యాన్ని పెంచుకుంటున్నారు’’అని కృష్ణమూర్తి తెలిపారు. కేంద్ర ప్రభుత్వం కన్జ్యూమర్ డ్యూరబుల్ విడిభాగాలకు పీఎల్ఐ పథకం కింద ప్రకటించిన ప్రయోజనాల ప్రభావాన్ని సైతం ఇక్రా నివేదిక గుర్తు చేసింది. రూమ్ ఏసీ పరిశ్రమలో స్థానిక తయారీ పెరగడానికి పీఎల్ఐ పథకం దోహదం చేసినట్టు తెలిపింది. మూడు లిస్టెడ్ రూమ్ ఏసీ కంపెనీలు జూన్తో ముగిసిన మొదటి త్రైమాసికంలో 53 శాతం మేర ఆదాయ వృద్ధిని నమోదు చేయడాన్ని ప్రస్తావించింది. వేసవి సీజన్లో డిమాండ్ గరిష్ట డిమాండ్కు నిదర్శనంగా పేర్కొంది. ఈ కంపెనీలు గత ఆర్థిక సంవత్సరంలో 17 శాతం మేర ఆదాయంలో వృద్ధిని సాధించగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనూ 25 శాతం అధిక ఆదాయాన్ని నమోదు చేస్తాయని ఇక్రా అంచనా వేసింది. తీవ్ర పోటీ, తయారీకి వినియోగించే విడిభాగాల ధరల్లో అస్థితరలు ఉన్నప్పటికీ.. రూమ్ ఏసీ కంపెనీల లాభాల మార్జిన్లు రానున్న కాలంలో క్రమంగా మెరుగుపడతాయని పేర్కొంది. -
Lok sabha elections 2024: ఎన్నికల ఎఫెక్ట్... టూ వీలర్లు, ఫ్రిజ్ సేల్స్ రయ్!
సార్వత్రిక ఎన్నికల కారణంగా ఆటోమొబైల్, గృహోపకరణాల మార్కెట్లో సందడి నెలకొంది. ముఖ్యంగా ఎంట్రీ లెవెల్ టూ వీలర్లు, గృహోపకరణాలకు ఒక్కసారిగా డిమాండ్ పుంజుకుంది. ఇదంతా ఎన్నికల చలవేనంటున్నాయి పరిశ్రమ వర్గాలు. నిజానికి వీటి కొనుగోళ్లు కొద్ది నెలలుగా తీవ్రంగా మందగించాయి. ఎన్నికల హడావుడి మొదలయ్యాక ఏప్రిల్, మే నెలల్లో వీటి అమ్మకాలు భారీగా పెరిగాయి. 125 సీసీ వరకు ఇంజిన్ సామర్థ్యం, రూ.లక్ష వరకు ధర ఉన్న చిన్న టూ వీలర్ల విక్రయాల్లో 33 శాతం వృద్ధి నమోదైందని ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్ (ఫాడా) ప్రెసిడెంట్ మనీశ్ రాజ్ సింఘానియా వెల్లడించారు. కరోనా విలయం తర్వాత ప్రీమియం టూ వీలర్లకు డిమాండ్ పుంజుకుంటున్నా ఎంట్రీ లెవెల్ విభాగంలో మాత్రం అమ్మకాలు నత్తనడకన వచ్చాయి. ‘‘కానీ ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వాలిచ్చే ప్రోత్సాహకాలకు తోడు పారీ్టలు సైతం భారీగా ఖర్చుకు తెరతీయడంతో అల్పాదాయ కుటుంబాల చేతిలో డబ్బులు ఆడుతున్నాయి. దాంతో చిన్న టూ వీలర్లు, ఫ్రిజ్ల వంటివాటిని భారీగా కొంటున్నారు’ అని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. మండుటెండల దెబ్బకు రిఫ్రిజిరేటర్లు, ఏసీలు, కూలర్ల కొనుగోళ్లు పెరిగాయి. ఎంట్రీ లెవెల్ సింగిల్ డోర్ ఫ్రిజ్లు శరవేగంగా అమ్ముడవుతున్నాయని గోద్రెజ్ అప్లయెన్సెస్ బిజినెస్ హెడ్ కమల్ నంది పేర్కొన్నారు. ‘‘చాలాకాలంగా ఈ విభాగంలో అమ్మకాల వృద్ధి సింగిల్ డిజిట్కే పరిమితమైంది. ఇప్పుడు మాత్రం ప్రీమియం సెగ్మెంట్తో సమానంగా వీటి సేల్స్ నమోదవుతున్నాయి’’ అని వివరించారు. ఎన్నికల ఖర్చు రికార్డ్... రాజకీయ విశ్లేషకుల అంచనా ప్రకారం 2024లో సార్వత్రిక ఎన్నికలు, పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో వ్యయం గత రికార్డులన్నింటినీ బద్దలు కొట్టనుంది. ఈ ఏడాది ఎన్నికల సీజన్లో పార్టీలు, అభ్యర్థుల ఖర్చు రూ.1.35 లక్షల కోట్లు దాటొచ్చని స్వచ్ఛంద సంస్థ సెంటర్ ఫర్ మీడియా స్టడీస్ (సీఎంఎస్)కు చెందిన ఎన్. భాస్కరరావు అంచనా వేశారు. -
ఇళ్ల అమ్మకాలు పెరిగాయ్
ముంబై: బలమైన డిమాండ్ కొనసాగడంతో ఈ ఏడాది మొదటి మూడు నెలల్లో ఇళ్ల అమ్మకాలు 14% పెరిగినట్లు స్థిరాస్తి కన్సల్టెంట్ అనరాక్ గణాంకాలు తెలిపాయి. దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో జనవరి–మార్చి మధ్య మొత్తం 1,30,170 యూనిట్లు అమ్ముడవగా., గతేడాది ఇదే కాలంలో 1,13,775 యూనిట్ల విక్రయాల జరిగాయి. ఇదే త్రైమాసికానికి సగటున ఇళ్ల ధరలు 10–32 % పెరిగాయి. ముంబై మెట్రోపాలిటన్ ప్రాంతం(ఎంఎంఆర్), పూణే, బెంగళూరు, హైదరాబాద్లో అమ్మకాలు పెరిగాయి. ఢిల్లీ–ఎన్సీఆర్, చెన్నై, కోల్కత్తా నగరాల్లో క్షీణించాయి. ► ముంబై మెట్రోపాలిటన్ ప్రాంతంలో ఇళ్ల అమ్మకాలు 24% పెరిగి 42,920 యూనిట్లు అమ్ముడయ్యాయి. పూణేలో 15% పెరిగి 22,990 యూనిట్లు, హైదరాబాద్లో 38% వృద్ధితో 19,660 యూనిట్లు, బెంగుళూరులో 14% అధికంగా 17,790 ఇళ్లు అమ్ముడయ్యాయి. ► ఢిల్లీ ఎన్సీఆర్లో విక్రయాలు 9% క్షీణించి 15,650 యూనిట్లు, కోల్కత్తాలో అమ్మకాలు 9% తగ్గి 5,650 యూనిట్లు, చెన్నైలో ఆరుశాతం తక్కువగా 5,510 యూనిట్లు అమ్మకాలు జరిగాయి. ‘‘ముఖ్యంగా రూ.1.5 కోట్ల; అంతకు మించి పైగా ధరలు కలిగిన ఇళ్లకు అత్యధిక డిమాండ్ కారణంగా గత పదేళ్లలో రికార్డు విక్రయాలు ఈ జనవరి–మార్చి మధ్య నమోదయ్యాయి. వినియోగదారులు, ఇన్వెస్టర్ల నుంచి బలమైన డిమాండ్తో అమ్మకాల్లో వృద్ధి నమోదైంది. పెరిగిన ఇళ్ల స్థలాలు ఆర్థిక వృద్ధి, మౌలిక సదుపాయాల మెరుగుదలను సూచిస్తున్నాయి’’ అని అనరాక్ చైర్మన్ అనుజ్ పురి తెలిపారు. -
2024లో ఆటో సూపర్స్టార్ట్
ముంబై: దేశ ఆటోమొబైల్ పరిశ్రమకు కొత్త సంవత్సరం శుభారంభం ఇచి్చంది. పలు ఆటో సంస్థలు 2024 జనవరిలో గత సంవత్సరం ఇదే నెలతో పోలి్చతే గణనీయమైన అమ్మకాలు జరిపాయి. మారుతీ సుజుకి ఇండియా, టాటా మోటార్స్, హ్యుందాయ్ మోటార్ ఇండియా, మహీంద్రా అండ్ మహీంద్రా, బజాజ్ ఆటో, హోండా మోటార్సైకిల్, స్కూటర్ ఇండియా జనవరి అమ్మకాల్లో మంచి వృద్ధిని నమోదు చేశాయి. మొత్తం అమ్మకాలలో దేశీయ పరిమాణం జనవరిలో 2,78,155 నుండి 3,82,512 యూనిట్లకు పెరిగింది. ఇక ఎగుమతులు వార్షిక ప్రాతిపదికన 102 శాతం పెరిగి 36,883 యూనిట్లుగా ఉన్నాయి. -
పండుగ సీజన్లో అమెజాన్ జోష్.. 13 ఏళ్లలో ఇదే బెస్ట్!
కోల్కత: ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ఇండియా పండుగల సీజన్తో జోష్ మీద ఉంది. దేశంలో తన 13 సంవత్సరాల కార్యకలాపాలలో ప్రస్తుత సీజన్ అత్యుత్తమంగా ఉందని కంపెనీ వెల్లడించింది. ప్రతి విభాగంలోనూ ఇదే అత్యుత్తమ సంవత్సరమని అమెజాన్ కంజ్యూమర్ ఎలక్ట్రానిక్స్, పర్సనల్ కంప్యూటింగ్, లార్జ్ అప్లయాన్సెస్ డైరెక్టర్ నిశాంత్ సర్దానా తెలిపారు. ‘కోవిడ్ తర్వాత గ్రామీణ ప్రాంతాలు మందగమనాన్ని ఎదుర్కొంటున్నాయి. అయితే డిమాండ్లో పునరుద్ధరణను సూచించే గ్రామీణ కొనుగోళ్లలో అమెజాన్ ఎలాంటి మందగమనాన్ని చూడలేదు. 80 శాతం ఆర్డర్లు ద్వితీయ, తృతీయ శ్రేణి, నాల్గవ తరగతి మార్కెట్ల నుంచి వచ్చాయి. గ్రామీణ ప్రాంతాలు, చిన్న పట్టణాలు బలమైన వృద్ధిని కనబరిచాయి. పండుగల సీజన్ కోసం దేశవ్యాప్తంగా 1,00,000 పైచిలుకు తాత్కాలిక ఉద్యోగావకాశాలు కల్పించాం’ అని వివరించారు. ప్రస్తుత పండుగల సీజన్లో ఈ–కామర్స్ కంపెనీల వ్యాపారం 18–20 శాతం వృద్ధితో రూ.90,000 కోట్లు నమోదు చేయవచ్చని రెడ్సీర్ స్ట్రాటజీ కన్సల్టెంట్స్ అంచనా వేస్తోంది. -
రెండింట ఒకటి ఎలక్ట్రిక్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశవ్యాప్తంగా అక్టోబర్లో ప్యాసింజర్, కార్గో విభాగంలో 1,04,712 యూనిట్ల త్రిచక్ర వాహనాలు అమ్ముడయ్యాయి. ఇందులో 54 శాతం వాటాతో ఎలక్ట్రిక్ త్రిచక్ర వాహనాలు 56,818 యూనిట్లు నమోదయ్యాయి. 2022 అక్టోబర్తో పోలిస్తే ఈ–త్రీవీలర్ల విక్రయాలు గత నెలలో 58 శాతం పెరగడం విశేషం. 2023 జనవరిలో అమ్ముడైన 70,929 త్రిచక్ర వాహనాల్లో ఎలక్ట్రిక్ వాటా 48 శాతం ఉంది. 2023 జనవరి–అక్టోబర్ మధ్య ఈ–త్రీవీలర్లు 4,71,154 యూనిట్లు అమ్ముడయ్యాయి. 2022 అక్టోబర్తో ముగిసిన 10 నెలల్లో ఈ సంఖ్య 2,74,245 యూనిట్లు మాత్రమే. అంటే ఏడాదిలో ఈ–త్రీవీలర్ల విక్రయాలు 72 శాతం పెరిగాయన్న మాట. 2023 జనవరి–అక్టోబర్ కాలంలో దేశవ్యాప్తంగా 8,81,355 యూనిట్ల త్రిచక్ర వాహనాలు అమ్ముడయ్యాయి. దీనినిబట్టి రోడ్డెక్కుతున్న త్రిచక్ర వాహనాల్లో రెండింటిలో ఒకటి ఎలక్ట్రిక్ మోడల్ ఉంటోందంటే మార్కెట్ తీరుతెన్నులను అర్థం చేసుకోవచ్చు. పోటీలో 475 కంపెనీలు.. నిర్వహణ వ్యయం తక్కువ కావడంతో ఎలక్ట్రిక్ త్రిచక్ర వాహనాలకు క్రమంగా భారత్లో ఆదరణ పెరుగుతోంది. ఆటోరిక్షా డ్రైవర్లు, ఫ్లీట్ ఆపరేటర్ల నుంచి వీటికి డిమాండ్ ఊపందుకుంది. 2023 జనవరిలో 34,333 యూనిట్ల ఈ–త్రీవీలర్లు అమ్ముడయ్యాయి. జూలై నుంచి ప్రతి నెల 50 వేల పైచిలుకు యూనిట్ల ఎలక్ట్రిక్ త్రిచక్ర వాహనాలు కస్టమర్ల చేతుల్లోకి వెళ్తున్నాయి. భారత్లో 475 కంపెనీలు ఈ–త్రీవీలర్ల మార్కెట్లో పోటీ పడుతున్నాయంటే ఆశ్చర్యం వేయక మానదు. అక్టోబర్లో మహీంద్రా లాస్ట్ మైల్ మొబిలిటీ తొలి స్థానంలో ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో వైసీ ఎలక్ట్రిక్ వెహికిల్స్, సేయిరా ఎలక్ట్రిక్ ఆటో, పియాజియో వెహికిల్స్ నిలిచాయి. అక్టోబర్ అమ్మకాల్లో టాప్–12 కంపెనీల వాటా 43 శాతం నమోదైంది. ఇటీవలే ఈ విభాగంలోకి ఎంట్రీ ఇచి్చన బజాజ్ ఆటో అయిదు నెలల్లో 2,080 యూనిట్లను విక్రయించింది. 124 యూనిట్లతో మొదలై అక్టోబర్లో 866 యూనిట్ల స్థాయికి చేరుకుంది. త్రీవీలర్లు 40 శాతం.. దేశవ్యాప్తంగా 2023 అక్టోబర్లో అన్ని విభాగాల్లో కలిపి మొత్తం 1,39,232 యూనిట్ల ఎలక్ట్రిక్ వాహనాలు అమ్ముడయ్యాయి. ఇందులో ఈ–త్రీవీలర్ల వాటా ఏకంగా 40 శాతానికి ఎగబాకింది. 2022లో 1,17,498 ఈవీలు రోడ్డెక్కాయి. ఇందులో 30 శాతం వాటాతో 35,906 యూనిట్ల ఈ–త్రీవీలర్లు ఉన్నాయి. 2023 జనవరి–అక్టోబర్ మధ్య అమ్ముడైన 12.3 లక్షల యూనిట్ల ఈవీల్లో ఈ–త్రీవీలర్లు 38 శాతం ఉన్నాయి. ఇక 2022లో 3,50,238 యూనిట్ల ఈ–త్రీవీలర్లు రోడ్డెక్కాయి. ప్రస్తుత వేగాన్నిబట్టి చూస్తే ఈ ఏడాది 57 శాతం వృద్ధితో 5,50,000 యూనిట్ల మార్కును దాటడం ఖాయంగా కనిపిస్తోంది. -
వోల్వో కార్ల పరుగు
న్యూఢిల్లీ: లగ్జరీ కార్ల తయారీలో ఉన్న వోల్వో కార్ ఇండియా 2023 జనవరి–సెపె్టంబర్ మధ్య రిటైల్లో 1,751 యూనిట్లను విక్రయించింది. అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 40 శాతం అధికం అని కంపెనీ శుక్రవారం ప్రకటించింది. ఎక్స్సీ60 మోడల్ ఈ వృద్ధిని నడిపించిందని వెల్లడించింది. మొత్తం అమ్మకాల్లో ఈ మోడల్ వాటా ఏకంగా 35 శాతం ఉందని వివరించింది. దేశీయంగా అసెంబుల్ అవుతున్న పూర్తి ఎలక్ట్రిక్ కారు ఎక్స్సీ40 రిచార్జ్ మోడల్లో 419 యూనిట్లు కస్టమర్ల చేతుల్లోకి వెళ్లాయని వోల్వో ప్రకటించింది. ఎక్స్సీ40 రిచార్జ్ వాటా 24 శాతం ఉందని తెలిపింది. సంస్థ మొత్తం విక్రయాల్లో ఎలక్ట్రిక్ కార్ల నుంచి 27 శాతం సమకూరుతోంది. ఈ విజయం కస్టమర్ల విశ్వాసాన్ని, భారత మార్కెట్కు ప్రీమియం, స్థిర వాహనాలను అందించడంలో కంపెనీ నిబద్ధతను ప్రతిబింబిస్తుందని వోల్వో కార్ ఇండియా ఎండీ జ్యోతి మల్హోత్రా ఈ సందర్భంగా తెలిపారు. కంపెనీకి భారత్లో 25 డీలర్షిప్ కేంద్రాలు ఉన్నాయి. -
ఎల్రక్టానిక్స్, గృహోపకరణాలకు జోష్!
న్యూఢిల్లీ: గృహోపకరణాలు, కన్జ్యూమర్ ఎల్రక్టానిక్ పరిశ్రమ ఈ ఏడాది అమ్మకాలపై బలమైన అంచనాలను పెట్టుకుంది. పండుగల సీజన్కుతోడు, వన్డే ప్రపంచ క్రికెట్ కప్ పోటీలు ఉండడంతో అమ్మకాలు గణనీయంగా పెరుగుతాయని, క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 20 శాతం వృద్ధి నమోదు అవుతుందని అంచనా వేస్తోంది. ఏటా పండుగల సీజన్లో అధిక విక్రయాలు నమోదవుతుండడం సాధారణమే. కాకపోతే ఈ ఏడాది క్రికెట్ పోటీలు కూడా రావడం అమ్మకాలకు కలిసొస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. 1987 తర్వాత పండుగల సీజన్ సమయంలో క్రికెట్ ప్రపంచ కప్ టోర్నమెంట్ రావడం ఇదే మొదటిసారి కానుంది. దీంతో టీవీలు, ముఖ్యంగా పెద్ద తెరల సెట్లు, ఆడియో ఉత్పత్తులు, సౌండ్ బార్లు, హెడ్ఫోన్లు, ఇయర్బడ్స్ అధికంగా అమ్ముడుపోతాయనే అంచనాలు నెలకొన్నాయి. సంప్రదాయ, చిన్న తెరల టీవీల స్థానంలో 55 అంగుళాల పెద్ద టీవీలను వినియోగదారులు కొనుగోలు చేసే అవకాశాలు ఉంటాయని కంపెనీలు భావిస్తున్నాయి. ప్రీమియం, అల్ట్రా ప్రీమియం అయిన క్యూఎల్ఈడీ, ఓఎల్ఈడీ టీవీలకు సైతం డిమాండ్ ఉంటుందని అంచనాతో ఉన్నాయి. వన్డే వరల్డ్కప్ అక్టోబర్ 5న ప్రారంభం అవుతుండగా, నవంబర్ 9న ముగియనుంది. ఆకర్షణీయమైన ఆఫర్లు గత సీజన్ల మాదిరే ఈ ఏడాది కూడా వడ్డీ రహిత రుణ సదుపాయం, కొత్త మోడళ్ల ఆవిష్కరణ, విస్తృత ప్రచారంతో అమ్మకాలు పెంచుకోవాలని ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాల కంపెనీలు యోచిస్తున్నాయి. ప్రస్తుత పండుగల సమయంలో అమ్మకాలు గతేడాది స్థాయిలోనే ఉండొచ్చు. కాకపోతే ఈ ఏడాది ప్రీమియం ఉత్పత్తుల అమ్మకాలు ఎక్కువగా ఉంటాయని అంచనా వేస్తున్నాం. వీటి అమ్మకాలు 30% పెరగొచ్చు. కాకపోతే మాస్ విభాగం (తక్కువ ధరల ఉత్పత్తులు) ఒత్తిడిని ఎదుర్కొనవచ్చు. ఈ ఏడాది ఆరంభం నుంచి ద్రవ్యోల్బణ ప్రభావం కొనసాగుతోంది. దీంతో విచక్షణారహిత వినియోగంపై ఒత్తిడి నెలకొంది. రుతుపవనాల్లో వ్యత్యాసం, కొన్ని రాష్ట్రాల్లో సరైన వర్షాలు కురవకపోవడం వ్యవసాయ ఆదాయాన్ని ప్రభావితం చేస్తుంది. ఇవి మాస్ ఉత్పత్తుల అమ్మకాలపై ప్రభావం పడేలా చేస్తాయి. కనుక ఈ విభాగంలో అమ్మకాలు ఏమంత మెరుగ్గా ఉంటాయని భావించడం లేదు’’అని గోద్రేజ్ అప్లయెన్సెస్ బిజినెస్ హెడ్ కమల్ నంది వివరించారు. -
హీరో మోటోకార్ప్ డిజిటల్ రైడ్
న్యూఢిల్లీ: ద్విచక్ర వాహన తయారీ దిగ్గజం హీరో మోటోకార్ప్ 2030 నాటికి డిజిటల్ వేదిక ద్వారా 30 శాతం అమ్మకాలను సాధించాలని లక్ష్యంగా చేసుకుంది. అలాగే మహిళా ఉద్యోగుల సంఖ్యను 30 శాతానికి చేర్చాలని నిర్ణయించామని హీరో మోటోకార్ప్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ పవన్ ముంజాల్ తెలిపారు. 2022–23 కంపెనీ వార్షిక నివేదికలో ఆయన ఈ విషయాలను వెల్లడించారు. ‘డిజిటల్ వేదికలను పెంపొందించాం. కొనుగోళ్లకు ముందు, తర్వాతి అవసరాలకు ప్రధాన గమ్యస్థానంగా ఈ వేదిక నిలిచింది. సమాచార సాంకేతిక వ్యవస్థలను ఆధునీకరించాం. ఆధునిక అనలిటిక్స్, ఆరి్టఫీíÙయల్ ఇంటెలిజెన్స్ టూల్స్ను వినియోగిస్తున్నాం. ఆటోమేషన్ సాంకేతికలను అమలు చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి వద్ద ఉన్న తయారీ కేంద్రంలో స్థాపించిన ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ డిజిటల్ ఫ్యాక్టరీ లైట్హౌస్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి నాటికి ఉత్పాదకతను 20 శాతం పెంచాలని లక్ష్యంగా చేసుకుంది’ అని ఆయన వివరించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆరోగ్యకర వృద్ధిని ఆశిస్తున్నామని చెప్పారు. భారత్తోపాటు విదేశీ మార్కెట్ల కోసం 2023–24లో 65 లక్షలకు పైగా ద్విచక్ర వాహనాల ఉత్పత్తిని లక్ష్యంగా పెట్టుకున్నామని వెల్లడించారు. 2022–23లో కంపెనీ 53 లక్షల యూనిట్లను తయారు చేసింది. 54 లక్షల యూనిట్లను విక్రయించింది. ఈ ఏడాది దారి చూపుతాం.. భారత్లో మోటార్సైకిళ్లు, స్కూటర్ల డిమాండ్లో గ్రామీణ, ఉప నగర మార్కెట్లు సవాళ్లను ఎదుర్కొన్నాయని ముంజాల్ పేర్కొన్నారు. అయినప్పటికీ నిర్మాణాత్మక వృద్ధి అంశాలు చెక్కుచెదరకుండా కొనసాగుతున్నాయని తెలిపారు. ‘దేశంలోని యువ నైపుణ్యం కలిగిన జనాభా, గ్రామీణ, ఉప నగర ప్రాంతాల బలమైన ఆర్థిక వృద్ధి సామర్థ్యం, వినియోగదారులకు రుణాలు సులభంగా అందుబాటులో ఉండడం, లాస్ట్ మైల్ కనెక్టివిటీకి పెరుగుతున్న డిమాండ్ దృష్ట్యా విజయవంతమైన 2023–24 సంవత్సరానికి హీరో మోటోకార్ప్ దారి చూపుతుందని విశ్వసిస్తున్నాం. అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులు సవాల్ విసురుతున్నప్పటికీ బ్రాండ్ నిర్మాణం, కొత్త ఉత్పత్తుల విడుదల, నెట్వర్క్ పరిధిని విస్తరించడంలో పెట్టుబడులను కొనసాగించాం. ప్రపంచంలోనే అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీదారుగా కొత్త మార్కెట్లలో మా ఉనికిని నెలకొల్పడానికి, ఇప్పటికే ఉన్న వాటిలో వాటాను పెంచుకోవడానికి, మార్కెట్ అభివృద్ధి ప్రయత్నాలకు కట్టుబడి ఉండటానికి దీర్ఘకాలిక ప్రణాళికలను రచించాం. ఇంటర్నల్ కంబషన్ ఇంజన్, ఎలక్ట్రిక్ మోడళ్లకు మరింత విలువ కేంద్రీకృతంగా ముందుకు తీసుకెళ్లాలని భావిస్తున్నాం’ అని ముంజాల్ పేర్కొన్నారు. -
అమ్మకాల్లో పావు వంతు ఈవీలే
న్యూఢిల్లీ: వాహన తయారీ సంస్థ ఎంజీ మోటార్ ఇండియా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం విక్రయాల్లో 25 శాతం ఎలక్ట్రిక్ వెహికిల్స్ కైవసం చేసుకుంటాయని భావిస్తోంది. ఈవీ విభాగంలో కొత్త ఉత్పత్తులను పరిచయం చేయనుండడం ఇందుకు కారణమని ఎంజీ మోటార్ ఇండియా డిప్యూటీ ఎండీ గౌరవ్ గుప్తా తెలిపారు. భారత్లో ఇప్పటి వరకు 10,000 పైచిలుకు ఈవీలు విక్రయించామని వెల్లడించారు. ‘దేశవ్యాప్తంగా 2023 జనవరి–జూన్లో 20.62 శాతం వృద్ధితో మొత్తం 29,040 యూనిట్లు రోడ్డెక్కాయి. 2022లో ఈ సంఖ్య 48,063 యూనిట్లు నమోదైంది’ అని వివరించారు. కొత్త వేరియంట్ ఫీచర్లు ఇవే.. జడ్ఎస్ ఈవీ టాప్ ఎండ్ వేరియంట్ అటానమస్ లెవెల్–2తో (అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్) రూపుదిద్దుకుంది. ట్రాఫిక్ జామ్ అసిస్ట్, ఫార్వార్డ్ కొలిషన్ వారి్నంగ్, స్పీడ్ అసిస్ట్ సిస్టమ్ అలర్ట్స్, లేన్ ఫంక్షన్స్, అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్ వంటి 17 రకాల ఫీచర్లను జోడించారు. ఇందులోని 176 పీఎస్ పవర్తో కూడిన 50.3 కిలోవాట్ అవర్ బ్యాటరీ ఒకసారి చార్జింగ్తో 461 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. పరిమిత కాల ఆఫర్లో ఎక్స్షోరూం ధర రూ.27.89 లక్షలు ఉంది. కంపెనీ నుంచి రెండవ ఈవీ అయిన కామెట్ ఎక్స్షోరూం ధర రూ.7.98 లక్షలు పలుకుతోంది. భారత్లో ఇదే చవకైన ఈవీ. -
భారీగా పెరిగిన ప్యాసింజర్ వెహికల్ సేల్స్.. గత నెలలో అమ్మకాలు ఇలా!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశవ్యాప్తంగా 2023 మే నెలలో హోల్సేల్లో ప్యాసింజర్ వెహికిల్స్ 3,34,247 యూనిట్లు అమ్ముడయ్యాయి. 2022 మే నెలతో పోలిస్తే ఇది 13.54 శాతం అధికమని సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చరర్స్ (సియామ్) తెలిపింది. టాటా మినహా యుటిలిటీ వెహికిల్స్ 33.5 శాతం పెరిగి 1,55,184 యూనిట్లు నమోదయ్యాయి. టాటా మోటార్స్ మూడు నెలలకోసారి అమ్మకాల వివరాలను వెల్లడిస్తోంది. ద్విచక్ర వాహనాలు 17.42 శాతం అధికమై 14,71,550 యూనిట్లు విక్రయం అయ్యాయి. (అపుడు పాల ప్యాకెట్ కొనలేక పాట్లు, ఇపుడు 800 కోట్ల ఆస్తులు!) ఇందులో మోటార్సైకిల్స్ 20.63 శాతం పెరిగి 9,89,120 యూనిట్లు, స్కూటర్స్ 12.18 శాతం దూసుకెళ్లి 4,46,593 యూనిట్లకు చేరాయి. త్రీవీలర్లు 28,595 నుంచి 48,732 యూనిట్లకు ఎగశాయి. అన్ని విభాగాల్లో కలిపి తయారీ కంపెనీల నుంచి డీలర్షిప్లకు చేరిన వాహనాల సంఖ్య టాటా మోటార్స్ మినహా 15,32,861 నుంచి 18,08,686 యూనిట్లకు చేరింది. 2022 మే నెలతో పోలిస్తే గత నెలలో అన్ని వాహన విభాగాల్లో రెండంకెల వృద్ధి నమోదైందని సియామ్ ప్రెసిడెంట్ వినోద్ అగర్వాల్ తెలిపారు. ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో ఈ ట్రెండ్ కొనసాగుతుందని అంచనా వేస్తున్నామని చెప్పారు. (నెలకు లక్షన్నర జీతం: యాపిల్ ఫోనూ వద్దు, కారూ వద్దు, ఎందుకు? వైరల్ ట్వీట్) మరిన్ని ఇంట్రస్టింగ్ కథనాలు, బిజినెస్ వార్తల కోసం చదవండి సాక్షిబిజినెస్ -
కార్ల అమ్మకాల వృద్ధి 7 శాతానికి పరిమితం
న్యూఢిల్లీ: డిమాండ్ మందగించిన కారణంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్యాసింజర్ వాహనాల (పీవీ) రంగం విక్రయాల వృద్ధి 5–7 శాతానికి పరిమితం కావచ్చని అంచనా వేస్తున్నట్లు టాటా మోటర్స్ ఎండీ (ప్యాసింజర్, ఎలక్ట్రిక్ వెహికల్స్) శైలేష్ చంద్ర తెలిపారు. ఈ నేపథ్యంలో తమ కంపెనీపరంగా సీఎన్జీ, ఎలక్ట్రిక్ మోడల్స్తో పాటు కొత్త ఉత్పత్తులను ప్రవేశపెట్టడం, ప్రస్తుతం ఉన్న వాహనాలను సరికొత్తగా తీర్చిదిద్దడంపై మరింతగా దృష్టి పెట్టనున్నట్లు వివరించారు. కోవిడ్పరమైన పరిణామాలతో డిమాండ్ భారీగా పేరుకుపోవడంతో గత ఆర్థిక సంవత్సరంలో పీవీల అమ్మకాలు 27 శాతం వృద్ధి నమోదు చేశాయి. కానీ ప్రస్తుతం కొన్ని స్పోర్ట్స్ యుటిలిటీ వాహనాలకు తప్ప మిగతావాటికి డిమాండ్ తగ్గిందని చంద్ర పేర్కొన్నారు. కొత్త ఉద్గార ప్రమాణాలకు మారే క్రమంలో వాహనాల రేట్ల పెరుగుదల కూడా డిమాండ్పై ప్రతికూల ప్రభావం చూపవచ్చని ఆయన చెప్పారు. అయితే, రాబోయే రోజుల్లో వృద్ధి తిరిగి రెండంకెల స్థాయికి చేరగలదని ఆయన వివరించారు. తమ సంస్థ విషయానికొస్తే పంచ్లో సీఎన్జీ వేరియంట్ను తేబోతున్నామని .. కర్వ్, సియెరా వంటి వాహనాలను ప్రవేశపెట్టబోతున్నామని చంద్ర చెప్పారు. ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు భారీగా పెరగబోతున్నాయని పేర్కొన్నారు. టాటా మోటర్స్ ఈ మధ్యే తమ ప్రీమియం హ్యాచ్బ్యాక్ ఆల్ట్రోజ్లో సీఎన్జీ వెర్షన్ను ప్రవేశపెట్టింది. దీని ధర రూ. 7.55 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. కంపెనీ గత ఆర్థిక సంవత్సరంలో డీలర్లకు రికార్డు స్థాయిలో 5.4 లక్షల వాహనాలను సరఫరా చేసింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే హోల్సేల్ అమ్మకాలు 45 శాతం పెరిగాయి. -
పెట్రోల్, డీజిల్ అమ్మకాలు అప్..
వ్యవసాయానికి డిమాండ్ పెరగడం, వేసవి ప్రారంభంతో వాహన ఎయిర్ కండిషనింగ్ అవసరం వంటి అంశాలతో భారత్లో మేనెల పెట్రోల్ డీజిల్ అమ్మకాలు పెరిగాయని తాజా గణాంకాలు తెలిపాయి. ముఖ్యాంశాలు పరిశీలిస్తే.. న్యూఢిల్లీ: దేశంలో అత్యధికంగా వినియోగించే ఇంధనం– డీజిల్కు డిమాండ్ ( మొత్తం డిమాండ్లో ఐదింట రెండు వంతుల వాటా) గత ఏడాది మేతో పోలిస్తే మేలో 9.3 శాతం పెరిగి 7.46 మిలియన్ టన్నులకు చేరుకుంది. ఏప్రిల్లో డిమాండ్ పెరుగుదల 6.7 శాతం. ► నెలవారీగా చూస్తే డీజిల్ డిమాండ్ ఏప్రిల్లో 7.16 మిలియన్ టన్నులుకాగా, మేలో 4.2 శాతం పెరుగుదలతో 7.46 మిలియన్ టన్నులకు చేరింది. ► ఇక పెట్రోల్ అమ్మకాలు వార్షికంగా 10.4 శాతం పురోగతితో 3.08 మిలియన్ టన్నులకు చేరింది. నెలవారీగా చూస్తే డిమాండ్ 16.5 శాతం పెరిగింది. ► పారిశ్రామిక, వ్యవసాయ కార్యకలాపాలు పుంజుకోవడంతో మార్చి ద్వితీయార్థం నుంచి పెట్రోలు, డీజిల్ విక్రయాలు పెరిగాయి. మార్చి ప్రథమార్థంలో వార్షిక ప్రాతిపదికన పెట్రోల్ విక్రయాలు 1.4 శాతం, డీజిల్ 10.2 శాతం తగ్గాయి. ► ఉష్ణోగ్రత పెరుగుదలతో ఎయిర్ కండిషనింగ్ అవసరాలు పెరగడమూ మేలో వినియోగం పెరగడానికి ఒక కారణం. ► రబీ పంటలు– ఎక్కువగా గోధుమలు, బార్లీ, ఆవాలు, నువ్వులు, పెసల పంటకాలం అక్టోబర్–డిసెంబర్ మధ్య ప్రారంభమవుతుంది. నూర్పిడికాలం ఏప్రిల్ నుండి జూన్ వరకు ఉంటుంది. హార్వెస్టింగ్, ట్రాక్టర్ల అవసరాలు డీజిల్ డిమాండ్ పెరుగుదలకు దారితీస్తుంది. ► కోవిడ్ సంక్షోభంలో ఉన్న 2021మే నెలతో పోల్చితే పెట్రోల్ వినియోగం తాజా సమీక్షా నెల్లో 72 శాతం పెరిగింది. మహమ్మారి ముందు 2019 మే నెలతో పోల్చితే 23.7 శాతం ఎగసింది. ► మే 2021తో పోల్చితే డీజిల్ వినియోగం 52.5 శాతం, మే 2019తో పోల్చితే 6.8 శాతం ఎగశాయి. పరిశ్రమ మాట.. ప్రభుత్వ, ప్రైవేట్ మూలధన వ్యయం పెరగడంతో భారత ఆర్థిక వ్యవస్థ వేగం పుంజుకుంది. సేవల రంగం పటిష్టంగా ఉండగా తయారీ రంగం కూడా పుంజుకుంది. దేశంలో చమురు డిమాండ్కు బలమైన పారిశ్రామిక కార్యకలాపాలు మద్దతునిస్తున్నాయి. వ్యవసాయ రంగంలో డిమాండ్ పుంజుకోవడం ఇంధన డిమాండ్కు మద్దతు నిస్తోంది. నీటిపారుదల విభాగంలో పైపుల వినియోగం ఇంధన డిమాండ్కు కారణంగా ఉన్న మరో కీలక అంశం. జెట్ ఫ్యూయల్కు డిమాండ్ ఏవియేషన్ రంగం నిరంతర సేవల పునఃప్రారంభంతో విమానాశ్రయాలలో భారత్ మొత్తం ప్రయాణీకుల రద్దీ కోవిడ్ ముందస్తు స్థాయికి చేరువవుతోంది. ఈ నేపథ్యంలో జెట్ ఫ్యూయెల్ డిమాండ్ మే నెల్లో 2022 ఇదే నెల్లో పోల్చితే 8.7 శాతం పెరిగి 6,09,800 టన్నులకు ఎగసింది. 2021 మేతో పోల్చితే 137 శాతం పెరిగింది. అయితే కోవిడ్ ముందస్తు విషయానికి వస్తే, 2019 మేనెలతో పోల్చితే 5.3% తక్కువగానే నమోదయ్యింది. అలాగే ఏప్రిల్ 2023తో (6,13,900 టన్నులు) పోల్చినా డిమాండ్ 0.7% తక్కువగానే ఉంది. వంట గ్యాస్ అమ్మకాలూ అప్ మరోవైపు వంట గ్యాస్ ఎల్పీజీ అమ్మకాలు వార్షికంగా మేలో 10% పెరిగి 2.4 మిలియన్ టన్నులకు చేరింది. ఎల్పీజీ వినియోగం 2021 మేతో పోల్చితే 13%, కోవిడ్ ముందస్తు కాలం 2019 మేతో పోల్చితే 19.6 % ఎగసింది. నెలవారీ డిమాండ్ చూసి నా (2023 ఏప్రిల్) మేనెల్లో ఎల్పీజీ డిమాండ్ 11.3 శాతం పెరిగింది. ఏప్రిల్లో డిమాండ్ 2.19 మిలియన్ టన్నులు. -
ఎస్యూవీలకే డిమాండ్
న్యూఢిల్లీ: ఎస్యూవీలకు బలమైన డిమాండ్తో దేశీయ ప్యాసింజర్ వెహికిల్స్ రంగంలో మే నెలలో విక్రయాల జోరు సాగింది. మారుతీ సుజుకీ ఇండియా, హ్యుందాయ్ మోటార్ ఇండియా, మహీంద్రా అండ్ మహీంద్రా, టయోటా కిర్లోస్కర్ మోటార్ బలమైన హోల్సేల్ అమ్మకాలను నమోదు చేశాయి. టాటా మోటార్స్, కియా, ఎంజీ మోటార్ ఇండియా వంటి ఇతర తయారీ సంస్థలు సైతం విక్రయాల్లో వృద్ధి సాధించాయి. అగ్రశ్రేణి సంస్థ మారుతీ సుజుకీ ఇండియా మొత్తం దేశీయ ప్యాసింజర్ వాహనాల విక్రయాలు 15 శాతం పెరిగి 1,43,708 యూనిట్లుగా నమోదయ్యాయి. ఆల్టో, ఎస్–ప్రెస్సోతో కూడిన మినీ కార్ల అమ్మకాలు 30 శాతం తగ్గి 12,236 యూనిట్లకు పడిపోయాయి. స్విఫ్ట్, సెలెరియో, ఇగ్నిస్, బాలెనో, డిజైర్ వంటి మోడళ్ల విక్రయాలు 5 శాతం పెరిగి 71,419 యూనిట్లకు చేరాయి. బ్రెజ్జా, గ్రాండ్ విటారా, ఎర్టిగాతో సహా యుటిలిటీ వాహనాల సేల్స్ 65 శాతం అధికమై 46,243 యూనిట్లకు చేరాయి. గత నెలలో కంపెనీ రెండంకెల అమ్మకాల వృద్ధికి ఎస్యూవీలు క్రెటా, వెన్యూ ఆజ్యం పోశాయని హ్యుందాయ్ ఇండియా సీవోవో తరుణ్ గర్గ్ తెలిపారు. టాటా మోటార్స్ అంతర్జాతీయ వ్యాపారంతో సహా ప్యాసింజర్ ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు 66% వృద్ధితో 5,805 యూనిట్లుగా ఉన్నాయి. గత ఏడాది ఇదే కాలంలో 3,505 యూనిట్లు విక్రయించామని కంపెనీ తెలిపింది. -
కొనసాగిన ఆటో అమ్మకాల జోరు
ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023–24) తొలి నెల ఏప్రిల్లో ఆటో అమ్మకాల్లో మెరుగైన వృద్ధి నమోదైంది. ప్రధానంగా స్పోర్ట్స్ యుటిలిటి వాహనాల(ఎస్యూవీ)కు డిమాండ్ కలిసొచ్చింది. దిగ్గజ కంపెనీలైన మారుతీ సుజుకీ, హ్యుందాయ్, టాటా మోటార్స్ సంస్థలు డీలర్లకు అధిక సంఖ్యలో వాహనాలను సరఫరా చేశాయి. మారుతీ సుజుకీ గత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్లో మొత్తం 1,50,661 వాహనాలను విక్రయించగా, ఏప్రిల్లో ఈ సంఖ్య 7 శాతం మేర పెరిగి 1,60,529 యూనిట్లకు చేరింది. ‘‘చిప్ కొరతతో గత నెలలో కొంత ఉత్పత్తి నష్టం జరిగింది. అయితే ఎస్యూవీ విభాగంలో 21 శాతం వృద్ధి నమోదు కావడంతో మొత్తం అమ్మకాల పరిమాణం పెరిగింది. ద్రవ్యోల్బణ సమస్య, గ్రామీణ ప్రాంతాల్లో విక్రయాలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉండటంతో రానున్న రోజుల్లో సెంటిమెంట్ స్తబ్ధుగా ఉండొచ్చు’’ అని ఎంఎస్ఐ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శశాంక్ శ్రీవాస్తవ తెలిపారు. ► ద్విచక్ర వాహన విక్రయాలకు డిమాండ్ కొనసాగడంతో చెప్పుకొదగిన స్థాయిలో విక్రయాలు జరిగాయి. హీరో మోటోకార్ప్(5% క్షీణత) మినహా టీవీఎస్ మోటార్స్, రాయల్ ఎన్ఫీల్డ్, హెచ్ఎంఎస్ఐ అమ్మకాలు వరుసగా 4%, 18%, 6% చొప్పున పెరిగాయి. ► విద్యుత్ ద్విచక్ర వాహన అమ్మకాలు ఏప్రిల్లో గణనీయంగా తగ్గాయి. నెల ప్రాతిపదికన మార్చిలో 82,292 యూనిట్లు అమ్ముడయ్యాయి. అవి ఈ ఏప్రిల్లో 62,581 యూనిట్లకు తగ్గాయి. -
జోరుగా ఆడి కార్ల విక్రయాలు
న్యూఢిల్లీ: లగ్జరీ కార్ల సంస్థ ఆడి ఇండియా మార్చి త్రైమాసికంలో 1,950 యూనిట్లను విక్రయించింది. 2022 మొదటి మూడు నెలల కాలంలో విక్రయాలు 862 యూనిట్లతో పోలిస్తే మూడు రెట్లు పెరిగాయి. తమ ఉత్పత్తుల పోర్ట్ఫోలియోలో 16 మోడళ్లు వచ్చి చేరాయని ఆడి ఇండియా హెడ్ బల్బీర్ సింగ్ దిల్లాన్ తెలిపారు. బలమైన ఎస్యూవీ పోర్ట్ఫోలియో కలిగి ఉన్నామని, తమ మొత్తం విక్రయాల్లో ఎస్యూవీ వాటా 60%గా ఉన్నట్టు చెప్పారు. కొత్తగా విడుదల చేసిన క్యూ3, క్యూ3 స్పోర్ట్బ్యాక్కు దేశవ్యాప్తంగా బలమైన డిమాండ్ కనిపిస్తున్నట్టు తెలిపారు. మంచి వృద్ధి మార్గంలో ఉన్నామని, 2023లోనూ బలమైన పనితీరు చూపిస్తామనే నమ్మకంతో ఉన్నట్టు పేర్కొన్నారు. ప్రీఓన్డ్ (అప్పటికే మరొకరు వినియోగించిన) కార్ల వ్యాపారాన్ని విస్తరిస్తామని ప్రకటించారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 22 ప్రీఓన్డ్ కార్ల ఔట్లెట్లను ఆడి నిర్వహిస్తోంది. ఈ ఏడాది చివరికి వీటి సంఖ్యను 25కు చేరుస్తామని దిల్లాన్ తెలిపారు. -
గ్రామాల్లో కొనుగోళ్లు.. గంపెడాశలు పెట్టుకున్న ఎఫ్ఎంసీజీ కంపెనీలు!
న్యూఢిల్లీ: కమోడిటీ ద్రవ్యోల్బణం చల్లబడడం ఎఫ్ఎంసీజీ ఉత్పత్తుల వినియోగానికి అనుకూలమని కంపెనీలు భావిస్తున్నాయి. ముఖ్యంగా గడిచిన ఐదారు త్రైమాసికాలుగా గ్రామీణ ప్రాంతాల్లో ఎఫ్ఎంసీజీ ఉత్పత్తుల వినియోగం పడిపోగా, తిరిగి అది పుంజుకుంటుందన్న అంచనాతో ప్రముఖ ఎఫ్ఎంసీజీ కంపెనీలు డాబర్, మారికో ఉన్నాయి. మార్జిన్లు మార్చి త్రైమాసికంలో పెరుగుతాయని గోద్రేజ్ కన్జన్యూమర్ ప్రొడక్ట్స్ (జీసీపీఎల్) సైతం అంచనాతో ఉంది. ‘‘మార్చి త్రైమాసికంలో ఎఫ్ఎంసీజీ రంగం క్రమంగా రికవరీని చూసింది. వార్షికంగా చూస్తే అమ్మకాల పరిమాణం పెరిగింది. పట్టణాల్లో, ప్రీమియం ఉత్పత్తుల విభాగాల్లో అమ్మకాలు స్థిరంగా కొనసాగాయి. ద్రవ్యోల్బణం చల్లబడడం మొత్తం మీద వినియోగానికి, గ్రామీణ మార్కెట్లకు అనుకూలం’’అని మారికో తెలిపింది. కొబ్బరి ధరలు స్థిరంగా, సానుకూల శ్రేణిలోనే ఉండగా, వంట నూనెల ధరలు తగ్గుముఖం పట్టాయి. స్థూల మార్జిన్లు పెరుగుతాయని, వార్షికంగా చూస్తే ఆపరేటింగ్ మార్జిన్లో సహేతుకమైన వృద్ధి ఉంటుందని మారికో తెలిపింది. ఎఫ్ఎంసీజీ అమ్మకాలు పూర్తి స్థాయిలో కోలుకోకపోయినా, త్రైమాసికం వారీగా చూస్తే మార్చిలో పుంజుకున్నట్టు డాబర్ పేర్కొంది. పట్టణ ప్రాంతాల్లో అమ్మకాలు తిరిగి సానుకూల ధోరణికి చేరాయని, గ్రామీణ మార్కెట్లలోనే ఇంకా సాధారణ స్థితికి చేరుకోవాల్సి ఉందని తెలిపింది. సమీప కాలంలో వినియోగంపై ఒత్తిళ్లు నెలకొన్నప్పటికీ, ద్రవ్యోల్బణం మోస్తరు స్థాయికి దిగి రావడం, వినియోగదారుల్లో విశ్వాసం పెరగడం, ప్రభుత్వ వినియోగం పెరగడం అనే సానుకూల సంకేతాలు కనిపిస్తున్నట్టు ఎఫ్ఎంసీజీ కంపెనీలు చెబుతున్నాయి. అధిక శాతం కమోడిటీల ధరలు గరిష్ట స్థాయి నుంచి దిగి రావడంతో, స్థూల మార్జిన్లను మెరుగుపడతాయని కంపెనీలు అంచనా వేస్తున్నాయి. ఒక అంకె వృద్ధి.. డాబర్ దేశీయ, అంతర్జాతీయ వ్యాపారం 5–6 శాతం స్థాయిలో వృద్ధి ఉంటుందని అంచనా వేస్తోంది. దేశీ మార్కెట్లో వినియోగ డిమాండ్ ధోరణలు మార్చి త్రైమాసికంలో నిలకడగా ఉన్నాయని, ఎఫ్ఎంసీజీ రంగం నిలకడైన వృద్ధిని చూస్తుందని సీజీపీఎల్ చెబుతోంది. మొత్తం మీద వృద్ధి అనేది అన్ని విభాగాల్లోనూ ఉంటుందని, హోమ్కేర్, పర్సనల్ కేర్ ఉత్పత్తుల్లో అమ్మకాలు, ఆదాయం పరంగా రెండంకెల వృద్ధిని చూస్తామని అంచనా వేస్తోంది. భారత్ తర్వాత గోద్రేజ్ కన్జ్యూమర్కు ఇండోనేషియా రెండో అతిపెద్ద మార్కెట్ కాగా, కన్సాలిడేటెడ్ స్థాయిలో రెండంకెల వృద్ధిపై కంపెనీ అంచనాలతో ఉంది. ‘‘మా ఉత్పత్తుల నాణ్యతలో పురోగతి ఉంది. మార్కెటింగ్పై అదే పనిగా పెట్టుబడులు పెడుతుండడం వల్ల, స్థూల మార్జిన్లు కోలుకుంటాయి. దీంత ఎబిట్డాలో రెండంకెల వృద్ధి నమోదు చేస్తాం’’అని జీసీపీఎల్ తెలిపింది. వర్షాల సీజన్ సానుకూలంగా ఉండడం రానున్న త్రైమాసికాల్లో వృద్ధికి కీలకమని పరిశ్రమ భావిస్తోంది. ‘‘బ్రాండ్లు, ఆవిష్కరణలపై బలంగా పెట్టుబడులు పెడుతున్నాం. పంపిణీని విస్తరిస్తున్నాం. తద్వారా మా మార్కెట్ వాటాను పెంచుకోవడంతోపాటు, స్థిరమైన వృద్ధిని నమోదు చేయాలనుకుంటున్నాం’’అని డాబర్ తెలిపింది. దేశీయ డిమాండ్ పరిస్థితులు సానుకూలంగా కనిపిస్తున్నట్టు బ్రోకరేజీ సంస్థ ప్రభుదాస్ లీలాధర్ సైతం చెబుతోంది. కాకపోతే వర్షాలు, వాతావరణ మార్పులు గ్రామీణ ప్రాంతాల్లో ఎఫ్ఎంసీజీ వినియోగాన్ని ఆలస్యం చేయవచ్చన్న అభిప్రాయంతో ఉంది. -
పేటీఎం అమ్మకాల్లో 40 శాతం వృద్ధి..
న్యూఢిల్లీ: గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో తమ ప్లాట్ఫామ్ ద్వారా జరిగిన స్థూల అమ్మకాలు (జీఎంవీ) 40 శాతం వృద్ధి చెందాయి. విలువపరంగా క్రితం క్యూ4లో రూ. 2.59 లక్షల కోట్లుగా ఉండగా ఈసారి రూ. 3.62 లక్షల కోట్లకు పెరిగాయి. సమీక్షాకాలంలో నెలవారీ లావాదేవీలు నిర్వహించే యూజర్ల సంఖ్య (ఎంటీయూ) 27 శాతం పెరిగి 9 కోట్లకు చేరిందని పేటీఎం మాతృసంస్థ వన్97 కమ్యూనికేషన్స్ తెలిపింది. పేమెంట్ డివైజ్ల కోసం చందా చెల్లించే వ్యాపారుల సంఖ్య 2022 డిసెంబర్ క్వార్టర్తో పోలిస్తే 10 లక్షలు పెరిగి 68 లక్షలకు చేరినట్లు వివరించింది. పేటీఎం ప్లాట్ఫాం ద్వారా రుణ వితరణ పరిమాణం రూ. 3,553 కోట్ల నుంచి మూడు రెట్లు పెరిగి రూ. 12,554 కోట్లకు ఎగిసిందని తెలిపింది. -
2,21,50,222 వాహనాలు రోడ్డెక్కాయి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశవ్యాప్తంగా 2022–23లో రిటైల్లో అన్ని విభాగాల్లో కలిపి వాహన విక్రయాలు 2,21,50,222 యూనిట్లు నమోదయ్యాయి. అంత క్రితం ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఇది 21 శాతం అధికమని ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్ (ఎఫ్ఏడీఏ) తెలిపింది. ద్విచక్ర వాహనాలు 19 శాతం వృద్ధితో 1,59,95,968 యూనిట్లు కస్టమర్ల చేతుల్లోకి వెళ్లాయి. అయితే పరిమాణం పరంగా ఈ విభాగం ఏడేళ్ల కనిష్టానికి పడిపోయింది. వాణిజ్య వాహనాలు 33 శాతం, త్రిచక్ర వాహనాలు 84 శాతం దూసుకెళ్లాయి. ట్రాక్టర్ల అమ్మకాలు 8 శాతం ఎగశాయి. అత్యధిక స్థాయిలో.. ప్యాసింజర్ వాహనాలు రికార్డు స్థాయిలో 23 శాతం అధికమై 36,20,039 యూనిట్లు రోడ్డెక్కడం విశేషం. 2021–22లో 29,42,273 యూనిట్లు అమ్ముడయ్యాయి. ప్యాసింజర్ వాహన రంగంలో ఇప్పటి వరకు దేశంలో 2018–19లో నమోదైన 32 లక్షల యూనిట్లే అత్యధికం. సెమీకండక్టర్ లభ్యత కాస్త మెరుగు పడడంతో అనేక కొత్త మోడళ్లు రంగ ప్రవేశం చేయడం, వాహనాల లభ్యత కారణంగా ఈ విభాగం ప్రయోజనం పొందింది. హై–ఎండ్ వేరియంట్లకు డిమాండ్ ఉండడం అమ్మకాలను కొనసాగించడంలో సహాయపడింది. అయితే ఎంట్రీ లెవెల్ విభాగంలోని కస్టమర్లు ఇప్పటికీ అధిక ద్రవ్యోల్బణంతో ప్రభావితం అవుతున్నందున ఈ సెగ్మెంట్ ఒత్తిడిలో ఉందని ఫెడరేషన్ తెలిపింది. వృద్ధి సింగిల్ డిజిట్లో.. ఇప్పుడు అధిక–వృద్ధి కాలం గడిచినందున అధిక బేస్, ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు, సాధారణ ధరల పెంపుదల, ప్రభుత్వ నియంత్రణ పరంగా మార్పుల కారణంగా.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వాహన పరిశ్రమ 9 శాతం లోపే వృద్ధిరేటును చూసే అవకాశం ఉందని ఫెడరేషన్ ప్రెసిడెంట్ మనీష్ రాజ్ సింఘానియా తెలిపారు. ఈ ఏడాది కన్సాలిడేషన్కు అవకాశం ఉందన్నారు. ఆటోమొబైల్ రంగంపై కోవిడ్–19 మహమ్మారి 2020–21, 2021–22లో తీవ్ర ప్రభావం చూపింది. గత ఆర్థిక సంవత్సరంలో ఎటువంటి ప్రభావం లేదు. -
విప్రో కన్జూమర్ అమ్మకాలు @ రూ. 10 వేల కోట్లు
న్యూఢిల్లీ: ఇటీవలే ముగిసిన గత ఆర్థిక సంవత్సరంలో తమ ఆదాయం రూ. 10,000 కోట్ల మైలురాయిని దాటినట్లు విప్రో కన్జూమర్ కేర్ అండ్ లైటింగ్ వెల్లడించింది. వివిధ ప్రాంతాలు, బ్రాండ్లు, కేటగిరీలవారీగా విక్రయాలు గణనీయంగా వృద్ధి చెందడం ఇందుకు దోహదపడినట్లు పేర్కొంది. అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో ఆదాయం రూ. 8,634 కోట్లుగా నమోదైంది. (ఈ–కామర్స్ వ్యాపారంలోకి ఫోన్పే.. కొత్త యాప్ పేరు ఏంటంటే..) దేశీయంగా ఎఫ్ఎంసీజీ (ఫాస్ట్ మూవింగ్ కన్జూమర్ గూడ్స్)వ్యాపార విభాగం 17 శాతం పెరిగినట్లు తెలిపింది. సబ్బుల బ్రాండ్ సంతూర్ ఇప్పుడు నిర్దిష్ట విభాగంలో రూ. 2,650 కోట్ల అమ్మకాలతో రెండో స్థానానికి చేరిందని పేర్కొంది. అటు వియత్నాం మార్కెట్లో రెండంకెల స్థాయి వృద్ధితో 10 కోట్ల డాలర్ల ఆదాయం మార్కును దాటినట్లు .. దక్షిణాఫ్రికా, మధ్యప్రాచ్యం, ఫిలిప్పీన్స్ తదితర మార్కెట్లలోను రెండంకెల స్థాయి వృద్ధి సాధించినట్లు కంపెనీ తెలిపింది. 2003లో రూ. 300 కోట్ల ఆదాయం ఉండగా .. గత రెండు దశాబ్దాల్లో 33 రెట్లు పెంచుకుని నేడు అంతర్జాతీయ ఎఫ్ఎంసీజీ దిగ్గజంగా ఎదిగామని సంస్థ సీఈవో వినీత్ అగ్రవాల్ తెలిపారు. 1945లో వనస్పతి సంస్థగా ప్రారంభమైన విప్రో కన్జూమర్ కేర్ అండ్ లైటింగ్కు ప్రస్తుతం 60 పైగా దేశాల్లో కార్యకలాపాలు ఉన్నాయి. 18 ఫ్యాక్టరీలు, 10,000 మంది పైచిలుకు సిబ్బంది ఉన్నారు. ఆదాయంలో 51 శాతం వాటా అంతర్జాతీయ వ్యాపారం నుంచి ఉంటోంది. -
వాహన అమ్మకాలు రికార్డ్!
న్యూఢిల్లీ: గత ఆర్థిక సంవత్సరంలో దేశీ వాహన రంగ దుమ్మురేపింది. మారుతీ సుజుకీ, హ్యుందాయ్, టాటా మోటార్స్ గతంలో ఎన్నడూ లేనంత అత్యధిక అమ్మకాలను సాధించాయి. కార్ల దిగ్గజం మారుతీ సుజుకీ 2022–23లో ఎగుమతులు, దేశీయంగా కలిపి మొత్తం 19,66,164 వాహనాలను విక్రయించింది. అంతక్రితం ఏడాది (2021–22)లో 16,52,653 యూనిట్లతో పోలిస్తే సేల్స్ 19 శాతం పెరిగాయి. హ్యుందాయ్ మొత్తం అమ్మకాలు సైతం 18 శాతం ఎగబాకి 7,20,565 యూనిట్లుగా నమోదయ్యాయి. భారత్లో కార్యకలాపాలు ప్రారంభించిన తర్వాత ఒక ఏడాదిలో సాధించిన అత్యధిక విక్రయాలు ఇవేనని హ్యుందాయ్ మోటార్ ఇండియా పేర్కొంది. టాటా మోటార్స్ దేశీయంగా గతేడాది 5,38,640 వాహనాలను విక్రయించింది. అంతక్రితం ఏడాదితో పోలిస్తే 45 శాతం వృద్ధి చెందాయి. పరిశ్రమవ్యాప్తంగా... చిప్ కొరత కారణంగా ఉత్పత్తి కార్యకలాపాలపై ప్రభావం పడుతున్నప్పటికీ గత ఆర్థిక సంవత్సరంలో తాము అత్యధిక విక్రయాలను సాధించామని మారుతీ సుజుకీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (మార్కెటింగ్, సేల్స్) శశాంక్ శ్రీవాస్తవ పేర్కొన్నారు. గత ఆర్థిక సంవత్సరంలో మొత్తం వాహన పరిశ్రమ అమ్మకాలు 27 శాతం వృద్ధి చెంది 38.89 యూనిట్లుగా నమోదయ్యాయని తెలిపారు. 2021–22లో సేల్స్ 30.62 లక్షలు. రిటైల్గా, మొత్తం విక్రయాల పరంగా చూసినా గతేడాది పరిశ్రమ అత్యధిక అమ్మకాలను నమోదు చేసిందన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 40–41 లక్షల అమ్మకాలను అంచనా వేస్తున్నామన్నారు. మార్చిలో చూస్తే... మారుతీ సుజుకీ మార్చి అమ్మకాలు స్వల్పంగా తగ్గాయి. దేశీయంగా సేల్స్ 3 శాతం తగ్గి 1,39,952 యూనిట్లుగా నమోదయ్యాయి. హ్యుందాయ్ విక్రయాలు మాత్రం 13 శాతం ఎగబాకాయి. టాటా మోటార్స్ దేశీ అమ్మకాలు 3 శాతం పెరిగాయి. ద్విచక్రవాహన సంస్థలు హీరోమోటో, హోండా, టీవీఎస్, రాయల్ ఎన్ఫీల్డ్ మెరుగైన విక్రయాలను నమోదు చేశాయి. -
పెరిగిన పెట్రోల్, డీజిల్ అమ్మకాలు
న్యూఢిల్లీ: వ్యవసాయ కార్యకలాపాలు పుంజుకోవడంతో మార్చిలో భారత్లో ఇంధన డిమాండ్ పెరిగింది. నెల మొదటి అర్ధభాగంలో కనిపించిన మందగమనాన్ని అధిగమిస్తూ, నెల మొత్తంగా ఇంధన డిమాండ్ పెరిగినట్లు పరిశ్రమల ప్రాథమిక గణాంకాలు వెల్లడించాయి. వ్యవసాయ రంగం నుండి బలమైన డిమాండ్, చలికాలం తర్వాత రవాణా పుంజుకోవడం వంటి కారణాలతో ఫిబ్రవరిలో ఇంధన అమ్మకాలు అత్యధిక స్థాయికి చేరుకున్నాయి. కానీ మార్చి మొదటి అర్ధభాగంలో కాలానుగుణంగా మందగమనం మొదలైంది. అయితే నెల రెండవ సగ భాగంలో తిరిగి ఎకానమీ కార్యకలాపాలు పుంజుకున్నాయి. ప్రత్యేకించి ఇక్కడ వ్యవసాయ రంగ క్రియాశీలత మెరుగుపడ్డం మెరుగైన ఫలితానికి కారణమని గణాంకాలు సూచిస్తున్నాయి. గణాంకాల్లో ముఖ్యాంశాలు పరిశీలిస్తే.. ► గత ఏడాది మార్చితో పోలిస్తే 2023 మార్చిలో పెట్రోలు విక్రయాలు 5.1 శాతం పెరిగి 2.65 మిలియన్ టన్నులకు చేరుకున్నాయి. అమ్మకాలు నెలవారీగా 3.4 శాతం పెరిగాయి. ► డీజిల్ విషయంలో మార్చిలో వార్షిక డిమాండ్ 2.1 శాతం పెరిగి 6.81 మిలియన్ టన్నులుగా నమోదయ్యింది. 2022 మార్చిలో ఈ పరిమాణం 6.67 మిలియన్ టన్నులు. నెలవారీగా చూస్తే, డిమాండ్ 4.5 శాతం పెరిగింది. ► ఒక్క జెట్ ఫ్యూయెల్ డిమాండ్ పరిశీలిస్తే, డిమాండ్ 25.7 శాతం పెరిగి 614000 టన్నులుగా నమోదయ్యింది. ► కాగా, కుకింగ్ గ్యాస్ ఎల్పీజీ అమ్మకాలు మార్చిలో వార్షికంగా 3 శాతం పడిపోయి 2.37 మిలియన్ టన్నులకు చేరాయి. నెలవారీగా చూస్తే, డిమాండ్ 6.54 శాతం పడిపోయింది. ఫిబ్రవరి డిమాండ్ 2.54 మిలియన్ టన్నులు. -
నెక్సా కస్టమర్లు 20 లక్షలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: నెక్సా రిటైల్ చైన్ల ద్వారా ఇప్పటి వరకు 20 లక్షల కార్లు రోడ్డెక్కాయని మారుతీ సుజుకీ ఇండియా ప్రకటించింది. ప్రీమియం కార్ల విక్రయాల కోసం 2015లో నెక్సా కేంద్రాలను కంపెనీ ప్రారంభించింది. బలేనో, ఇగ్నిస్, సియాజ్, ఎక్స్ఎల్6, గ్రాండ్ వితారా మోడళ్లు ఇక్కడ కొలువుదీరాయి. త్వరలో మార్కెట్లోకి రానున్న ఎస్యూవీలు ఫ్రాంక్స్, జిమ్నీ సైతం వీటి సరసన చేరనున్నాయి. ఇతర మోడళ్లను అరీనా ఔట్లెట్ల ద్వారా విక్రయిస్తున్నారు. హ్యుండై, టాటా మోటార్స్ విక్రయాల కంటే నెక్సా కేంద్రాల ద్వారా వచ్చే ఏడాది అధిక యూనిట్లను నమోదు చేయాలన్నది లక్ష్యమని కంపెనీ మార్కెటింగ్, సేల్స్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శశాంక్ శ్రీవాస్తవ తెలిపారు. రెండవ స్థానం దిశగా.. తొలి 10 లక్షల యూనిట్లకు నాలుగేళ్లు, ఆ తర్వాతి 10 లక్షల యూనిట్లకు మూడేళ్ల సమయం పట్టిందని శశాంక్ వెల్లడించారు. ‘ప్రస్తుతం మారుతీ సుజుకీ అరీనా, హ్యుండై, టాటా మోటార్స్ తర్వాత నెక్సా నాల్గవ స్థానంలో ఉంది. వచ్చే ఏడాది రెండవ స్థానానికి చేరుతుంది. సంస్థ మొత్తం విక్రయాల్లో 47 శాతం వృద్ధితో నెక్సా వాటా 23 శాతం ఉంది. దేశీయ ప్యాసింజర్ కార్ల రంగంలో నెక్సా 10 శాతం వాటా కైవసం చేసుకుంది. ఈ ఔట్లెట్ల ద్వారా గత ఆర్థిక సంవత్సరంలో 2.55 లక్షల యూనిట్లు అమ్ముడయ్యాయి. 2022–23లో 3.7 లక్షల యూనిట్లు ఆశిస్తున్నాం. వచ్చే ఆర్థిక సంవత్సరంలో కొత్త మోడళ్లు, గ్రాండ్ వితారా కారణంగా నెక్సా నుంచి 6 లక్షల యూనిట్ల మార్కును చేరుకుంటాం’ అని వివరించారు. పరిశ్రమ కంటే మెరుగ్గా.. 2023–24లో ప్యాసింజర్ వాహన పరిశ్రమ వృద్ధి 5–7.5 శాతం ఆశిస్తున్నామని శశాంక్ తెలిపారు. ‘పరిశ్రమలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 38.9 లక్షల యూనిట్లు, 2023–24లో 41 లక్షల యూనిట్ల అమ్మకాలు నమోదు కావొచ్చు. ఆర్థిక వృద్ధి, రుతుపవనాల సరళి, గ్రామీణ మార్కెట్పై దాని ప్రభావం, వడ్డీ రేట్ల పెరుగుదల, నగదు లభ్యత స్థాయిలు, పరిస్థితులకు తగ్గట్టుగా వాహన తయారీ కంపెనీలు చేపట్టిన ధరల పెంపు వంటి అంశాల ఆధారంగా ఈ వృద్ధి ఆధారపడి ఉంటుంది. పరిశ్రమ కంటే మెరుగైన వృద్ధిని మారుతీ సుజుకీ ఆశిస్తోంది’ అని పేర్కొన్నారు. -
పెద్ద పట్టణాల్లో ఇళ్ల అమ్మకాల జోరు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఏడు ప్రధాన పట్టణాల్లో ఇళ్ల విక్రయాలు డిసెంబర్తో ముగిసిన మూడో త్రైమాసికంలో 11 శాతం పెరిగినట్టు రేటింగ్ ఏజెన్సీ ఇక్రా తెలిపింది. ఏడు పట్టణాల్లో 149 మిలియన్ చదరపు అడుగులు (ఎంఎస్ఎఫ్) అమ్ముడుపోయినట్టు వెల్లడించింది. గత పదేళ్లలో ఒక త్రైమాసికం వారీ అత్యధిక విక్రయాలు ఇవేనని పేర్కొంది. డిమాండ్ మెరుగ్గా ఉండడమే వృద్ధికి మద్దతునిచ్చినట్టు తెలిపింది. 2022–23 మొదటి తొమ్మిది నెలల్లో (2022 ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు) ఈ ఏడు ప్రధాన పట్టణాల్లో 412 ఎంఎస్ఎఫ్ అడుగుల ఇళ్లను విక్రయించినట్టు ఇక్రా తెలిపింది. అంతక్రితం ఏడాది ఇదే తొమ్మిది నెలల్లో విక్రయాలు 307 ఎంఎస్ఎఫ్తో పోలిస్తే 30 శాతానికి పైగా వృద్ధి నమోదైంది. కరోనా మహమ్మారి తర్వాత కొనుగోలుదారుల ప్రాధాన్యతల్లో మార్పు వచ్చిందంటూ.. లగ్జరీ, మధ్య స్థాయి ధరల ఇళ్ల వాటా పెరిగినట్టు వివరించింది. 2019–20లో లగ్జరీ ఇళ్ల వాటా 14 శాతం, మధ్యస్థాయి ధరల ఇళ్ల వాటా 36 శాతం చొప్పున ఉంటే.. 2022–23 ఏప్రిల్–డిసెంబర్ కాలానికి లగ్జరీ ఇళ్ల అమ్మకాల వాటా 16 శాతానికి పెరిగితే, మధ్యస్థాయి ఇళ్ల విక్రయాల వాటా 42 శాతానికి చేరింది. హైదరాబాద్తోపాటు, చెన్నై బెంగళూరు, కోల్కతా, ముంబై మెట్రోపాలిటన్ రీజియన్, నేషనల్ క్యాపిటల్ రీజియన్, పుణె పట్టణాలకు సంబంధించి ఇక్రా గణాంకాలు విడుదల చేసింది. 2023–24లో 16 శాతం.. ‘‘రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్ అమ్మకాలు విలువ పరంగా 2022–23లో 8–12 శాతం మేర వృద్ధి చెందొచ్చు. 2023–24లో 14–16 శాతం మధ్య పెరగొచ్చు’’అని ఇక్రా వైస్ ప్రెసిడెంట్, కో గ్రూప్ హెడ్ అనుపమ రెడ్డి తెలిపారు. టాప్–12 డెవలపర్ల ప్రాథమిక గణాంకాల ఆధారంగా వేసిన అంచనాలుగా ఇక్రా పేర్కొంది. ఆర్బీఐ వడ్డీ రేట్ల పెరుగుదల గృహ కొనుగోళ్లపై లేదని తెలిపింది. ‘‘కరోనా ముందున్న నాటి రేట్ల కంటే ఇప్పటికీ గృహ రుణాలపై రేట్లు తక్కువే ఉన్నాయి. కనుక కొనుగోలు శక్తి ఇప్పటికీ ఆరోగ్యంగానే ఉంది. తక్కువ నిల్వలు, డెవలపర్లు తమకు అనుకూలంగా ప్రాజెక్టులు ప్రారంభించడం, ఉద్యోగ మార్కెట్లో మందగమనం, వడ్డీ రేట్లు మరింత పెరుగుదల కొనుగోలు శక్తిపై చూపించే అంశాలు’’అని పేర్కొంది. 2022 డిసెంబర్ నాటికి అమ్ముడుపోని ఇళ్ల పరిమాణం 839 ఎంఎస్ఎఫ్గా ఉందని ఇక్రా తెలిపింది. 2021 డిసెంబర్లో విక్రయం కాని ఇళ్లు 923 ఎంఎస్ఎఫ్తో పోలిస్తే తక్కువేనని గుర్తు చేసింది. వార్షికంగా చూస్తే 2022 డిసెంబర్ త్రైమాసికంలో ఇళ్ల ధరలు 10 శాతం పెరిగినట్టు పేర్కొంది. పెరిగిన నిర్మాణ వ్యయాలను కస్టమర్లకు బదిలీ చేయడమే ధరల పెరుగుదలకు కారణంగా తెలిపింది. -
టాటా ప్యాసింజర్ వాహనాలు @ 50 లక్షలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ దిగ్గజం టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికిల్స్ అమ్మకాల్లో కొత్త మైలురాయిని అధిగమించింది. మొత్తం 50 లక్షల యూనిట్ల విక్రయాలతో రికార్డు సాధించింది. 10 లక్షల యూనిట్ల మార్కును కంపెనీ 2004లో చేరుకుంది. ఆ తర్వాత ఆరేళ్లలోనే 20 లక్షల యూనిట్ల స్థాయిని తాకింది. 2015లో 30 లక్షల యూనిట్లు, 2020లో 40 లక్షల యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది. 2020 తర్వాత అతి తక్కువ కాలంలోనే 50 లక్షల మార్కును చేరుకోవడం విశేషం. కోవిడ్–19, సెమికండక్టర్ల కొరత ఉన్నప్పటికీ నూతన రికార్డును అందుకున్నట్టు కంపెనీ తెలిపింది. ప్రతి మైలురాయి వెనుక ఒడిదుడుకుల ప్రయాణం ఉందని టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికిల్స్ ఎండీ శైలేష్ చంద్ర వ్యాఖ్యానించారు. -
పెట్రోల్, డీజిల్ విక్రయాలు మళ్లీ పైకి
న్యూఢిల్లీ: శీతాకాలం ప్రభావం తొలగిపోవడంతో ఫిబ్రవరిలో మళ్లీ పెట్రోల్, డీజిల్ అమ్మకాలు పుంజుకున్నాయి. రెండంకెల వృద్ధిని చూశాయి. ప్రభుత్వరంగ ఆయిల్ కంపెనీల గణాంకాలను పరిశీలిస్తే.. ఫిబ్రవరిలో పెట్రోల్ అమ్మకాలు 12 శాతం పెరిగి 2.57 మిలియన్ టన్నులుగా ఉన్నాయి. 2022 ఫిబ్రవరిలో పెట్రోల్ అమ్మకాలు 2.29 మిలియన్ టన్నులుగా ఉండడం గమనార్హం. 2021 ఫిబ్రవరి విక్రయాలు 1.57 మిలియన్ టన్నులతో పోల్చినా వృద్ధి నమోదైంది. నెలవారీగా చూస్తే.. జనవరి నుంచి ఫిబ్రవరికి పెట్రోల్ అమ్మకాలు 13.5 శాతం పెరిగాయి. ఇక డీజిల్ విక్రయాలు గత నెలలో 6.52 మిలియన్ టన్నులుగా ఉన్నాయి. గతేడాది ఇదే నెలలో విక్రయాలతో పోలిస్తే 13 శాతం పెరిగాయి. ఈ ఏడాది జనవరి నెల విక్రయాలతో పోల్చి చూసినప్పుడు 9.2 శాతం వృద్ధి నమోదైంది. పర్వత ప్రాంతాల్లో మంచు వల్ల జనవరిలో డీజిల్ అమ్మకాలు 8.6 శాతం తగ్గడం గమనార్హం. ట్రక్కులు తిరిగి పూర్తి స్థాయిలో రోడ్లపైకి రావడం, రబీ సాగు సీజన్ రద్దీగా మారడంతో ఇక ముందూ డీజిల్ అమ్మకాలు పెరుగుతాయని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. విమానయాన సేవలు పెరగడం ఏవియేషన్ టర్బయిన్ ఫ్యూయల్ (ఏటీఎఫ్) అమ్మకాలను పెంచింది. గతేడాది ఇదే నెలతో పోల్చినప్పుడు 2023 ఫిబ్రవరిలో ఏటీఎఫ్ విక్రయాలు 41 శాతం పెరిగి 5,74,200 టన్నులుగా ఉన్నాయి. ఎల్పీజీ అమ్మకాలు 2.43 శాతం పెరిగి 2.53 మిలియన్ టన్నులుగా ఉన్నాయి. -
హైదరాబాద్లో గృహ విక్రయాలు భేష్
న్యూఢిల్లీ: మెరుగైన అమ్మకాలతో డిసెంబర్ క్వార్టర్ (క్యూ3) ముగిసే నాటికి (2022 అక్టోబర్–డిసెంబర్) దేశంలోని తొమ్మిది ప్రధాన నగరాల్లో విక్రయంకాని హౌసింగ్ స్టాక్లు 10 శాతం తగ్గి 4,61,600 యూనిట్లకు పడిపోయాయని ప్రోప్ఈక్విటీ సోమవారం ఒక నివేదికలో పేర్కొంది. సెప్టెంబర్తో ముగిసిన త్రైమాసికంలో (క్యూ2–జూలై–సెప్టెంబర్) ఈ సంఖ్య 5,12,526 యూనిట్లుగా ఉంది. ఇక హైదరాబాద్ విషయానికి వస్తే, దేశ సగటుతో సమానంగా (10 శాతం) విక్రయంకాని గృహాల సంఖ్య క్యూ2, క్యూ3ల్లో 93,473 యూనిట్ల నుంచి 84,545కు తగ్గింది. నివేదికలో కొన్ని అంశాలను పరిశీలిస్తే.. ► తొమ్మిది నగరాల్లో హౌసింగ్ విక్రయాల సంఖ్య అక్టోబర్–డిసెంబర్ త్రైమాసికంలో 1,20,275 యూనిట్లు. సెప్టెంబర్ త్రైమాసికంతో పోల్చితే ఈ సంఖ్య 8 శాతం అధికంకాగా, 2021 ఇదే కాలంతో పోల్చితే 10 శాతం అధికం. ► రియల్ ఎస్టేట్ గణాంకాల విశ్లేషణ సంస్థ– ప్రోప్ఈక్విటీ తాజా డేటా కోసం పరిగణనలోకి తీసుకున్న గృహాల్లో అపార్ట్మెంట్లు, ఇండిపెండెంట్ ఫ్లోర్లు విల్లాలు/గృహాలు ఉన్నాయి. హోల్డ్లో (నిలిచిపోయిన) ఉన్న అమ్మకాలు, నిర్మాణాల నిలిపివేత, లాటరీ ప్రాజెక్ట్లను ఈ గణాంకాల నుంచి మినహాయించడం జరిగింది. సవాళ్లు ఉన్నా... పటిష్ట రికవరీ అనేక సవాళ్లు ఉన్నప్పటికీ...ఈ ఏడాది గృహాల విక్రయాలు బాగా పుంజుకున్నాయి. ఇండస్ట్రీలో డిమాండ్, పాజిటివ్ సెంటిమెంట్ పెరుగుతుండటం గమనార్హం. వడ్డీరేట్లు స్థిరంగా పెరిగినప్పటికీ, కస్టమర్లు రుణాలు తీసుకోడానికి ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. ఆస్తుల ధర మున్ముందు పెరుగుతుందన్న అంచనాలు దీనికి ప్రధాన కారణం. – సమీర్ జసుజా, ప్రోప్ఈక్విటీ వ్యవస్థాపకుడు, ఎండీ మార్కెట్ సెంటిమెంట్ బాగుంది.. ఇంటి కొనుగోళ్లకు మార్కెట్ సెంటిమెంట్ భారీగా మెరుగుపడినందున భారతదేశం అంతటా అమ్మకాలు డిసెంబర్ త్రైమాసికంలో అలాగే 2022లో భారీ జంప్ను చూశాయి. కొనుగోళ్ల విషయంలో ఊగిసలాటలో ఉన్న చాలా మంది కస్టమర్లు ఇప్పుడు మార్కెట్లోకి తిరిగి వచ్చారు. దీనివల్లే చివరకు బ్లాక్బస్టర్ అమ్మకాలు జరిగాయి. – శివాంగ్ సూరజ్, ఇన్ఫ్రామంత్రా వ్యవస్థాపక డైరెక్టర్ సానుకూలం.. అంతర్జాతీయంగా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ బలహీనంగా ఉన్నప్పటికీ రియల్ ఎస్టేట్ రంగ సూచీ సానుకూల శ్రేణిలోనే ఉంది. వచ్చే ఆరు నెలలకు సంబంధించి సూచించే మా ఫ్యూచర్ సెంటిమెంట్ ఇండెక్స్ కొంత మెరుగుపడింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థతో పోలిస్తే, భారత ఆర్థిక వ్యవస్థ బలంగా ఉండడం, రియల్ ఎస్టేట్ రంగలో వృద్ధి అవకాశాల దృష్ట్యా భవిష్యత్తు సెంటిమెంట్ స్కోరు 2022 డిసెంబర్ త్రైమాసికంలో 58కి పెరిగింది. ఇది అంతకుముందు త్రైమాసికంలో 57గా ఉంది. – శిశిర్ బైజాల్, నైట్ ఫ్రాంక్ ఇండియా సీఎండీ -
మారుతీ కుటుంబం 2.5 కోట్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్యాసింజర్ కార్ల విక్రయాల్లో భారత్లో అగ్రశేణి కంపెనీ మారుతీ సుజుకీ.. 2023 జనవరి 9 నాటికి దేశీయంగా 2.5 కోట్ల కార్లను విక్రయించి సరికొత్త రికార్డులతో దూసుకెళ్తోంది. అప్పటి మారుతీ ఉద్యోగ్ 1983 డిసెంబర్ నుంచి అమ్మకాలను ప్రారంభించింది. కంపెనీ 2012 ఫిబ్రవరి నాటికి 1 కోటి యూనిట్ల మైలురాయిని చేరుకుంది. 2019 జూలై కల్లా 2 కోట్ల యూనిట్ల విక్రయాలను సాధించింది. జపాన్కు చెందిన సుజుకీ మోటార్ కార్పొరేషన్ అనుబంధ కంపెనీ మారుతీ సుజుకీ ఇండియా ప్రస్తుతం దేశీయంగా 17 మోడళ్లను తయారు చేసి విక్రయిస్తోంది. ఎస్యూవీలకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో ఈ విభాగంలో తన స్థానాన్ని నిలబెట్టుకోవాలని సంస్థ కృతనిశ్చయంతో ఉంది. క్రమంగా ఎస్యూవీ మోడళ్లను ప్రవేశపెడుతోంది. మరోవైపు హైబ్రిడ్, సీఎన్జీ విభాగంలోనూ విస్తరిస్తోంది. ఇప్పటి వరకు కంపెనీ భారత్లో 21 లక్షల యూనిట్ల హైబ్రిడ్, సీఎన్జీ వాహనాలను విక్రయించింది. -
లాభాల్లోకి టాటా మోటార్స్
న్యూఢిల్లీ: ఆటో రంగ దేశీ దిగ్గజం టాటా మోటార్స్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) మూడో త్రైమాసికంలో టర్న్అరౌండ్ ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో నష్టాలను వీడి లాభాల్లోకి ప్రవేశించింది. రూ. 3,043 కోట్ల నికర లాభం ఆర్జించింది. గతేడాది(2021–22) ఇదే కాలంలో రూ. 1,451 కోట్ల నికర నష్టం ప్రకటించింది. విభిన్న మార్కెట్లలో అమ్మకాలు ఊపందుకోవడం ఇందుకు దోహదపడింది. మొత్తం ఆదాయం సైతం రూ. 72,229 కోట్ల నుంచి రూ. 88,489 కోట్లకు ఎగసింది. కాగా.. స్టాండెలోన్ నికర లాభం దాదాపు మూడు రెట్లు జంప్చేసి రూ. 506 కోట్లను తాకింది. గత క్యూ3లో కేవలం రూ. 176 కోట్లు ఆర్జించింది. జేఎల్ఆర్ జూమ్ ప్రస్తుత సమీక్షా కాలంలో టాటా మోటార్స్ లగ్జరీ కార్ల విభాగం జాగ్వార్ ల్యాండ్ రోవర్(జేఎల్ఆర్) ఆదాయం 28 శాతం పుంజుకుని 600 కోట్ల పౌండ్లకు చేరింది. మెరుగుపడ్డ సరఫరాలు, పటిష్ట మోడళ్లు, వీటికి తగిన ధరలు ఉత్తమ పనితీరుకు కారణమైనట్లు కంపెనీ పేర్కొంది. వెరసి 26.5 కోట్ల పౌండ్ల పన్నుకుముందు లాభం ఆర్జించింది. గతేడాది క్యూ3లో 9 మిలియన్ పౌండ్ల పన్నుకుముందు నష్టం ప్రకటించిన సంగతి తెలిసిందే. చైనాలో లాక్డౌన్ల కారణంగా హోల్సేల్ అమ్మకాలు ప్రభావితమైనట్లు కంపెనీ పేర్కొంది. జనవరి నుంచి పరిస్థితులు మెరుగుపడగలవని అంచనా వేసింది. చిప్ల కొరత తగ్గడం, ఉత్పత్తి, హోల్సేల్ అమ్మకాలు పుంజుకోవడం కంపెనీ టర్న్అరౌండ్కు దోహదం చేసినట్లు జేఎల్ఆర్ తాత్కాలిక సీఈవో ఆడ్రియన్ మార్డెల్ పేర్కొన్నారు. ఫలితాల నేపథ్యంలో టాటా మోటార్స్ షేరు ఎన్ఎస్ఈలో 1 శాతం నష్టంతో రూ.419 వద్ద ముగిసింది. -
పెట్రోల్, డీజిల్ భారీ అమ్మకాలు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ అమ్మకాలు 2022 డిసెంబర్ నెలలోనూ గణనీయ వృద్ధిని చూశాయి. ముఖ్యంగా వ్యవసాయ రంగంలో పనులకు వీటికి డిమాండ్ ఏర్పడడం ఈ వృద్ధికి దోహదపడినట్టు చెప్పుకోవాలి. పెట్రోల్ విక్రయాలు 2.76 మిలియన్ టన్నులుగా నమోదయ్యాయి. 2021 డిసెంబర్ నెలతో పోల్చి చూస్తే 8.6 శాతం అధికం. ఇక 2020 డిసెంబర్ తో పోల్చినప్పుడు 13 శాతం, 2019 డిసెంబర్తో (కరోనాకు ముందు) పోల్చి చూసినప్పుడు 23 శాతం చొప్పున వృద్ధి కనిపించింది. ఇక 2022 నవంబర్ నెల విక్రయాలతో పోల్చి చూసినా 4 శాతం పెరుగుదల కనిపిస్తోంది. అటు డీజిల్ అమ్మకాలు సైతం 2021 డిసెంబర్ నెలతో పోలిస్తే 2022 డిసెంబర్లో 13 శాతం పెరిగి 7.3 మిలియన్ టన్నులుగా ఉన్నాయి. 2020 డిసెంబర్ నెల కంటే 15 శాతం, 2019 డిసెంబర్ కంటే 11 శాతం అధికం. ఇక 2022 నవంబర్ నెల విక్రయాలతో పోల్చినప్పుడు 0.5 శాతం తగ్గాయి. ఇతర ఇంధనాల వినియోగమూ పైపైకే వ్యవసాయ రంగంలో వినియోగం పెరిగినట్టు పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. ఇరిగేషన్ పంప్లు, ట్రక్ల కోసం డీజిల్ను ఎక్కువగా ఉపయోగిస్తుంటారని తెలిసిందే. 2022 జూన్ నుంచి చూస్తే మధ్యలో జూలై, ఆగస్ట్లో మాత్రం అధిక వర్షాలతో పెట్రోల్, డీజిల్ విక్రయాలకు కొంత డిమాండ్ తగ్గగా, మిగిలిన నెలల్లో జోరుగా కొనసాగింది. విమాన ప్రయాణికుల రద్దీ కూడా గరిష్ట స్థాయికి చేరుకోవడం గమనార్హం. దీంతో ఏవియేషన్ టర్బయిన్ ఫ్యూయల్ (ఏటీఎఫ్) విక్రయాలు గత నెలలో 18 శాతం వృద్ధి చెంది 6,06,000 టన్నులుగా ఉన్నాయి. 2020 డిసెంబర్తో పోల్చినప్పుడు 50 శాతం అధికంగా ఉన్నాయి. వంటగ్యాస్ విక్రయాలు 8 శాతం వృద్ధితో 2.72 మిలియన్ టన్నులుగా నమోదయ్యాయి. నెలవారీగా చూస్తే వృద్ధి 6 శాతానికి పైనే ఉంది. -
రెండంకెల స్థాయిలో ఇంధన విక్రయాల వృద్ధి
న్యూఢిల్లీ: పండుగల సీజన్లో కార్యకలాపాలు మరింత పుంజుకోవడం, వ్యవసాయ రంగంలో డిమాండ్ పెరగడంతో నవంబర్లో దేశీయంగా పెట్రోల్, డీజిల్ అమ్మకాలు గణనీయంగా వృద్ధి చెందాయి. రెండంకెల స్థాయిలో పెరిగాయి. గతేడాది నవంబర్తో పోలిస్తే ఈసారి పెట్రోల్ అమ్మకాలు 11.7 శాతం పెరిగి 2.66 మిలియన్ టన్నులకు, డీజిల్ విక్రయాలు 27.6 శాతం వృద్ధి చెంది 7.32 మిలియన్ టన్నులుగా నమోదయ్యాయి. కోవిడ్ కష్టకాలమైన 2020 నవంబర్తో పోలిస్తే పెట్రోల్ అమ్మకాలు 10.7 శాతం, కోవిడ్ పూర్వం 2019 నవంబర్తో పోలిస్తే 16.2 శాతం పెరిగాయి. అటు డీజిల్ విక్రయాలు 17.4 శాతం (2020 నవంబర్తో పోలిస్తే), 9.4 శాతం (2019 నవంబర్తో పోలిస్తే) పెరిగాయి. జూన్ నుండి పెట్రోల్, డీజిల్ అమ్మకాలు భారీగా పెరుగుతున్నాయి. పంటల సీజన్ కావడంతో డీజిల్కు డిమాండ్ గణనీయంగా ఉంటోందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. సాగు నీటి పంపులు, ట్రక్కుల్లో ఇంధనాల వినియోగం ఎక్కువగా పెరిగిందని వివరించాయి. విమాన ప్రయాణాలు కూడా పుంజుకుంటూ ఉండటంతో విమాన ఇంధన (ఏటీఎఫ్) విక్రయాలు సైతం గత నవంబర్తో పోలిస్తే ఈసారి 21.5 శాతం పెరిగి 5,72,200 టన్నులకు చేరాయి. అయితే, కోవిడ్ పూర్వం నవంబర్ (2019)తో పోలిస్తే మాత్రం 13.3 శాతం తక్కువగా నమోదయ్యాయి. దేశీయంగా విమాన ప్రయాణాలు కోవిడ్ పూర్వ స్థాయులకు చేరినప్పటికీ కొన్ని దేశాల్లో ఇంకా ఆంక్షలు కొనసాగుతుండటంతో అంతర్జాతీయ ప్రయాణాల ట్రాఫిక్ కాస్త తక్కువగానే ఉంటోందని పరిశ్రమ వర్గాలు వివరించాయి. ఏటీఎఫ్ ధర తగ్గింపు .. అంతర్జాతీయంగా క్రూడాయిల్ రేట్లు తగ్గడంతో ప్రభుత్వ రంగ చమురు రిటైల్ కంపెనీలు ఏటీఎఫ్ రేటును గురువారం 2.3 శాతం తగ్గించాయి. అయితే, పెట్రోల్, డీజిల్ రేట్లను మాత్రం వరుసగా ఎనిమిదో నెలా సవరించకుండా, యథాతధంగా ఉంచాయి. తాజా తగ్గింపుతో ఏటీఎఫ్ రేటు ఢిల్లీలో కిలోలీటరుకు రూ. 2,775 తగ్గి రూ. 1,17,588కి చేరింది. గత నెల కూడా ఆయిల్ కంపెనీలు విమాన ఇంధనం రేటును 4.19 శాతం (రూ. 4,842) తగ్గించాయి. విమానయాన కంపెనీల నిర్వహణ వ్యయా ల్లో 40 శాతం వాటా ఇంధనానిదే ఉంటుంది. ఈ నేపథ్యంలో తాజా తగ్గింపులు వాటికి కొంత ఊరటనివ్వనున్నాయి. ఏటీఎఫ్ రేటును ఆయిల్ కంపెనీ లు ప్రతి నెలా 1వ తారీఖున సమీక్షిస్తాయి. పెట్రో ల్, డీజిల్ రేట్లను అవి ఏప్రిల్ 6 నుండి సవరించలేదు. విండ్ఫాల్ లాభాలపై పన్ను సగానికి తగ్గింపు డీజిల్ ఎగుమతుల లెవీపై ఊరట అంతర్జాతీయంగా రేట్ల అనూహ్య పెరుగుదలతో, దేశీ చమురు ఉత్పత్తి దారులకు వచ్చే భారీ లాభాలపై (విండ్ఫాల్ ట్యాక్స్) పన్నును కేంద్ర ప్రభుత్వం సగానికి తగ్గించింది. అలాగే, డీజిల్ ఎగుమతులపైనా లెవీని తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఓఎన్జీసీ తదితర సంస్థలు ఉత్పత్తి చేసే టన్ను చమురుపై ప్రస్తుతం రూ.10,200గా ఉన్న పన్నును రూ.4,900కు తగ్గించింది. లీటర్ డీజిల్ ఎగుమతిపై లెవీని 10.5 నుంచి 8కి తగ్గించింది. ఏటీఎఫ్పై అదనపు ఎక్సైజ్ డ్యూటీ లీటర్కు రూ.5గా కొనసాగనుంది. మొదట పెట్రోల్ ఎగుమతులైనా కేంద్రం లెవీ విధించగా, తర్వాత దాన్ని ఎత్తివేయడం గమనార్హం. ఉక్రెయిన్పై రష్యా యు ద్ధం తర్వాత అంతర్జాతీయంగా చమురు ఉత్పత్తి, సరఫరా తగ్గిపోయి, ధరలు గణనీయంగా పెరిగిపోవడం తెలిసిందే. ఈ పరిణా మం దేశీ చమురు ఉత్పత్తి కంపెనీలకు అనూహ్య లాభాలు వచ్చేందుకు దారితీసింది. దీంతో కేంద్ర ప్రభుత్వం విండ్ఫాల్ పన్నును ప్రవేశపెట్టడం తెలిసిందే. -
కమర్షియల్ వాహనాలు జోరుగా.. హుషారుగా! తగ్గేదెలే!!
న్యూఢిల్లీ: వాహన రుణాలపై వడ్డీ రేట్లు పెరగడం ప్రతికూలమే అయినప్పటికీ ఈ ఏడాది వాణిజ్య వాహనాల (సీవీ) అమ్మకాలు రెండంకెల స్థాయిలో వృద్ధి చెందగలవని అంచనా వేస్తున్నట్లు టాటా మోటర్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గిరీష్ వాఘ్ తెలిపారు. అధిక ద్రవ్యోల్బణం అలాగే వడ్డీ రేట్ల పెరుగుదల వంటి ప్రతికూలతలను అధిగమించేలా మౌలికసదుపాయాలపై ప్రభుత్వం పెట్టుబడులు పెడుతుండటం, దేశీయంగా వినియోగం క్రమంగా పెరుగుతుండటం తదితర సానుకూలాంశాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. రవాణా రేట్లు, వాహనాల వినియోగం క్రమంగా పెరుగుతుండటమనేది రవాణాదారుల విశ్వాస సూచీ మెరుగుదలకు తోడ్పడుతున్నాయని వాఘ్ వివరించారు. తమ కంపెనీ విషయానికొస్తే లాభదాయకత వృద్ధిపైనే ప్రధానంగా దృష్టి పెడుతున్నామని, ఎప్పట్లాగే ఆర్థిక సంవత్సరం ద్వితీయార్ధం పండుగ సీజన్ నుండి డిమాండ్ పుంజుకోగలదని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. దేశీ ఆటోమొబైల్ తయారీ సంస్థల సమాఖ్య (సియామ్) గణాంకాల ప్రకారం 2022-23 తొలి త్రైమాసికంలో దేశీయంగా సీవీల విక్రయాలు 112 శాతం పెరిగి 1,05,800 యూనిట్ల నుంచి 2,24,512 యూనిట్లకు పెరిగాయి. 2021-22లో అమ్మకాలు 26 శాతం వృద్ధి చెంది 5,68,559 యూనిట్ల నుంచి 7,16,566 యూనిట్లకు పెరిగాయి. వడ్డీ రేట్ల పెంపుతో ఈఎంఐల భారం పెరుగుతుందని, అయితే ఇది మరీ ఎక్కువగా ఉండకుండా చూసేలా తగు ఫైనాన్సింగ్ స్కీమ్లు లభించే విధంగా ఆర్థిక సంస్థలతో కలిసి పరిశ్రమ ప్రయత్నాలు చేస్తోందని వాఘ్ చెప్పారు. -
ప్యాసింజర్ వెహికిల్స్ దూసుకెళ్తున్నాయ్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టడం, సెమికండక్టర్ల సరఫరా తిరిగి సాధారణ స్థితికి చేరుకోవడం భారత వాహన పరిశ్రమకు కలిసి వచ్చింది. ప్యాసింజర్ వెహికిల్స్ తయారీ, విక్రయాలు వేగం పుంజుకున్నాయి. అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 2022 ఆగస్ట్లో కార్ల అమ్మకాల్లో కొత్త రికార్డు నమోదైంది. ఎస్యూవీల జోరుతో టాప్–7 కంపెనీల మొత్తం ప్యాసింజర్ వాహనాల విక్రయాలు ఏకంగా 30.2 శాతం వృద్ధితో 3,05,744 యూనిట్లకు చేరాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇదే అత్యధిక వృద్ధి. ఆగస్ట్ నుంచి పండుగల సీజన్ ప్రారంభం అవుతుంది. జోరు మొదలైందని.. రాబోయే నెలల్లో ఇది కొనసాగుతుందని వాహన పరిశ్రమ ధీమాగా ఉంది. ఏడాది పొడవునా జరిగే మొత్తం విక్రయాల్లో పండుగల సీజన్ వాటా ఏకంగా 40 శాతం దాకా ఉంటోంది. 2018–19ని మించిన విక్రయాలు.. దేశంలో గత ఆర్థిక సంవత్సరంలో 30,69,499 ప్యాసింజర్ వాహనాలు అమ్ముడయ్యాయి. 2018–19లో అత్యధికంగా 33,77,389 యూనిట్లు రోడ్డెక్కాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 2018–19ని మించిన విక్రయాలు నమోదు కానున్నాయని భారత్లో ఆటోమొబైల్ దిగ్గజం మారుతీ సుజుకీ చెబుతోంది. 37 లక్షల యూనిట్లతో పరిశ్రమ నూతన రికార్డు సాధిస్తుందన్న అంచనా ఉందని మారుతీ సుజుకీ సేల్స్ ఈడీ శశాంక్ శ్రీవాస్తవ వెల్లడించారు. 2021–22తో పోలిస్తే ఇది 21 శాతం అధికమని అన్నారు. 2021 ఆగస్ట్తో పోలిస్తే గత నెలలో మారుతీ సుజుకీ 30 శాతం, హ్యుండై 5.6, టాటా మోటార్స్ 68.3, మహీంద్రా అండ్ మహీంద్రా 87, కియా ఇండియా 33.3, టయోటా కిర్లోస్కర్ 17.12 శాతం వృద్ధి సాధించాయి. హోండా కార్స్ 30.5 శాతం తిరోగమన వృద్ధి చవిచూసింది. ద్విచక్ర వాహనాలు ఇలా.. : అంత క్రితం ఏడాది ఇదే కాలం, అలాగే ఈ ఏడాది జూలైతో పోలిస్తే ఆగస్ట్లో అన్ని ద్విచక్ర వాహన కంపెనీలు వృద్ధిని నమోదు చేశాయి. సెమికండక్టర్ల సరఫరా మెరుగవడం డిమాండ్కు తగ్గట్టుగా కస్టమర్లకు వాహనాలను అందించేందుకు వీలైందని కంపెనీలు అంటున్నాయి. జీడీపీ వృద్ధి, రెండేళ్ల తర్వాత సాధారణ పండుగల సీజన్, మెరుగైన రుతుపవనాలతో అధిక దిగుబడి, కస్టమర్ల సెంటిమెంట్ సానుకూలంగా ఉండడం.. వెరిశి రాబోయే నెలల్లో టూ వీలర్ల అమ్మకాలు మరింత జోరుగా ఉంటాయని హీరో మోటోకార్ప్ తెలిపింది. 2021 ఆగస్ట్తో పోలిస్తే గత నెలలో హీరో మోటోకార్ప్ 4.6 శాతం, హోండా 5.1, టీవీఎస్ 56.2, బజాజ్ 42.2, సుజుకీ 6.2, రాయల్ ఎన్ఫీల్డ్ 33.8 శాతం అధికంగా విక్రయాలను సాధించాయి. -
వాహన విక్రయాలు జూమ్
ముంబై: అంతర్జాతీయంగా సెమీ కండెక్టర్ల కొరత ప్రభావం తగ్గడంతో.., దేశీయంగా జూలైలో వాహన విక్రయాలు వృద్ధి బాటపట్టాయి. వార్షిక ప్రాతిపదికన మారుతీ సుజుకీ, హ్యుందాయ్, టాటా మోటార్స్, మహీంద్రాఅండ్మహీంద్రా, కియా ఇండియా, టయోటా కిర్లోస్కర్ మోటార్, హోండా కార్స్, స్కోడా ఆటో అమ్మకాలు పురోగతిని సాధించాయి. ప్యాసింజర్ వాహనాలకు డిమాండ్ ఊపందుకోవడంతో ఈ ఏడాదిలోకెల్లా జూలైలో అత్యధికంగా అమ్ముడయ్యాయి. ఆర్థిక రికవరీలో భాగంగా మౌలిక, నిర్మాణ రంగం ఊపందుకుంది. ఫలితంగా సరుకు రవాణా అవసరాలు పెరగడంతో వాణిజ్య వాహన విక్రయాల్లో వృద్ధి నమోదైంది. -
జూన్లో ఇంధన అమ్మకాలు జూమ్..
న్యూఢిల్లీ: పంటల సీజన్, ప్రయాణాలు, ఆర్థిక కార్యకలాపాలు పుంజుకుంటున్న నేపథ్యంలో ఇంధన విక్రయాలు పెరుగుతున్నాయి. జూన్లో దేశీయంగా పెట్రోల్, డీజిల్ అమ్మకాలు భారీగా పెరిగాయి. పరిశ్రమ గణాంకాల ప్రకారం.. పంటల సీజన్ ప్రారంభ దశ కావడంతో డీజిల్ విక్రయాలు కరోనా ముందు స్థాయికి ఎగిశాయి. రెండంకెల స్థాయి వృద్ధి నమోదు చేశాయి. జూన్లో డీజిల్ అమ్మకాలు (2021 జూన్తో పోలిస్తే) 35.2 శాతం పెరిగి, 7.38 మిలియన్ టన్నులకు చేరాయి. 2019 జూన్తో (కరోనా పూర్వం) పోలిస్తే ఇది 10.5 శాతం, 2020 జూన్తో పోలిస్తే 33.3 శాతం ఎక్కువ. అలాగే ఈ ఏడాది మేలో నమోదైన 6.7 మిలియన్ టన్నులతో పోలిస్తే 11.5 శాతం అధికం. వ్యవసాయం, రవాణా రంగాల్లో వినియోగం పెరగడం వల్ల డీజిల్కు డిమాండ్ ఎగిసిందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. మరోవైపు, ప్రభుత్వ రంగ రిటైల్ సంస్థల్లో పెట్రోల్ విక్రయాలు జూన్లో 29 శాతం పెరిగి 2.8 మిలియన్ టన్నులకు చేరాయి. 2020 జూన్తో పోలిస్తే ఇది 36.7 శాతం, 2019 అదే నెలతో పోలిస్తే 16.5 శాతం అధికం. నెలవారీగా చూస్తే 3.1 శాతం ఎక్కువ. గతేడాది ఇదే వ్యవధిలో బేస్ తక్కువగా నమోదు కావడం కూడా జూన్లో గణాంకాలు మెరుగ్గా ఉండటానికి కారణమని పరిశ్రమ వర్గాలు వివరించాయి. అటు, గత నెల వంట గ్యాస్ అమ్మకాలు స్వల్పంగా 0.23 శాతం పెరిగి 2.26 మిలియన్ టన్నులకు చేరాయి. విమానయాన రంగం రెండేళ్ల తర్వాత పూర్తి స్థాయిలో కార్యకలాపాలు ప్రారంభిస్తుండటంతో విమాన ఇంధనం (ఏటీఎఫ్) విక్రయాలు రెట్టింపై 5,35,900 టన్నులుగా నమోదయ్యాయి. విండ్ఫాల్ ట్యాక్స్తో సుంకాల నష్టం దాదాపు భర్తీ .. దేశీయంగా ఉత్పత్తయ్యే, విదేశాలకు ఎగుమతి చేసే చమురుపై విండ్ఫాల్ ట్యాక్స్ విధించడం ద్వారా ప్రభుత్వ ఖజానాకు భారీగానే దఖలు పడనుంది. దీంతో పెట్రోల్, డీజిల్పై సుంకాల తగ్గింపు వల్ల వాటిల్లే సుమారు రూ. 1 లక్ష కోట్ల నష్టాన్ని నాలుగింట మూడొంతుల మేర ప్రభుత్వం భర్తీ చేసుకోనుందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. కంపెనీలు ప్రత్యేకంగా ఎటువంటి పెట్టుబడులు పెట్టకుండా, ధరలు అనూహ్యంగా పెరగడం వల్ల పొందే భారీ లాభాలపై విధించే పన్నును విండ్ఫాల్ ట్యాక్స్గా పరిగణిస్తారు. విండ్ఫాల్ ట్యాక్స్ను ఈ ఆర్థిక సంవత్సరం ఆఖరు దాకా కొనసాగించిన పక్షంలో ఖజానాకు కనీసం రూ. 72,000 కోట్ల మేర ఆదాయం రావచ్చని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. -
ఎస్యూవీలు.. తగ్గేదేలే!
గత కొన్నేళ్లుగా దేశీ ఆటో రంగంలో సరికొత్త ట్రెండ్ కనిపిస్తోంది. కార్ల విభాగంలో కాంపాక్ట్ స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్స్(ఎస్యూవీలు) అమ్మకాలు యమ స్పీడ్గా వృద్ధి చెందుతున్నాయి. వెరసి అత్యధిక శాతం కస్టమర్లు ఆసక్తి చూపే చిన్న ప్రీమియం కార్ల విక్రయాలను ఇవి వెనక్కి నెడుతున్నాయి. వెరసి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2021–22) తొలి 11 నెలల్లో మొత్తం అమ్మకాలలో చిన్న ఎస్యూవీల వాటా 22 శాతానికి ఎగసింది. ఇదే సమయంలో హ్యాచ్బ్యాక్ కార్ల వాటా 19 శాతంగా నమోదైంది. ఇతర వివరాలు చూద్దాం... దేశీయంగా ప్రయాణికుల(ప్యాసింజర్) వాహనాల విభాగంలో ఇటీవల కొన్నేళ్లుగా ఎస్యూవీలు యమ స్పీడును ప్రదర్శిస్తున్నాయి. అమ్మకాలలో ప్రీమియం చిన్న కార్లను దాటి వేగంగా పరుగెడుతున్నాయి. ఫలితంగా ఈ ఏడాది తొలి 11 నెలల్లో వీటి వాటా 22 శాతానికి చేరింది. వెరసి ఎప్పటినుంచో అమ్మకాలలో మార్కెట్ లీడర్లుగా నిలుస్తున్న హ్యాచ్బ్యాక్ కార్ల అమ్మకాలను వెనక్కి నెట్టాయి. ఏప్రిల్–ఫిబ్రవరిలో వీటి వాటా 19%కి పరిమితంకావడమే ఇందుకు నిదర్శనం. ఈ బాటలో దేశీయంగా విక్రయమవుతున్న ప్రతీ రెండు కార్లలో నూ ఒకటి ఎస్యూవీయే ఉంటున్నట్లు ఆటో రంగ నిపుణులు పేర్కొన్నారు. వెరసి మార్చితో ముగియనున్న ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడవుతున్న విభాగంగా ఎంట్రీలెవెల్ ఎస్యూవీలు నిలవనున్నట్లు తెలియజేశారు! వివిధ మోడళ్ల ఎఫెక్ట్ కొన్నేళ్లుగా రూ. 10 లక్షల ధరలలోపు కొత్త యూఎస్వీ మోడళ్లు మార్కెట్లను ముంచెత్తుతున్నాయి. వీటికి సులభమైన ఫైనాన్స్ సౌకర్యాలు జత కలుస్తున్నాయి. మరోపక్క సరఫరా సమస్యలతో హ్యాచ్బ్యాక్ మోడళ్ల తయారీ నీరసించడం ఎస్యూవీలకు డిమాండును పెంచుతోంది. పరి శ్రమ వర్గాల అంచనాల ప్రకారం మారుతీ సుజుకీ బ్రెజ్జా, టాటా నెక్సాన్, పంచ్, రేనాల్ట్ కైగర్, హ్యుందాయ్ వెన్యూ మోడళ్లు ఉమ్మడిగా తొలి 11 నెలల్లో 6,00,000 వరకూ విక్రయమయ్యాయి. ఇదే కాలంలో వివిధ కంపెనీల హ్యాచ్బ్యాక్ మోడళ్లు 5,40,000 అమ్ముడైనట్లు అంచనా. ప్రారంభ శ్రేణి ఎస్యూవీల స్పీడుకు ప్రధానంగా మూడు కారణాలున్నట్లు మారుతీ సుజుకీ సీనియర్ అధికారి శశాంక్ శ్రీవాస్తవ చెబుతున్నారు. పలు కొత్త మోడళ్లు విడుదలకావడం, అధిక గ్రౌండ్ క్లియరెన్స్, ప్రీమియం హ్యాచ్బ్యాక్, కాంపాక్ట్ సెడాన్ ధరలతో పోలిక వంటి అంశాలను ప్రస్తావించారు. కాంపాక్ట్ ఎస్యూవీ విభాగంలో బ్రెజ్జా అత్యధికంగా విక్రయమవుతున్న మోడల్గా పేర్కొన్నారు. జాబితాలో కంపెనీలు.. హ్యుందాయ్ మోటార్ ఇండియా అమ్మకాలలో సగం వాటా ఎస్యూవీలదేకాగా.. టాటా మోటా ర్స్, మహీంద్రా అండ్ మహీంద్రా , జీప్, కియా, ఎంజీ మోటార్స్, నిస్సాన్ ఎస్యూవీలను రూపొందించడంలో ముందుంటున్నాయి. గత మూడు, నాలుగేళ్లలోనే 12 రకాల కొత్త యూఎస్వీలు మార్కెట్లలోకి ప్రవేశించాయి. మొత్తం ఎస్యూవీల మార్కెట్లో ఎంట్రీలెవెల్ ఎస్యూవీల వాటా 60 శాతంకావడం గమనించదగ్గ అంశం! -
పండుగ సీజన్పై పెద్ద ఆశలు...
న్యూఢిల్లీ: ఈ ఏడాది పండుగ సీజన్లో అమ్మకాలు రెండంకెల వృద్ధిని సాధిస్తాయని గృహోపకరణాలు, కన్జూమర్ ఎలక్ట్రానిక్స్ పరిశ్రమ అంచనా వేస్తోంది. కరోనా తీవ్రత నేపథ్యంలో పనిమనుషులు ఇళ్లలోకి రాని పరిస్థితి, వర్క్ ఫ్రమ్ హోమ్ వాతావరణ నేపథ్యం విక్రయాలను పెంచేందుకు తోడ్పడతాయని కన్జూమర్ ఎలక్ట్రానిక్స్ అండ్ అప్లయన్సెస్ తయారీ పరిశ్రమ (సీఈఏఎంఏ) విశ్లేషిస్తోంది. లాక్డౌన్ సడలింపుతో ఈ జూలైలో కన్జూమర్ ఎలక్ట్రానిక్స్ అమ్మకాల్లో వృద్ధిని సాధించగా, ఆగస్ట్ నుంచి గృహోపకరణాల విభాగపు విక్రయాల్లోనూ వృద్ధిని చూస్తున్నట్లు సీఈఏఎంఏ పేర్కొంది. ఆగస్ట్లో ఓనమ్ పండుగ సందర్భంగా జరిగిన అమ్మకాలు అంచనాలను మించడంతో పరిశ్రమలో మరింత ఆశావహ వాతావరణం నెలకొంది. అమ్మకాల వృద్ధి ఇందుకే... వ్యవస్థలో నెలకొన్న డిమాండ్కు తగ్గట్లు పలు కంపెనీలు తమ మార్కెటింగ్ వ్యూహాలను అమలు పరుస్తున్నాయి. ఉత్పత్తులపై క్యాష్బ్యాక్ ప్రకటనలు, వారంట్లతో పాటు వాయిదాల పద్ధతి గడువు పెంపు, ఎక్సే్చంజ్ ఆఫర్లు, కొత్త ఉత్పత్తుల ఆవిష్కరణ లాంటి పద్ధ్దతులను అనుసరిస్తూ కస్టమర్లను ఆకర్షిస్తున్నాయి. అలాగే కోవిడ్–19 నేపథ్యంలో ప్రజలు ఆరోగ్య భద్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ఫలితంగా ఈ తరహా పరికరాలకు డిమాండ్ భారీగా పెరిగింది. వీటికే అధిక డిమాండ్... కరోనాతో గృహ శ్రామిక శక్తి(పని మనుషుల) కొరత నెలకొనడంతో వాషింగ్ మెíషీన్, మైక్రోవేవ్, డిష్వాష్ బార్, రిఫ్రిజిరేటర్ లాంటి ఎలక్ట్రానిక్స్ పరికరాలకు అధిక డిమాండ్ నెలకొందని సీఈఏఎంఏ తెలిపింది. వర్క్ ఫ్రమ్ హోమ్తో పాటు కరోనా తో దాదాపు అందరూ ఇం టికే పరిమితం కావడంతో టీవీలు, హోమ్, పర్సనల్ ఆడియోలకు మంచి గిరాకీ నెలకొంది. ఆందోళనలూ ఉన్నాయ్... పరిశ్రమ ఆశావాదాన్ని వ్యక్తం చేస్తున్నప్పటికీ స్థానిక రిటైలర్లు, బ్రాండ్ల విషయంలో సీఈఏఎంఏ కొంత ఆందోళనను వ్యక్తం చేసింది. ద్రవ్య కొరత కారణంగా గత సీజన్లలో మాదిరి స్కీములు, ప్రమోషన్లు లాంటి కార్యక్రమాలను వారు నిర్వహించలేకపోవచ్చని చెప్పుకొచ్చింది. అలాగే ఫోన్లు, ల్యాప్æట్యాప్స్, టీవీ లాంటి పరికరాల్లో ఉత్పత్తి కొరత కారణంగా బ్రాండ్ల సమస్య నెలకొని ఉంది. కంపెనీల ఆశాభావం... ఓనమ్తో పండుగ సీజన్ ప్రయాణాన్ని సానుకూలంగా ప్రారంభించామని, గతేడాదితో పోలిస్తే ఈ విభాగాల్లో అమ్మకాలు ఇప్పటికే 20 శాతం వృద్ధిని సాధించాయని సోనీ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ సునీల్ నయ్యర్ తెలిపారు. పండుగ సీజన్ ముగిసేనాటికి 30శాతం అమ్మకాలను సాధిస్తామని ఆయన అన్నారు. మరోవైపు ఓనమ్ సందర్భంగా ప్యానసోనిక్ అమ్మకాలు కిందటేడాదితో పోలిస్తే 18 శాతం వృద్ధిని సాధించాయి. ఈ పండుగ సీజన్ విక్రయాల్లో 20శాతం వృద్ధిని సాధిస్తామని కంపెనీ ధీమా వ్యక్తం చేస్తోంది. దక్షిణ కొరియా దిగ్గజం ఎల్జీ సైతం ఇదే కాలంలో 30శాతం అమ్మకాల వృద్ధిని ఆశిస్తోంది. -
మరోసారి టాప్ లో మారుతి
ప్రముఖ దేశీ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకీ మరోసారి సత్తా చాటింది. ఆగస్ట్ నెలలో ఆకర్షణీయ అమ్మకాలతో టాపర్ గా నిలిచింది. కార్ల తయారీ దిగ్గజం సుజుకి భారతదేశం లిమిటెడ్ ఆగస్టు విక్రయాలలో 12 శాతం వృద్ధిని నమోదు చేసింది. గత ఏడాదితో పోలిస్తే ఆగస్టు నెలలో 132,211 యూనిట్ల (119.931 డొమెస్టిక్/ 12,280 ఎగుమతులు) ను విక్రయించినట్టు బీఎస్ఈ ఫైలింగ్ లో తెలిపింది. గత ఏడాది 117,864 యూనిట్ల (106,781 / 11,083) గా ఉన్నాయి. ప్రయాణికుల వాహనాల మొత్తం అమ్మకాలు 12.2 శాతం పెరిగి 1.3 లక్షల యూనిట్లను తాకాయి. వీటిలో దేశీ అమ్మకాలు 12.3 శాతం వృద్ధితో 1.19 లక్షల యూనిట్లుగా నమోదయ్యాయి. అలాగే 10.8 శాతం వృద్ధితో 12,280 యూనిట్లను ఎగుమతి చేసింది. అలాగే యుటిలిటీ వాహనాల విక్రయాలు 114.5 శాతం వృద్ధితో16.806 యూనిట్లకు పెరిగాయి. మధ్యస్థాయి కార్ల సెగ్మెంట్ సియాజ్, కాంపాక్ట్ సెగ్మెంటో విభాగంలోస్విఫ్ట్, రిట్జ్, బాలెనో, సెలెరియో, డిజైర్ అమ్మకాలు కూడా వృద్ధి పొందాయి. అయితే ఆగష్టు 2015 అమ్మకాలు పోలిస్తే మారుతి సుజుకి దాని మినీ సెగ్మెంట్ లో మాత్రం కొద్దిగా తగ్గుదలనునమోదుచేసింది.వృద్ధిని ఆల్టో, వ్యాగన్ ఆర్, సూపర్ కాంపాక్ట్ సెగ్మెంట్లో (డిజైర్ టూర్) గత నెలలో అమ్మకాలు క్షీణించాయి. వచ్చే మూడు నెలల పండుగ సీజన్, ఏడవ వేతన కమిషన్ సిఫారసులు అమలు, మంచి వాతావరణ పరిస్థితులు, తదితర కీలక అంశాల కారణంగా ప్రత్యేక మెడల్స్ లో డిమాండ్ మరింత పుంజుకునే అవకాశాలున్నాయని పార్ట్ నర్ వాటర్ హౌస్ కు చెందిన అబ్దుల్ మజీద్ తెలిపారు. డీజిల్ వాహనాలపై నెలకొన్న అనిశ్చితి నేపథ్యంలో యూజర్లు డీజిల్ తో పోలిస్తే.. పెట్రోల్ ఇంజీన్ కార్లవైపే మొగ్గు చూపే అవకాశం ఉందని తెలిపారు. ఈ వార్తల నేపథ్యంలో మారుతి స్వల్ప లాభాలతో ట్రేడ్ అవుతోంది. మరోవైపు ఎంట్రీ లెవల్ సెగ్మెంట్ పైనే ఎక్కువగా దృష్టి కేంద్రీకరించినట్టు మారుతి సుజుకి ఎండీ కెనిచి అయుక్వా తెలిపారు. దీపావళి కి ముందు మరిన్ని వాహనాలను డెలీవరీ చేయాల్సి ఉందన్నారు. మరో ఆరు నెలల్లో గుజరాత్ లోని తమ ప్లాంట్ రడీ అవనున్నట్టు ఆయన వెల్లడించారు. భద్రతా ఉద్గార నిబంధనలు అమల్లోకి వస్తే రాబోయేరెండేళ్లలో కార్ల ధరలుమరింత పెరుగుతాయని చెప్పారు.