share price
-
కంపెనీకి భారీ నష్టం.. షేరు ధర మాత్రం పైకి... ఎందుకిలా?
ఆర్ధిక ఫలితాల సీజన్ (Q3 Results) మొదలైంది. స్టాక్ మార్కెట్ (Stock market) మదుపర్లు, ట్రేడర్ల కళ్లన్నీ ఇప్పుడు వాటిమీదే ఫోకస్ అయి ఉన్నాయి. గత గురువారం రిలయన్స్, ఇన్ఫోసిస్ (Infosys), యాక్సిస్ బ్యాంకులు ఆర్ధిక ఫలితాలు ప్రకటించాయి. ఈ మూడు కంపెనీలు ప్రకటించిన ఫలితాలు ప్రోత్సాహకరంగానే ఉన్నాయి. అయితే... శుక్రవారం రిలయన్స్ షేరు ధర రూ.35 పెరిగితే యాక్సిస్ బ్యాంకు షేర్ ధర రూ. 47, ఇన్ఫోసిస్ రూ.113 పడిపోయాయి. ఫలితాలు బానే ఉన్నా షేర్ ధర ఎందుకు పడిపోతుందో చాలామందికి తెలియదు. కేవలం ఫలితాలను నమ్ముకుని షేర్ కొంటే చివరకు నష్టపోతారు. ఎందుకిలా జరుగుతుంది?ఈ ప్రశ్నకు అనేకానేక సమాధానాలు. వాటిని విశ్లేషించి చూద్దాం.సాధారణంగా కంపెనీలు ఒక ఏడాది/త్రైమాసికానికి సదరు కాలంలో ఆర్జించిన ఆదాయాలు, లాభాలు/నష్టాలను ప్రకటిస్తూ ఉంటాయి.ఆ మూడు నెలలు, ఏడాది కాలంలో కంపెనీ పనితీరు బావుందా, క్షీణించిందా, కొత్త ప్రాజెక్టులు ఏమి వచ్చాయి, ఉద్యోగులు పెరిగారా/తగ్గారా, ఎంత డివిడెండ్ ప్రకటించాయి, భవిష్యత్ గురించి కంపెనీ ఏం చెబుతోంది? ఇత్యాది ప్రశ్నలు అన్నిటికీ ఈ ఫలితాలు సమాధానం చెబుతాయి.ఒక కంపెనీ ప్రకటించే లాభాలు, డివిడెండ్ లే ఆ కంపెనీ ఎంత ఆరోగ్యకరంగా పనిచేస్తోందో తెలియచెబుతాయి.ఆ కంపెనీ ఏ రంగానికి చెందిందో.. ఆ రంగానికి ప్రస్తుతం, భవిష్యత్ ఎలా ఉండొచ్చు అన్న అంశాన్ని కూడా విశ్లేషకులు అంచనా వేసి ఒక నిర్ణయానికి వస్తారు.కంపెనీ ఆదాయం స్థిరంగా పెరుగుతూ వస్తోందా... రాబోయే రోజుల్లో వేరే కంపెనీలను కొనుగోలు చేసే స్థాయిలో పుష్కలంగా నిధులను సంపాదించగలుగుతోందా అని కూడా చూస్తారు.అలాగే ఈపీఎస్ అనేది ప్రముఖ పాత్ర పోషిస్తుంది. ఈపీఎస్ అంటే ఎర్నింగ్ పర్ షేర్ అని అర్ధం. సింపుల్ గా చెప్పాలంటే ఒక్కో షేర్ పై గిట్టుబాటు అయ్యేది ఎంత అన్నది తెలుస్తుంది. ఈ పై అంశాలన్నీ స్టాక్ మార్కెట్లో ఒక షేర్ ధరను నిర్ధారిస్తాయి. ఒక కంపెనీ మంచి ఆదాయాలు, లాభాలు ఆర్జించినంత మాత్రాన ఆ కంపెనీ షేర్ ధర పెరిగిపోదు. ఒక్కోసారి పడిపోతుంది కూడా. ఇలా ఎందుకు జరుగుతుందో చూద్దాం.ఇన్ఫోసిస్ నే ఉదాహరణగా తీసుకుందాం. ఈ కంపెనీ అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికానికి రూ.41,764 కోట్ల ఆదాయంపై రూ. 6,806 కోట్ల లాభాన్ని ప్రకటించింది. ఆదాయం 8 శాతం, లాభం 11 శాతం పెరిగాయి. పైగా భవిష్యత్లో ఆర్జించబోయే ఆదాయాల అంచనాలను కూడా పెంచింది. ఫలితాలు ప్రోత్సాహకరంగానే ఉన్నాయి. అయినా శుక్రవారం ఈ కంపెనీ షేర్ ధర రూ.113 పడిపోయింది. దీనికి అనేక కారణాలు...ఫలితాలు ప్రకటించడానికి ముందే మార్కెట్ కు కొంత సమాచారం ఉంటుంది. దాన్నిబట్టి ప్రస్తుత ఫలితాలు ఉన్నాయా, లేదా అని మార్కెట్ వర్గాలు చూస్తాయి. కంపెనీ మంచి ఫలితాలు ప్రకటించినా, వాళ్ళ అంచనాలు అందుకోలేకపోతే షేర్ ధరను పడగొడతారు. ఈ విషయంపై ఓ కన్నేయాలి.ఫలితాలకు ముందే ఆ షేర్ ధర పెరిగి ఉంటుంది. "వదంతులు వ్యాపించినప్పుడు కొనాలి. అవి నిజమైనప్పుడు అమ్మేయాలి..." అన్నది మార్కెట్లో ఉన్న సామెత. సాధారణంగా మార్కెట్లో బడా వర్గాలకు ముందే కాస్త ఉప్పు అందుతుంది కాబట్టి వాళ్ళు రూమర్ల సమయంలోనే కొనేస్తారు. కొద్ది రోజుల తర్వాత ఆ షేర్ అమ్మేసి మంచి లాభాలు సంపాదిస్తారు. ఇలా ఎందుకు జరుగుతోందో చాలామంది చిన్న ఇన్వెస్టర్లకు తెలియదు. ఈలోపు సదరు కంపెనీ ఆ రూమర్లను నిజం చేస్తూ ప్రకటన చేస్తుంది. అది చూసి రిటైల్ ఇన్వెస్టర్లు కొనడం మొదలెడతారు. సరిగ్గా ఈ సమయంలోనే అంతకుముందే కొనుగోలు చేసిన పెద్ద ఇన్వెస్టర్లు మెల్లగా బయటకు వచ్చేయడం మొదలెడతారు. దీంతో షేర్ ధర పడటం మొదలవుతుంది. అలా ఎందుకు జరుగుతోందో వీళ్లకు అర్ధం కాదు. మంచి పాజిటివ్ న్యూస్ కదా.. ఇప్పుడు పడినా కానీ మళ్ళీ పెరుగుతుందిలే అని ఎదురుచూస్తూ ఉంటారు. కానీ ఆ షేర్ ఇంకా పడుతూనే ఉంటుంది. చివరకు నష్టాన్ని బుక్ చేసి బయటకు రావాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. ఇలా జరక్కూడదంటే మార్కెట్ తో పాటు నడవడం నేర్చుకోవాలి.ఒక్కోసారి కంపెనీ చాలా చెత్త ఫలితాలు ప్రకటిస్తుంది. అయినా షేర్ ధర భారీగా పెరుగుతుంది. నష్టాలు వచ్చాయి కదా.. షేర్ ధర పడుతుంది అని షార్ట్ సెల్ చేసిన చిన్న ఇన్వెస్టర్లు లాస్ భరించాల్సి వస్తుంది. దీనికి కారణం ఏమిటంటే.. కంపెనీ పరిస్థితి బాలేదని, నష్టాలు ప్రకటించబోతోందని ముందే పసిగట్టిన మార్కెట్... అవే మాదిరి ఫలితాలు రాగానే పెద్దగా ఆందోళన చెందదు. అంచేత షేర్ ధర పెరుగుతుంది. ఇదే సమయంలో ఈ విషయం ఊహించని చిన్న ఇన్వెస్టర్ మాత్రం నష్టపోతాడు. ఇలా ప్రతిసారీ జరక్కపోవచ్చు కానీ, ఈ ప్రమాదాన్ని పసిగట్టగలగాలి.కొన్ని కంపెనీలు ఆర్ధిక ఫలితాల విషయంలో తిమ్మిని బమ్మి చేసి చూపించడానికి ప్రయత్నిస్తూ ఉంటాయి. సెబీ నిబంధనలకు ఇది విరుద్ధం. ఇలా మదుపర్లను మోసం చేయాలని చూసే ఆయా కంపెనీలపై సెబీ తగిన చర్యలు తీసుకుంటుంది. సత్యం రామలింగరాజు జైలు పాలవడం, ఆ కంపెనీని మహీంద్రా గ్రూప్ హస్తగతం చేసుకోవడం గుర్తుండే ఉంటుంది. వాస్తవానికి లాభాలు తగిన స్థాయిలో రాకపోయినా, అధిక లాభాలు వచ్చినట్లు చూపిస్తూ మభ్యపెట్టడం ద్వారా మదుపర్లను నిట్టనిలువునా ముంచేయడమే రామలింగరాజు చేసిన పని. అంచేత కంపెనీ పనితీరు, ఫండమెంటల్స్ పై అవగాహన లేకుండా ఇష్టమొచ్చినట్లు షేర్లు కొనేయకూడదు.కంపెనీ పనితీరు అద్భుతంగా ఉన్నా షేర్ ధర పడటం అనేది తాత్కాలికమే కావచ్చు. పైగా అదే రంగంలోని మరో కంపెనీ అంతకుముందే ప్రకటించిన ఆర్ధిక ఫలితాలతో బేరీజు వేసుకుని చూడటం వల్ల కూడా ఒక్కోసారి షేర్ ధర పడుతుంది. కాబట్టి ఈ విషయంపైనా కూడా మదుపర్లు అవగాహన కలిగి ఉండటం అవసరం.మార్కెట్లో ట్రేడ్/ఇన్వెస్ట్ చేసే వ్యక్తులు గుర్తుపెట్టుకోవాల్సిన ప్రధానాంశం... ఆ ఫలితాలను విశ్లేషించే కొన్ని ప్రాథమిక విషయాలు తెలిసి ఉండటం. లేదంటే నిండా మునిగిపోతారు. ఫలితాల సందర్భంగా కంపెనీ ఎలాంటి ప్రకటన చేసింది? విశ్లేషకులు ఏం చెబుతున్నారు? ఆరోజు మార్కెట్లో షేర్ కదలికలు ఎలా ఉన్నాయి? వంటి విషయాలు తెలుసుకోకుండా గుడ్డిగా షేర్లు కొనేస్తే... తగిన ఫలితం అనుభవించక తప్పదు. తస్మాత్ జాగ్రత్త.-బెహరా శ్రీనివాస రావుస్టాక్ మార్కెట్ విశ్లేషకులు -
ఒకేరోజు రూ.3.53 నుంచి రూ.2.36 లక్షలకు చేరిన స్టాక్!
ఎల్సిడ్ ఇన్వెస్ట్మెంట్స్ అనే స్మాల్ క్యాప్ స్టాక్ భారీగా పెరిగి రికార్డు నమోదు చేసింది. అక్టోబర్ 29న పెరిగిన స్టాక్ విలువ ఏకంగా ఇండియన్ ఈక్విటీ మార్కెట్లోనే ఖరీదైన స్టాక్గా మారింది. ఈ స్టాక్ ధర ఒక్క ట్రేడింగ్ సెషన్లో ఏకంగా 66,92,535 శాతం దూసుకుపోయింది. దాంతో గతంలో రూ.3.53గా ఉండే స్టాక్ ధర కాస్తా రూ.2,36,250కు చేరింది. ఇండియాలోనే ఇప్పటి వరకు ఖరీదైనా స్టాక్గా ఉన్న ఎంఆర్ఎఫ్ షేర్ ధర రూ.1.2 లక్షలును మించిపోయింది.షేర్ ధర రూ.3.53 వద్ద ఎందుకుందంటే..2011 నుంచి ఒక్కో షేరు ధర దాదాపు రూ.3గా ఉంది. కానీ ఎల్సిడ్ ఇన్వెస్ట్మెంట్స్ ఒక్కో షేర్ పుస్తక విలువ(వాస్తవ విలువ) రూ.5,85,225గా ఉంది. ఇలా కంపెనీ స్టాక్ల వాస్తవ విలువ ఆకర్షణీయంగా ఉండడంతో కంపెనీ షేర్లు ఎవరూ అమ్మడానికి ఇష్టపడలేదు. దాంతో షేర్ల ట్రేడింగ్ కొరత ఎక్కువైంది. తక్కువ ట్రేడింగ్ వాల్యూమ్ల కారణంగా స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ నిలిపేశారు. ఫలితంగా దాదాపు ఒక దశాబ్దం పాటు స్టాక్ ధర సింగిల్ డిజిట్లోనే ఉంది.ఇదీ చదవండి: ‘షరతులు తీరిస్తే జాబ్ చేయడానికి సిద్ధం’ఎందుకు అంత పెరిగిందంటే..ఎల్సిడ్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ వాల్యుయేషన్కు అనుగుణంగా ప్రత్యేక సెషన్ను నిర్వహించాలని స్టాక్ ఎక్స్ఛేంజీలను సెబీ ఆదేశించింది. దాంతో ఎల్సిడ్ వాటాదారుల పంట పండినట్లయింది. కొత్త మెకానిజంలో భాగంగా లిక్విడిటీని మెరుగుపరచడం, సరసమైన ధరల ఆవిష్కరణను సులభతరం చేయడం లక్ష్యంగా హోల్డింగ్ కంపెనీలకు ఎటువంటి ప్రైస్ బ్యాండ్లు విధించలేదు. దాంతో బీఎస్ఈ, ఎన్ఎస్ఈ నిర్వహించిన ప్రత్యేక కాల్ ఆక్షన్ సెషన్లో స్టాక్ ధర భారీగా పెరిగింది. మంగళవారం కొన్ని షేర్లు చేతులు మారిన తర్వాత, బుధవారం ఉదయం ఎటువంటి ట్రేడింగ్ కార్యకలాపాలు జరగలేదు. -
సెబీ కొత్త నిబంధనలు..రియల్ టైం షేర్ వ్యాల్యూ షేరింగ్పై
స్టాక్ మార్కెట్ మదపర్లకు ముఖ్యగమనిక. వివిధ ఆన్లైన్ ప్లాట్ఫారమ్లతో పాటు థర్డ్ పార్టీ యాప్లకు రియల్ టైమ్ షేర్ వ్యాల్యూ సమాచారాన్ని అందించే అంశంపై మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త నిబంధనల్ని అమల్లోకి తెచ్చింది.ఈ సందర్భంగా నిర్దిష్ట ఆన్లైన్ గేమింగ్ ప్లాట్ఫారమ్లు, యాప్లు, వెబ్సైట్లు మొదలైనవి రియల్ టైం షేర్ వ్యాల్యూ ఆధారంగా వర్చువల్ ట్రేడింగ్ (పేపర్ కరెన్సీ), పలు ట్రేడింగ్ చేయడం ఎలాగో నేర్పించే ఫాంటసీ గేమ్ తయారీ సంస్థలకు అందిస్తున్నట్లు దృష్టికి వచ్చింది. అంతేకాదు కొన్ని లిస్టెడ్ కంపెనీలు సైతం సంబంధిత వర్చువల్ స్టాక్ పోర్ట్ఫోలియో పనితీరు ఆధారంగా రివార్డ్స్ లేదంటే డబ్బుల్ని చెల్లిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విధానంపై పెట్టుబడిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని, వారి సమస్యకు పరిష్కార మార్గంగా సెబీ కొత్త నిబంధనలు అమల్లోకి తెచ్చింది. సెబీ ప్రకారం, అనుమతులు లేకుండా రియల్ ట్రైం ట్రేడింగ్ వ్యాల్యూ ఏంటనేది మధ్యవర్తులకు చేరవేయకూడదని తెలిపింది. ఒకవేళ్ల పంపించాల్సి వస్తే వ్రాతపూర్వక ఒప్పందాలపై సంతకం చేయాలి. ఈ బాధ్యతల్ని మార్కెట్ ఇన్ఫ్రా స్ట్రక్చర్ ఇనిస్టిట్యూషన్లు (ఎంఐఐఎస్)లు పరిశీలించాల్సి ఉంటుందని సెబీ తన మార్గదర్శకాల్లో వెల్లడించింది. సర్క్యులర్ విడుదలైన ముప్పై రోజుల తర్వాత కొత్త నిబంధనలు అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది. ఈ సందర్భంగా పెట్టుబడిదారులకు అవగాహన కల్పించడం, అవగాహన కల్పించడం కోసం మార్కెట్ ధరల డేటాను పంచుకునేటప్పుడు ఆర్థిక ప్రోత్సాహకాలు అవసరం లేదని సెబీ పేర్కొంది -
రిలయన్స్ షేర్ల రికార్డ్.. రూ.18 లక్షల కోట్ల మార్కు దాటిన ఆర్ఐఎల్
ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ల ధర ఊపందుకుంది. మార్కెట్ విలువ ప్రకారం దేశంలో అతిపెద్ద కంపెనీ అయిన ఆర్ఐఎల్ షేర్లు గురువారం (జనవరి 11) 2 శాతానిపైగా పెరిగాయి. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్లో ఈ కంపెనీ షేరు విలువ రూ. 2,700కిపైగా పెరిగి కొత్త రికార్డు స్థాయికి చేరుకుంది. ఫలితంగా ఆర్ఐఎల్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 18 లక్షల కోట్ల మార్కును దాటింది. గతేడాది నిఫ్టీలో రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ల విలువ 9 శాతం తగ్గుదల నమోదైంది. అయితే ఆర్ఐఎల్ షేర్ల కొనుగోళ్లు గత కొన్ని రోజులలో ఊపందుకున్నాయి. గత రెండు ట్రేడింగ్ సెషన్లలో సుమారుగా 4 శాతం పెరిగాయని ఎకనమిక్స్ టైమ్స్ నివేదిక పేర్కొంది. డిసెంబరు త్రైమాసిక ఫలితాల సీజన్ నేటి నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రధాన బ్రోకరేజీల కొనుగోలు జాబితాలో ఆర్ఐఎల్ అగ్రస్థానంలో ఉంది. గోల్డ్మ్యాన్ సాచ్స్ ఇటీవల ఆర్ఐఎల్ టార్గెట్ ధరను రూ.2,660 నుంచి రూ.2,885కి పెంచగా జెఫరీస్ ఇంకా ఎక్కువగా టార్గెట్ ధరను రూ.3,125గా నిర్ణయించింది. ఇక నోమురా అయితే రూ. 2,985గా నిర్ణయించింది. త్వరలో గ్రీన్ ఎనర్జీ గిగా కాంప్లెక్స్ జామ్నగర్లోని ధీరూభాయ్ అంబానీ గ్రీన్ ఎనర్జీ గిగా కాంప్లెక్స్ను 2024 ద్వితీయార్థంలో ప్రారంభించనున్నట్లు ఆర్ఐఎల్ చైర్పర్సన్ ముఖేష్ అంబానీ తాజాగా ప్రకటించారు. 5,000 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ ప్రాజెక్ట్ హరిత ఇంధన రంగంలో అత్యధిక ఉద్యోగాలను సృష్టించడం, పర్యావరణహిత ఉత్పత్తులను పెంపొందించడం లక్ష్యంగా పెట్టుకుంది. -
భార్యతో తెగదెంపులు: ఇప్పటికే రూ. 1500 కోట్లు మటాష్!
రేమండ్ అధినేత, బిలియనీర్ గౌతమ్ సింఘానియా భార్యతో, విభేదాలు, విడాకులు అంశం వార్తలకెక్కింది మొదలు రేమాండ్ సంపద భారీగా కుప్పకూలింది. దాదాపు 1500కోట్ల రూపాయలను సంస్థ కోల్పోయింది. 32 ఏళ్ల తమ వైవాహిక జీవితానికి స్వస్తి అంటూ తన భార్య నవాజ్ సింఘానియాతో విడిపోతున్నట్లు సింఘానియా ప్రకటించిన సంగతి తెలిసిందే. భౌతిక దాడికి పాల్పడ్డారని బోర్డు మీటింగ్స్లో మాట్లాడనీయలేదని నవాజ్ మోడీ ఆరోపణల నేపథ్యంలో వివాదం నడుస్తోంది. అటు ఇద్దరు కుమార్తెల ప్రయోజనాలు, కుటుంబ గౌరవం నేపథ్యంలో తన గోప్యతను గౌరవించాలంటూ సింఘానియా మౌనం పాటిస్తుండటం గమనార్హం. ప్రపంచంలోనే అతిపెద్ద సూట్ ఫాబ్రిక్ ఉత్పత్తిదారులలో ఒకటైన రేమండ్ లిమిటెడ్ ఛైర్మన్ గౌతమ్ సింఘానియా వివాదం నేపథ్యంలో పెట్టుబడిదారులలో ఆందోళన నెలకొంది. దీంతో వరుసగా ఏడో రోజు కూడా భారీ అమ్మకాలు వెల్లువెత్తాయి. బుధవారం నాడు షేర్లు 4.4శాతం కుప్పకూలాయి. నవంబర్ 13 నుండి షేరు మొత్తంగా 12శాతం పతనమైంది. నవాజ్ మోడీ కూడా బోర్డు సభ్యురాలు కాబట్టి ఇది కార్పొరేట్ గవర్నెన్స్ సమస్య అనీ, ఇది కంపెనీపై ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలియదని ICICI సెక్యూరిటీస్ లిమిటెడ్ విశ్లేషకుడు వరుణ్ సింగ్ అన్నారు. రూ.11,658 కోట్ల నెట్వర్త్ మరోవైపు సెటిల్మెంట్లో భాగంగా నవాజ్ మోడీ 1.4 బిలియన్ డాలర్ల సంపదలో 75శాతం ఇవ్వాలని కోరినట్టు తెలుస్తోంది.అయితే దీనిపై ఆ రేమండ్ గ్రూప్ ప్రతినిధి ఇంకా అధికారికంగా స్పందించలేదు. రేమండ్ లిమిటెడ్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.11,658 కోట్లు. రేమండ్ వ్యాపారంలో ఎక్కువ భాగం రియల్ ఎస్టేట్ వాటానే ఎక్కువ. దక్షిణ ముంబైలోని జేకే హౌస్ ఆస్తి అత్యంత విలువైందిగా అంచనా. దీని విలువ దాదాపు రూ. 6,000 కోట్లు ఉంటుందని సమాచారం. దీంతోపాటు లంబోర్ఘిని గల్లార్డో LP570 సూపర్లెగ్గేరా, లంబోర్ఘిని ముర్సిలాగో, లోటస్ ఎలిస్ కన్వర్టిబుల్, నిస్సాన్ స్కైలైన్ GTR, హోండా S2000, ఫెరారీ 458 ఇటాలియా, ఆడి క్యూ7 లగ్జరీ కార్లు కూడా సింఘానియా సొంతం. -
22 వేలకోట్ల రూపాయలతో టీసీఎస్ బైబ్యాక్!
అత్యంత విలువైన భారత బ్రాండ్ ఐటీ దిగ్గజ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) 22వేలకోట్ల రూపాయల విలువైన షేర్ల బైబ్యాక్ను ప్రకటించనుంది. దాంతో తీవ్ర మార్కెట్ అనిశ్చితి మధ్య సోమవారం మార్కెట్లో టీసీఎస్ షేర్ విలువ స్వల్పంగా పెరిగి 52 వారాల గరిష్టానికి చేరింది. గడిచిన ఆరేళ్లలో కంపెనీ ఐదోసారి బైబ్యాక్ ప్రతిపాదనను పరిశీలిస్తుంది. ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం.. లిస్టెడ్ కంపెనీ తన నికర విలువలో 25శాతం వరకు షేర్లను తిరిగి కొనుగోలు చేయవచ్చు. దాని ప్రకారం జూన్ 30 చివరి నాటికి టీసీఎస్ రూ.22,620 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేయగలదు. ఇది 2017 నుంచి కంపెనీ బైబ్యాక్ చేసిన షేర్లకంటే ఎక్కువ. ఫిబ్రవరి 2017, 2018, 2020లో వరుసగా రూ.16000కోట్లు, 2022లో రూ.18వేల కోట్ల విలువైన షేర్ల బైబ్యాక్ను ప్రకటించింది. అయితే ఈ విధానం కంపెనీని ఆర్థికంగా ఎన్నోవిధాలుగా ప్రభావితం చేస్తుంది. జూన్ 30నాటికి కంపెనీ బ్యాలెన్స్షీట్లో రూ.15,622 కోట్లు క్యాష్ రూపంలో అందుబాటులో ఉందని తెలుస్తుంది. -
రైల్వే సంస్థ జాక్పాట్! రికార్డ్ స్థాయిలో పెరిగిన షేర్ల ధర
భారతీయ రైల్వే ఆధీనంలోని ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ (IRFC) జాక్పాట్ కొట్టింది. స్టాక్ మార్కెట్లో ఆ సంస్థ షేర్లు గురువారం (ఆగస్ట్ 3) నాడు 12 శాతం పెరిగి 52 వారాల కొత్త గరిష్ట స్థాయి రూ.44.65కి చేరుకున్నాయి. ఐఆర్ఎఫ్సీ షేర్ల ధర భారీగా పెరగడానికి కారణం వెంటనే స్పష్టంగా తెలియనప్పటికీ, రూ.5.25 లక్షల కోట్ల పెట్టుబడికి రైల్వే శాఖ ప్లాన్ చేసిందని, దీనిపై కేంద్ర కేబినెట్ ఆమోదానికి ప్రయత్నిస్తున్నట్లు వారం రోజుల కిందట కొన్ని మీడియా నివేదికలు పేర్కొన్నాయి. 2024 నుంచి 2031 ఆర్థిక సంవత్సరాల కాలంలో దేశంలోని రైల్వే మౌలిక సదుపాయాలను మెరుగుపరిచేందుకు ఈ పెట్టుబడి ఉద్దేశించినట్లు తెలుస్తోంది. ఇన్క్రెడ్ ఈక్విటిస్ గౌరవ్ బిస్సా ఈ స్టాక్పై రూ.45 ధర లక్ష్యంతో కొనుగోలు కాల్ జారీ చేయడంతో స్టాక్ కూడా ఊపందుకుంది. ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ అనేది ప్రభుత్వ రంగ సంస్థ. క్యాపిటల్ మార్కెట్లు, ఇతర రుణాల ద్వారా ఆర్థిక వనరులను సేకరిస్తుంది. దీనిపై రైల్వే శాఖ పరిపాలనా నియంత్రణను కలిగి ఉంది. ఈ సంస్థలో కేంద్ర ప్రభుత్వానికి మెజారిటీ వాటా ఉంది. -
లాభాల్లోకి టాటా మోటార్స్.. షేర్ల ధరకు రెక్కలు
న్యూఢిల్లీ: ఆటో రంగ దేశీ దిగ్గజం టాటా మోటార్స్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023–24) తొలి త్రైమాసికంలో టర్న్అరౌండ్ ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన ఏప్రిల్–జూన్(క్యూ1)లో రూ. 3,301 కోట్ల నికర లాభం ఆర్జించింది. గతేడాది(2022–23) ఇదే కాలంలో రూ. 4,951 కోట్ల నికర నష్టం ప్రకటించింది. లగ్జరీకార్ల బ్రిటిష్ అనుబంధ సంస్థ జాగ్వార్ ల్యాండ్రోవర్(జేఎల్ఆర్)తోపాటు వాణిజ్య వాహన బిజినెస్ పుంజుకోవడం కంపెనీ పటిష్ట పనితీరుకు దోహదపడ్డాయి. ఇక మొత్తం ఆదాయం సైతం రూ. 71,228 కోట్ల నుంచి రూ. 1,01,528 కోట్లకు జంప్చేసింది. అయితే మొత్తం వ్యయాలు రూ. 77,784 కోట్ల నుంచి రూ. 98,267 కోట్లకు ఎగశాయి. ఈ కాలంలో టాటా మోటార్స్ స్టాండెలోన్ నష్టం రూ. 181 కోట్ల నుంచి రూ. 64 కోట్లకు తగ్గింది. మొత్తం ఆదాయం రూ. 14,793 కోట్ల నుంచి రూ. 15,733 కోట్లకు బలపడింది. జేఎల్ఆర్ జూమ్... ప్రస్తుత సమీక్షా కాలంలో జేఎల్ఆర్ ఆదాయం 57 శాతం జంప్చేసి 6.9 బిలియన్ పౌండ్లను తాకగా.. 43.5 కోట్ల పౌండ్ల పన్నుకు ముందు లాభం ఆర్జించింది. కొత్త ఏడాదిని పటిష్టంగా ప్రారంభించినట్లు జేఎల్ఆర్ కొత్త సీఈవో అడ్రియన్ మార్డెల్ పేర్కొన్నారు. క్యూ1లో రికార్డ్ క్యాష్ఫ్లోను సాధించినట్లు వెల్లడించారు. ఈ ఏడాది మొత్తం క్యూ1 స్థాయి పనితీరు చూపగలమని విశ్వసిస్తున్నట్లు గ్రూప్ సీఎఫ్వో పీబీ బాలాజీ పేర్కొన్నారు. ఇదీ చదవండి ➤ SEBI Notices To Yes Bank Ex CEO: యస్ బ్యాంక్ రాణా కపూర్కు సెబీ నోటీసు.. రూ. 2.22 కోట్లు కట్టాలి కాగా.. వాణిజ్య వాహన విభాగం ఆదాయం 4.4 శాతం పుంజుకుని రూ. 17,000 కోట్లను తాకింది. దేశీయంగా హోల్సేల్ అమ్మకాలు 14 శాతం క్షీణించి 82,400 యూనిట్లకు చేరగా.. రిటైల్ విక్రయాలు ఇదే స్థాయిలో నీరసించి 77,600 యూనిట్లకు పరిమితమయ్యాయి. ప్రయాణికుల వాహన విభాగం ఆదాయం 11 శాతం ఎగసి రూ. 12,800 కోట్లను తాకినట్లు కంపెనీ ఈడీ గిరీష్ వాగ్ తెలియజేశారు. అమ్మకాలు 8 శాతం వృద్ధితో 1,40,400 యూనిట్లకు చేరినట్లు వెల్లడించారు. బలమైన జూన్ త్రైమాసిక ఆదాయాలతో బుధవారం (జులై 26) ట్రేడింగ్లో ఎన్ఎస్ఈలో టాటా మోటార్స్ షేర్లు 4 శాతానికి పైగా జంప్ చేసి 52 వారాల గరిష్ట స్థాయి రూ.665.40కి చేరుకున్నాయి. -
ఓనర్ ఆస్తుల గురించి ఎవరికీ తెలియని విషయాలు..!
-
LIC: ఏడాదిలో రూ. 1.93 లక్షల కోట్లు ఆవిరి!
న్యూఢిల్లీ: జీవిత బీమా దిగ్గజం ఎల్ఐసీ షేర్లు లిస్టయిన ఏడాది వ్యవధిలో 40 శాతం క్షీణించాయి. దీంతో రూ. 1.93 లక్షల కోట్ల మేర ఇన్వెస్టర్ల సంపద హరించుకుపోయింది. ఎల్ఐసీ గతేడాది ఐపీవో ద్వారా రూ. 20,557 కోట్లు సమీకరించి, రూ. 5.54 లక్షల కోట్ల మార్కెట్ క్యాప్తో టాప్ 5 విలువైన కంపెనీల్లో ఒకటిగా నిల్చింది. షేర్లు మే 17న ఇష్యూ రేటుతో పోలిస్తే దాదాపు 8 శాతం డిస్కౌంటుకు బీఎస్ఈలో రూ. 872 వద్ద, ఎన్ఎస్ఈలో రూ. 867 వద్ద లిస్టయ్యాయి. ఇష్యూ ధర రూ. 949తో పోలిస్తే ప్రస్తుతం షేరు ఎన్ఎస్ఈలో 39.93 శాతం క్షీణించింది. బుధవారం రూ. 570 వద్ద ముగిసింది. తొలి ఏడాది ట్రేడింగ్లో కంపెనీ షేర్లు 52 వారాల గరిష్ట స్థాయి రూ. 920ని, 52 వారాల కనిష్ట స్థాయి రూ. 530.20ని తాకాయి. (ఈ పిక్స్ చూశారా? గుండెలు బాదుకుంటున్న కృతి సనన్ ఫ్యాన్స్) గురువారం కూడా షేరు ధర మరో 3 శాతం నష్టాలతో ఉంది. గడిచిన సంవత్సర కాలంలో ఇష్యూ ధరను మాత్రం దాటలేకపోయాయి. ఇదే వ్యవధిలో బీఎస్ఈ సెన్సెక్స్ 13.33 శాతం, నిఫ్టీ 11.82 శాతం పెరిగాయి. (అయ్యయ్యో! ఐకానిక్ స్టార్, ప్రిన్స్ మహేష్, డార్లింగ్ ప్రభాస్? ఎందుకిలా?) -
టాటా మోటార్స్ నష్టాలు, షేర్లు ఢమాల్!
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022-23) రెండో త్రైమాసికంలో ఆటో మేజర్ స్ట్రీట్ నిరాశపరచడంతో గురువారం ట్రేడింగ్లో టాటా మోటార్స్ షేర్ 5 శాతం కుప్పకూలింది. జాగ్వార్ ల్యాండ్ ఓవర్ (జేఎల్ఆర్) అమ్మకాలు ఆశ్చర్యపరిచినా, దేశీయ లాభాలు ఈ అంచనాలను అందుకోలేక మార్కెట్ను నిరాశపరిచాయి. ఫలితాల నేపథ్యంలో బుధవారం స్వల్ప నష్టాలతో రూ. 433 వద్ద ముగిసింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జులై-సెప్టెంబర్(క్యూ2)లో నికర నష్టాలు భారీగా తగ్గి రూ.945 కోట్లకు పరిమితమయ్యాయి. గతేడాది(2021–22) ఇదే కాలంలో ఏకంగా రూ. 4,442 కోట్ల నష్టం వచ్చింది. ఆదాయం సైతం రూ. 62,246 కోట్ల నుంచి రూ. 80,650 కోట్లకు జంప్చేసింది. ఇక స్టాండెలోన్ నికర నష్టాలు సైతం రూ. 659 కోట్ల నుంచి తగ్గి రూ. 293 కోట్లకు పరిమితమయ్యాయి. మొత్తం ఆదాయం రూ. 11,197 కోట్ల నుంచి రూ. 15,142 కోట్లకు ఎగసింది. జేఎల్ఆర్ జూమ్ ప్రస్తుత సమీక్షా కాలంలో బ్రిటిష్ అనుబంధ సంస్థ జాగ్వార్ ల్యాండ్ రోవర్(జేఎల్ఆర్) ఆదాయం 36శాతం జంప్చేసి 5.3 బిలియన్ పౌండ్లను తాకింది. దేశీయంగా టాటా మోటార్స్ వాణిజ్య వాహన అమ్మకాలు 19శాతం వృద్ధితో 93,651 యూనిట్లను తాకగా.. ఎగుమతులు 22శాతం పుంజుకుని 6,771 వాహనాలకు చేరినట్లు కంపెనీ ఈడీ గిరీష్ వాగ్ పేర్కొన్నారు. ఈ కాలంలో 69శాతం అధికంగా 1,42,755 ప్యాసింజర్ వాహనాలు విక్ర యించింది. ఎలక్ట్రిక్ వాహన విభాగంలో 326శాతం వృద్ధితో 11,522 యూనిట్లు అమ్ముడయ్యాయి. -
వావ్..అదరహో! ఎలైట్ క్లబ్లోకి ఎస్బీఐ ఎంట్రీ
సాక్షి,ముంబై: ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బిఐ) మార్కెట్ క్యాప్ ర్యాంకింగ్లో ఘనతను సొంతం చేసుకుంది. రూ. 5.03 ట్రిలియన్ల మార్కెట్ క్యాప్తో, కంపెనీల మొత్తం మార్కెట్ క్యాప్ ర్యాంకింగ్లోఎస్బీఐ ఏడో స్థానాన్ని సాధించింది. దీంతో రూ.5 ట్రిలియన్ల మార్కెట్ క్యాప్ను దాటిన దేశంలో మూడో బ్యాంకుగా ఎస్బీఐ నిలిచింది. ఎస్బీఐ రూ. 5-ట్రిలియన్ మార్కును అధిగమించడం ఇదే తొలిసారి. షేర్ ధర సెప్టెంబర్ 14న రికార్డు స్థాయిలో రూ. 573ని తాకింది. బీఎస్ఈ డేటా ప్రకారం మార్కెట్ క్యాపిటలైజేషన్ (మార్కెట్ క్యాప్) తొలిసారిగా రూ. 5ట్రిలియన్ మార్కును తాకింది. బలహీనమైన మార్కెట్లో ఎస్బీఐ షేర్లు లాభాల్లో ఉంది. గత మూడు నెలల్లో ఎ స్బీఐ షేరు 26 శాతం ఎగిసింది. ఈ లిస్ట్లో ప్రయివేటు బ్యాంకింగ్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ టాప్ ప్లేస్లో ఉంది. సంస్థ మార్కెట్ క్యాప్ రూ. 8.42 ట్రిలియన్లు. అలాగే ఐసిఐసిఐ బ్యాంక్ మార్కెట్ క్యాప్ రూ. 6.34 ట్రిలియన్లు గా ఉంది. అలాగే గత మూడునెలల కాలంలో ఐసీఐసీఐ బ్యాంక్ 32 శాతం ర్యాలీ చేయగా, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 15 శాతం లాభపడింది. ఈ జాబితాలోని ఇతర ఆరు కంపెనీలు రిలయన్స్ ఇండస్ట్రీస్ (రూ. 17.72 ట్రిలియన్), టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (రూ. 11.82 ట్రిలియన్), హెచ్డిఎఫ్సి బ్యాంక్ (రూ. 8.42 ట్రిలియన్), ఇన్ఫోసిస్ లిమిటెడ్ (రూ. 6.5 ట్రిలియన్), ఐసిఐసిఐ బ్యాంక్ (రూ. 6.34 ట్రిలియన్) యూనిలివర్ (రూ. 6.08 ట్రిలియన్లు) ఉన్నాయి -
అటు భారీ నష్టాలు,ఇటు సీఎఫ్వో గుడ్బై, కుప్పకూలిన షేర్లు
బెంగళూరు: ఆర్థిక సంక్షోభంతో ఇబ్బందులు పడుతున్న స్పైస్జెట్కు మరోషాక్ తగిలింది. ఒకవైపు భారీ స్థాయిలో ఈ త్రైమాసికంలో నష్టాలు, మరోవైపు సంస్థ సీఎఫ్వో రాజీనామా చేయడంతో గురువారం నాటి మార్కెట్లో స్పైస్జెట్ షేర్లలో అమ్మకాల ఒత్తిడి నెలకొంది. ఫలితంగా దాదాపు 15 శాతం కుప్పకూలాయి. ఇది ఇలా ఉండగా గురువారం ఉదయం ఆటోపైలట్ స్నాగ్ కారణంగా ఢిల్లీ-నాసిక్ స్పైస్జెట్ విమానాన్ని వెనక్కి మళ్లించిన ఘటన చోటు చేసుకుంది. ఇదీ చదవండి: చెక్ బౌన్స్ కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు ఇంధన ధరల భారం, దేశీయ కరెన్సీ రూపాయిక్షీణత, స్పైస్జెట్ లిమిటెడ్ భారీ నష్టాన్ని నమోదు చేసింది. మరోవైపు సంస్థ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ సంజీవ్ తనేజా రాజీనామా చేసినట్లు ప్రకటించడంతో ఇన్వెస్టర్ల సెంటిమెంటు దెబ్బతింది. షేర్లు గురువారం ఆరంభంలో 14.7 శాతం నష్టపోయాయి. పెరుగుతున్న నష్టాలు, ఇటీవలి కాలంలో మిడ్-ఎయిర్ సంఘటనల మధ్య సంజీవ్ రాజీనామా చేసినట్లు తెలిపింది. (SpiceJet: స్పైస్జెట్ విమానంలో సమస్య: మధ్యలోనే వెనక్కి) కాగా జూన్తో ముగిసిన త్రైమాసికంలో నికర నష్టం రూ. 789 కోట్లకు పెరిగిందని, ప్రధానంగా అధిక ఇంధన ధరలు, రూపాయి క్షీణత కారణంగా నష్టాలొచ్చాయని బడ్జెట్ ఎయిర్లైన్స్ ప్రకటించింది. ఏడాది క్రితం కాలంలో రూ. 235.3 కోట్ల నికర నష్టాన్ని నివేదించింది. మార్చి 2022తో ముగిసిన త్రైమాసికంలో రూ. 458 కోట్ల నికర నష్టం వచ్చినట్టు వెల్లడించిది. అయితే సైబర్ సెక్యూరిటీ దాడి కారణంగా ఆలస్యమైందని కంపెనీ పేర్కొంది. అంతేకాదు నగదు సంక్షోభంలో చిక్కుకున్న సంస్థ అద్దెదారులకు సకాలంలో చెల్లింపులు చేయలేక ఇబ్బందులు పడుతోంది, కొంతమంది తమ రిజిస్ట్రేషన్ను రద్దు చేసే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు వరుసగా రెండో నెలలో కూడా జీతాలు చెల్లింపు ఆలస్యమైందని ఉద్యోగులు ఆరోపిస్తుండగా, చెల్లింపులు "గ్రేడెడ్ ఫార్మాట్"లో జరుగుతున్నాయని స్సైస్జెట్ వివరణ ఇచ్చింది. -
డా.రెడ్డీస్ లాభం 108 శాతం అప్: అయినా షేరు ఢమాల్
హైదరాబాద్: ఫార్మా దిగ్గజం డా.రెడ్డీస్ ఈ ఏడాది తొలి త్రైమాసికంలో లాభాల్లో భారీ పురోగతి సాధించినప్పటికీ శుక్రవారం నాటి మార్కెట్లో అమ్మకాలు వెల్లువెత్తాయి. దాదాపు 4 శాతం కుప్పకూలి ఇన్వెస్టర్లకు షాక్ ఇచ్చింది. క్యూ1లో డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ (డీఆర్ఎల్) రూ. 1,188 కోట్ల నికర లాభం ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరం నమోదైన రూ. 571 కోట్లతో పోలిస్తే ఇది 108 శాతం అధికం. సమీక్షాకాలంలో ఆదాయం ఆరు శాతం పెరిగి రూ. 4,919 కోట్ల నుంచి రూ. 5,215 కోట్లకు ఎగిసింది. ప్రధానంగా ఇండివియర్, అక్వెస్టివ్ థెరాప్యూటిక్స్లతో సుబాక్సోన్ ఔషధ వివాద సెటిల్మెంట్తో వచ్చిన నిధులు, అలాగే కొన్ని బ్రాండ్ల విక్రయాలు తదితర అంశాలు ఇతర ఆదాయం పెరగడానికి కారణమని ఫలితాల వెల్లడి సందర్భంగా సంస్థ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ పరాగ్ అగర్వాల్ తెలిపారు. ఉత్పాదకతను పెంచుకోవడం, కొత్త ఉత్పత్తులను ప్రవేశపెట్టడం తదితర చర్యలతో వ్యాపారాన్ని మరింత మెరుగుపర్చుకోనున్నట్లు ఈ సందర్భంగా సంస్థ కో-చైర్మన్, ఎండీ జి.వి. ప్రసాద్ తెలిపారు. బూస్టర్ డోస్గా స్పుత్నిక్ లైట్.. కోవిడ్కి సంబంధించి స్పుత్నిక్ లైట్ను దేశీయంగా ఇతర టీకాలకు యూనివర్సల్ బూస్టర్ డోస్గా ఉపయోగించే అంశంపై కసరత్తు చేస్తున్నట్లు డీఆర్ఎల్ సీఈవో ఎరెజ్ ఇజ్రేలీ వెల్లడించారు. -
స్పైస్జెట్కు డీజీసీఏ షాక్, ఇండిగోకు జాక్పాట్
సాక్షి,ముంబై: విమానయాన సంస్థ స్పైస్ జెట్కు మరో భారీ షాక్ తగిలింది. ఇటీవల సంస్థ విమానాల్లో వరుస సాంకేతిక లోపాల ఘటనలు ఆందోళన రేపిన నేపథ్యంలో ఎయిర్లైన్స్ రెగ్యులేటరీ డీజీసీఏ కీలక ఆదేశాలు జారీ చేసింది. సాంకేతిక సమస్యలు, సెఫ్టీ తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని ఎనిమిది వారాలపాటు కేవలం 50 శాతం విమానాలను మాత్రమే నడిపించాలని స్పైస్జెట్ను ఆదేశించింది ఎనిమిది వారాల పాటు ఆమోదం పొందిన విమానాల్లో 50 శాతం విమానాలనే నడపాలని డీజీసీఏ ఆదేశించడంతో లాభాల మార్కెట్లో స్పైస్జెట్ షేర్ 7 శాతం కుప్పకూలింది. ఆ తరువాత మరింత అమ్మకాలు వెల్లువెత్తడంతో 9.66 శాతం తగ్గి రూ. 34.60 వద్ద 52 వారాలా కనిష్టాన్ని తాకింది. మరోవైపు ప్రత్యర్థి విమానయాన సంస్థ ఇండిగో షేర్లలో కొనుగోళ్ల ధోరణి కనిపిస్తోంది. 3 శాతానికి పైగా లాభాలతో ఉంది. అయితే డీజీసీఏ ఆదేశాలపై స్పందించిన స్పైస్జెట్ తమ విమాన కార్యకలాపాలపై ఎలాంటి ప్రభావం ఉండదని తెలిపింది. విమానాలను కేన్సిల్ చేయలేదని వెల్లడించింది. రానున్న రోజుల్లో, వారాల్లో అన్ని విమానాలు షెడ్యూల్ ప్రకారం పనిచేస్తాయని తెలిపింది. ఇటీవలి సంఘటనలపై చర్యలు తీసుకుంటున్నామన్న సంస్థ డీజీసీఏ ఆదేశాల మేరకు పని చేస్తామని పేర్కొంది. కాగా జూన్ 19, జూలై 5 మధ్య ఎనిమిది స్పైస్జెట్ విమానాల్లో సాంకేతిక లోపాలు తలెత్తాయి. దీంతో డీజీసీఏ జూలై 6న విమానయాన సంస్థకు షోకాజ్ నోటీసు జారీ చేసిన సంగతి తెలిసిందే. Hence, there will be absolutely no impact on our flight operations. We want to reassure our passengers and travel partners that our flights will operate as per schedule in the coming days and weeks. There will be no flight cancellation as a consequence of this order. >> — SpiceJet (@flyspicejet) July 27, 2022 -
రూ. 500 కోట్ల నిధుల సమీకరణ ప్లాన్స్: వోడాఫోన్ ఐడియా జూమ్
సాక్షి, ముంబై: ప్రముఖ టెల్కో వోడాఫోన్ ఐడియా భారీ ఎత్తున నిధులను సమీకరించనుంది. 5జీ స్పెక్ట్రమ్ వేలానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చి తరుణంలో బోర్డు ఈ మేరకు నిర్ణయం తీసుకోనుంది. దీంతో మంగళవారం నాటి ట్రేడింగ్లో వోడాఫోన్ షేర్ దాదాపు 3 శాతం లాభపడింది. వోడాఫోన్ గ్రూప్ సంస్థలకు ప్రాధాన్యత ఆధారంగా ఈక్విటీ షేర్లు లేదా కన్వర్టిబుల్ వారెంట్ల ద్వారా రూ. 500 కోట్ల వరకు నిధులను సమీకరించే ప్రతిపాదనను పరిశీలించడానికి బోర్డు బుధవారం సమావేశమవుతుందని కంపెనీ స్టాక్ ఎక్స్ఛేంజ్ సమాచారంలో వెల్లడించింది. వోడాఫోన్ ఐడియా గ్రూపు నుంచి రూ. 500 కోట్ల ఫండ్ ఇన్ఫ్యూషన్ ప్లాన్ను పరిశీలించేందుకు వోడాఫోన్ ఐడియా బోర్డు బుధవారం సమావేశం కానుంది. దీనికి బోర్డు ఆమోదం తె లిపితే రెండు నెలల్లో ఇది రెండవది కావడం విశేషం. మరోవైపు బోర్డు ఆమోదించిన రూ. 25,000 కోట్ల అదనపు పెట్టుబడులకు గాను ఇటీవలి రూ. 4,500 కోట్ల పెట్టుబడులకు తోడు తమకు ఇంకా రూ. 20,000 కోట్లు అవసరమని కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రవీందర్ టక్కర్ ఇటీవల వెల్లడించారు. ఫండ్ ఇన్ఫ్యూషన్తో సామర్థ్యాన్ని మెరుగుపరచుకోవడంతోపాటు, 5జీ పెట్టుబడులపై దృష్టిపెట్టినట్టు చెప్పారు. కాగా ఈ ఏడాది మార్చిలో ఇద్దరు ప్రమోటర్ల రూ. 4,500 కోట్ల నిధుల సమీకరణను కంపెనీ బోర్దు ఆమోదించింది. వోడాఫోన్ ఐడియాలో వొడాఫోన్ గ్రూప్ దాదాపు రూ.3,375 కోట్లు పెట్టుబడి పెట్టగా, ఆదిత్య బిర్లా గ్రూప్ రూ.1,125 కోట్లు పెట్టింది. అయితే, ఎయిర్టెల్, జియోలతో పోలిస్తే కంపెనీ ఇప్పటివరకు ఒక్క విదేశీ ఇన్వెస్టర్ పెట్టుబడులను సేకరించ లేకపోయింది. -
ఎల్ఐసీ విషయంలో అలా జరగడం తాత్కాలికమే
న్యూఢిల్లీ: బీమా రంగ దిగ్గజం ఎల్ఐసీ షేరు తగ్గుదల ఆందోళనకరంగా అనిపిస్తున్నప్పటికీ, ఇది తాత్కాలికమైనదేనని ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ, పెట్టుబడుల విభాగం (దీపం) కార్యదర్శి తుహిన్ కాంత పాండే తెలిపారు. సంస్థ ఫండమెంటల్స్ గురించి షేర్హోల్డర్లు అర్థం చేసుకోవడానికి కొంత సమయం పడుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ అంశాలన్నింటినీ ఎల్ఐసీ పరిశీలించి, వాటాదారులకు మరింత విలువను చేకూర్చేందుకు తగు చర్యలు తీసుకుంటుందని పాండే వివరించారు. గత నెలలో నిర్వహించిన ఎల్ఐసీ పబ్లిక్ ఇష్యూ ద్వారా కేంద్రం రూ. 20,500 కోట్లు సమీకరించింది. అయితే మే 17న లిస్టయిన దగ్గర్నుంచి ఎల్ఐసీ షేరు క్షీణిస్తూనే ఉంది. ఇష్యూ ధర రూ. 949 కాగా గరిష్టంగా రూ. 920 స్థాయిని మాత్రమే తాకగలిగింది. అప్పట్నుంచి పతనబాటలోనే ఉన్న షేరు శుక్రవారం బీఎస్ఈలో రూ. 709.70 వద్ద క్లోజయ్యింది. చదవండి: ఒక్క మాటతో ఆ కంపెనీ షేర్లు ఎక్కడికో దూసుకు పోయాయి! -
ఇన్వెస్టర్లకు షాక్..నాలుగోవంతు సంపద మటాష్!
సాక్షి, ముంబై: దేశంలోని అతిపెద్ద బీమా కంపెనీ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ) మార్కెట్ విలువ దారుణ స్థితికి చేరింది. మార్కెట్ వాల్యుయేషన్లో నాలుగో వంతు తుడిచిపెట్టుకుపోయింది. విశ్లేషకుల అంచనాలకు, భయాలకు అనుగుణంగానే షేరు మరింత దిగజారి కొత్త కనిష్టాన్ని నమోదు చేసింది. అమ్మకాల ఒత్తిడితో ఎల్ఐసీ షేర్ ధర గురువారం మరో కొత్త రికార్డు కనిష్ట స్థాయికి పడిపోయింది. ఐపీవో ఇష్యూ ధర 949 రూపాయలతో పోలిస్తే దాదాపు 25 శాతం కుప్పకూలింది. మే 17న స్టాక్ ఎక్స్ఛేంజ్లో లిస్టింగ్ అయిన దగ్గరినుంచి కేవలం నాలుగు సెషన్లలో మాత్రమే లాభపడిన షేరు ధర ఆల్ టైం లో రూ.720 టచ్ చేసింది. ప్రస్తుతం 723.20 వద్ద కొనసాగుతోంది. ఫలితంగా మార్కెట్ క్యాపిటలైజేషన్ 6,00,242 కోట్లకు చేరింది. ఒక దశలోమార్కెట్ క్యాప్ దాదాపు 4.6 లక్షల కోట్లకు పడిపోయింది. దలాల్ స్ట్రీట్లో షేరు విలువ రూ. 1.4 లక్షల కోట్లకు పైగా తుడిచిపెట్టుకుపోవడంతోపెట్టుబడిదారులు లబోదిబో మంటున్నారు. -
ఒక్క మాటతో ఆ కంపెనీ షేర్లు ఎక్కడికో దూసుకు పోయాయి!
షేర్ మార్కెట్ అదొక అర్థం కాని మయాజాలం. గ్రాఫులు , లెక్కలు, విశ్లేషణలు, మార్కెట్ పండితులు ఇలా ఎందరు ఎన్ని చెప్పినా అంచనాలు క్షణాల్లో పట్టు తప్పుతుంటాయ్. పదేళ్ల డేటాతో చేసిన విశ్లేషణ కంటే కూడా సెంటిమెంట్ పవర్ ఎక్కువ మార్కెట్లో. చాన్నాళ్ల తర్వాత మార్కెట్కి సెంటిమెంట్ రుచి చూపించి ఇన్వెస్టర్లకు రూపాయికి రూపాయి లాభం అది రెండు వారాల వ్యవధిలోనే అందించింది ఓ బ్రాండ్. ఒకప్పుడు ఇండియన్ రోడ్లపై రారాజులా వెలిగింది అంబాసిడర్ కారు. బిర్లాలకు చెందిన హిందూస్థాన్ మోటార్స్ సంస్థ ఈ కారును మార్కెట్లోకి తెచ్చింది. మార్కెట్లోకి రావడం ఆలస్యం ట్యాక్సీ డ్రైవర్ నుంచి సెలబ్రిటీల వరకు అందరి మనసును దోచుకుంది. 90వ దశకం వరకు సినిమాల్లో ఈ కారే కనిపించేది. అంబాసిడర్ అంటే స్టేటస్ సింబల్గా వెలిగిపోయింది. విదేశీ కార్లు ఇండియాలోకి వచ్చినా రాజకీయ నేతలు చాన్నాళ్ల పాటు అంబాసిడర్ని వదల్లేక పోయారు. అయితే ఆధునికతను సంతరించుకోక క్రమంగా అంబాసిడరే కనుమరుగై పోయింది. అంబాసిడర్ సెంటిమెంట్ పాత అంబాసిడర్కు కొత్తగా ఎలక్ట్రిక్ హంగులు అద్ది మార్కెట్లోకి తెస్తామంటూ హిందూస్థాన్ మోటార్స్ సంస్థ ఇటీవల ప్రకటించింది. ఈ మేరకు విదేశీ కంపెనీతో సంప్రదింపులు కూడా పూర్తయినట్టు వెల్లడించింది. రాబోయే ఎలక్ట్రిక్ అంబాసిడర్ కారు ప్రొటోటైప్ ఫోటోలు, వీడియోలు సైతం సోషల్ మీడియాలో హోరెత్తిపోయాయి. పాత కాలం అంబాసిడర్ను కొత్త లుక్లో చూసేందుకు దేశం యావత్తు ఆసక్తి చూపించింది. అంబాసిడర్ మీద ఓ పాజిటివ్ వైబ్ క్రియేట్ అయ్యింది. షేర్ల ధరకు రెక్కలు గడిచిన ఐదేళ్లుగా హిందూస్తాన్ మోటార్స్ షేరు రూ. 7 నుంచి రూ 10 దగ్గరే తిరుగాడుతోంది. కేవలం రెండు సార్లు మాత్రమే స్వల్ప కాలం పాటు రూ.15 గరిష్టాలను అందుకుంది. అంబాసిడర్ సరికొత్త రూపంలో మార్కెట్లోకి రాబోతుందన్న వార్త వచ్చిన తర్వాత హిందూస్థాన్ మోటార్స్ షేర్లకు రెక్కలు వచ్చాయి. లాభాలే లాభాలు మే 24న హిందూస్థాన్ మోటార్స్ ఒక్క షేరు ధర రూ. 10.80 దగ్గర ఉండగా జూన్ 8న షేరు ధర రూ.22.05కి చేరుకుంది. కేవలం రెండు వారాల వ్యవధిలో షేరు ధర రెట్టింపు అయ్యింది. మే 24న ఎలక్ట్రిక్ అంబాసిడర్ వార్త విని లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టిన వారికి రెండు వారాలు తిరిగే సరికి మరో లక్ష లాభం కళ్ల చూడగలిగారు. ఇక ఎప్పటి నుంచో ఈ షేర్లను అట్టిపెట్టుకున్న వారు ఒక్క వార్తతో బూరెల బుట్టలో పడ్డట్టు అయ్యింది. చాలా కాలం పాలు లాభాలు అందివ్వని హిందూస్థాన్ మోటార్స్ షేర్లు ఒక్క వార్తతో తారా జువ్వలా లాభాల్లోకి దూసుకుపోయాయి. చదవండి: Ambassador Electric Car: ఇండియన్ రోడ్ల రారాజు.. అంబాసిడర్ కొత్త లుక్కు చూసారా? -
ఎల్ఐసీ ఫ్లాప్ షో, మార్కెట్ క్యాప్ ఢమాల్: షాక్లో ఇన్వెస్టర్లు
సాక్షి,ముంబై:అతిపెద్ద బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ)కి మార్కెట్లో వరుసగా ఐదో సెషన్లోనూ అమ్మకాల సెగ తాకింది. ఇన్వెస్టర్ల ఎడ తెగని అమ్మకాలతో సోమవారం ఎస్ఐసీ మరింత దిగజారి ఆల్ టైం కనిష్టానికి చేరింది. ఫలితంగా సంస్థ మార్కెట్ క్యాప్ 5 లక్షల కోట్ల రూపాయల దిగువకు పడిపోయింది. ఇది లిస్టింగ్ నాటికి రూ.6 లక్షల కోట్లకు పై మాటే. ఈ స్థాయికి దిగజారడం ఇదే తొలిసారి. సోమవారం నాటి అమ్మకాలతో ఎల్ఐసీ షేరు 2.86 శాతం క్షీణించి రికార్డు ముగింపు కనిష్టం రూ.777.40 వద్ద స్థిరపడింది. బీఎస్ఈఇండెక్స్లో ఈ స్టాక్ ఆల్-టైమ్ ఇంట్రాడే కనిష్ట స్థాయి రూ. 775.40ని తాకింది. దీంతో మార్కెట్ విలువ 4.97 లక్షల కోట్లకు చేరింది. అయితే భవిష్యత్తులో మరింత అమ్మకాల ఒత్తిడి ఎదుర్కోనుందని, యాంకర్ ఇన్వెస్టర్ల లాక్-ఇన్ పీరియడ్ ముగియనున్న నేపథ్యంలో రూ. 750 వద్ద మరింత దిగజారే అవకాశం ఉందని స్టాక్ మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. ఎల్ఐసీ షేరు లిస్టింగ్ ప్రైస్ (మే 17న) రూ. 949 నుండి 18.08 శాతం కుప్ప కూలింది. ఎఫ్ఐఐల భాగస్వామ్యం దాదాపు శూన్యం కావడం, లాక్ ఇన్ పీరియడ్ ముగియనుండటంతోపాటు, క్యూ4 ఫలితాలు ప్రోత్సాహకరంగా లేకపోవడంతో మరింత దిగజారవచ్చని, పొజిషనల్ ఇన్వెస్టర్లు అప్రమత్తంగాఉండాలని మార్కెట్ నిపుణుడు ఎస్ఎంసి గ్లోబల్ సెక్యూరిటీస్ రీసెర్చ్ వైస్ ప్రెసిడెంట్ సౌరభ్ జైన్ సూచించారు. దీంతో ఇప్పటికే ఇన్వెస్ట్ చేసిన ఇన్వెస్టర్లు లబోదిబో మంటున్నారు. అయితే లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్లు పెద్దగా చింతించాల్సిన అవసరం లేదని నిపుణులు పేర్కొంటున్నారు. కాగా మార్చి 2022 త్రైమాసికంలో సంస్థ వార్షిక ప్రాతిపదికన ఏకీకృత నికర లాభం 17 శాతం క్షీణించి 2,410 కోట్లు రూపాయలుగా ఉంది. అయితే నికర ఆదాయం 17.9 శాతం పెరిగి రూ.1.4 లక్షల కోట్లకు చేరింది, క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలోరూ.1.2 లక్షల కోట్లుగా ఉంది. -
Anand Mahindra: అబ్దుల్ కలాం మాటలే మాలో ధైర్యాన్ని నింపాయి
మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలామ్ స్ఫూర్తితోనే కఠిన పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొని తిరిగి సరైన మార్గంలోకి రాగలిగామంటూ గతాన్ని నెమరు వేసుకున్నారు ప్రముఖ ఇండస్ట్రియలిస్టు ఆనంద్ మహీంద్రా. మిన్నువిరిగి మీద పడిన ఆ సందర్భంలో కేవలం అబ్దుల్ కలామ్ చెప్పిన మాటలే తమలో ధైర్యాన్ని నింపాయన్నారు ఆనంద్ మహీంద్రా. ఇందుకు సంబంధించిన వివరాలను ట్విటర్లో ఆయన షేర్ చేశారు. మార్కెట్లో నెలకొన్న ఒడిదుడుకుల కారణంగా మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూపు షేర్ల ధర 2019లో భారీగా పడిపోయింది. ఆల్టైం హై రూ.984 నుంచి నేలకు దిగి వచ్చింది. కంపెనీ వ్యక్తులుగా మా అందరికీ ఆ ఘటన షాక్ కలిగించింది. అయితే అదే ఏడాది జరిగిన యాన్యువల్ లీడర్షిప్ కాన్ఫరెన్స్లో మా కంపెనీ ఉద్యోగులకు దిశానిర్ధేశం చేయాల్సి వచ్చింది. అప్పుడు మహనీయుడు అబ్దుల్ కలామ్ మాటాలనే ప్రస్తావిస్తూ వారిలో స్ఫూర్తిని నింపానంటూ ఆనంద్ మహీంద్రా తెలిపారు. అంతకు ముందు మహీంద్రా వ్యాలీ ప్రారంభోత్సవానికి వచ్చిన అబ్దుల్ కలామ్ మాట్లాడుతూ డేర్ టూ డ్రీమ్ అంటూ సలహా ఇచ్చారు. కలామ్ మాటలనే మరోసారి ఉద్యోగులకు వివరించానంటూ ఆనంద్ మహీంద్రా ఆనాటి ఘటన గుర్తు చేసుకున్నారు. మనందరం కష్టపడి పని చేస్తే మహీంద్రా గ్రూపు 75వ వార్షికోత్సవం నాటికి మరోసారి ఆల్టైం హైకి షేరు ధర చేరుకోవడం కష్టం కాదంటూ వారిలో నమ్మకం నింపేందుకు ప్రయత్నించినట్టు ఆయన వెల్లడించారు. In 2019, M&M’s share price had fallen sharply from its all-time high of ₹984. In our annual leadership conference that year, I reminded our team of the late President Kalam’s advice when he inaugurated Mahindra Research valley. “Take the Hill” he said, i.e, dare to dream. (1/3) pic.twitter.com/V6A9T4eROt — anand mahindra (@anandmahindra) May 30, 2022 అయితే ముందుగా నిర్దేశించుకున్నట్టు 75వ వార్షికోత్సం నాటికి ఆల్టైం హై రూ.984కి షేరు ధర తీసుకెళ్లలేకపోయామని ఆనంద్ మహీంద్రా అన్నారు. కానీ సరిగ్గా ఏడాది తిగిరే సరికి ఆల్టైం హైని దాటేసినట్టు తెలిపారు. కలాం డేర్ టూ డ్రీమ్ మాటలను నిజం చేస్తూ కొత్త ఆల్టైం హైకి షేరు ధర రూ.1000కి చేరుకుందన్నారు. మరోసారి ఈ ఘనత సాధించిన తన టీమ్కి కృతజ్ఞతలు తెలిపారు మహీంద్రా. చదవండి: భారతి ‘స్వరాజ్’’పై ఆనంద్ మహీంద్రా ఆసక్తికర వ్యాఖ్యలు -
అదానీ వెంటే ఇన్వెస్టర్లు.. అందరికీ లాభాలే లాభాలు!
అదానీ ప్రస్తుతం ఇండియన్ బిజినెస్ వరల్డ్ లోనే కాదు ఏషియా బిజినెస్ సర్కిళ్లలో ప్రముఖంగా వినిపిస్తున్న పేరు. దూకుడైన వ్యాపార వ్యూహాలతో జెట్ స్పీడ్తో అదానీ కంపెనీలు దౌడు తీయిస్తున్నారు ఆ కంపెనీల సీఈవో గౌతమ్. తాజాగా ప్రపంచంలోనే పెద్ద సిమెంట్ కంపెనీల్లో ఒకటైన హోల్సిమ్ గ్రూప్కి చెందిన అంబుజా, ఏసీసీ సిమెంటులను ఆయన టేకోవర్ చేశారు. శుభశకునాలే! భారీ సిమెంట్ కంపెనీలను గౌతమ్ అదానీ టేకోవర్ చేయడంతో ఒక్కసారిగా గౌతమ్ అదానీ గ్రూపు కంపెనీల షేర్ల ధరలకు రెక్కలు వచ్చాయి. దీనికి తోడు త్వరలోనే భారత ప్రభుత్వం ఇన్ఫ్రా రంగంపై భారీగా ఖర్చు చేయబోతున్నట్టు మార్కెట్ నిపుణులు అంచనాలు వెలువరించారు. దీంతో అగ్నికి ఆజ్యం తోడైనట్టు అదానీ కంపెనీల షేర్లు లాభాల్లోకి వచ్చాయి. రెండు గంటల్లోనే సోమవారం మార్కెట్ ఆరంభమైన తర్వాత ఈ కంపెనీల షేర్లు కొనేందుకు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపించారు. మార్కెట్ ఆరంభమైన రెండు గంటల వ్యవధిలోనే ఈ గ్రూపుకు చెందిన కంపెనీల షేర్లు కనిష్టంగా ఒక శాతం నుంచి గరిష్టంగా ఐదు శాతం వరకు వృద్దిని నమోదు చేశాయి. ఒక్క ఎనర్జీ సెక్టార్ మినహా ప్రతీ కంపెనీ షేర్లు దౌడు తీస్తున్నాయి. మార్కెట్ వర్గాల అంచనా ప్రకారం కేవలం రెండు గంటల్లోనే అదానీ కంపెనీల షేర్లు భారీ లాభాలను ఆర్జించగలిగాయి. మధ్యాహ్నం 12 గంటల సమయంలో దేశీ స్టాక్ ఎక్సేంజీలలో అదానీ గ్రూపులో వివిధ కంపెనీల షేర్లు ఇలా ఉన్నాయి. - అదానీ ఎంటర్ ప్రైజెస్ షేరు ధర రూ. 40 పెరిగి రూ. 2094 దగ్గర ట్రేడవుతోంది. వృద్ధి 1.96 శాతంగా నమోదు అయ్యింది. - అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్జోన్ లిమిటెడ్ షేరు 0.86 వృద్ధిని నమోదు చేసింది. ఒక్కో షేరు ధర రూ.6.10 పెరిగి రూ. 712 దగ్గర ట్రేడవుతోంది. - అదానీ పవర్ షేరు ఏకంగా 4.99 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఒక్కో షేరు ధర రూ.12.70 వంతున పెరిగి రూ. 267.35 దగ్గర నమోదు అవుతోంది. - అదానీ గ్రీన్ ఎనర్జీ షేరు ధర రూ.61.30 వరకు లాభపడింది. 2.82 శాతం వృద్ధితో రూ.2231 దగ్గర ట్రేడవుతోంది. - అదానీ విల్మర్, అదానీ ఎయిర్పోర్ట్స్ హోల్డింగ్స్ షేర్లు కూడా లాభాల్లో ఉన్నాయి. - అదానీ ట్రాన్స్మిషన్ షేరు మాత్రం స్వల్ప నష్టాల్లో ఉంది. 1.20 శాతం క్షీణతతో ఒక్కో షేరు విలువ రూ.26 తగ్గి రూ.2161 దగ్గర ట్రేడవుతోంది. -అదానీ టోటల్ గ్యాస్ లిమిటెడ్ షేరు కూడా నష్టాల్లో ఉంది. ఒక్కో షేరు ధరలో రూ.43 కోతకు గురైంది. రూ.2325 దగ్గర నమోదు అవుతోంది. చదవండి: అదానీ చేతికి హోల్సిమ్ ఇండియా -
ఐపీవోలో ఎల్ఐసీ రికార్డు!
న్యూఢిల్లీ: బీమా రంగ ప్రభుత్వ దిగ్గజం ఎల్ఐసీ పబ్లిక్ ఇష్యూలో భాగంగా షేర్ల కేటాయింపును చేపట్టింది. ధరల శ్రేణిలో తుది ధర రూ. 949ను ఖరారు చేసింది. అయితే పాలసీదారులకు రూ. 60 డిస్కౌంట్పోను రూ. 889కే షేర్లను జారీ చేసింది. ఈ బాటలో ఉద్యోగులు, రిటైల్ ఇన్వెస్టర్లకు రూ. 904 ధర(రూ. 45 రాయితీ)లో షేర్లను కేటాయించగా.. ఇతరులకు రూ. 949 ధరలో షేర్ల జారీని చేపట్టింది. ఇష్యూలో భాగంగా ప్రభుత్వం 3.5 శాతం వాటాకు సమానమైన 22.13 కోట్ల షేర్లను విక్రయించింది. ఇందుకు రూ. 902–949 ధరల శ్రేణిని ప్రకటించిన సంగతి తెలిసిందే. వెరసి రూ. 20,557 కోట్లు సమకూర్చుకుంది. ఈ నెల 17న(మంగళవారం) ఎల్ఐసీ స్టాక్ ఎక్సేంజీలలో లిస్ట్కానుంది. దీంతో దేశీ క్యాపిటల్ మార్కెట్లో అతిపెద్ద పబ్లిక్ ఇష్యూగా ఎల్ఐసీ రికార్డు సృష్టించింది. ఫలితంగా ఇంతక్రితం 2021లో రూ. 18,300 కోట్లు సమీకరించడం ద్వారా రికార్డు నెలకొల్పిన పేటీఎమ్ రెండో ర్యాంకుకు చేరింది. ఇక 2010లో రూ. 15,500 కోట్ల విలువైన ఐపీవో చేపట్టిన కోల్ ఇండియా, 2008లో రూ. 11,700 కోట్ల ఇష్యూకి వచ్చిన రిలయన్స్ పవర్ తదుపరి ర్యాంకుల్లో నిలిచాయి. చదవండి: ఎల్ఐసీ.. షేర్ల అలాట్మెంట్పై సుప్రీం కోర్టు కీలక నిర్ణయం -
ఓఎన్జీసీ అమ్మకానికి వేళాయే, కేంద్రం చేతికి వేలకోట్లు!
న్యూఢిల్లీ: ఇంధన రంగ పీఎస్యూ దిగ్గజం ఓఎన్జీసీలో ప్రభుత్వం విక్రయానికి ఉంచిన 1.5 శాతం వాటా పూర్తి స్థాయిలో సబ్స్క్రయిబ్ అయ్యింది. దీంతో ప్రభుత్వానికి రూ. 3,000 కోట్లు లభించనున్నాయి. ఈ నిధులు వచ్చే ఆర్థిక సంవత్సరం (2022–23)లో లెక్కకురానున్నట్లు అధికారిక వర్గాలు పేర్కొన్నాయి. రిటైల్ ఇన్వెస్టర్లకు షేరుకి రూ.159 ఫ్లోర్ ధరలో ప్రభుత్వం 1.5% వాటాకు సమానమైన 1.88 కోట్ల షేర్లను ఆఫర్ చేసింది. గురువారం(31) ఆఫర్ ప్రారంభంకావడంతో 1.33 కోట్ల షేర్లకు బిడ్స్ దాఖలయ్యాయి. మిగిలిన షేర్లను సంస్థాగత ఇన్వెస్టర్లకు ప్రభుత్వం కేటాయించనుంది. 30న ప్రారంభమైన సంస్థాగత ఇన్వెస్టర్ల విభాగంలో 8.49 కోట్ల షేర్లను అమ్మకానికి ఉంచగా.. రూ.159.91 సగటు ధరలో 30.35 కోట్ల షేర్లకు డిమాండ్ కనిపించింది. వెరసి మూడున్నర రెట్లు అధిక సబ్స్క్రిప్షన్ నమోదైంది. ఈ బిడ్స్ మొత్తం విలువ రూ.4,854 కోట్లు! కాగా.. ఆఫర్కు అధిక డిమాండ్ కనిపిస్తే గ్రీన్షూ ఆప్షన్కింద రెట్టింపు షేర్ల(18.86 కోట్లు)ను విక్రయించేందుకు ప్రభుత్వానికి వీలుంది. ఆఫర్లో భాగంగా తొలుత 9.43 కోట్ల షేర్లను విక్రయానికి ఉంచిన విషయం విదితమే. ఈ వార్తల నేపథ్యంలో ఓఎన్జీసీ షేరు 1 శాతం బలపడి రూ.164 వద్ద ముగిసింది. -
ఉక్రెయిన్ - రష్యా యుద్ధం.. భారత్లో రాకెట్లా దూసుకెళ్తున్న షేర్లు ఇవే!
ఉక్రెయిన్పై రష్యా చేపట్టిన దాడి ఆ తర్వాత అనంతర పరిణామాలతో ఇన్వెస్టర్ల ఆలోచణ ధోరణిలో మార్పులు కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి. రష్యా దాడులు, అమెరికా దాని మిత్ర పక్ష దేశాలు విధిస్తున్న ఆర్థిక ఆంక్షల కారణంగా బడా వ్యాపారాల భవిష్యత్తు డోలయమానంలో పడగా, వాటి లాభాల మార్జిన్లకు కోతలు పడుతున్నాయి. అయితే యుద్ధం తెచ్చిన ఉద్రిక్తల కారణంగా రక్షణ రంగంలో వ్యాపారం చేస్తున్న కంపెనీల షేర్ల ధరలు రయ్రయ్మంటున్నాయి. ఉక్రెయిన్పై రష్యా దాడి మొదలుపెట్టి మూడు వారాలు దాటినా నేటికి ఫలితం తేలలేదు. పైగా రష్యా, చైనా, ఉత్తర కొరియాలు ఓ పక్క. అమెరికా దాని మిత్ర పక్షలు ఒక పక్క అనే పరిస్థితి నెలకొంది. ఇరుపక్షాలు మూడో ప్రపంచ యుద్దం ముంగిట సంయమనం పాటిస్తున్నాయి. కానీ యుద్ధ భయాలు మాత్రం తొలగిపోలేదు. ముఖ్యంగా రెండు ప్రపంచ యుద్ధాలకు వేదికగా నిలిచిన యూరప్ దేశాలు తమ రక్షణ విషయంలో ఆందోళన చెందుతున్నాయి. నాటోను నమ్మలేం మరోవైపు కీలక సమయంలో నాటో దేశాలు చేతులెత్తాశాయంటూ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలన్స్కీ చేసిన ప్రకటన ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలను పునరాలోచనలో పడేసింది. దేశ రక్షణ విషయంలో ఔట్సోర్సింగ్ నమ్మదగిన వ్యవహారం కాదనేట్టుగా పరిస్థితులు మారాయి. చాలా దేశాలు రక్షణ బడ్జెట్ పెంచే యోచనలో ఉన్నాయి. అస్థిరంగా ఆయిల్ ఉక్రెయిన్పై రష్యా దండయాత్ర తదనంతర పరిణామాల్లో స్టాక్ మార్కెట్లు తీవ్ర నష్టాలు చవి చూశాయి. ఇన్వెస్టర్లు వివిధ కంపెనీల్లో తమ పెట్టుబడులు వెనక్కి తీసుకుని ఆయిల్, బంగారంలలో పెట్టుబడులు పెట్టారు. కానీ ముడి చమురు ధరలు మరింర అస్థిరంగా మారాయి. కేవలం పది రోజలు వ్యవధిలోనే బ్యారెల్ ముడి చమురు ధర 40 డాలర్ల వరకు హెచ్చు తగ్గులు చవిచూసింది. బంగారానిది ఇదే బాట. దీంతో నమ్మకమైన పెట్టుబడుల కోసం ఇన్వెస్టర్లు రక్షణ రంగంలో ఉన్న కంపెనీల వైపుకు చూస్తున్నారు. ఫలితగా డిఫెన్స్ సెక్టార్లో ఉన్న కంపెనీల స్టాక్స్ పరుగులు పెడుతున్నాయి. డిఫెన్స్పైనే గురి - డిఫెన్స్ సెక్టార్కి అవసరమైన ముడి పరికరాలు తయారు చేసే భారత డైనమిక్స్ షేరు ధర ఈ రోజు ఉదయం మార్కెట్ ప్రారంభంలో రూ. 529లు ఉండగా మధ్యాహ్నాం దాదాపు 7 శాతం వృద్ధితో రూ.36లు లాభపడి 558.65కి చేరుకుంది. - మన దేశంలో డిఫెన్స్లో ఎంతో కీలకమైన హిందుస్తాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ షేరు ధర ఈ రోజు ఉదయం రూ. 1394ల వద్ద ట్రేడింగ్ ప్రారంభం కాగా మధ్యాహ్నం 12 గంటల సమయానికి 4.13 శాతంత వృద్ధితో రూ.1433 దగ్గర ట్రేడవుతోంది. - భారత్ ఎలక్ట్రానిక్ షేరు ఒక శాతం వృద్ది కనబరిచి రూ.207.80 దగ్గర ట్రేడవుతోంది - భారత్ ఎర్త్మూవర్స్ లిమిటెడ్ (బీఈఎంఎల్) షేర్లు రూ.25ల లాభంతో 1.65 శాతం వృద్ధి కనబరిచి రూ.1542 దగ్గర ట్రేడవుతోంది. - కీలకమైన సెమికండక్టర్లు తయారు చేసే ఆస్ట్రా మైక్రోవేవ్ ప్రొడక్ట్ లిమిటెడ్ షేరు 4.52 శాతం వృద్ధితో రూ.226.55 దగ్గర ట్రేడవుతోంది. జెన్ టెక్నాలజీస్ షేర్లు సైతం లాభాల్లో ఉన్నాయి. చదవండి: Ukraine War: శాంతించిన క్రూడ్.. దిగొచ్చిన బంగారం! -
లబోదిబో అంటున్న జొమాటో ఇన్వెస్టర్లు..!
Zomato On A Bumpy Ride: గత ఏడాది స్టాక్ మార్కెట్లో అడుగుపెట్టిన జొమాటో షేర్ ధర ఇప్పుడు భారీగా పడిపోతుంది. జొమాటోలో ఇన్వెస్ట్ చేసిన పెట్టుబడుదారులందరూ ఇప్పుడు లబోదిబో అంటున్నారు. బిఎస్ఈలో 9 శాతం పడిపోయి రూ.114.00కు పడిపోతుంది. ఈ కంపెనీ స్టాక్ ధర 52 వారాల గరిష్టం నుంచి 30 శాతానికి పైగా దిగజారింది. గత ఏడాది జీవనకాల గరిష్ట స్థాయి రూ.160.30కి చేరిన షేర్ ధర, నిన్న(జనవరి 23) అత్యంత కనిష్ట స్థాయి రూ.114కి పడిపోయింది. కేవలం ఈ ఏడాదిలోనే ఈ కంపెనీ షేర్ ధర 20 శాతానికి పైగా పడిపోవడం విశేషం. "జొమాటో కంపెనీ అనేక విధాలుగా స్విగ్గీ నుంచి కఠినమైన పోటీని ఎదుర్కొంటోంది. ప్రధానంగా మెట్రో నగరాల్లోని రెస్టారెంట్ నెట్ వర్క్, స్విగ్గీ నుంచి ఈ పోటీ ఉంది" అని వైస్ ప్రెసిడెంట్ & రీసెర్చ్ ఆఫ్ షేర్ ఇండియా డాక్టర్ రవి సింగ్ తెలిపారు. గత నాలుగు ట్రేడింగ్ సెషన్లోనే సుమారు రూ.10 వేల కోట్లకు నష్టపోయినట్లు తెలుస్తుంది. అలాగే, కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ మార్క్ కూడా రూ.1 లక్షల కోట్ల దిగువకు పడిపోయింది. ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్ జొమాటోకు సెప్టెంబర్ క్వార్టర్లో నష్టాలు మరింత తీవ్రమయ్యాయి. రూ.435 కోట్ల కన్సాలిడేటెడ్ నష్టాన్ని ప్రకటించింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో నష్టాలు రూ.230 కోట్లుగానే ఉన్నాయి. ఆదాయం రూ.426 కోట్ల నుంచి రూ.1,024 కోట్లకు పెరిగింది. తన నిర్వహణలోని ఫిస్టో కంపెనీని క్యూర్ఫిట్కు 50 మిలియన్ డాలర్లకు విక్రయించనున్నట్టు ప్రకటించింది. (చదవండి: బుక్ చేసిన నాలుగేళ్లకు డెలివరీ ప్రచారం.. టయోటా క్లారిటీ!) -
ఎగబడి లోన్లు ఇచ్చిన బ్యాంక్.. చివరికి ‘చెత్త’ ఘనత
ఒకప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఎంతో పేరు మోసిన ఆ బ్యాంకు.. భవిష్యత్తు మొత్తం తనదే అనే ప్రతిష్ట సంపాదించుకుంది. కానీ, పరిస్థితులు తలకిందులు అయ్యాయి. బ్యాంకుకు సంబంధించి రియల్టి విభాగం భారీ దెబ్బ వేసింది. పోటీతత్వంలో వెనుకంజ, అడ్డగోలుగా లోన్లు మంజూరు చేయడంతో పాటు ఎవర్గ్రాండ్ పరిణామాలు చెత్త బ్యాంక్ ట్యాగ్ను తగిలించాయి చివరికి!. చైనాకు చెందిన మిన్షెంగ్ బ్యాంకింగ్ కార్పొరేషన్. కొన్నేళ్ల కిందటి దాకా ఆసియాలో ఇదే అతిపెద్ద బ్యాంక్గా ఉండేది. ఇప్పుడేమో రియల్ ఎస్టేట్ దిగ్గజం అప్పుల ధాటికి బాధితురాలిగా మారిపోయింది ఈ బ్యాంక్. అడ్డగోలుగా ఇచ్చిన లోన్ల కారణంగా మిన్షెంగ్ దారుణంగా పతనం అయ్యింది. గత ఏడాది కాలంలో స్టాక్ ధరలు 31 శాతం దిగువన ట్రేడ్ అవుతున్నాయి. ఈ చెత్త పర్ఫార్మెన్స్ కారణంగా ఇప్పుడు మరో అప్రతిష్ట మూటగట్టుకుంది. బ్లూమ్బర్గ్ వరల్డ్ బ్యాంకుల ఇండెక్స్ జాబితాలో ప్రపంచంలోనే అత్యంత చెత్త ప్రదర్శన కనబర్చిన బ్యాంక్గా నిలిచింది మిన్షెంగ్ బ్యాంకింగ్ కార్పొరేషన్. ఈ సూచీలో ప్రపంచంలోని మొత్తం 155 బ్యాంకులను పరిగణనలోకి తీసుకుంటుంది బ్లూమ్బర్గ్. పైకి.. ఆపై పతనం 1996లో బీజింగ్ కేంద్రంగా నాన్-స్టేట్ కంట్రోల్ లెండర్(చైనాలోనే తొలి ఘనత) కార్యకలాపాలను మొదలుపెట్టింది మిన్షెంగ్. అనంతి కాలంలోనే ప్రపంచంలో టాప్ 20 బ్యాంకింగ్ దిగ్గజాల సరసన నిలిచింది. ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతున్న ఈ బ్యాంక్.. 2022 కార్యాచరణను ప్రకటించుకుంది. లోకల్ బ్రాంచ్ మేనేజర్లకు మరిన్ని అధికారాలు కట్టబెట్టడంతో పాటు ప్రాపర్టీ రుణాల హోల్డింగ్లను తగ్గించడం అత్యంత ప్రాధాన్యతగా పాటించేందుకు సిద్ధమైంది. వీటితో పాటు ఉద్యోగుల జీతాలను సగానికి తగ్గించడం లాంటి హేయనీయమైన నిర్ణయాలు సైతం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రైవేట్ రంగంపై పట్టు కోసం చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ తీసుకున్న నిర్ణయాలు దేశ ఆర్థిక వ్యవస్థను కకావికలం చేస్తోంది. ముఖ్యంగా ప్రాపర్టీ ఇండస్ట్రీని పునాదులతో సహా కుదిపేస్తోంది. ఈ పరిణామాలను తట్టుకోలేక ఎడాపెడా డిస్కౌంట్లతో ఆకర్షణ కోసం ప్రయత్నించింది రియల్ ఎస్టేట్ దిగ్గజం ఎవర్గ్రాండ్. చివరకు డిఫాల్ట్ ప్రకటనతో బాంబుపేల్చగా.. గ్లోబల్ రియల్ ఎస్టేట్పై దీని ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ క్రమంలోనే ఎవర్గ్రాండ్కు బిలియన్ డాలర్ల లోన్ కట్టబెట్టిన మిన్షెంగ్.. ఇప్పుడు లబోదిబోమంటోంది. సంబంధిత వార్త: పెనుసంక్షోభం అంచున డ్రాగన్.. ఆందోళనలో గ్లోబల్ బ్యాంకింగ్, రియల్టి రంగాలు! -
ఇన్వెస్టర్ల జేబులు గుల్ల.. పేటీఎం ఒక్కటే కాదు.. ఇవి కూడా
ఎన్నో అంచనాల నడుమ ఇన్షియల్ పబ్లిక ఇష్యూకి వచ్చిన పేటీఎం షేర్లు ఇన్వస్టర్లకు షాక్ ఇచ్చాయి. దేశంలోనే అతి పెద్ద ఐపీవోగా రికార్డు స్థాయిలో రూ.18,300 కోట్ల నిధులు సమీకరణ లక్ష్యంగా అడుగులు పడగా లిస్టింగ్ అయిన తొలిరోజే షేర్ల ధర భారీగా పడిపోవడంతో ఒక్క రోజులోనే 38 వేల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైపోయింది. అంచనాలు తారుమారు పేటీఎంకి ముందు ఐపీవోకి పలు కంపెనీలు వచ్చాయి. వీటిలో జోమాటో, నైకా ఐపీవోలు సంచనలం సృష్టించాయి. జోమాటో లిస్టింగ్లోనూ అదరగొట్టినా ఆ తర్వాత కొంత వెనుకడుగు వేసింది. ఇక నైకా షేర్లు ఇంకా జోరుమీదే ఉన్నాయి. ఇదే పరంపరలో వచ్చిన పేటీఎం మాత్రం బొక్కబోర్ల పడింది. అయితే లాంగ్రన్లో పేటీఎం షేర్లు లాభాలు అందిస్తాయనే వారు ఉన్నారు. పేటీఎం తరహాలో గతంలో లిస్టింగ్లో అనేక కంపెనీలు ఢమాల్ అన్నాయి. వాటిలో కొన్ని ముఖ్యమైన ఐపీవోల వివరాలు.. - దేశవ్యాప్తంగా అనేక స్టోర్లను కలిగి నగర వాసులందరదికీ సుపరిచితమైన కాఫీ డే 2015 అక్టోబరు 14న ఐపీవో ఇష్యూ చేసింది. 316 నుంచి 328 ప్రైస్బ్యాండ్తో 45 లాట్లలో లిస్టింగ్కి వచ్చింది. తొలిరోజు కంపెనీ షేర్ల ధర 17.60 శాతం క్షీణించింది. - అనిల్ అంబానికి చెందిన రిలయన్స్ పవర్ 2008 జనవరి 15న ఐపీవోకి వచ్చింది. ప్రైస్బ్యాండ్ ధర రూ.405 నుంచి 450గా నిర్ణయించారు. అయితే లిస్టింగ్ అయిన తొలిరోజే ఈ కంపెనీ షేర్లు 17.20 శాతం క్షీణించాయి. - ఇదే తరహాలో ఐసీఐసీఐ సెక్యూరిటీస్ షేర్లు 14.4 శాతం, కెయిర్న్ 14.10 శాతం, యూటీఐ మ్యూచువల్ ఫండ్స్ 14 శాతం, కళ్యాణ్ జ్యూయలర్లర్స్ 13.4 శాతం, భారతి ఇన్ఫ్రా లిమిటెడ్ 13.1 శాతం క్షీణించి ఐపీవోలో షేర్లు అలాట్ కాబడిన ఇన్వెస్టర్లకు కన్నీళ్లను మిగిల్చాయి. పరిశీలించాకే స్టాక్ మార్కెట్లో రంగంలోకి దిగేముందు పూర్తి స్థాయి పరిశీలన అవసరమని నిపుణులు చెబుతుంటారు. ప్రచార ఆర్భాటాలను నమ్మడం కాకుండా కంపెనీ పనితీరు, భవిష్యత్తు, మార్కెట్లో ట్రెండ్ను బట్టి ఇన్వెస్ట్ చేయాలని సూచిస్తుంటారు. -
జోరమీదున్న ఆటోమొబైల్స్ షేర్స్.. ఎగబడుతున్న ఇన్వెస్టర్లు
Tatamotors, Maruti Suzuki, share price: స్టాక్ మార్కెట్ నష్టాల్లో కొనసాగుతుంటే ఆటో మొబైల్ ఇండసక్ట్రీ షేర్లు లాభాల పంట పండిస్తున్నాయి. ముఖ్యంగా టాటా మోటార్స్, మారుతి సుజుకి షేర్లు కొనేందుకు ఇన్వెస్టర్లు ఎగబడుతున్నారు. మరోవైపు ఇంట్రాడే ట్రేడింగ్లో ఈ షేర్లు ఇన్వెస్టర్లకు తక్షణ లాభాలను అందిస్తున్నాయి. ఎగబాకిన టాటా షేర్లు టాటా మోటార్ కంపెనీ షేర్లు మంగళవారం హాట్కేకుల్లా అమ్ముడయ్యాయి. ఈ రోజు ఉదయం మార్కెట్లో ఒక్కో షేరు ధర రూ.507లు ఉండగా మధ్యాహ్నం సమయానికి షేర్ల ధరలు రివ్వున ఎగిశాయి. ఒక్కో షేరు ధర రూ.15 వంతున పెరిగి 2.97 శాతం వృద్ధితో రూ.520.45 దగ్గర ట్రేడ్ అవుతున్నాయి. ఏడాది కాలంలో టాటా మోటార్ షేరు ఏకంగా 229 శాతం వృద్ధిని నమోదు చేసింది. పైగా ఈవీ కారు మార్కెట్లో టాటానే నంబర్ వన్గా ఉంది. ఇటీవల టాటా నుంచి వచ్చిన హారియర్, టియాగో, పంచ్ మోడళ్లకు ఆదరణ బాగుండటంతో టాటా షేర్లు కొనేందుకు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపిస్తున్నారు. ఇన్వెస్టర్ల ఆసక్తి గత మూడు నెలలుగా కొనసాగిన బుల్ జోరులో టాటా పవర్ షేర్లు బాగా లాభాలను అందించాయి. ఏడాది వ్యవధిలో 324 శాతం వృద్ధిని నమోదు చేశాయి. టాటా పవర్ షేర్ల ధర రూ.57 నుంచి రూ.244 వరకు పెరిగింది. అదే తరహాలో టాటా మోటార్ షేర్లు కూడా పెరగవచ్చనే సెంటిమెంట్ తోడవటంతో ఇన్వెస్టర్లు టాటా మోటార్ షేర్లు కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే 229 శాతం వృద్ధి నమోదు అయ్యింది. రాబోయే రోజుల్లో మరింత పెరగవచ్చనే ప్రచారం మార్కెట్ వర్గాల్లో సాగుతోంది. మారుతి సైతం స్టాక్మార్కెట్లో మంగళవారం మారుతి సుజూకి షేర్లు ఇన్వెస్టర్లకు భారీ లాభాలను అందించాయి. ఈ రోజు ఉదయం ఒక్కో షేరు ధర రూ. 7,546లు ఉండగా మధ్యాహ్నం 2:51 గంటల సమయానికి 7.13 శాతం వృద్ధిని కనబరిచింది. ఒక్కో షేరు ధర ఏకంగా రూ.534 పెరిగి షేరు ధర రూ. 8,038 దగ్గర ట్రేడ్ అవుతోంది. దీంతో ఇంట్రా డే ట్రేడింగ్లో మారుతి షేర్లు కాసుల వర్షం కురిపిస్తున్నాయి. -
రిలయన్స్ అండతో కొనసాగిన రికార్డు ర్యాలీ
ముంబై: అదానీ గ్రూప్ వ్యవహారంతో ట్రేడింగ్ ప్రారంభంలోనే భారీ పతనాన్ని చవిచూసిన సూచీలు.., చివరికి స్వల్ప లాభాలతో గట్టెక్కాయి. ట్రేడింగ్ ప్రారంభమైన కొద్ది నిమిషాలకే 539 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్ చివరికి 77 పాయింట్ల లాభంతో 52,552 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 194 పాయింట్లను కోల్పోయినా.., 13 పాయింట్ల లాభంతో 15,800 పైన 15,812 వద్ద ముగిసింది. సూచీలకిది వరుసగా మూడోరోజూ లాభాల ముగింపు. మిడ్సెషన్లో సెన్సెక్స్ 52,591 వద్ద, నిఫ్టీ 15,823 గరిష్టాలను అందుకున్నాయి. రెండు సూచీలకు ముగింపు, ఇంట్రాడే స్థాయిలు జీవితకాల గరిష్టాలు కావడం విశేషం. దీంతో సూచీల ర్యాలీ కొనసాగినట్లైంది. అధిక వెయిటేజీ కలిగిన రిలయన్స్ షేరు రాణించడం, ప్రపంచ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందడం, దేశంలో కోవిడ్ కేసులు తగ్గడం తదితర అంశాలు కలిసిరావడంతో సూచీలు ఆరంభ నష్టాలను పూడ్చుకోగలిగాయి. ప్రభుత్వరంగ బ్యాంక్స్, ఐటీ, ఎఫ్ఎంసీజీ షేర్లకు స్వల్ప కొనుగోళ్ల మద్దతు లభించగా, తక్కిన రంగాల షేర్లలో అమ్మకాలు జరిగాయి. మెటల్ షేర్లు అధికంగా నష్టపోయాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.504 కోట్ల విలువైన షేర్లను అమ్మారు. దేశీయ ఫండ్స్(డీఐఐలు) రూ.244 కోట్ల షేర్లను కొన్నారు. ఇక ఫారెక్స్ మార్కెట్లో రూపాయి విలువ వరుసగా ఐదోరోజూ నష్టపోయింది. డాలర్ మారకంలో 22 పైసలు పతనమై 73.29 వద్ద స్థిరపడింది. మూడ్ను దెబ్బతీసిన అదానీ వ్యవహారం ప్రపంచ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలను అందుకున్న దేశీయ మార్కెట్ ఉదయం లాభంతో మొదలైంది. అదానీ గ్రూప్లో పెట్టుబడులు పెట్టిన మూడు విదేశీ ఫండ్ల అకౌంట్లను ఎస్సీడీఎల్ నిలిపివేసిందనే వార్తలతో ట్రేడింగ్ ఆరంభమైన కొద్ది నిమిషాలకే సెన్సెక్స్ 539 పాయింట్లను కోల్పోయి 51,936 వద్ద, నిఫ్టీ 194 పాయింట్లు నష్టపోయి 15,605 వద్ద ఇంట్రాడే కనిష్టాలను నమోదు చేశాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు సూచీల రికవరీకి తోడ్పాటును అందించింది. ఒక దశలో 2% ర్యాలీ చేసి రూ.2,258 గరిష్టాన్ని అందుకుంది. చివరికి 1.5% లాభంతో రూ.2,245 వద్ద ముగిసింది. చదవండి: రోజుకు ఈ కార్పొరేట్ కపుల్ సంపాదన ఎంతో తెలుసా? -
పేటెంట్ వివాదానికి స్వస్తి : షేరు దూకుడు
సాక్షి,ముంబై: దేశీయ ఫార్మా దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ కు కాలం కలిసి వస్తోంది. తాజా పరిణామాలతో శుక్రవారం నాటి మార్కట్లో హైదరాబాద్కు చెందిన ఔషధ తయారీ సంస్థ డా.రెడ్డీస్ షేరు దూసుకు పోతోంది. వరుసగా నాల్గోరోజూ కొనుగోళ్ళ మద్దతుతో 5 శాతానికి పైగా ఎగిసి రికార్డు స్థాయిని నమోదు చేసింది. ఇటీవల నోవావాక్స్ కరోనా వ్యాక్సిన్ తయారీ ఒప్పందానికి తోడు, అమెరికాకు చెందిన సెల్జీన్తో వివాదం పరిష్కరించుకున్నట్లు డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ అధికారికంగా ప్రకటించింది. సెల్జీన్తో వివాదం పరిష్కరించుకున్నట్లు డాక్టర్ రెడ్డీస్ గురువారం నాటి రెగ్యులేటరీ ఫైలింగ్లో తెలిపింది. దీంతో ఇన్వెస్టర్ల ఆసక్తిభారీగా నెలకొంది. ('స్పుత్నిక్ వి' వ్యాక్సిన్ : డా.రెడ్డీస్ భారీ డీల్) కేన్సర్ వ్యాధుల చికిత్సలో ఉపయోగించే ‘రెవ్లీమిడ్’ ఔషధంపై యూఎస్ కంపెనీ ‘సెల్జీన్’ తో డాక్టర్ రెడ్డీస్కు పేటెంట్ వివాదాన్ని తాజాగా పరిష్కరించుకుంది. వ్యాజ్యం లోని అన్న అసాధారణమైన వివాదాల పరిష్కారం, రెగ్యులేటరీ ఆమోదానికి లోబడి డీల్ కుదిరినట్టు తెలిపింది. దీంతో 2022 మార్చి తరువాత ప్రపంచంలోని ‘టాప్-10’ ఔషధాల్లో ఒకటైన ‘రెవ్లీమిడ్’ ఔషధంపై సెల్జీన్ యూఎస్ మార్కెట్లో విక్రయించే అంశంపై ఇరు కంపెనీలు ఒప్పందాన్ని ఆమోదించినట్టు తెలిపింది. తద్వారా 2022 మార్చి తర్వాత యూఎస్లో ‘రెవ్లీమిడ్’ జనరిక్ ఔషధం విక్రయాలకు డాక్టర్ రెడ్డీస్కు అనుమతి లభించింది. అలాగే 2026 జనవరి 31 వరకు కొంత పరిమితితోను. ఆ తర్వాత పరిమితి లేకుండా విక్రయం చేసుకోవచ్చని డాక్టర్ రెడ్డీస్ నార్త్ అమెరికా జెనెరిక్స్ సీఈఓ మార్క్ కికుచి చెప్పారు. మల్టిపుల్ మైలోమా, మైలోడిస్ప్లాస్టిక్ సిండ్రోమ్స్, మాంటిల్ సెల్ లింఫోమా, ఫోలిక్యులార్ లింఫోమా లాంటి కేన్సర్ వ్యాధుల చికిత్సలో ఈ ఔషధాన్ని వినియోగిస్తారు. కాగా వరుస నష్టాలకు చెక్ చెప్పిన లాభాల మార్కెట్లో నిఫ్టీ ఫార్మా దాదాపు 4 శాతం ఎగిసింది. ముఖ్యంగా డాక్టర్ రెడ్డీస్, లుపిన్, సిప్లా సన్ ఫార్మా లాభాల్లో కొనసాగుతున్నాయి. -
రిలయన్స్ షేరు ర్యాలీ ఇప్పట్లో ఆగదు
రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు ర్యాలీ మరింత కాలం కొనసాగే అవకాశం ఉందని స్టాక్ మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా కోవిడ్-19 వ్యాప్తితో గత ఈక్విటీ మార్కెట్లు భారీ పతనాన్ని చవిచూసిన సందర్భంలో... రిలయన్స్ షేరు ధర కేవలం 3నెలల్లో రెట్టింపు అయ్యింది. ఈ మార్చి 23న రూ.868 వద్ద ఉన్న షేరు జూన్ 20నాటికి రూ.1761కి చేరుకుంది. ఇంతటి స్థాయిలో ర్యాలీ చేసినప్పటికీ.., పలు బ్రోకరేజ్ సంస్థలు షేరుపై ‘‘బుల్లిష్’’ వైఖరిని కలిగి ఉన్నాయి. ఈ షేరుకు మొత్తం 17 బ్రోకరేజ్ సంస్థలు ‘‘స్ట్రాంగ్ బై’’ రేటింగ్ను, 8 కంపెనీలు ‘‘బై’’ రేటింగ్ను కేటాయించాయి. మరోవైపు 3 బ్రోకరేజ్ సంస్థలు ‘‘సెల్’’ రేటింగ్ను ఇవ్వగా, 1 బ్రోకరేజ్ సంస్థ ‘‘స్ట్రాంగ్ సెల్’’ రేటింగ్ను ఇచ్చింది. మరో 3ఏళ్లలో షేరు ధర రెట్టింపు: ప్రభుదాస్ లిల్లాధర్ బ్రోకరేజ్ షేర్ హోల్డర్ల కోణంలో పరిశీలిస్తే వచ్చే 3ఏళ్లలో షేరు మరోసారి రెట్టింపు అయ్యే అవకాశాలున్నాయని ప్రభుదాస్ లిల్లాధర్ బ్రోకరేజ్ సంస్థ రీసెర్చ్ విశ్లేషకుడు అజయ్ బోడ్కే తెలిపారు. భారత క్యాపిటల్ మార్కెట్లో అతి తక్కువ కాల వ్యవధిలో రూ.1లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించడం అనేది అరుదుగా జరిగే సంఘటనగా ఆయన అభివర్ణించారు. ‘‘భారత్ జనాభాలో ఆరోవంతు అవసరాల్లో జియో భాగం కానుంది. రిటైల్, టెలికాం, కన్జ్యూమర్ కేంద్రీకృత వ్యాపారాల వృద్ధి రిలయన్స్ షేరు ర్యాలీకి సహకరిస్తాయి. ఈ షేరు మార్చి కనిష్టస్థాయి నుంచి డ్రీమ్ ర్యాలీ చేసింది. షేర్ హోల్డర్ల కోణంలో పరిశీలిస్తే వచ్చే 3ఏళ్లలో షేరు రెట్టింపు అయ్యే అవకాశం ఉంది.’’ అని అజయ్ బోడ్కే తెలిపారు. వచ్చే 2-5ఏళ్లలో జియో వాల్యూయేషన్ 200 బిలియన్ డాలర్లు: కేఆర్ చౌక్సీ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చే 2-5ఏళ్లలో జియో ప్లాట్ఫాం 200 బిలియన్ డాలర్ల వాల్యూయేషన్స్ను సాధించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని కేఆర్ చౌక్సీ ఇన్వెస్ట్మెంట్స్ మేనేజర్ దేవన్ చౌక్సీ అన్నారు. జియో ప్లాట్ఫామ్ సామర్థ్యాన్ని గూగుల్, ఆపిల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్ లాంటి వాటితో పోలిస్తున్నారు. కంపెనీని రుణ రహితంగా మారుస్తామని ఇచ్చిన వాగ్ధానాన్ని ముకేశ్ నిలబెట్టుకున్నారని ఆయన తెలిపారు. రిటైల్, హెల్త్కేర్, పేమెంట్స్ గేమింగ్ అండ్ ఎడ్యుకేషన్, మీడియా, ఎంటర్టైన్మెంట్ వంటి అనేక పెద్ద మొత్తంలో వ్యాపార అవకాశాల కోసం రిలయన్స్ పూర్తి ఫ్రేమ్వర్క్ను రూపొందించిందని చౌక్సీ చెప్పారు. ఆశావాదం విస్తృతంగా వ్యాపించింది: ఐఐఎఫ్ఎల్ సెక్యూరిటీస్ కంపెనీపై ఆశావాదం విస్తృత స్థాయిలో వ్యాపించడంతో షేరు మరి కొంతకాలం ర్యాలీ చేసేందుకు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని ఐఐఎఫ్ఎల్ సెక్యూరిటీస్ అయాన్ ముఖోపాధ్యాయ్ అన్నారు. ఇంకా చాలా ఫండింగ్ సంస్థలు ఈ షేరును కొనుగోలు చేయాల్సి ఉందన్నారు. ఇటీవల స్టాక్ విభజన జరగవచ్చనే ఊహాగానాలు కూడా వెలుగులోకి వచ్చాయని ఆయన తెలిపారు. రిలయన్స్ వ్యాపారాల విభజన జరిగి వేర్వేరు సంస్థలుగా ఎక్చ్సేంజీల్లో లిస్ట్ కావచ్చన్నారు. దీంతో మరిన్ని పెట్టుబడులను రిలయన్స్ను ఆకర్షించేందుకు అవకాశం ఉందిని ముఖోపాధ్యాయ్ అభిప్రాయపడ్డారు. నిర్ణయించిన గడువుకు ముందే కంపెనీని నికర రుణరహితంగా మారుస్తామని ఇచ్చిన హామిని ముకేశ్ అంబానీ నిలబెట్టుకోవడంతో ఇన్వెస్టర్లు రిలయన్స్ షేరు కొనుగోళ్లకు మొగ్గుచూపుతున్నారు. వాస్తవానికి వచ్చే ఏడాది మార్చి 31వ తేదిలోగా కంపెనీని రుణ రహిత కంపెనీగా మారుస్తామని గతంలో కంపెనీ ఛైర్మన్ ముకేశ్ అంబానీ తెలిపారు. రిలయన్స్ అనుబంధ సంస్థ జియో ఫ్లాట్ఫామ్ పెట్టుబడుల ప్రవాహం పెరగడంతో పాటు దేశంలో అతిపెద్ద రైట్స్ ఇష్యూను విజయవంతం చేయడంతో కంపెనీ మార్కెట్ క్యాప్ తొలిసారి 150బిలియన్ డాలర్లను అందుకుంది. ఈ క్రమంలో 150బిలియన్ డాలర్లను అందుకున్న తొలి భారతీయ కంపెనీగా రిలయన్స్ చరిత్ర సృష్టించింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ కేవలం 58 రోజుల్లో రూ.1,68,818 కోట్లను సమీకరించింది. ఇందులో జియోలో వాటా విక్రయంతో రూ.115,693.95 కోట్లను, రైట్స్ ఇష్యూ ద్వారా రూ.53,124.20 కోట్లును సేకరించింది. గతంలో పెట్రో-రిటైల్ జాయింట్ వెంచర్లో బ్రిటన్ సంస్థ బీవీకి వాటాను విక్రయించడంతో రూ.7వేల కోట్లకు విక్రయించడంతో మొత్తం రూ.1.75లక్షల కోట్లు నిధుల సమీకరణ చేయగలిగింది. -
ఒక్క నెలలోనే యస్ బ్యాంకు రికార్డు లాభం
సాక్షి, ముంబై : వరుస వివాదాలతో భారీ నష్టాల్లో కూరుకుపోయిన ప్రయివేటు బ్యాంకు యస్ బ్యాంకు రికార్డు స్తాయి లాభాలతో దూసుకుపోతోంది. రుణాల సేకరణ ప్రయత్నాలు ఒక కొలిక్కి రానుండటంతో పాటు, రాకేష్ ఝన్ఝన్ వాలా షేర్ల కొనుగోలు పరిణామాల నేపథ్యంలో యస్ బ్యాంక్ షేర్లు ఒక నెలలో 78 శాతానికిపైగా పుంజుకున్నాయి. దీంతో ఒక బిలియన్ డాలర్లకు పైగా ఎక్కువ విలువైన కంపెనీల వరుసలో చేరింది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద లాభంగా నిలవడం విశేషం. గత ఏడాదిలో 68 శాతం కోల్పోగా, ఈ సంవత్సరం ప్రారంభంనుంచి 61శాతం పడిపోయి, సెప్టెంబర్ 2019 చివరలో, వ్యవస్థాపకుడు రానా కపూర్, ఇతర ప్రమోటర్ల వాటాల విక్రయంతో 2019లో అతిచెత్త ప్రదర్శన కనబర్చిన కంపెనీగా దిగజారిపోయింది. అయితే ఇటీవల నిధుల సేకరణకు బ్యాంకు యాజమాన్యం ప్రయత్నాలుముమ్మరంలో చేయడంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బలపడింది. దీనికి తోడు ప్రముఖ పెట్టుబడిదారుడు నవంబరు 5వ తేదీన రాకేష్ ఝన్ ఝన్వాలా రూ. 87కోట్ల విలువైన 1.3 కోట్ల షేర్లను కొనుగోలు చేయడం మరింత సానుకూలంగా మారింది. దీంతో వరుస సెషన్లుగా లాభపడుతూ వచ్చిన యస్ బ్యాంకు షేరు సోమవారం నాటి ట్రేడింగ్లో మరో 5 శాతం ఎగిసి రూ.72.90వద్ద ముగిసింది. ఇంట్రాడేలో రూ. 71.35 గరిష్టాన్ని తాకింది. అక్టోబర్ 1 న, యస్ బ్యాంక్ షేర్ ధర 23 శాతానికి పైగా పడిపోయి రూ. 29 వద్ద 52 వారాల కనిష్టానికి చేరిన సంగతి తెలిసిందే. -
తూత్తుకుడి విషాదం : వేదాంత షేరు ఢమాల్
సాక్షి,ముంబై: తమిళనాడులోని తూత్తుకుడిలో కాల్పుల ఉదంతంతో వేదాంత షేరు భారీ పతనాన్ని నమోదు చేసింది. వేదాంతకు చెందిన స్టెరిలైట్ కాపర్ తయారీ ప్లాంటును మూసివేయాలంటూ ప్రజలు చేపట్టిన ఆందోళన కాల్పులకు దారితీసింది. ఈ ఘటనలో 11మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. దీంతో గురువారం నాటి మార్కెట్లో వేదాంతా కౌంటర్లో అమ్మకాలు ఊపందుకున్నాయి. 5.5 శాతానికిపైగా క్షీణించి 10 నెలల కనిష్టాన్ని నమోదుచేసింది. జూలై 5, 2017 నాటి స్థాయికి పడిపోయింది. తమిళనాడును అట్టుడికించిన తూత్తుకూడి ఘటనపై స్టెరిలైట్ కంపెనీ సీఈవో రామనాధ్ స్పందించారు. ఈ విధ్వంసం వెనుక కరుడుగట్టిన శక్తులు ఉన్నాయని విమర్శించారు. ఈ ప్లాంట్ నిర్మాణానికి సంబంధించి పర్యావరణ కాలుష్యం సహా, ఇతర అన్ని నిబంధనలకనుగుణంగానే తాము పనిచేస్తున్నామని చెప్పుకొచ్చారు. ఈ వ్యవహారంలో తదుపరి వాదనలు జూన్ 6వతేదీన ఉన్నాయని చెప్పారు. -
రికార్డులు సృష్టిస్తున్న రిలయన్స్ ఇండస్ట్రీస్
ముంబై : ప్రముఖ వ్యాపారవేత్త, బిలీనియర్ ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్లో రికార్డులు సృష్టిస్తోంది. శుక్రవారం ప్రారంభ ట్రేడింగ్లో ఈ కంపెనీ షేర్లు రూ.1000 మార్కును చేధించాయి. ఈ రోజు సాయంత్రం కంపెనీ తన నాలుగో క్వార్టర్ ఫలితాలను ప్రకటించనున్న నేపథ్యంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ నేటి ట్రేడింగ్లో జోరుగా కొనసాగుతోంది. ప్రస్తుతం కంపెనీ షేరు 2.39 శాతం లాభంలో రూ.998.70 వద్ద కొనసాగుతోంది. కంపెనీ మార్చి క్వార్టర్లో రూ.9,635.2 కోట్ల నికర లాభాలను ప్రకటిస్తుందని అంచనాలు వెలువడుతున్నాయి. ఏడాది ఏడాదికి ఇది 19.8 శాతం పెంపుగా విశ్లేషకులు పేర్కొంటున్నారు. మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా కూడా రిలయన్స్ దేశంలో రెండో అతిపెద్ద కంపెనీగా ఉన్న సంగతి తెలిసిందే. పెట్రో కెమికల్, రిఫైనరీ బిజినెస్లను మాత్రమే కాక, పెట్టుబడిదారులు టెలికాం రంగంపై కూడా ఎక్కువగా దృష్టిసారించారు. గ్రాస్ రిఫైనింగ్ మార్జిన్లు 11.6 డాలర్ల నుంచి 11.3 డాలర్లకు పడిపోయే అవకాశాలున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. డిసెంబర్ క్వార్టర్లో రిలయన్స్కు చెందిన జియో టెలికాం వ్యాపారాలు లాభాలను నమోదు చేశాయి. మొత్తంగా ఈ ఏడాది కంపెనీ షేర్లు 34 శాతం ర్యాలీ జరిపాయి. నేడు వెల్లడించే ఫలితాల్లో ఈక్విటీ షేర్లపై డివిడెండ్ను కూడా కంపెనీ ప్రకటించనుందని తెలుస్తోంది. -
ఇన్ఫీకి రూ.8వేల కోట్లు లాస్!
టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ ఇవాల్టి మార్కెట్లో భారీ అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. 2018-19 ఆర్థిక సంవత్సరానికి గాను ఈబీఐటీ మార్జిన్ గైడెన్స్ తగ్గించడంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ దెబ్బతింది. దీంతో ఆ కంపెనీ షేర్లు 3 శాతం మేర నష్టల్లో ముగిశాయి. ఈ నష్టాల దెబ్బకి కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ కూడా రూ.8000 కోట్ల మేర తుడిచిపెట్టుకుపోయింది. ఇంట్రాడేలో కంపెనీ స్టాక్ 5.98 శాతం మేర కిందకి పడిపోయి రూ.1,099ను తాకింది. ట్రేడింగ్ సెషన్ ముగిసే నాటికి కంపెనీ షేరు 3.10 శాతం నష్టంలో రూ.1,132.80గా నమోదైంది. ఎన్ఎస్ఈలో ఇంట్రాడేలో రూ.1,102 కనిష్ట స్థాయిని తాకి, చివరి రూ.1,134.50 వద్ద స్థిరపడింది. దీంతో మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.7,887.28 కోట్లు హరించుకుపోయి, రూ.2,47,416.46 కోట్లగా రికార్డైంది. 30-షేరు ఇండెక్స్లో ఈ కంపెనీనే రెండో అతిపెద్ద లూజర్. అంచనావేసిన దానికంటే తక్కువగా కంపెనీ తన క్వార్టర్ ఫలితాల్లో మార్జిన్ గైడెన్స్ను 22-24 శాతానికి తగ్గించింది. మార్జిన్ గైడెన్స్ కోత పెట్టడంతోనే కంపెనీ స్టాక్ ప్రతికూలంగా స్పందించిందని గ్లోబల్ బ్రోకరేజ్ నోమురా తెలిపింది. కాగ, కంపెనీ ప్రకటించిన క్వార్టర్ ఫలితాల్లో కన్సాలిడేటెడ్ నికర లాభం రూ.3690 కోట్లగా నమోదైన సంగతి తెలిసిందే. -
అదానీ, రిలయన్స్ ఇన్ఫ్రా డీల్: షేర్ల జోరు
సాక్షి, ముంబై: అప్పుల్లో కూరుకుపోయిన పవర్ బిజినెస్ విక్రయించేందుకు అదానీ ట్రాన్స్మిషన్తో రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. సమీకృత ముంబై పవర్ బిజినెస్లో 100 శాతం వాటాను అదానీ ట్రాన్స్మిషన్కు విక్రయించేందుకు తప్పనిసరి ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు అనిల్ అంబానీ గ్రూప్ కంపెనీ రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వెల్లడించింది. రెండు సంస్థల మధ్య కుదిరిన ఒప్పందానికి సంబంధించి రిలయన్స్ ఇన్ఫ్రా గురువారం అధికారిక ప్రకటన విడుదల చేసింది. మొత్తం డీల్ విలువ రూ. 18,800 కోట్లుకాగా... ముంబైలో రిలయన్స్ ఇన్ఫ్రా నిర్వహిస్తున్న విద్యుదుత్పత్తి, ప్రసారం, పంపిణీ బిజినెస్లు అదానీ ట్రాన్స్మిషన్కు బదిలీకానున్నాయి. ముంబై పవర్ బిజినెస్కు 30 లక్షల మంది కస్టమర్లున్నారు. 1892 మెగావాట్ల విద్యుత్ పంపిణీ చేపడుతోంది. 500 మెగావాట్ల బొగ్గు ఆధారిత ప్లాంటును కలిగి ఉంది. ఈ డీల్ ద్వారా తమకు దక్కే మొత్తాన్ని రిలయన్స్ ఇన్ఫ్రా తన అప్పులను తగ్గించుకోనున్నట్లు తెలుస్తోంది. రిలయన్స్ ఇన్ ఫ్రా సీఈవో అనిల్ జలాన్ మాట్లాడుతూ ఒప్పందం ద్వారా అప్పుల తర్వాత సుమారు రూ .3,000 కోట్ల మిగులు వుంటుందని, ఈ నిధులను ఇతర నిర్మాణం, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులపై మరింత దృష్టి పెట్టడానికి తమకు సహాయపడుతుందన్నారు. తద్వారా రూ. 10,000 కోట్ల ఆర్డర్ బుక్తో దేశంలో రెండో అతిపెద్ద నిర్మాణ సంస్థగా ఉన్న తమకు చౌకైన నిధులకు సులభ ప్రాప్యతను కలిగి ఉంటామని చెప్పారు. దీంతో శుక్రవారం నాటి మార్కెట్లో ఇన్వెస్టర్లు భారీ కొనుగోల్లకు మొగ్గు చూపడంతో రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దాదాపు 5 శాతం ఎగసింది. ఒక దశలో రూ. 545 వద్ద ట్రేడ్ అయింది. మరోవైపు గురువారం ఆల్టైం హైని తాకిన అదానీ ట్రాన్స్మిషన్ 8.5 శాతం లాభాలతో కొనసాగుతోంది. -
మారుతి దూకుడు: కొత్త రికార్డ్
సాక్షి, ముంబై: దేశీయ కార్ల దిగ్గజం మారుతి సుజుకి విశ్లేషకుల అంచనాలకనుగుణంగా దూసుకుపోతోంది. తాజాగా మారుతి సుజుకి కౌంటర్ బుధవారం మరో ఆల్ టైం రికార్డ్ స్థాయిని టచ్ చేసింది. దీంతో మార్కెట్ క్యాప్ రీత్యా టాప్-5 కంపెనీల్లో మారుతి ప్లేస్ కొట్టేసింది. మారుతీ సుజుకీ షేరు బీఎస్ఈలో తొలిసారి రూ. 10వేల మైలురాయిని తాకింది. దీంతో కంపెనీ మార్కెట్ విలువ(కేపిటలైజేషన్) మరింత బలపడింది. రూ. 3 లక్షల కోట్లను అధిగమించింది. ఈ ఏడాది లో 83 శాతం వృద్ధి సాధించింది. కంపెనీ ప్రధానంగా స్విఫ్ట్, స్విఫ్ట్ డిజైర్, ఆల్టో విక్రయాలతో దూసుకెళుతున్న మారుతి సరికొత్త వాహనాలతో కస్టమర్ల బేస్ను పెంచుకుంటోంది. వితారా బ్రెజా, ఇగ్నిస్, బాలెనో తదితర కొత్త మోడళ్లకు సైతం డిమాండ్ భారీగా ఉండడటంతో కార్ల మార్కెట్లో కంపెనీ వాటా 50 శాతానికి చేరింది. కాగా.. ప్రస్తుతం కంపెనీ మార్కెట్ క్యాప్ రీత్యా ఐదో ర్యాంకును సొంతం చేసుకుంది. కాగా రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ క్యాప్ రీత్యా రూ. 5.83 లక్షల కోట్లతో అగ్రస్థానం ఉన్న సంగతి విదితమే. ఇక రూ. 4.93 లక్షల కోట్లతో టీసీఎస్ రెండో ర్యాంకులోనూ, రూ. 4.88 లక్షల కోట్లతో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ మూడవ ర్యాంకు, రూ. 3.22 లక్షల కోట్లతో ఐటీసీ నాలుగో స్థానంలో నిలిచాయి. రూ.10వేల -
హెచ్డీఎఫ్సీకి ఫండ్ రైజింగ్ బూస్ట్
సాక్షి, ముంబై: భారీ ఎత్తున నిధుల సమీకరణ చర్యలుచేపట్టిందన్న వార్తల నేపథ్యంలో శుక్రవారం నాటి బుల్ మార్కెట్లో ప్రయివేట్ రంగ దిగ్గజం హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కౌంటర్ భారీగా లాభపడింది. వివిధ మార్గాలలో నిధుల సమీకరణ చేపట్టే ప్రతిపాదన నేపథ్యంలో ఇన్వెస్టర్లు భారీ కొనుగోళ్ల దిగారు. హెచ్డీఎఫ్సీకౌంటర్ 52 వారాల గరిష్టాన్ని తాకింది. బిఎస్ఇ ఫైలింగ్ ప్రకారం, అర్హతగల సంస్థాగత ఇన్వెస్టర్లకు షేర్ల జారీ(క్విప్) లేదా ఏడీఆర్, డిపాజిటరీ రిసీప్ట్స్ తదితర మార్గాలలో నిధుల సమీకరణ చేపట్టేందుకు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ప్రతిపాదించింది. ఈ విషయాన్ని చర్చించేందుకు 2017 డిసెంబర్ 20 న బోర్డు సమావేశం కానున్నట్లు కంపెనీ పేర్కొంది. బ్యాంకు వాటాదారుల ఆమోదంతో సహా. బోర్డు ఆమోదం పొందినట్లయితే, పైన పేర్కొన్న ప్రతిపాదనకు వాటాదారుల ఆమోదం పొందేందుకు విస్తృత సాధారణ సాధారణ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తోంది. మరోవైపు ఈ షేరుపై రూ. 2165 టార్గెట్తో ఎనలిస్టులు బై కాల్ ఇస్తున్నారు. -
‘మార్కెట్ బాహుబలి’ ఎంఆర్ఆఫ్ జోరు
ముంబై: మార్కెట్ ఎనలిస్టులు అంచనాలను అధిగమించి మార్కెట్ బాహుబలి ఎంఆర్ ఆఫ్ మరో కీలక రికార్డ్ స్థాయిని తాకింది. లాభాల స్వీరణతో మార్కెట్లు కన్సాలిడేషన్ బాటలో పయనిస్తుండగా మరోసారి టైర్ స్టాక్స్ ర్యాలీ మాత్రం ఈరోజుకూడా కొనసాగుతోంది. ముఖ్యంగా మార్కెట్ లీడర్ ఎంఆర్ఎఫ్ ఎంఆర్ఆఫ్ నిన్నటి హవాను కొనసాగిస్తోంది. రూ. 70,164.60 వద్ద రికార్డ్ గరిష్టాన్ని నమోదు చేసింది. ఇంట్రాడేలో గరిష్టాన్ని తాకిన ఈ షేర్ మార్కెట్ లో ’బాహుబలి’ అనడంలో సందేహం లేదు. ప్రస్తుతంఈ గరిష్టాని స్వల్పంగా వెనక్కి తగ్గి 1.36శాతంలాభంతో 69, 784 వద్ద కొనసాగుతోంది. తద్వారా కంపెనీ మార్కెట్ క్యాప్ తొలిసారి రూ. 30,000 కోట్లను తాకడం విశేషం. ఇదే బాటలో సియట్ జేకే టైర్స్ అపోలో టైర్స్ పయనిస్తున్నాయి. మరోవైపు ఎఫ్ అండ్ వో సిరీస్ ముగింపు నేపథ్యంలో స్టాక్మార్కెట్లలో లాభాల స్వీకరణ కనిపిస్తోంది.నిన్న రికార్డ్ ఆల్ టైం హైని టచ్ చేయడంతో మదుపర్లు అమ్మకాలకు దిగి అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. -
ఏకంగా ఆ స్టాక్ ధర రూ.60వేలకు ఎగిసింది!
న్యూఢిల్లీ : దేశంలోనే అతిపెద్ద టైర్ల తయారీ కంపెనీ ఎంఆర్ఎఫ్ సోమవారం మార్కెట్లో మెరుపులు మెరిపించింది. ఒక్కసారిగా ఆ స్టాక్ ధర రూ.60వేల మార్కును కొల్లగొట్టింది. సోమవారం మధ్యాహ్న ట్రేడింగ్ లో మొదటిసారి ఆ స్టాక్ ధర రూ.60వేల క్రాస్ చేసినట్టు వెల్లడైంది. ఈ కంపెనీ షేరు ధర రూ.59,250 వద్ద ప్రారంభమైంది. అనంతరం ఆల్-టైమ్ గరిష్ట స్థాయిలోకి రూ.60,140కు చేరుకుంది. చివరికి 1.21 శాతం లాభంతో ఈ కంపెనీ షేరు ధర రూ.59,900 వద్ద ముగిసింది. విలువ పరంగా చూసుకుంటే, ఎంఆర్ఎఫ్ ఎక్కువ ఖరీదైన దేశీ స్టాక్. దీని తర్వాత ఐషర్ మోటార్స్(రూ.24,322), బోస్ (రూ.22,988), శ్రీ సిమెంట్(రూ.16,460), పేజ్ ఇండస్ట్రీస్(రూ.14,803), 3ఎం ఇండియా(రూ.11,080) లు ఉంటాయి. ఈ దశాబ్దం ప్రారంభమైనప్పటి నుంచి ఎంఆర్ఎఫ్ షేరు ధర 4,759 శాతం పైకి ఎగిసినట్టు తెలిసింది. అంటే 50 సార్లు అన్నమాట. మార్చి 24 నాటికి ఇది రూ.59,184కు చేరుకుంది. ఎంఆర్ఎఫ్ రెవెన్యూలు, ఈబీఐడీటీఏ, ప్యాట్లు 2017-18 ఆర్థిక సంవత్సరంలో 16, 17, 18 శాతం పైకి ఎగుస్తాయని ఇన్స్టిట్యూషనల్ రీసెర్చ్ ఆనంద్ రతి ఫిబ్రవరిలోనే చెప్పారు. మార్కెట్ నిపుణుల ప్రకారం రబ్బర్ ధరలు ఫిబ్రవరి నుంచి 25 శాతం తగ్గాయని తెలిసింది. రబ్బర్ ధరలు తగ్గడం అపోలో టైర్స్, ఎంఆర్ఎఫ్ వంటి టైర్ల తయారీ సంస్థలకు అనుకూలిస్తుందని మార్కెట్ విశ్లేషకులు పేర్కొన్నారు. స్వల్పకాల వ్యవధిలో ఈ కంపెనీల రెవెన్యూలు, మార్జిన్లు పెరుగుతాయని అంచనావేస్తున్నారు. 2016 డిసెంబర్ తో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ నికర లాభాలు రూ.288.08 కోట్లగా నమోదయ్యాయి. ఇతర మేజర్ టైర్ల కంపెనీలు అపోలో కూడా మధ్యాహ్నం ట్రేడింగ్ లో లాభపడినట్టు తెలిసింది. -
మంచు ముద్దల్లా లోహ షేర్లు..!
ఆరు నెలల్లో 50% వరకూ పతనం - మూడేళ్ల గరిష్ఠ ధరతో పోలిస్తే మరీ ఘోరం - ఇక తగ్గవనుకోవటానికి వీల్లేదంటున్న నిపుణులు - ఈ బేరిష్ దశ దీర్ఘకాలం సాగుతుందంటూ సూచనలు దేశంలో అగ్రగామి ఉక్కు సంస్థల్లో ఒకటైన టాటా స్టీల్ షేరు ధర ఈ ఏడాది ప్రారంభంలో దాదాపు 400 రూపాయలు. మరిప్పుడో..? దాదాపు 250 రూపాయలు. అంటే 40%పైగా పతనమైందన్న మాట. ఇదొక్కటే కాదు. హిందాల్కో, జిందాల్ స్టీల్, సెయిల్, వేదాంత, నాల్కో... ఇలా మెటల్ షేర్లన్నీ దారుణంగా కరిగిపోతున్నాయి. ఏకంగా 30 నుంచి 40 శాతం వరకూ పతనమవుతున్నాయి. మూడేళ్ల కిందట వీటిని చూసినవారికి... సగానికన్నా ఎక్కువ, అతిదారుణంగా పడిపోయిన తీరు స్పష్టంగానే అర్థమవుతుంది. కొన్ని కంపెనీల షేర్లయితే వాటి బుక్ వాల్యూ కన్నా తక్కువకు పడిపోయాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఈ లెక్కన చూసినపుడు చాలా షేర్లు ఆకర్షణీయంగా ఉన్నాయని, కొనుగోళ్లకు మంచి సమయమేనని కూడా కొందరు ఇన్వెస్టర్లు భావిస్తున్నాయి. అయితే నిజంగానే ఇది మంచి సమయమా? లేక ఇంకా పతనం కొనసాగుతుందా? భవిష్యత్ ఎలా ఉంటుంది? వీటిపై మార్కెట్ నిపుణులు ఏమంటున్నారు? ఇవన్నీ తెలియజేసేదే ‘సాక్షి బిజినెస్’ అందిస్తున్న ఈ ప్రత్యేక కథనం... ఒక దేశం అభివృద్ధి చెందుతున్న తీరును తెలియజేయటానికి ఆ దేశంలో తలసరి ఉక్కు వినియోగాన్ని కూడా ప్రామాణికంగా తీసుకుంటారంటే ఉక్కు వినియోగం ప్రాధాన్యాన్ని అర్థం చేసుకోవచ్చు. కాకపోతే అంతర్జాతీయంగా, దేశీయంగా పలు ప్రతికూలాంశాలు ఎదురవటంతో దేశంలో ఉక్కుతో పాటు ఇతర లోహాలూ కుదేలవుతున్నాయి. అన్నిటికన్నా ముఖ్యంగా చైనా ఆర్థిక వ్యవస్థ వృద్ధి నెమ్మదించటం లోహ పరిశ్రమపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతోంది. ఉక్కు, రాగి, అల్యూమినియం వంటి లోహాలను అధికంగా వినియోగించే చైనాలో మందగమనం వల్ల డిమాండ్తో పాటు ధరలూ తగ్గాయి. పులి మీద పుట్రలా ఆస్ట్రేలియా, ఇండోనేషియాల్లో మైనింగ్పై నిషేధాలు తొలగడంతో ఎన్నడూ లేనంతగా సరఫరా పెరుగుతోంది. ఫలితం... డిమాండ్, తగ్గి సరఫరా పెరగటంతో ధరలు నేలచూపులు చూస్తున్నాయి. ముడి ఇనుము మైనింగ్కు సంబంధించి కర్ణాటక, గోవాల్లో నిషేధం వల్ల కంపెనీలు ఉక్కిరిబిక్కిరయ్యాయి. దీనికి ఉత్పాదక వ్యయాలు పెరగడం, వాహన, నిర్మాణ రంగాల్లో అంతంత మాత్రపు డిమాండ్, మైనింగ్ అనుమతుల్లో జాప్యం, డాలర్తో రూపాయి మారకం క్షీణించడం ఇవన్నీ తోడవుతున్నాయి. హిందాల్కో, జిందాల్, తదితర కంపెనీలకు బొగ్గు కుంభకోణం మసి అంటుకోవడం, న్యాయ వివాదాలు వీటికి ఆజ్యం పోసేవే. ఈ షేర్లు ఆకర్షణీయమేనా? లోహ కంపెనీల షేర్ల ధరలు బాగా తగ్గుతుండటంతో ఈ షేర్ల బాటమ్ అవుట్ దగ్గరలోనే ఉందని ఇన్వెస్టర్లు చేస్తున్న ఆలోచనలతో నిపుణులు మాత్రం ఏకీభవించటం లేదు. హిందాల్కో, టాటా స్టీల్, సెయిల్, జేఎస్డబ్ల్యూ స్టీల్, జిందాల్ స్టీల్ అండ్ పవర్, నాల్కో కంపెనీలు తమ పుస్తక విలువల కంటే తక్కువ స్థాయిలోనే ట్రేడవుతున్నాయి. వీటి మార్కెట్ ధరకు, పుస్తక విలువకు మధ్య నిష్పత్తి ఒకటి కంటే తక్కువే ఉంది. అంతమాత్రాన ఇవి కొనుగోలుకు ఆకర్షణీయంగా ఉన్నట్లు భావించరాదనేది నిపుణుల మాట. ఈ లోహ షేర్ల రుణభారాలు బాగా పెరుగుతున్నాయని, ఇవి బే ర్ గ్రిప్లోకి జారిపోయాయనేది వారి అభిప్రాయం. ‘‘లోహ షేర్లు బేర్ దశలో సుదీర్ఘ కాలం ఉంటాయి. దీర్ఘకాలం రిస్క్ను భరించగలిగే సామర్థ్యం ఉంటేనే వీటి గురించి ఆలోచించాలి’’ అని ఓ బ్రోకింగ్ కంపెనీ నిపుణుడు అభిప్రాయపడ్డారు. పలు మ్యూచువల్ ఫండ్ సంస్థలు కూడా తమ పోర్ట్ఫోలియోల్లో లోహ షేర్లను వీలైనంతగా తగ్గించుకుంటున్నాయి. ఈ రంగం భవిష్యత్తు అనిశ్చితిగా ఉంటుంటమే దీనికి ప్రధాన కారణమని అవి చెబుతున్నాయి. లోహ పరిశ్రమ కోలుకోవడానికి చాలా కాలం పడుతుందని, ఒకసారి కోలుకుంటే మాత్రం మంచి రాబడులను అందిస్తాయని మార్కెట్ ఎనలిస్ట్లు చెబుతున్నారు.