Theft
-
కేడీల ఆట కట్టించిన హైదరాబాద్ పోలీసులు
సాక్షి, హైదరాబాద్: నగరంలోని నారాయణగూడ పోలీసుస్టేషన్ పరిధిలో నివసించే కేడియా ఆయిల్స్ కంపెనీ యజమాని రోహిత్ కేడియా (Rohit Kedia) ఇంట్లో జరిగిన భారీ చోరీ కేసును పోలీసులు ఛేదించారు. బిహార్, పశ్చిమ బెంగాల్కు చెందిన ముగ్గురు నిందితులు దాదాపు రూ.40 కోట్ల విలువైన సొత్తు దోచుకుపోగా... అత్యంత వేగంగా స్పందించిన పోలీసులు 20 గంటల్లో వారిని పట్టుకున్నారు. ఈ నిందితుల్లో ఒకరు గతేడాది దోమలగూడ పోలీసుస్టేషన్ (Domalguda Police Station) పరిధిలో స్నేహలత దేవిని చంపి, రూ.కోటి విలువైన సొత్తు దోపిడీకి పాల్పడిన కేసులో వాంటెడ్గా ఉన్నట్లు నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ (CV Anand) పేర్కొన్నారు. తూర్పు మండల డీసీపీ బాలస్వామి, అదనపు డీసీపీలు అందె శ్రీనివాసరావు, జె.నర్సయ్యలతో కలిసి గురువారం ఐసీసీసీలో ఏర్పాటు చేసిన సమావేశంలో కొత్వాల్ వివరాలు వెల్లడించారు. కుమార్తె పెళ్లి పనుల కోసం.. రాజేంద్రనగర్లో కేడియా ఆయిల్స్ కంపెనీ నిర్వహిస్తున్న రోహిత్ కేడియా హిమాయత్ నగర్లో నివసిస్తున్నారు. ఆయన కుటుంబం వద్ద దాదాపు 20 మంది పనివాళ్లు ఉన్నారు. దాదాపు ఎకరం విస్తీర్ణంలో ఉండే వీరి ఇంటి ప్రాంగణంలోనే పనివాళ్ల కోసం మూడంతస్తుల భవనం నిర్మించారు. రోహిత్ ఇంట్లో బిహార్లోని బిరోల్ గ్రామానికి చెందిన సుశీల్ ముఖియా రెండేళ్ల పాటు పని చేసి ఏడాది క్రితం మానేశాడు. ఇటీవల రోహిత్ కుమార్తె వివాహం నిశ్చయం కావడంతో పాటు దుబాయ్లో డెస్టిషన్ మ్యారేజ్ చేయాలని నిర్ణయించారు. పెళ్లి పనుల కోసం సహాయంగా ఉండటానికి సుశీల్ను సంప్రదించిన రోహిత్ 15 రోజుల క్రితం పిలిపించారు. ఇదే ఇంట్లో పని చేసే పశ్చిమ బెంగాల్ మహిళ బసంతి ఆర్హికి ఇతడితో గతంలోనే వివాహేతర సంబంధం ఉంది. నేరగాడితో గతంలో ఉన్న పరిచయంతో.. సుశీల్తో పాటు బసంతి సైతం మిగిలిన పని వాళ్లతో కలిసి రోహిత్ ఇంటి ప్రాంగణంలోని భవనంలోనే ఉంటున్నారు. కుమార్తె వివాహం కోసం రోహిత్ ఫ్యామిలీ మొత్తం గత వారం దుబాయ్ వెళ్లింది. ఇదే అదనుగా భావించిన సుశీల్.. ఆ ఇంటిని దోచేయడానికి ఢిల్లీలో ఉండే తన స్నేహితుడు మోల్హు ముఖియాను నగరానికి పిలిపించాడు. గత ఏడాది దోమలగూడ పరిధిలో స్నేహలత అనే వృద్ధురాలిని హత్య చేసిన బిహారీలు రూ.కోటి సొత్తు దోచుకుపోయారు. ఈ కేసులో ఆమె ఇంట్లో పని చేసే మహేష్ ముఖియాతో పాటు మోల్హు, రాహుల్ నిందితులుగా ఉన్నారు. దోపిడీ జరిగిన ఎనిమిది నెలలకు మహేష్ చిక్కినా.. మిగిలిన ఇద్దరూ పరారీలోనే ఉండిపోయారు. మోల్హు నేర చరిత్ర తెలిసిన సుశీల్ తాజా నేరం కోసం ఢిల్లీ తలదాచుకున్న అతడిని పిలిపించాడు. వీరిద్దరూ కలిసి మంగళవారం తెల్లవారుజామున సర్వెంట్స్ బిల్డింగ్ నుంచి రోహిత్ ఇంట్లోకి ప్రవేశించారు. అల్మారాలు, లాకర్లు పగులకొట్టి 710 గ్రాముల వజ్రాలతో కూడిన ఆభరణాలు, 1.4 కేజీల స్వర్ణాభరణాలు, రూ.19.63 లక్షలు, 24 దేశాల కరెన్సీ, 215 గ్రాముల వెండి అపహరించారు.మూడు నగరాలకు ప్రత్యేక బృందాలు... మంగళవారం ఉదయం 9 గంటల ప్రాంతంలో రోహిత్ ఇంట్లో చోరీ జరిగిన విషయాన్ని రోహిత్ మేనేజర్ అభయ్ కేడియా గుర్తించారు. వెంటనే నారాయణగూడ పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ కేసును ఛేదించడానికి నారాయణగూడ పోలీసు, టాస్క్ఫోర్స్ బృందాలు రంగంలోకి దిగాయి. సీసీ కెమెరాల్లో రికార్డు అయిన దృశ్యాల ఆధారంగా నిందితులు ముగ్గురూ సికింద్రాబాద్ రైల్వేస్టేషన్కు వెళ్లారని, అక్కడ నుంచి ఢిల్లీ వెళ్తే తెలంగాణ ఎక్స్ప్రెస్ ఎక్కారని గుర్తించారు.చదవండి: సైబర్ నేరాలతో రూ.88.58 లక్షల కోట్లు దోపిడీ దీంతో మూడు ప్రత్యేక బృందాలు భోపాల్, నాగ్పూర్, పట్నాలకు వెళ్లి కాపుకాశాయి. డీసీపీ బాలస్వామి మహారాష్ట్ర పోలీసులతో తనకు ఉన్న పరిచయాలను వినియోగించి ఈ నిందితుల సమాచారం ఇచ్చారు. దీంతో మంగళవారం రాత్రి తెలంగాణ ఎక్స్ప్రెస్ నాగ్పూర్ రైల్వేస్టేషన్కు చేరుకుంది. నగర పోలీసులు, అక్కడి జీఆర్పీ అధికారులతో కలిసి సోదాలు చేశారు. ముగ్గురు నిందితులతో పాటు చోరీ సొత్తు మొత్తం స్వాదీనం చేసుకుని నగరానికి తీసుకువచ్చారు.ఆదాయపు పన్ను శాఖకు సమాచారం ఇస్తాంరోహిత్ కేడియా ఇంటి నుంచి చోరీ అయిన సొత్తులో వజ్రాలే 3,300 క్యారెట్లు ఉన్నట్లు తేలింది. ప్రస్తుతం ఒక్కో క్యారెట్ రూ.1.12 లక్షలు పలుకుతోంది. ఈ ప్రకారం చూస్తే వీటి విలువే రూ.37 కోట్ల వరకు ఉంది. వీటితో పాటు భారీగా విదేశీ కరెన్సీ, బంగారం, నగదు చోరీకి గురయ్యాయి. సొత్తు మొత్తం రికవరీ చేసి వీడియో కాల్ ద్వారా దుబాయ్లో ఉన్న యజమానికి చూపించి ఖరారు చేసుకున్నాం. భారీ సొత్తు చోరీ, రికవరీపై ఆదాయపు పన్ను శాఖకు సమాచారం ఇవ్వాలని నిర్ణయించాం. నగదు, సొత్తును యజమాని వారి వద్ద డిక్లేర్ చేశారా? లేదా? అనేది ఆ అధికారుల విచారణలో వెలుగులోకి వస్తుంది. – సీవీ ఆనంద్, హైదరాబాద్ సీపీ -
కిలాడీ పనిమనిషి
కర్ణాటక: ఏడాదిన్నర కాలంగా పని చేస్తున్న ఇంటిలోని గుట్టుమట్లను తెలుసుకుంది, ఓ రోజు బంగారు, నగదు చోరీ చేసి, చివరకు కటకటాల పాలైన పనిమనిషి ఉదంతమిది. వివరాలు.. పరప్పన అగ్రహార ఠాణా పరిధిలోని ఓ ఇంటిలో నిందితురాలు పనిచేసేది. చాలా బంగారు ఆభరణాలు, నగదు ఉండటాన్ని గమనించిన కిలాడీలో దుర్బుద్ధి పుట్టింది. బంగారు నగలు, నగదు మాయం చేసి ఏమీ తెలియనట్లు పని చేసుకుంటోంది. సొత్తు కనబడకపోవడంతో ఇంటి యజమాని ఆమెపై అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు కాగానే భర్త, అతని అన్నతో కలిసి నిందితురాలు పరారైంది. పోలీసులు గాలింపు జరిపి ముగ్గురినీ అరెస్టు చేశారు. వారి నుంచి రూ.22 లక్షల విలువ చేసే 273 గ్రాముల బంగారం, నగదును స్వాదీనపరచుకున్నారు. -
2,500 ఏళ్లనాటి బంగారు హెల్మెట్ను... ఎత్తుకెళ్లారు
ఎస్సెన్ (నెదర్లాండ్స్): నెదర్లాండ్స్లో దొంగలు ఏకంగా వేల ఏళ్లనాటి బంగారు హెల్మెట్పైనే కన్నేశారు. ఎలాగైనా చేజిక్కించుకోవాలనుకున్నారు. చివరికి అనుకున్నది సాధించారు. కట్టుదిట్టమైన భద్రతా వ్యవస్థను బాంబులతో బద్ధలుకొట్టి మరీ దోచుకెళ్లిపోయారు. అది ఏకంగా 2,500 ఏళ్లనాటి బంగారు హెల్మెట్! దాంతో ఈ దొంగతనం సంచలనం సృష్టించింది. ప్రాచీన వస్తు ప్రదర్శన కోసం తమ దేశం నుంచి నెదర్లాండ్స్ పట్టుకుపోయిన అత్యంత విలువైన వస్తువులు చోరశిఖామణుల పాలబడటంతో రొమేనియా సైతం దిగ్భ్రాంతికి గురైంది. నెదర్లాండ్స్లోని ఎస్సెన్ నగరంలోని డ్రెంట్స్ పురాతన వస్తుప్రదర్శనశాలలో ఈ భారీ చోరీ జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం శనివారం తెల్లవారుజామున ముసుగులు ధరించిన దొంగలు మ్యూజియం వద్దకొచ్చి బయటివైపు ఉన్న భారీ తలుపును రంధ్రాలు పెట్టే మెషీన్, ఇనుప రాడ్లతో ఎలాగోలా తెరిచారు. అక్కడే లోపలివైపు ఇంకో భారీ తలుపు ఉంది. అత్యంత పటిష్టంగా ఉన్న దీనిని మామూలుగా తెరవడం సాధ్యంకాదని దొంగలకు తెలుసో ఏమో, ముందుజాగ్రత్తగా పెద్ద బాంబును వెంట తెచ్చుకున్నారు. తలుపుకు బాంబు అమర్చి పేల్చేశారు. తునాతునకలైన ద్వారం గుండా ఎంచక్కా లోపలికి వెళ్లి అక్కడ అత్యంత ప్రాచీనమైన నాలుగు వస్తువులను తీసుకుని ఉడాయించారు. వెలకట్టలేని హెల్మెట్ చోరీకి గురైన వాటిల్లో 2,500 ఏళ్ల క్రితం నాటి పుత్తడితో చేసిన హెల్మెట్ ఉంది. క్రీస్తుపూర్వం 50వ సంవత్సరంలో దీనిని తయారు చేశారని కొందరు చరిత్రకారులు చెబుతున్నారు. దాదాపు 907 గ్రాముల బరువైన ఈ హెల్మెట్ను రొమేనియాలో వంద సంవత్సరాల క్రితం ఒక కుగ్రామంలో కనుగొన్నారు. ‘హెల్మెట్ ఆఫ్ కోటోఫెనెస్టీ’గా పిలుచుకునే దీనిని పూర్వకాలంలో ఉత్సవాలు, సంబరాల్లో ఉపయోగించేవారు. హెల్మెట్ ముందుభాగంలో పెద్ద కళ్లను చెక్కారు. దుష్టశక్తుల బారిన పడకుండా కాపాడుతుందని ఆనాటి జనం విశ్వసించేవారు. జంతు వధ చేస్తున్నట్లుగా హెల్మెట్ వెనుకవైపు చెక్కారు. రొమేనియా సంస్కృతి సంబంధించి ఇది వెలకట్టలేని ప్రాచీన కళాఖండమని చోరీ తర్వాత రొమేనియా ప్రభుత్వం ఆవేదన వ్యక్తంచేసింది. దీంతోపాటు డేసియన్ల రాజ్యానికి చెందిన అలనాటి రాయల్ బ్రేస్లెట్సహా మూడు వస్తువులనూ దొంగలు పట్టుకెళ్లిపోయారు. రోమన్లు రొమేనియాను పాలించడానికి ముందు రాజ్యమేలిన డేసియన్ల సంస్కృతిని కళ్లకుకట్టేందుకు ఆనాటి వస్తువులను ఒక దగ్గరకు చేర్చి నెదర్లాండ్స్ ప్రభుత్వం ఒక ప్రదర్శనను ఏర్పాటుచేసింది. గత ఏడాది జూలై నుంచి ఈ ప్రదర్శన కొనసాగుతోంది. కీలకమైన హెల్మెట్ను సైతం రొమేనియా నుంచి తెప్పించిమరీ ప్రదర్శనకు ఉంచగా అది కాస్తా ఇప్పుడు దొంగలపరమైంది.చోరుల కోసం వేట మొదలు మళ్లీ అప్పజెప్తామని చెప్పి బుకారెస్ట్ నగరంలోని ‘నేషనల్ హిస్టరీ మ్యూజియం ఆఫ్ రొమేనియా’ నుంచి తీసుకొచ్చిన ప్రాచీన వస్తువులు పోవడంతో నెదర్లాండ్స్ ప్రభుత్వం ఈ చోరీ ఘటనను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎలాగైనా వాళ్లను పట్టుకునేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. వారం క్రితం చోరీకి గురైన ఒక కారు ఈ మ్యూజియం దగ్గర కాలిపోయిన స్థితిలో ఉండటం చూసి ఈ రెండు చోరీలకు ఏమైనా సంబంధం ఉందేమోనని పోలీసులు అనుమానిస్తున్నారు. కొట్టుకొచ్చిన కారులో ఇక్కడికొచ్చిన దొంగలు ఆ తర్వాత పారిపోతూ నాలుగు మైళ్ల దూరంలో కారును వదిలేసి తగలబెట్టిపోయారని పోలీసులు భావిస్తున్నారు. కొట్టేసిన కారుకు నకిలీ నంబర్ ప్లేట ఉండటం చూస్తుంటే ఇదేదో ఆరితేరిన దొంగలముఠా పనిగా అనుమానిస్తున్నారు. ‘‘ మా మ్యూజియం 170 ఏళ్ల చరిత్రలో ఎన్నడూ ఇలాంటి చోరీ ఘటన చూడలేదు. నిజంగా ఇది దురదృష్టకరం’’ అని ఎస్సెన్లోని డ్రెంట్స్ మ్యూజియం డైరెక్టర్ హ్యారీ ట్యూపన్ అన్నారు. -
మారలేదు.. ఇక మారడని..!
మధిర: బస్సులో ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారడంతో తల్లిదండ్రులను ఎదిరించి మరీ మతాంతర వివాహం చేసుకుంది. ఇంతలోనే భర్త పెళ్లిముందు చెప్పినట్లు ఉద్యోగం చేయటంలేదని, పలు చోరీ కేసుల్లో నిందితుడని తెలియడంతో తల్లడిల్లిపోయింది. తప్పుడు పనులు ఆపేయాలని, కష్టపడి బతుకుదామని చెప్పిచూసింది. అయినా అతడిలో మార్పు రాకపోవటంతో అవమాన భారం భరించలేక ఇద్దరు కుమార్తెలను హత్య చేసి, తానూ బలవన్మరణానికి పాల్పడింది. గుండెను మెలిపెడుతున్న ఈ ఘటన ఖమ్మం జిల్లా మధిర మండలం నిదానపురం గ్రామంలో చోటుచేసుకుంది. నల్లగొండ జిల్లాకు చెందిన మౌనిక అలియాస్ ప్రెజా (30) ఐదేళ్ల క్రితం విజయవాడ నుంచి మధిరకు బస్సులో వస్తుండగా.. మధిర మండలం నిదానపురానికి చెందిన షేక్ బాజీ ఆమె పక్క సీట్లో కూర్చున్నాడు. అక్కడ వారిమధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారడంతో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. మౌనిక తల్లిదండ్రులు అందుకు ఒప్పుకోకపోవటంతో ఆమె బాజీతో వెళ్లిపోయి పెళ్లి చేసుకుంది. వీరికి మెహక్ (4), మెనురూల్ (3) అనే కుమార్తెలు ఉన్నారు. నిదానపురంలోని అద్దె ఇంట్లో నివసిస్తున్నారు.అవమానంతో అసాధారణ నిర్ణయం.. ఉద్యోగం చేస్తున్నానని చెప్పిన బాజీ.. నిజానికి పలు చోరీ కేసుల్లో నిందితుడని మౌనికకు తెలిసింది. దీంతో చోరీలు మానేయాలని భర్తకు నచ్చజెప్పింది. అయినా అతడిలో మార్పు రాలేదు. బాజీపై ఈ నెల 22న (బుధవారం) ఖమ్మం సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) పోలీసులు విచారణ ప్రారంభించారు. బోనకల్ మండలం మోటమర్రిలో అతడిని అదుపులోకి తీసుకున్నారు. గురువారం నిదానపురం చేరుకున్న పోలీసులు.. బాజీ చోరీ చేస్తుండగా సీసీ కెమెరాల్లో రికార్డయిన వీడియో, ఫొటోలు ఆమెకు చూపించారు. దీంతో ఆమె గుండె పగిలిపోయింది. ఆ బాధలోనే కఠిన నిర్ణయం తీసుకుంది. అద్దెకు తీసుకున్న రేకుల షెడ్డు ఇనుప పైపునకు చీరలను కట్టి ఇద్దరు కుమార్తెలకు ఉరి వేసింది. ఆపై మరో చీరతో ప్రెజా సైతం ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. స్థానికులు పోలీసులకు సమాచారం అందించటంతో వైరా ఏసీపీ రెహమాన్, మధిర సీఐ మధు, ఎస్సై లక్ష్మీభారవి అక్కడికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. -
పెళ్లింట్లో భారీ చోరీ
అనంతపురం: పెళ్లింట్లో దొంగలు పడ్డారు. సుమారు రూ.3.50 కోట్ల విలువైన బంగారం, రూ.20 లక్షల నగదు ఎత్తుకెళ్లారు. అనంతపురం నగరంలోని ఓ ఇంట్లో బుధవారం వేకువజామున ఈ భారీ చోరీ జరిగింది. బాధితుల కథనం ప్రకారం.. అనంతపురం మండలం కాట్నేకాలువ గ్రామానికి చెందిన కొండ్రెడ్డి వెంకటశివారెడ్డి నగరంలో స్థిరపడ్డారు. భూములు అధికంగా ఉండడంతో పాటు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. కొండ్రెడ్డి వెంకటశివారెడ్డి, కవిత దంపతులకు ఒక్కగానొక్క కుమార్తె సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నారు. ఏలూరుకు చెందిన బుసిరెడ్డి ఆదినారాయణరెడ్డి కుమారుడితో ఆమెకు వివాహం నిశ్చయమైంది. ఫిబ్రవరి 7న అనంతపురం ఎంవైఆర్ కల్యాణ మండపంలో వివాహం జరిపేందుకు నిశ్చయించారు. ఈ నేపథ్యంలోనే పెళ్లి కుమార్తెకు బహుమతిగా ఇవ్వనున్న బంగారం, వెంకటశివారెడ్డి, కవిత దంపతులకు చెందిన బంగారంతో పాటు వెంకట శివారెడ్డి అత్త, మామ, వియ్యంకుల బంగారు ఆభరణాలు కలిపి సుమారు 5 కిలోల బంగారాన్ని ఇంట్లోని లాకర్లో ఉంచారు. కాగా.. శివారెడ్డి దంపతులు తెలంగాణలో ఉన్న తమ బంధువుల్ని పిలిచేందుకు వెళ్లగా.. ఇదే అదునుగా భావించిన దొంగలు బుధవారం వేకువజామున 4 గంటలకు ఇంట్లోకి చొరబడ్డారు. ఊచలు తొలగించి ఇంట్లోకి వెళ్లి తొలుత బీరువా తాళాలు పగులగొట్టారు. అందులో ఉన్న లాకర్ తాళం తీసుకుని.. లాకర్లోని సుమారు ఐదు కిలోల బంగారాన్ని, బీరువాలోని రూ.20 లక్షల నగదును ఎత్తుకెళ్లారు. మొత్తం ఐదుగురు దొంగల ముఠా చోరీలో పాల్గొన్నట్టు సీసీ కెమెరాల ఫుటేజీలను బట్టి తెలుస్తోంది. ఇంట్లో సీసీ కెమెరాలు లేనప్పటికీ ఎదురింటి సీసీ కెమెరాల్లో ఆ దృశ్యాలు రికార్డయ్యాయి. మరో రెండు ఇళ్లలోనూ చోరీ కాగా.. వెంకటశివారెడ్డి ఇంటి పక్కనే ఉంటున్న డిప్యూటీ కమిషనర్ ఇంట్లో రూ.75 వేలు, మిస్టర్ ఛాయ్ నిర్వాహకుడు ఇంట్లోనూ చోరీ జరిగింది. వీరు ఇంకా ఇళ్లకు చేరుకోకపోవడంతో అందులో ఎంత మొత్తం చోరీ జరిగిందనే అంశంపై స్పష్టత రాలేదు. ఘటన స్థలంలో డాగ్ స్క్వాడ్తో తనిఖీలు చేశారు. ఈ చోరీ వెనుక తెలిసిన వారి హస్తం ఉందా? లేక రాటుదేలిన దొంగల ముఠా పనా అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
పొన్నాల ఇంట భారీ చోరీ
హైదరాబాద్, సాక్షి: మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ఇంట్లో చోరీ జరిగింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. లక్షన్నర నగదుతో పాటు భారీగా అభరణాలు దొంగలు దోచుకెళ్లారు. ఫిలిం నగర్ పోలీసులకు ఈ ఘటనపై పొన్నాల సతీమణి అరుణాదేవి ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
తిరుమల: బంగారు బిస్కెట్ చోరీ ఘటన కీలక మలుపు
తిరుమల: తిరుమల (Tirumala) పరకామణిలో బంగారు బిస్కెట్ (Gold biscuit) చోరీ ఘటన కీలక మలుపు తిరిగింది. ఇటీవల 100 గ్రాముల బంగారు బిస్కెట్ దొంగలిస్తూ పట్టుబడిన నిందితుడిని తిరుమల వన్టౌన్ పోలీసులు తమదైన శైలిలో విచారణ చేపట్టడంతో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. తిరుపతికి చెందిన వీరిశెట్టి పెంచలయ్య శ్రీవారి పరకామణిలో అగ్రిగోస్ కంపెనీ ద్వారా కాంట్రాక్ట్ ఉద్యోగిగా రెండేళ్ల నుంచి పనిచేస్తున్నారు.ఇతను తొందరగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో ఏడాదిగా పరకామణిలోని గోల్డ్ స్టోరేజ్ గదిలో ఉంచే బంగారు వస్తువులను దొంగలిస్తూ వస్తున్నాడు. ఈ మేరకు అతనిపై నిఘా ఉంచగా.. ఈనెల 11న మధ్యాహ్నం గోల్డ్ స్టోరేజ్ గదిలో ఉన్న 100 గ్రాముల బంగారు బిస్కెట్ను దొంగలించి దానిని ట్రాలీకి ఉన్న పైపుల్లో దాచిపెట్టాడు. తనిఖీ సమయంలో టీటీడీ భద్రతా సిబ్బంది గుర్తించడంతో పెంచలయ్య పరారయ్యాడు.ఈ విషయమై టీటీడీ విజిలెన్స్ సిబ్బంది తిరుమల వన్టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితుడిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారించారు. విచారణలో మొత్తం 555 గ్రాముల బంగారు బిస్కెట్లు, బంగారు ఆభరణాలు మొత్తం 655 గ్రాములు, 157 గ్రాముల వెండి వస్తువులను స్వా«దీనం చేసుకున్నారు.ఇదీ చదవండి: అన్నదాత ఇంట కానరాని సంక్రాంతి -
కేరళలో చోరీ..సికింద్రాబాద్లో షెల్టర్!
సాక్షి, సిటీబ్యూరో: కేరళలోని తిరునల్వేలి జిల్లా మూలక్రాయ్పట్టిలో ఉన్న జ్యువెలరీ దుకాణంలో రెండు కేజీలకు పైగా బంగారు ఆభరణాలు చోరీ చేసి, నాలుగున్నర నెలలుగా పరారీలో ఉన్న రామకృష్ణన్ను అక్కడి పోలీసులు శనివారం సికింద్రాబాద్లో అరెస్టు చేశారు. విచారణలో భాగంగా ఆ సొత్తును తాను తల్లి మీనాక్షి వద్దే ఉంచానని చెప్పాడు. దీంతో ప్రత్యేక బృందం తిరునల్వేలి సమీపంలోని రెట్టార్కులం గ్రామంలోని వారి ఇంటిపై దాడి చేసి సొత్తు స్వా«దీనం చేసుకున్నారు. ఈ అవమానాన్ని తట్టుకోలేక మీనాక్షి ఆదివారం ఉదయం ఆత్మహత్య చేసుకుంది. అక్కడ చోరీ చేసి సిటీకి వచ్చి... మూలక్రాయ్పట్టికి చెందిన వి.రెహ్మాన్ అక్కడే కొన్నేళ్లుగా జ్యువెలరీ దుకాణం నిర్వహిస్తున్నారు. ఆ సమీపంలోని రెట్టార్కులం గ్రామానికి చెందిన రామకృష్ణన్ ప్రైవేట్ ఉద్యోగి. జల్సాలకు అలవాటుపడిన ఇతగాడు కొన్నేళ్లుగా తిరునల్వేలి చుట్టుపక్కల ప్రాంతాల్లో చిన్న చిన్న దొంగతనాలు చేస్తున్నాడు. ఇప్పటి వరకు పట్టబడకపోవడంతో పోలీసు రికార్డుల్లోకి ఎక్కలేదు. గత ఏడాది ఆగస్టులో ఇతడి కన్ను రెహా్మన్ నిర్వహిస్తున్న జ్యువెలరీ దుకాణంపై పడింది. ఆ నెల 22 రాత్రి షెల్డర్ పగులకొట్టి లోపలకు ప్రవేశించిన రామకృష్ణన్ 2.22 కేజీల బంగారం, రూ.3 లక్షల నగదు తస్కరించాడు. ఆ సొత్తును బయటకు తీయకుండా దాచి ఉంచి, కొన్నాళ్లు తన స్వస్థలానికి దూరంగా ఉంటే పోలీసులకు చిక్కనని భావించాడు. స్నేహితుడిది అంటూ తల్లికి ఇచ్చు... మర్నాడు దుకాణం తెరిచిన వెంటనే కనిపించిన సీన్తో తన దుకాణంలో జరిగిన చోరీ విషయం రెహా్మన్ గుర్తించాడు. దీనిపై మూలక్రాయ్పట్టి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. దర్యాప్తు కోసం తిరునల్వేలి ఎస్పీ నేతృత్వంలో తొమ్మిది ప్రత్యేక బృందాలు ఏర్పడ్డాయి. గుర్తించిన జ్యువెలరీ దుకాణం నుంచి తస్కరించిన నగదు తన వద్ద ఉంచుకున్న రామకృష్ణన్ బంగారం మాత్రం నేర్పుగా ప్యాక్ చేశాడు. రెట్టార్కులంలోని తల్లికి దీన్ని ఇచ్చి ఇంట్లో ఉంచాలని సూచించాడు. దుబాయ్ వెళ్తున్న తన స్నేహితుడు కొన్ని విలువైన వస్తువులు ప్యాక్ చేసి, భద్రపరచాలని ఇచ్చాడంటూ ఆమెను నమ్మించాడు. నగదుతో గత ఏడాది ఆగస్టు 23న కేరళ నుంచి హైదరాబాద్ చేరుకున్నాడు. హో టళ్లలో బస, ఖరీదైన మద్యం, ఆహారం, జల్సాలతో మూడు నెలల్లోనే రూ.3 లక్షలు ఖర్చు చేసేశాడు. నిర్మాణం వద్ద కాపలాదారుడిగా పని... దీంతో సికింద్రాబాద్లోని ఓ నిర్మాణం వద్ద కాపలాదారుడిగా ప్రైవేట్ ఉద్యోగంలో చేరాడు. కనీసం ఏడాది పాటు ఇక్కడ తలదాచుకుని ఆపై స్వస్థలానికి వెళ్లాలని భావించాడు. ఆ తర్వాత తల్లి వద్ద ఉన్న సొత్తును విక్రయించి సొమ్ము చేసుకోవాలని అనుకున్నాడు. సికింద్రాబాద్లో కొత్త ఫోన్ నెంబర్ తీసుకున్న రామకృష్ణన్ దాన్ని వినియోగించి తల్లి మీనాక్షితో మాట్లాడటం మొదలెట్టాడు. మూలక్రాయ్పట్టి చోరీ కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసు బృందాలు సీసీ కెమెరాల్లో నమోదైన దృశ్యాల ఆధారంగా రామకృష్ణన్ను నిందితుడిగా గుర్తించాయి. అయితే అతడి ఆచూకీ కోసం చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో తల్లి ఫోన్పై నిఘా ఉంచాయి. ఆమెకు సికింద్రాబాద్లో ఉన్న నెంబర్ నుంచి ఫోన్లు వస్తున్నట్లు గుర్తించాయి. దీంతో శనివారం ఇక్కడకు వచి్చన ఓ స్పెషల్ టీమ్ రామకృష్ణన్ను పట్టుకుంది. ప్రాథమిక విచారణలోనే అతగాడు విషయాలన్నీ బయటపెట్టాడు.తీవ్ర అవమానంగా భావించిన మీనాక్షి.. నిందితుడిని తీసుకుని కేరళ బయలుదేరిన పోలీసులు జ్యువెలరీ దుకాణంలో చోరీ చేసిన సొత్తు అతడి తల్లి వద్ద ఉందనే విషయాన్ని అక్కడి టీమ్కు చెప్పారు. దీంతో ఓ బృందం ఆదివారం ఉదయం రెట్టార్కులం గ్రామంలోని రామకృష్ణన్ ఇంట్లో దాడి చేసి 2.22 కేజీల బంగారం స్వాధీనం చేసుకున్నారు. ఈ పరిణామంతోనే తన కుమారుడు దొంగగా మారాడనే విషయం మీనాక్షికి తెలిసింది. దీనికి తోడు గ్రామంలో అందరూ చూస్తుండగా పోలీసులు తమ ఇంట్లో సోదాలు చేయడం, చోరీ బంగారం రికవరీ చేయడాన్ని తీవ్ర అవమానంగా భావించింది. దీంతో పోలీసులు వెళ్లి కొద్దిసేపటిలో ఇంట్లో ఫ్యాన్కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పోలీసుస్టేషన్కు వచ్చి తిరిగి వెళ్లిన ఆమె భర్త ఈ విషయం గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ‘సోమవారం రామకృష్ణన్ను రెట్టార్కులం తీసుకువెళ్లి మీనాక్షి అంత్యక్రియలు పూర్తి చేయించాం. ఆపై కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించాం. అతడు ఇలాంటి మరికొన్ని నేరాలు చేసినట్లు అనుమానం ఉంది. కస్టడీలోకి తీసుకుని ఆ కోణంలో విచారిస్తాం’ అని తిరునల్వేలికి చెందిన ఓ ఉన్నతాధికారి ‘సాక్షి’కి ఫోన్ ద్వారా తెలిపారు.తిరునల్వేలిలో జ్యువెలరీ దుకాణాన్ని దోచేసిన రామకృష్ణన్ గత ఏడాది ఆగస్టులో చోటు చేసుకున్న ఈ భారీ దొంగతనం సొత్తు తల్లికి ఇచ్చి నగరానికి వచ్చి ప్రైవేట్ ఉద్యోగిగా మకాం సాంకేతిక ఆధారాలతో నిందితుడిని పట్టుకున్న అక్కడి కాప్స్ అతడి ఇంటి నుంచి సొత్తు సీజ్, అవమానంతో తల్లి ఆత్మహత్య -
విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్!
-
నేరాల్లో మరో కోణం!
సాక్షి, అమరావతి /హైదరాబాద్: చిల్లర దొంగతనాలు మొదలు రూ.కోట్లు కాజేసిన సైబర్ కేటుగాళ్ల ఉదంతాల వరకు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ ఏడాది కాలంలో వివిధ నేరాలు చోటుచేసుకున్నాయి. అందుకు సంబంధించి బోలెడు ఎఫ్ఐఆర్లు సైతం నమోదయ్యాయి. కానీ వాటిలో కొన్ని విచిత్రమైన కేసులు పోలీసులను ఆశ్చర్యపరిచాయి. ఇంతకీ ఆ విచిత్ర కేసులేమిటంటే.. సైనేడ్ హత్యలుగుంటూరు జిల్లాలో ఓ తల్లీ కూతురు, వారి స్నేహితురాలు పాల్పడ్డ సైనేడ్ హత్యలు సంచలనం రేపాయి. ఈ ఏడాది సెప్టెంబరులో నాగూర్ బి అనే మహిళ అనుమానాస్పద మృతి కేసు దర్యాప్తుతో మొత్తం కుట్ర బయటపడింది. తెనాలికి చెందిన ముడియా రమణమ్మ, ఆమె కూతురు వెంకటేశ్వరి, వారి స్నేహితురాలు గునగప్ప రజినీ ముందస్తు పన్నాగంతో నాగూర్బీ అనే మహిళతో పరిచయం పెంచుకున్నారు. ఆమె బంగారం కాజేయాలని భావించారు.నాగూర్బీని నమ్మించి ఆటోలో ఓ నిర్మానుష్య ప్రదేశానికి తీసుకువెళ్లారు. దారిలో ఆటో డ్రైవర్తో బ్రీజర్ కొనిపించారు. ఆ బ్రీజర్లో సైనేడ్ కలిపి నాగూర్బీతో బలవంతంగా తాగించి హత్య చేశారు. ఆమె ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలను కాజేశారు. పోలీసుల దర్యాప్తులో ఈ ముఠా అంతకుముందు కూడా ఇదే రీతిలో చేసిన హత్యలు కూడా బయటపడ్డాయి. నాగమ్మ అనే మహిళ నుంచి వెంకటేశ్వరి రూ.20 వేలు అప్పు తీసుకుంది. ఆ అప్పును ఎగవేసేందుకు సైనేడ్ కలిపిన కూల్ డ్రింక్ తాగించి నాగమ్మను హత్య చేసింది. 2022లో వెంకటేశ్వరి తన అత్త సుబ్బలక్ష్మిని కూడా ఇలానే సైనేడ్ కలిపిన కూల్ డ్రింక్ తాగించి హత్య చేసింది. తెనాలికి చెందిన మోషే అనే వ్యక్తి తన భార్యను తీవ్రంగా వేధించేవాడు. అతని ఇన్సూరెన్స్, పెన్షన్ డబ్బులు పంచుకోవాలనే ఒప్పందంతో రమణమ్మ, వెంకటేశ్వరి.. మోషే భార్యతో కలసి అతడిని హత్య చేశారు. రమణమ్మ, వెంకటేశ్వరి, రజినీ, ఆటో డ్రైవర్తోపాటు సైనేడ్ విక్రయించిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.దొంగ నోట్లు ఆశ చూపి..‘రూ.లక్ష ఇస్తే రూ.3 లక్షల దొంగనోట్లు ఇస్తాం’ అని ఆశ చూపించి స్నేహితుడిని హత్య చేసిన ఉదంతం కర్నూలు జిల్లాలో వెలుగు చూసింది. కర్నూలు జిల్లా ఆస్పరిలో పెంటయ్య అనే రైతు అప్పుల పాలయ్యాడు. తన పొలాన్ని రూ.17.50 లక్షలకు విక్రయించాడు. ఆ సొమ్మును కాజేయాలని అతని స్నేహితులు బోడిగుండ నరసింహుడు, హనుమంతు భావించారు. ‘రూ.లక్ష ఇస్తే రూ.3 లక్షల దొంగనోట్లు ఇస్తాం... దాంతో నీ అప్పులన్నీ తీరిపోతాయి’ అని ఆశ చూపించారు. డబ్బులు పట్టుకుని ఆలూరు మండలం హళేబీడుకు రమ్మన్నారు. వారి మాటలు నమ్మిన పెంటయ్య రూ.7.50 లక్షలు తీసుకుని వెళ్లారు.అక్కడ స్నేహితులు ఆయనతో సైనైడ్ కలిపిన మద్యాన్ని బలవంతంగా తాగించి హత్య చేశారు. పెంటయ్య మృతదేహాన్ని సమీపంలోని పంపయ్య ఆచారి అనే వ్యక్తి పొలంలో పూడ్చి పెట్టారు. అందుకుగాను ఆచారికి కొంత సొమ్ము ముట్టజెబుతామన్నారు. రెండు రోజుల తర్వాత దుర్వాసన వస్తుండటంతో బోడిగుండ నరసింహుడు, హనుమంతు, పంపయ్య ఆచారీలు ఆ మృతదేహాన్ని అక్కడి నుంచి ఆటోలో ఆస్పరి మండలంలోని చిన్న హోతూరు వంక వద్దకు తీసుకెళ్లి ముళ్ల పొదల్లో పడేసి వెళ్లారు. మృతదేహాన్ని సమీప గ్రామస్తులు గుర్తించడంతో పోలీసులు కేసు నమోదైంది. బోడిగుండ నరసింహుడు, హనుమంతు, పంపయ్య ఆచారీలను అరెస్ట్ చేసి జైలుకు పంపారు.డామిట్.. కథ అడ్డం తిరిగింది!వదిన ఆస్తిని కాజేయడం కోసం భీమవరంలో ఓ వ్యక్తి పన్నిన ‘మృతదేహం పార్సిల్’ పన్నాగం విస్మయ పరిచింది. పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ల మండలానికి చెందిన శ్రీధర్ వర్మకు ఇద్దరు భార్యలతోపాటు ఓ మహిళతో వివాహేతర సంబంధం ఉంది. తన రెండో భార్య రేవతి తల్లిదండ్రుల ఆస్తిపై అతను కన్నేశాడు. ఆ ఆస్తిలో తన రెండో భార్య అక్కకు కూడా వాటా ఉంది. దాంతో ఆమె వాటాను కూడా దక్కించుకోవడం కోసం ఓ ఎత్తుగడ వేశాడు. ఆమె (వదిన) నిర్మిస్తున్న ఇంటి కోసం రెండుసార్లు క్షత్రియ ఫౌండేషన్ పేరుతో నిర్మాణ సామగ్రిని పంపించాడు. మూడోసారి నిర్మాణ సామగ్రి పేరుతో ఓ మృతదేహాన్ని పార్సిల్ చేసి పంపాడు. అందుకోసం తన ప్రియురాలితో కలసి తన గ్రామానికి చెందిన మద్యానికి బానిసైన యువకుడిని హత్య చేశాడు.అతని మృతదేహాన్ని తన వదిన ఇంటికి పార్సిల్ పంపాడు. రూ.1.30 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆ పార్సిల్లో ఓ లేఖ రాసి పెట్టాడు. ఆ పార్సిల్ చూడగానే వదిన భయపడి తనకు ఫోన్ చేసి పిలుస్తుందని.. ఆమెకు సహకరించినట్టుగా నటించి రూ.1.30 కోట్లు సర్దుబాటు పేరుతో ఆమె ఆస్తిని దక్కించుకోవాలన్నది శ్రీధర్ వర్మ పన్నాగం. అయితే తీవ్ర ఆందోళన చెందిన ఆమె వెంటనే పోలీసులకు సమాచారం అందించింది. దీంతో మొత్తం కుట్ర బట్టబయలైంది. కాగా, ఆస్తి మొత్తం దక్కాక ఇద్దరు భార్యలను కూడా వదిలించుకుని ప్రియురాలు సుష్మాతో ఉడాయించాలని శ్రీధర్ వర్మ భావించాడు. దీంతో శ్రీధర్ వర్మ, అతని రెండో భార్య రేవతి, ప్రియురాలు సుష్మాలను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు పంపారు.మద్యంపై మక్కువతో.. పనిచేస్తున్న సంస్థలకు సున్నం పెట్టే వాళ్లు.. అన్నం పెట్టిన ఇంట్లోనే కన్నం వేసిన వాళ్ల గురించి అప్పుడప్పుడూ చూస్తూనే ఉంటాం. సాధారణంగా ఆయా నేరాల్లో సొమ్ము కాజేయడమే నిందితుల ప్రధాన ఉద్దేశంగా ఉంటుంది. కానీ జూబ్లీహిల్స్ రోడ్ నం.10లోని ఆర్యూ పబ్లో పనిచేసే వినీత్కుమార్ అనే సెక్యూరిటీ గార్డు వెరైటీ చోరీకి పాల్పడ్డాడు. ఖరీదైన విదేశీ మద్యం తాగడం కోసం ఇద్దరు స్నేహితులతో కలిసి అర్ధరాత్రి దాటాక పబ్లోకి ప్రవేశించి రాయల్ సెల్యూట్, చివాస్ రీగల్, మొహిట్ చాన్ దాన్ బాటిళ్లను ఎత్తుకెళ్లాడు. పనిలో పనిగా పారిపోవడానికి ఉపయోగపడుతుందని రూ.2 లక్షల నగదు కూడా కొట్టేశాడు.మాస్టార్కు ఎదురైన ప్రేమ వేధింపులుబస్టాప్ లాంటి ప్రదేశాల్లో రోడ్సైడ్ రోమియోల ఆగడాల గురించి.. విద్యాబుద్ధులు నేర్పాల్సిన గురువులే కీచకులుగా మారిన ఉదంతాల గురించి అప్పుడప్పుడూ వింటుంటాం. కానీ హైదరాబాద్ అశోక్నగర్లోని ఓ కోచింగ్ సెంటర్లో ఫ్యాకల్టీగా పనిచేస్తున్న ఓ గురువుపై మనసు పారేసుకున్న ఓ యువతి తన ప్రేమను నిరాకరించాడన్న కోపంతో ఆయనపై క్షక్షగట్టింది. లెక్చరర్తోపాటు ఆయన కుమార్తె ఫొటోలను అసభ్యంగా మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేసింది. దీనిపై బాధితుడు సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించడంతో ఆ యువతి చివరకు జైలుపాలైంది.హుస్సేన్సాగర్లో ‘90 ఎంఎల్’స్టోరీసాధారణంగా ప్రేమ వ్యవహారాలు, కుటుంబ కలహాలు, ఆర్థిక సమస్యల కారణంగా ఆత్మహత్యలు చేసుకుంటుంటారు. కానీ ఓ మందుబాబు మాత్రం మద్యం మత్తులో హుస్సేన్సాగర్లోకి దిగి ‘చుక్క’కావాలంటూ పోలీసులకు చుక్కలు చూపించాడు. నడుము లోతు నీళ్లున్న ప్రాంతంలో అతడు నిల్చుని ఉండటాన్ని చూసిన పర్యాటకులు ఆత్మహత్యాయత్నం చేసుకుంటున్నాడనుకొని పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ట్యాంక్బండ్ వద్దకు చేరుకున్న ఓ కానిస్టేబుల్ నీటిలోకి తాడు విసిరి, దాన్ని పట్టుకుని పైకి రావాల్సిందిగా యువకుడిని కోరాడు. కానీ అందుకు నిరాకరించిన మందుబాబు.. తనకు ‘90 ఎంఎల్’ ఇస్తేనే బయటకు వస్తానంటూ మొండికేశాడు. చివరకు గంటన్నరపాటు సాగిన డ్రామా అనంతరం పోలీసులు అతన్ని బయటకు రప్పించారు.‘అతడి’పైనా అత్యాచార యత్నంయువతులు, మహిళలపై అత్యాచారాలు, అత్యాచారయత్నాలకు సంబంధించిన కేసులు నేటికీ నమోదవుతుండటం చాలవన్నట్లు ఇద్దరు మహిళలు ఓ పురుషుడిపై అత్యాచారయత్నం చేయడం, నగ్నంగా వీడియోలు తీసి అతన్ని బెదిరించడం సనత్నగర్ ఠాణా పరిధిలో చోటుచేసుకుంది. సదరు వ్యక్తికి మసాజ్ థెరపిస్టుగా పరిచయమైన ఓ మహిళ.. భరత్నగర్ కాలనీకి చెందిన మరో మహిళను పరిచయం చేసింది. ఇద్దరూ కలిసి అతన్ని భరత్నగర్ కాలనీలోని మహిళ ఇంటికి తీసుకెళ్లి మసాజ్ పేరుతో దుస్తులు విప్పించి అత్యాచారానికి యత్నించారు. అతడు నిరాకరించడంతో నగ్న వీడియోలను తీసి సోషల్ మీడియాలో పెడతామని బెదిరించి కొంత డబ్బు గుంజారు. ఆపై ఇంకా డబ్బివ్వాలని డిమాండ్ చేయడంతో ఈ ‘లైంగిక వేధింపులు’తట్టుకోలేక బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. దీంతో నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.ఆమె అలా... అతడు ఇలాభిన్న మనస్తత్వాలుగల భార్యభర్తల్ని మనం చూస్తూనే ఉంటాం. హైదరాబాద్ లోని రామాంతపూర్లో నివసించే ఓ ‘విపరీత’జంట వ్యవహారం ఉప్పల్ ఠాణా అధికారుల దృష్టికి వచ్చింది. గతంలో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో హౌస్ కీపర్గా పనిచేసిన మహిళ మద్యానికి బానిసగా మారింది. నిత్యం మద్యం తాగి రోడ్లపై న్యూసెన్స్ చేస్తూ పోలీసులకు చిక్కేది. అంతటితో ఆగకుండా ఏకంగా పోలీసుస్టేషన్కే వచ్చి న్యూసెన్స్ చేసి వెళ్తుండటం పోలీసులకు తలనొప్పిగా మారింది. ఆమె భర్త కూడా తక్కువేం కాదు.. చుట్టుపక్కల కాలనీల్లోని ఇళ్ల గోడలు దూకి చెప్పులు, బూట్లు చోరీ చేసేవాడు. సీసీ కెమెరాల ఆధారంతో ఒకరోజు అతని ఇంటిపై దాడి చేసిన స్థానికులు వందల జతల పాదరక్షలు గుర్తించి పోలీసులకు అప్పగించారు. -
కొట్టేస్తే కొట్టేశారు గానీ.. పేదలకు పంచండి
లండన్: బ్రిటన్లోని యార్క్ నగరంలో క్రిస్మస్ మార్కెట్లో అమ్మడానికి రుచికరమైన పలు రకాల తాజా తినుబండారాలతో వ్యాన్ సిద్ధంగా ఉంది. వ్యాన్ను వాణిజ్యసముదాయానికి తరలించేలోపు దానిని ఎవరో దొంగలించారు. విషయం తెల్సుకున్న దాని యజమాని, పాకశాస్త్ర ప్రవీణుడు టామీ బ్యాంక్స్ ఒకింత బాధపడ్డారు. ప్రేమానురాగాలను కలిపి వంటచేసే చెఫ్లకు తాము వండిన ఆహార పదార్ధాలను ఇతరులకు వడ్డించడంలోనే ఆనందం, తృప్తి ఉంటాయి. టామీకి సైతం ఆ ఆనందమే ఎక్కువ. అందుకే తాను తయారుచేసిన పదార్థాలను దొంగలు ఎక్కడ పడేస్తారోననే బాధ ఎక్కువైంది. అందుకే వాటిని నేలపాలు చేయకుండా క్షుద్భాదతో తల్లడిల్లే పేదలకు పంచాలని బహిరంగ ప్రకటన చేశారు. బ్యాంక్స్కు యార్క్షైర్ కౌంటీలో ఒక పబ్తోపాటు రెండు రెస్టారెంట్లు ఉన్నాయి. స్వతహాగా వంటవాడైన బ్యాంక్స్ తన రెస్టారెంట్లలో కొన్ని ప్రత్యేకమైన ఆహారపదార్థాలను స్వయంగా తయారుచేస్తారు. తమ వ్యాన్ దొంగతనంపై తాజాగా ఆయన ఒక వీడియోను ఇన్స్టా గ్రామ్లో పోస్ట్చేశారు. ‘‘ చిన్న వ్యాన్లో ఖరీదైన తినుబండారాలున్నాయి. స్టీక్, ఏల్, బీర్లు, టర్కీ, బట్టర్నట్ స్క్వాష్ పై, కేక్లు ఉన్నాయి. వాటి మొత్తం విలువ ఏకంగా రూ. 27,00,000 పైమాటే. వ్యాను అప్పనంగా దొరికిందన్న ఆనందంలో ఇంత ఖరీదైన ఆహారపదార్ధాలను పోతూపోతూ దారిలో పడేయకండి. పేదలకు పంచి వారి ఆకలి మంటలు తీర్చండి’’ అని వేడుకున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. ‘‘ఆహారం విలువ తెలిసిన నిజమైన చెఫ్’ అంటూ బ్యాంక్స్ను కొందరు నెటిజన్లు ప్రశంసల్లో ముంచెత్తారు. బ్రిటన్లో సర్వ్ చేయడానికి సిద్ధంగా ఉన్న ఆహారపదార్ధాల చోరీలో ఇది తాజా ఘటనగా పేరొందింది. రెండు నెలల క్రితం లండన్లోని నీల్స్ యార్డ్ పాల ఉత్పత్తుల కేంద్రం వద్ద ఇలాంటి భారీ చోరీ జరిగింది. ఫ్రాన్స్కు చెందిన ఒక భారీ రిటైర్ సంస్థకు హోల్సేల్ పంపిణీదారుగా ప్రకటించుకుంటూ ఒక దొంగ ఈ డైరీకి వచ్చి ఏకంగా 48,488 పౌండ్ల బరువైన చీజ్ను దర్జాగా పట్టుకెళ్లిపోయాడు. దీని మార్కెట్ విలువ ఏకంగా రూ.3.30 కోట్లు. బ్రిటిష్, అంతర్జాతీయ పోలీసులు వేట మొదలెట్టి ఆ 63 ఏళ్ల పెద్దాయనను పట్టుకున్నాసరే చీజ్ జాడను మాత్రం కనిపెట్టలేకపోయారు. -
కూకట్పల్లిలో భారీ చోరీ
మూసాపేట: కూకట్పల్లిలోని ఓ ఇంట్లో భారీ చోరీ జరిగింది. రూ.కోటి విలువైన బంగారు ఆభరణాలను దొంగలు అపహరించారు. పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం..టంగుటూరుకు చెందిన మధుసూదన్రావు, సంధ్యారాణి దంపతులు కూకట్పల్లి జయానగర్లోని శ్రీ సీతా ప్యాలెస్ అపార్టుమెంట్లో నివాసం ఉంటున్నారు. కొద్దిరోజులుగా వీరు అవసరాల నిమిత్తం వేరే ప్రాంతంలో ఉంటున్నారు. గురువారం సాయంత్రం మధుసూదన్రావు ఇంటికి వచ్చి దుస్తులు తీసుకొని వెళ్లిపోయాడు. శుక్రవారం ఉదయం డ్రైవర్ ఫోన్చేసి ఇంటి తలుపు తీసి ఉందని ఫోన్ చేసి చెప్పగా వెంటనే ఇంటికి వచ్చి చూసిన మధుసూదన్రావు దొంగతనం జరిగిందని గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు.గురువారం రాత్రి సుమారు 11.47 గంటల ప్రాంతంలో ఇద్దరు వ్యక్తులు మెట్ల మార్గంలో ఫ్లాట్లోకి వెళ్లినట్లు సీసీకెమెరాలో నమోదైంది. దొంగలు బెడ్రూమ్లోని డ్రెస్సింగ్ టేబుల్ అద్దం వెనుక ఉన్న బీరువా తాళాలు తీసుకొని..బీరువాలో ఉన్న సుమారు కోటి రూపాయల విలువైన బంగారు ఆభరణాలను దోచుకెళ్లారు. 82 తులాల బంగారు నగలు, రూ.10 లక్షల విలువ చేసి డైమండ్ నెక్లెస్, రూ.2 లక్షల నగదు ఎత్తుకెళ్లారు. శుక్రవారం ఉదయం 7.30 ప్రాంతంలో వాచ్మెన్ మొక్కలకు నీరు పోసేందుకు వెళ్లగా..ఫ్లాట్ డోర్ తెరిచి ఉందని గమనించి డ్రైవర్కు తెలియజేశాడు. వెంటనే డ్రైవర్ యజమానికి తెలపటంతో వారు వచ్చి చూసుకోగా బంగారు నగలు దొంగతనం అయినట్లు గమనించారు. కాగా డ్రెస్సింగ్ టేబుల్ అద్దం వెనుక ఉన్న తాళాన్ని తీసుకొని దొంగతనం చేయటంతో తెలిసిన వారి పనై ఉండవచ్చని బాధితులు, పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
ఓ దొంగతనం.. ఆపై పంచాయితీ..
వట్పల్లి (అందోల్): దొంగతనం విషయంలో పంచాయితీకి పిలవడంతో తల్లీకుమారుడు ఆత్మహత్యా యత్నం చేశారు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా అందోల్ మండలంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. సంగారెడ్డికి చెందిన ఓ వ్యక్తి అందోలు మండలం చింతకుంట గ్రామంలో జరిగిన విందుకు ఆదివారం టాటా ఏస్ వాహనంలో వచ్చాడు. సోమవారం తిరిగి వెళ్లిపోదామని నిర్ణయించుకొని వాహనాన్ని గ్రామంలోని ఖాళీ ప్రదేశంలో నిలిపాడు. అదే గ్రామానికి చెందిన తాగుడుకు బానిసైన వడ్ల శ్యామ్ (21) ఆ వాహనాన్ని అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఎత్తుకెళ్లాడు. కౌడిపల్లి మండలం బుజరంపేట గ్రామ శివారుకు వెళ్లగానే వాహనం కాల్వలో ఇరుక్కుపోయింది. దానిని బయటకు తీసే ప్రయత్నంలో భారీ శబ్ధం రావడంతో చుట్టుపక్కల వారు లేచి దొంగ దొంగ అని అరిచారు. దీంతో శ్యామ్ వెంటనే సమీపంలోని ఓ బైక్ను తీసుకొని అక్కడి నుంచి పరారయ్యారు. బుజరంపేట గ్రామస్తులు దుంపలకుంటలోని సీసీ ఫుటేజీని పరిశీలించి వడ్ల శ్యామ్ను గుర్తించారు. గ్రామ పెద్దలతో సమావేశమై శ్యామ్ను తమకు అప్పగించాలని, లేకపోతే వాహనాన్ని ఇచ్చేది లేదని హెచ్చరించారు. అనంతరం శ్యామ్ తండ్రి యాదయ్యను పిలిపించి జరిగిన విషయాన్ని వివరించారు. ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం శ్యామ్ అతడి తల్లిదండ్రులు యాదయ్య, బాలమణి (46), చిన్నమ్మ మమత బుజరంపేటకు పంచాయితీకి వెళ్లేందుకు నిర్ణయించుకున్నారు. తండ్రి, చిన్నమ్మ బస్లో బయలుదేరగా, శ్యామ్ తల్లి బాలమణితో బైక్పై బయలుదేరాడు. చింతకుంట బ్రిడ్జిపైకి రాగానే బైక్ను ఆపి మొదట శ్యామ్ మంజీరా నీళ్లలోకి దూకగా, అనంతరం తల్లి దూకింది. విషయం తెలుసుకున్న జోగిపేట, చిలప్చెడ్ పోలీసులు వేర్వేరుగా గాలింపు చర్యలు చేపట్టినా వారి ఆచూకీ లభ్యం కాలేదు. -
మంత్రి శ్రీధర్బాబు నివాసంలో సెల్ఫోన్ చోరీ
బంజారాహిల్స్: బంజారాహిల్స్ రోడ్డు నెంబర్.12లోని మినిస్టర్ క్వార్టర్స్లో ఉంటున్న మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు నివాసంలో సెల్ఫోన్ చోరీకి గురైంది. బంజారాహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. బంజారాహిల్స్లోని మంత్రుల నివాస సముదాయంలో క్వార్టర్ నెంబర్–7లో మంత్రి శ్రీధర్బాబు ఉంటున్నారు. గత నెల 31వ తేదీ రాత్రి 9 గంటల ప్రాంతంలో దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని మంత్రి ఇంట్లో ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ పీఏ సతీ‹Ùకుమార్ లక్ష్మీపూజ నిర్వహించాడు. పూజ అనంతరం రాత్రి 9.30 గంటలకు ఆయన ఫోన్ కోసం చూడగా కనిపించలేదు. అన్ని ప్రాంతాలు వెతికినా ఉపయోగం లేకుండా పోయింది. మంత్రి ఇంట్లో పూజలకు ఎంతోమంది అతిథులు వచ్చారని, ఎలా చోరీకి గురైందో తెలియదని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. పూజల్లో నిమగ్నమై ఉండగా గుర్తుతెలియని వ్యక్తులు సెల్ఫోన్ చోరీ చేసి ఉంటారని పేర్కొన్నారు. దీపావళి తర్వాత వారం రోజులుగా తాను విధి నిర్వహణలో బీజీగా ఉన్నానని, దీంతో శనివారం ఫిర్యాదు చేస్తున్నట్లు పేర్కొన్నారు. బంజారాహిల్స్ పోలీసులు ఘటనా స్థలంలో వివరాలు సేకరించారు. -
HYD: ట్రావెల్ బస్సులో భారీ చోరీ.. పోలీస్స్టేషన్కు ప్రయాణికులు
సాక్షి,రంగారెడ్డి : ఏపీలోని మండపేట నుంచి హైదరాబాద్ వచ్చిన ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో శుక్రవారం(నవంబర్ 8) తెల్లవారుజామున భారీ చోరి జరిగింది. బస్సులో ప్రయాణిస్తున్న ఓ మహిళా బ్యాగులో నుంచి రూ.15లక్షల విలువైన బంగారు ఆభరణలను ఎవరో దొంగిలించారు.తన బ్యాగులో ఉండాల్సిన బంగారం కనిపించలేదని మహిళ చెప్పడంతో తొలుత డ్రైవర్ బస్సును హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీ వద్ద ఆపేశాడు. అనంతరం బస్సును అబ్దుల్లాపూర్మెట్ పోలీసు స్టేషన్కు తరలించాడు.బస్సులో ప్రయాణం చేసిన మొత్తం 40 మంది ప్రయాణికులు ఉదయం 6 గంటల నుంచి అబ్దుల్లాపూర్మెట్ పోలీస్స్టేషన్లోనే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చోరీకి సంబంధించి బాధిత మహిళ ఫిర్యాదుతో అబ్దుల్లాపూర్మెట్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఇదీ చదవండి: మానవ అక్రమ రవాణా కేసులో ఆరుగురికి జీవిత ఖైదు -
ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇంట్లో చోరీ.. విలువైన పత్రాలు మాయం!
సాక్షి, కొమురంభీం జిల్లా: కాగజ్ నగర్ మండలం కోసిని గ్రామంలోని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇంట్లో చోరీ జరిగింది. బీరువా తాళాలు పగులగొట్టి విలువైన పత్రాలు ఎత్తుకెళ్లారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.తన ఇంట్లో జరిగిన చోరీ ఘటనపై ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ స్పందించారు. తెలంగాణలో దోపిడీ దొంగల పాలన నడుస్తుందని మండిపడ్డారు. నిన్న సిర్పూర్-కాగజ్ నగర్ కోసిని గ్రామంలోని తన ఇంట్లో దొంగలు పడ్డారని.. కొన్ని విలువైన డాక్యుమెంట్లు దొచుకోని పోయారని తెలిపారు. దీని వెనక ఉన్న కుట్ర కోణాన్ని కూడా శోధించాల్సిందిగా డీజీపీని ఆయన కోరారు.తెలంగాణ లో దోపిడి దొంగల పాలన నడుస్తున్నది. ఇది ముమ్మాటికీ నిజం. నిన్న సిర్పూర్-కాగజ్ నగర్ కోసిని గ్రామంలోని మా స్వగృహం లో దొంగలు పడ్డారు. కొన్ని విలువైన డాక్యుమెంట్లు దొచుకోని పోయారు.దీని వెనక ఉన్న కుట్ర కోణాన్ని కూడా శోధించాల్సిందిగా @TelanganaDGP గారిని కోరుతున్న.My home in… pic.twitter.com/A5ewLPMzCa— Dr.RS Praveen Kumar (@RSPraveenSwaero) October 31, 2024 -
స్టోక్స్ పాక్ పర్యటనలో ఉన్నవేళ.. కుటుంబానికి భయానక అనుభవం
ఇంగ్లండ్ టెస్టు జట్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ ఇంట్లో భారీ చోరీ జరిగింది. పలు ఆభరణాలతో పాటు విలువైన వస్తువులను దొంగలు ఎత్తుకెళ్లారు. స్టోక్స్ పాకిస్తాన్ పర్యటనలో ఉన్న సమయంలో ఈ ఘటన జరిగింది. ఈ విషయాన్ని ఇంగ్లండ్ సారథి సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు.ముసుగు దొంగలు తన ఇంట్లో ప్రవేశించి దొంగతనానికి పాల్పడ్డారని స్టోక్స్ తెలిపాడు. ఆ సమయంలో తన భార్య, ఇద్దరు పిల్లలు ఇంట్లోనే ఉన్నారని.. అదృష్టవశాత్తూ వారికి ఎలాంటి హానీ జరగలేదన్నాడు. ఈ పని ఎవరు చేశారో తెలియాల్సి ఉందని.. త్వరగా దొంగలను పట్టుకోవడంలో తమకు సహకరించాలని కోరాడు. పాక్ పర్యటనలో ఉన్న సమయంలోఏదేమైనా కష్ట సమయంలో తన కుటుంబానికి పోలీసులు అండగా ఉన్నారని.. వారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపాడు. ఈ మేరకు.. ‘‘అక్టోబరు 17, గురువారం.. ముసుగు ధరించిన కొందరు వ్యక్తులు నార్త్ ఈస్ట్లో గల కాసిల్ ఈడెన్ ఏరియాలో ఉన్న మా ఇంట్లోకి చొరబడ్డారు. నా భార్యా పిల్లలకు భయానక అనుభవంర్యా నగలు, విలువైన వస్తువులు ఎత్తుకుపోయారు. అందులో మా కుటుంబానికి అతి ముఖ్యమైన వస్తువులు కూడా ఉన్నాయి. దొంగలను పట్టుకునేందుకు దయచేసి నాకు సహాయం చేయండి. నిజానికి ఈ దుర్ఘటన జరిగినపుడు నా భార్య, ఇద్దరు చిన్న పిల్లలు ఇంట్లోనే ఉన్నారు. అయితే, వారిపై దొంగలు ఎలాంటి భౌతిక దాడికి పాల్పడలేదు. కానీ.. ఆ సమయంలో వారి మనఃస్థితి ఎంత ఆందోళనకరంగా ఉంటుందో.. దాని ప్రభావం ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.అందుకే ఫొటోలు షేర్ చేస్తున్నానా ఇంట్లో చోరీకి గురైన వస్తువుల ఫొటోలు విడుదల చేస్తున్నాను. వాటిని ఎవరైనా సులువుగా గుర్తించవచ్చు. తద్వారా దొంగలను పట్టుకునే వీలు కలుగుతుంది. మాకెంతో ముఖ్యమైన వస్తువులు పోయినప్పటికీ.. కేవలం వాటిని రికవరీ చేసుకోవాలనే ఉద్దేశంతో మాత్రమే ఈ పోస్టు పెట్టడం లేదు.ఈ పని చేసిన దుండగులు ఎవరో కనిపెట్టడం కోసమే వాటి ఫొటోలు షేర్ చేస్తున్నా. విపత్కరకాలంలో మా కుటుంబానికి స్థానిక పోలీసులు అండగా నిలిచారు. వారి మేలు మర్చిపోలేనిది. ఆ దొంగలను పట్టుకునేందుకు మేమంతా తీవ్రం శ్రమిస్తున్నాం’’ అని స్టోక్స్ ఎక్స్ వేదికగా తన ఆవేదనను పంచుకున్నాడు.పాక్ చేతిలో ఘోర ఓటమికాగా మూడు మ్యాచ్ల టెస్టు సిరీస్ ఆడేందుకు స్టోక్స్ ఇటీవల పాకిస్తాన్ పర్యటనకు వెళ్లాడు. గాయం నుంచి పూర్తిగా కోలుకోని కారణంగా తొలి మ్యాచ్కు అతడు దూరంగా ఉన్నాడు. అయితే, ఆ తర్వాత అతడు తిరిగి వచ్చినప్పటికీ ఫలితం లేకపోయింది. తొలి టెస్టులో ఘన విజయం సాధించిన ఇంగ్లండ్.. ఆఖరి రెండు టెస్టుల్లో పాకిస్తాన్ చేతిలో దారుణంగా ఓడిపోయింది. తద్వారా సిరీస్ను 1-2తో కోల్పోయింది.చదవండి: Aus A vs Ind A: రుతు, నితీశ్ డకౌట్.. అభిమన్యు, ఇషాన్ విఫలంpic.twitter.com/1nEmNcrnjQ— Ben Stokes (@benstokes38) October 30, 2024 -
ఇనుప ఖనిజం అక్రమ ఎగుమతి కేసులో కాంగ్రెస్ ఎమ్మెల్యేకు ఏడేళ్ల జైలు
బెంగళూరు: బెళెకెరి నౌకాశ్రయంలోని ఇనుప ఖనిజం దొంగతనం, అక్రమ ఎగుమతి కేసులో కాంగ్రెస్ ఎమ్మెల్యే సతీశ్ కృష్ణ సాయిల్కు ప్రత్యేక కోర్టు ఏడేళ్ల జైలు శిక్షతోపాటు రూ.6 కోట్ల భారీ జరిమానా విధించింది. ప్రజాప్రతినిధులపై కేసులను విచారించే ప్రత్యేక న్యాయస్థానం సాయిల్తోపాటు ఆరుగురికి జైలు శిక్ష, భారీగా జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించింది. శ్రీ మల్లికార్జున షిప్పింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీగా ఉన్న సాయిల్(58) తాజా పరిణామంతో ఎమ్మెల్యే పదవికి అనర్హుడయ్యే అవకాశముంది. బళ్లారి గనిలో అక్రమంగా వెలికి తీసిన ఇనుప ఖనిజాన్ని 2010లో బెళెకెరి పోర్టులో అధికారులు నిల్వ ఉంచారు. దీనిపై కన్నేసిన సాయిల్, మరికొందరు కోట్లాది రూపాయల ఖనిజాన్ని దొంగచాటుగా చైనాకు ఎగుమతి చేశారు. తాజాగా దోషులుగా తేలిన వారిలో ప్రైవేట్ కంపెనీల నిర్వాహకులతోపాటు పోర్టుల డిప్యూటీ కన్జర్వేటర్ మహేశ్ జె బిలియె కూడా ఉన్నారు. ఈ నెల 24వ తేదీన తీర్పు వెలువడిన వెంటనే ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారులు సాయిల్, మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. -
విజిబుల్ పోలీసింగ్తోనే చోరీలకు విరుగుడు
విజిబుల్ పోలీసింగ్పై దృష్టి వరంగల్ జిల్లా నర్సంపేటలో కొద్దిరోజుల క్రితం తాళం వేసిన ఇంట్లో చోరీ జరిగింది. పెద్ద మొత్తంలో నగదు, బంగారం పోయింది. అయితే నిందితులను పట్టుకున్నాం. ఇటీవల వరంగల్ వెస్ట్జోన్ పోలీసులు ఇద్దరు దొంగలను పట్టుకొని వారి నుంచి రూ.22.56 లక్షల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు. అదే సమయంలో చోరీల నివారణకు విజిబుల్ పోలీసింగ్ పెంచుతున్నాం. ఠాణాల వారీగా కూడా సమీక్షిస్తున్నాం. ఎవరైనా విధులు సరిగా నిర్వర్తించకపోతే సదరు సిబ్బందిపై చర్యలు తీసుకుంటాం. – అంబర్ కిశోర్ ఝా, పోలీసు కమిషనర్. వరంగల్ సాక్షి, వరంగల్: ఉమ్మడి వరంగల్ జిల్లాలో విజిబుల్ పోలీసింగ్ను పెంచాల్సిన అవసరం ఏర్పడింది. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు వరంగల్ పోలీసు కమిషనరేట్తో పాటు మహబూబాబాద్, ములుగు, భూపాలపల్లి జిల్లాల్లో నమోదవుతున్న చోరీల సంఖ్య ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది. శాంతిభద్రతల పరిరక్షణలో కీలకమైన ఈ విజిబుల్ పోలీసింగ్లో.. ముఖ్య నగరాలు, పట్టణాలతో పాటు గ్రామాల్లో పోలీసులు, పెట్రోకార్, బ్లూకోల్ట్ సిబ్బంది.. తరచూ పర్యటిస్తూ నిఘా పెంచితే దొంగల్లో భయం పుడుతుంది. అదే సమయంలో ప్రజల్లో భద్రత భావం పెరుగుతుంది. ఇలా విజిబుల్ పోలీసింగ్తో దొంగతనాలతో పాటు నేరాలు తగ్గే అవకాశముంది. సిబ్బంది.. పెట్రోలింగ్ పెరగాలి ఈ ఏడాది జనవరి నుంచి సెప్టెంబర్ వరకు వరంగల్, హనుమకొండ, జనగామ జిల్లాల్లో విస్తరించిన వరంగల్ పోలీసు కమిషనరేట్ పరిధిలో 150 చోరీలు జరిగాయి. మహబూబాబాద్లో 182, ములుగు 131, భూపాలపల్లి 78 చోరీ కేసులు నమోదయ్యా యి. గతేడాదితో పోల్చుకుంటే వీటి సంఖ్య ఎక్కువగా ఉండటం ఆందోళనకరంగా మారింది. కానీ.. చోరీ కేసుల ఛేదనలో కీలకమైన సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్)లో సిబ్బంది కొరత వల్ల కూడా దొంగలు పేట్రేగిపోతున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. డిటాచ్మెంట్ ఇన్స్పెక్టర్ల నియామకం లేకపోవడం కూడా చోరీలు పెరగడానికి కారణంగా కనిపిస్తోంది. ఇంకోవైపు సమయాల్లో ఆయా పోలీసు స్టేషన్ల పరిధిలోని పోలీసులు పెట్రోలింగ్ పూర్తి స్థాయిలో చేయకపోవడం దొంగలకు వరంగా మారిందన్న విమర్శలున్నాయి. ఫ్రెండ్లీ పోలీసింగ్ తరహాలోనే విజిబుల్ పోలీసింగ్ ద్వారానే నేరాలను పూర్తిస్థాయిలో అరికట్టాలన్న పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాలు క్షేత్రస్థాయిలో అంతగా అమలు కాకపోవడంతో దొంగతనాలు పెరిగేందుకు అస్కారం ఏర్పడింది. ఇంకా చాలావరకు చిన్నచిన్న దొంగతనాల కేసులు నమోదు కాలేదన్న విమర్శలున్నాయి. -
HYD: మల్కాజ్గిరిలో సెల్ఫోన్లు మాయం..ఎందుకంటే..
సాక్షి,హైదరాబాద్:మల్కాజ్గిరిలో మొబైల్ దొంగలు హల్చల్ చేశారు. ఆనంద్బాగ్లో పాల కోసం వెళ్లిన వ్యక్తి నుంచి ఫోన్ చోరీ చేశారు. ఈస్ట్ ఆనంద్ బాగ్ లోని మార్కెట్కు వచ్చిన మరో వ్యక్తి నుంచి కూడా సెల్ఫోన్ కొట్టేశారు. ప్రజల దృష్టి మళ్లిస్తూ మొబైల్స్ చోరీ చేస్తున్నారని బాధితులు మాల్కాజ్గిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు.చోరీలపై సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా మాల్కాజ్గిరి పోలీసులు దర్యాప్తు చేస్తున్నరు.ఇదీ చదవండి: బంజారాహిల్స్ పబ్.. ప్రతి దానికి ఓ రేటు -
బంగ్లాలో మోదీ గిఫ్ట్ చోరీ.. భారత్ తీవ్ర స్పందన
ఢిల్లీ: జేశోరేశ్వరి కాళీమాత ఆలయానికి ప్రధాని మోదీ బహూకరించిన కిరీటం చోరీపై తాజాగా భారత విదేశాంగ శాఖ స్పందించింది. జేశోరేశ్వరి కాళీమాత ఆలయానికి ప్రధాని మోదీ బహూకరించిన కిరీటం చోరీకి గురికావడం పట్ల తీవ్రంగా ఖండించింది. కొందరు వ్యక్తులు ఉద్దేశపూర్వకంగానే ఇలాంటి అపవిత్ర చర్యలకు పాల్పడుతున్నారని మండిపడింది.‘‘ఢాకాలోని తంతిబజార్లో పూజా మండపంపై దాడి, జేశోరేశ్వరి కాళీమాత ఆలయంలో చోరీ జరగడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇది చాలా బాధాకరం. బంగ్లాదేశ్లోని హిందువులు సహా మైనారిటీలు, వారి ప్రార్థన మందిరాల భద్రత, మనోభావాలను దృష్టిలో పెట్టుకొని తగిన చర్యలను తీసుకోవాలని ఆ దేశ ప్రభుత్వాన్ని కోరుతున్నాం’’ అని భారత విదేశాంగ శాఖ పేర్కొంది. కాగా, 2021 మార్చిలో బంగ్లాదేశ్లో పర్యటించిన ప్రధాని.. కాళీ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి బంగారు కిరీటాన్ని గిఫ్ట్గా అందించిన సంగతి తెలిసిందే. బంగ్లాలోని సత్ఖీరా జిల్లా ఈశ్వరీపూర్లోని ఈ కాళీ ఆలయం శక్తి పీఠాల్లో ఒకటి. స్థానిక కళాకారులు మూడు వారాల పాటు శ్రమించి దీన్ని తయారుచేశారు.ఇదీ చదవండి: 50 ఏళ్లలో తొలిసారి సహారా ఎడారిలో వరదలు.. ఫోటోలు వైరల్ -
పని చేసిన సంస్థకే కన్నం.. రూ.6 కోట్ల విలువైన నగలతో ఉడాయించిన ఉద్యోగులు
సాక్షి,హైదారాబాద్ : పని చేసిన సంస్థకే కన్నం వేశారు ఉద్యోగులు. రూ.6 కోట్ల విలువైన నగలతో ఉడాయించారు. నగల్ని మాయం చేసిన ప్రబుద్ధుడితో పాటు అతనికి సహకరించిన సిబ్బంది గురించి పోలీసులు ఆరాతీస్తున్నారు. బంజారాహిల్స్ శ్రీ కృష్ణ జ్యువెలర్స్ షోరూంలో భారీ చోరీ జరిగింది. రూ.6 కోట్ల విలువైన బంగారు నగలు మాయమయ్యాయి. అయితే అదే షోరూంలో ప్రస్తుతం, గతంలో పనిచేసిన ఉద్యోగులకు దుర్బుద్ది పుట్టి అందరూ ఓ ముఠాగా ఏర్పడ్డారు. భారీ చోరీకి పాల్పడ్డారు. చోరీ జరిగినప్పటి నుంచి మేనేజర్ సూకేతు షా ఆచూకీ లభ్యం కాకపోవడంతో పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. మేనేజర్ సుకేతు షాతో పాటు ఉదయ్ కుమార్, చింటు, సత్య, అజయ్, టింకు, చంద్ర, శ్రీకాంత్ బబ్బూరిలపై కేసు నమోదు చేసిన బంజారాహిల్స్ పోలీసులు.. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు చర్యల్ని ముమ్మరం చేశారు. కేసులో ట్విస్ట్..మరోవైపు రూ..6 కోట్ల నగల మాయం కేసులో కీలక పాత్రపోషించిన మేనేజర్, తన భర్త సూకేతు షా కనిపించడం లేదంటూ అతని భార్య బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. శ్రీ కృష్ణ జ్యువెలర్స్ మేనేజ్మెంట్ వేధింపుల కారణంగానే తన భర్త అదృశ్యం అయ్యాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. లెటర్తో పాటు,ఓ వీడియోను సైతం పోలీసులకు అందించారు. -
కోర్టుకు హాజరై వెళ్తూ మళ్లీ చోరీ
మంచిర్యాలక్రైం: వివిధ దొంగతనాల కేసులో కోర్టులో హాజరయ్యేందుకు వచ్చి తిరిగివెళ్తూ మరోసారి చోరీకి పాల్పడి పోలీసులకు పట్టుబడ్డారు. మంచిర్యాల జిల్లాలో జరిగిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం ఇస్పెట్ గ్రామానికి చెందిన మాసు అన్నపూర్ణ, రాధ, శనిగరం పూలమ్మ అనే ముగ్గురు మహిళలు గతంలో వరంగల్లోని మట్టెవాడ, బెల్లంపల్లి వన్టౌన్, జమ్మికుంట పోలీసుస్టేషన్ల పరిధిలో దొంగతనాలకు పాల్పడి జైలుకి వెళ్లారు. బెల్లంపల్లి వన్టౌన్ పరిధిలో జరిగిన దొంగతనం కేసులో గత నెల 30న మంచిర్యాల జిల్లా కోర్టుకు హాజరయ్యారు.తిరిగి వెళ్తూ మంచిర్యాలలోని శ్రీవైష్ణవి జువెల్లరీ షాపులో ఆభరణాలు కొనుగోలుదారులుగా వెళ్లారు. అక్కడ వెండిపట్టీలు చూస్తూ రూ.45వేల విలువైన పది జతలు దొంగిలించారు. యజమాని ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేపట్టి మహిళలు దొంగతనానికి పాల్పడినట్లుగా సీసీపుటేజీ ఆధారంగా గుర్తించారు. ప్రత్యేక బృందంతో ఇస్పెట్ గ్రామానికి వెళ్లి ముగ్గురిని అదుపులోకి తీసుకుని పట్టీలను రికవరీ చేశారు. ఈ మేరకు ఈ ముగ్గురిని రిమాండ్కు తరలించినట్లు పోలీసులు మీడియాకు వెల్లడించారు. -
డిప్యూటీ సీఎం ఇంట్లో భారీ చోరీ
బంజారాహిల్స్ (హైదరాబాద్): ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఇంట్లో భారీ చోరీ జరిగింది. ఆయన ఇంట్లో పని చేస్తున్న బిహార్కు చెందిన వ్యక్తి, తన స్నేహితుడితో కలిసి దాదాపు రూ.20 లక్షల విలువైన సొత్తు, నగదు ఎత్తుకుపోయాడు. ఈ మేరకు అందిన ఫిర్యాదు నేపథ్యంలో..బంజారాహిల్స్ పోలీసులు అన్ని రాష్ట్రాల రైల్వే పోలీసు (జీఆర్పీ) అధికారులను అప్రమత్తం చేయడంతో.. పశ్చిమబెంగాల్లోని ఖరగ్పూర్ రైల్వే స్టేషన్లో వారిద్దరూ పట్టుబడ్డారు. భట్టి విక్రమార్క ప్రస్తుతం ప్రజా భవన్లో నివసిస్తున్నారు. అయితే ఆయనకు బంజారాహిల్స్ రోడ్ నం.14లోని బీఎన్ రెడ్డికాలనీలో విల్లా ఉంది. బిహార్కు చెందిన రోషన్కుమార్ మండల్ (28) ఆ ఇంట్లో పని చేస్తూ అక్కడే ఉంటున్నాడు.ఇంటి హాల్లో పడుకుంటూ వాచ్మన్గా, సర్వెంట్గా విధులు నిర్వర్తిస్తున్నాడు. భట్టి ఇటీవల విదేశీ పర్యటనకు వెళ్లడాన్ని అవకాశంగా తీసుకున్న రోషన్ దొంగతనానికి పథకం వేశాడు. తన స్వస్థలం నుంచి స్నేహితుడైన ఉదయ్ కుమార్ ఠాకూర్ను పిలిపించాడు. ఇద్దరూ కలిసి మంగళవారం మధ్యాహ్నం విల్లా పడక గది తాళాలు పగులకొట్టారు. అందులోని బీరువాలో ఉన్న నగదు, బంగారు, వెండి వస్తువులు, విదేశీ కరెన్సీ, బంగారు ఆభరణాలు తస్కరించారు. అదే రోజు రాత్రి సికింద్రాబాద్ నుంచి రైలు మార్గంలో బిహార్కు బయలుదేరారు. అయితే అదే ఇంట్లో భట్టి వ్యక్తిగత సహాయకులు కూడా ఉంటుంటారు.గురువారం విల్లాలో రోషన్ కనిపించకపోవడంతో ఇల్లంతా వెతుకుతూ మొదటి అంతస్తుకు వెళ్లారు. అక్కడ ప్రధాన బెడ్రూమ్ తాళాలు పగులగొట్టి ఉండటం, చోరీ జరగడాన్ని గుర్తించారు. వెంటనే భట్టి పీఏ భాస్కర శర్మకు సమాచారం అందించారు. వెంటనే విల్లాకు వచ్చిన ఆయన రోషన్కు ఫోన్ చేయగా స్విచ్చాఫ్ వచ్చింది. దీంతో ఆయన బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీ కెమెరాల్లో నమోదైన ఫుటేజ్లను పరిశీలించగా రోషన్, ఉదయ్ ఓ బ్యాగ్తో వెళ్తున్న దృశ్యాలు కనిపించాయి. వీళ్లు రైల్లో వెళ్లారని గుర్తించిన పోలీసులు పశి్చమ బెంగాల్, బిహార్ల్లో ఉన్న అన్ని రైల్వేస్టేషన్ల జీఆర్పీ అధికారులకు సమాచారం ఇచ్చారు.నగరం నుంచి తొలుత భువనేశ్వర్ వెళ్లిన నిందితులిద్దరూ అక్కడి నుంచి భువనేశ్వర్–హౌరా జన్ శతాబ్ది ఎక్స్ప్రెస్ ఎక్కారు. ఈ రైలు గురువారం సాయంత్రం ఖరగ్పూర్ స్టేషన్లోని ప్లాట్ఫామ్ నం.7కు చేరుకోగా అందులో తనిఖీలు చేస్తున్న జీఆర్పీ సిబ్బంది బ్యాగ్తో ఉన్న రోషన్, ఉదయ్లను అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి చోరీ సొత్తు, సొమ్ము స్వాధీనం చేసుకుని నగర పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో శుక్రవారం ఖరగ్పూర్ వెళ్లిన ఎస్సై రాంబాబు నేతృత్వంలోని బృందం శనివారం సాయంత్రానికి నిందితుల్ని ఇక్కడకు తీసుకురానుంది. -
భట్టివిక్రమార్క ఇంట్లో చోరీ..నిందితుల అరెస్ట్
సాక్షి,హైదరాబాద్: బంజారాహిల్స్ రోడ్ నెంబర్14లో ఉన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇంట్లో చోరీకి పాల్పడ్డ నిందితులు పోలీసులకు చిక్కారు. పశ్చిమబెంగాల్లోని ఖరగ్పూర్ రైల్వేస్టేషన్లో నిందితులను బెంగాల్ పోలీసులు అరెస్టు చేశారు.చోరీకి పాల్పడ్డవారిని బిహార్కు చెందిన రోషన్ కుమార్ మండల్,ఉదయ్కుమార్ ఠాకూర్గా గుర్తించారు. వీరి నుంచి రూ.2.2లక్షల నగదు,100 గ్రాముల బంగారం, విదేశీ కరెన్సీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.ఇదీ చదవండి: మంత్రి పొంగులేటి నివాసంలో ఈడీ సోదాలు