thopudurthy prakash reddy
-
సీఎం జగన్ సిద్ధం సభకు లక్షల సంఖ్యలో కార్యకర్తలు
-
సామాజిక సాధికార యాత్రకు పోటెత్తిన జనం
-
చంద్రబాబు అరెస్ట్ అక్రమం కాదు.. అనివార్యం: మంత్రి అంబటి
సాక్షి, అమరావతి: చంద్రబాబుది అక్రమ అరెస్టుకాదని, అనివార్యమైన అరెస్టు మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. అరెస్టు చేయటం వలన సింపతి వస్తుందని టీడీపీ, ఎల్లోమీడియా చూసిందని, దీన్ని కక్షసాధింపుగా ప్రజలు చూస్తారని భావించారు కానీ అవేవీ జరగలేదని అన్నారు. భారీగా అక్రమాలు చేసినా చంద్రబాబును అరెస్టు చేయకపోతే రాజ్యాంగానికి విలువ ఏముంటుందని పేర్కొన్నారు. సీఐడీవారికి ఫ్రీ హ్యాండ్ ఇవ్వటం వలన కేసుకు అనుగుణంగా వారు వ్యవహరించారని చెప్పారు,. అధికారంలో ఉన్నప్పుడు అడ్డగోలుగా చేసినందునే చంద్రబాబు అరెస్టు అయ్యారని మంత్రి అంబటి అన్నారు. స్కిల్ కేసులో ఇప్పుడు అరెస్టు అయ్యారని.. ఇంకా రింగు రోడ్డు, ఫైబర్ నెట్ కేసుల్లోనూ విచారణ జరుగుతుందని తెలిపారు. చంద్రబాబు అరెస్టుకు ముందు చాలా లోతైన విచారణ జరిగిందన్నారు. షెల్ కంపెనీలకు డబ్బు తరలించి, తర్వాత తన ఖాతాలోకి వేసుకున్నట్టు తేలిందని పేర్కొనఆనరు. సీమెన్స్ కంపెనీతో సంబంధం లేకుండానే వ్యవహారం నడిపారన్నారు. ఆ కంపెనీ కూడా ఈ విషయం చెప్పిందని, రూ.330 కోట్ల ప్రజాధనాన్ని దోచుకొని లూటీ చేశారని విమర్శించారు. చట్టానికి వ్యతిరేకంగా ఎవరూ ఏమీ చేయలేరు మంత్రి అంబటి మాట్లాడుతూ.. అన్యాయంగా అరెస్టు చేయాల్సిన అవసరం ప్రభుత్వానికి ఏంటి? ఎన్నికలకు ముందు అరెస్టు చేస్తే చంద్రబాబుకు సింపతీ పెరుగుతుందని మాకు తెలీదా? కానీ వ్యవస్థలు సక్రమంగా పని తమపని తాము చేసుకునేలా మేము ఫ్రీహ్యాండ్ ఇచ్చాం. చట్టానికి వ్యతిరేకంగా ఎవరూ ఏమీ చేయలేరు. సీమెన్స్ కంపెనీ ఒక్క పైసా కూడా పెట్టుబడి పెట్టలేదు. రూ.330 కోట్లు ఇవ్వటానికి వీల్లేదని సీఎస్ కృష్ణారావుతో సహా ఫైనాన్స్ అధికారులు నోట్ ఫైల్ రాశారు. కానీ చంద్రబాబు ఒత్తిడి చేసి నిధులు విడుదల చేయించారు. అంతదారుణంగా అక్రమాలు చేస్తే అరెస్టు చేయకూడదా?. చట్టబద్దంగానే సీఐడీ అరెస్టు చేసింది. చంద్రబాబు పిఎస్ పెండ్యాల శ్రీనివాస్, మనోజ్ వాసుదేవ్ పరారయ్యారు. చంద్రబాబు సహకారంతోనే వారిద్దరూ పరారయ్యారు. ఫైబర్ నెట్, రింగ్ రోడ్ విచారణ కూడా జరుగుతుంది. ఎంతటి వారైనా తప్పు చేస్తే చట్టం, న్యాయం సహించదు. రోడ్డుమీదకు వచ్చి గొడవలు చేస్తే సహించేదిలేదు. ప్రజలకు ఇబ్బందులు కల్హిస్తే అణచివేస్తాం. ప్రజల నుండి దూరం చేయలేరంటూ పొలిటికల్ డైలాగులు కుదరవు. కోర్టులో వాస్తవాలు చెప్పుకుంటే మంచిది. ప్రభుత్వ సొమ్ము కాజేసిన సంగతిని పవన్ కల్యాణ్ తెలుసుకుని మాట్లాడాలి. వాసస్తవాలు తెలియాలంటే ఆ వివరాలు మేము పవన్కు పంఇస్తాం. పవన్ వత్తాసు పలకటం ఏంటి షూటింగ్ వదిలి బయటకు రాలేని పవన్, ప్రజలను రోడ్డు మీదకు రమ్మనటం ఏంటి?. గావుకేకలు షూటింగ్లో పెట్టటం కాదు, బయటకు వచ్చి మాట్లాడాలి. ఒక దోపిడీ దారునికి పవన్ కల్యాణ్ వత్తాసు పలకటం ఏంటి?. చంద్రబాబు, పవన్.. ఇద్దరూ ఎవరికి ఆపద వచ్చినా పూలబొకేలు ఇచ్చుకుంటుంటారు. ఇప్పుడు చంద్రబాబు వద్దకు వచ్చి ఒక పూలబొకేని పవన్ ఇస్తే మంచిది. చంద్రబాబు, పవన్ అవినీతి గోదావరిలో దిగాలనుకుంటే మాకేమీ అభ్యంతరం లేదు. బీజేపీ అధ్యక్షురాలు కూడా మా బావ అవినీతి చేయలేదని చెప్పటం లేదు. అరెస్టు ప్రొసీజర్ గురించే ఆమె మాట్లాడుతున్నారు. అంతేకానీ మా బావ నీతిమంతుడని చెప్పలేదంటేనే అర్థం చేసుకోవచ్చు. లోకేష్ పాత్ర కూడా ఉందని తేలితే ఆయన్ని కూడా అరెస్టు చేస్తారు. చదవండి: చంద్రబాబు పాపం పండింది: మంత్రి అమర్నాథ్ తప్పు చేశానని చంద్రబాబుకు తెలుసు రాజకీయ కక్షతో బాబును అరెస్ట్ చేయించాల్సిన అవసరం మాకు లేదని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ తెలిపారు. రాజకీయమే చేయాలంటే 4 ఏళ్లుగా బాబు, లోకేష్ బయట తిరేవారు కాదని అన్నారు. రాష్ట్ర ఖజానాను దోచుకున్న బాబుకు కచ్చితంగా శిక్ష పడాల్సిందేనని వ్యాఖ్యనించారు. తప్పు చేశానని చంద్రబాబుకు తెలుసని పేర్కొన్నారు. బాబు స్కిల్ డెవలప్మెంట్ స్కాంపై 2018లో జీఎస్టీ కేసు పెట్టిందని డొల్ల కంపెనీల ద్వారా లావాదేవీలు జరిగాయని తేలిందన్నారు. చంద్రబాబు ఒత్తిడి మేరకు చేశామని సెక్రటరీనే ఒప్పుకున్నాడని పేర్కొన్నారు. ఇప్పుడు MOU అని సిమెన్స్ కంపెనీ కోర్టులో వాంగ్మూలం ఇచ్చిందని గుర్తు చేశారు. యువతను చంద్రబాబు మోసం చేశాడని విమర్శించారు. యువతకు స్కిల్స్ నేర్చించలేదు కానీ.. తన స్కిల్స్తో వ్యవస్థను మేనేజ్ చేశాడని దుయ్యబట్టారు. స్కిల్ డెవెలప్మెంట్ స్కామ్ శాంపిల్ మాత్రమే.. ఇలాంటి స్కామ్లు చాలా చేశాడని అన్నారు. అన్నీ కేసుల్లో స్టేలపైనే ఎవరి పాపాలు పండుతాయో ఎవరికి శిక్ష వెయ్యాలో ఆ దేవుడికి బాగా తెలుసు. దివంగత ఎన్టార్ ఆత్మ క్షోభ , బాధ కూడా గతంలో వినిపించారు.. అది ఇప్పటికి పాపం పండింది. చంద్రబాబు చేసిన అక్రమాలు ఒక్కటి కాదు. ఏలేటి స్కామ్, లిక్కర్ స్కామ్లో అన్ని కేసులలో స్టేలపైనే జీవిస్తున్నాడు. పాపలన్నీ బద్దలైనాయిఅన్నింటికి శిక్ష తప్పదు. -మంత్రి కారుమూరి నాగేశ్వరరావు చట్టానికి ఎవరూ అతీతులు కాదు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్టు సక్రమమే. చట్టానికి ఎవరు అతీతులు కాదు.. గతంలోనూ ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తుల అరెస్టులు జరిగాయి. స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్లో వేల కోట్ల అక్రమాలకు చంద్రబాబు పాత్ర ఉంది కనుకనే అరెస్ట్ చేశారు. - నెల్లూరు పార్లమెంట్ సభ్యులు ఆదాల ప్రభాకర్ రెడ్డి చంద్రబాబు అరెస్టుకు రాజకీయ సంబంధం లేదు చంద్రబాబు అరెస్టును స్వాగతిస్తున్నాం. ఆయన అరెస్టుకు రాజకీయానికి సంబంధం లేదు. స్కిల్ డెవలప్ మెంట్లో ఏం జరిగింది అనేది అసెంబ్లీ సాక్షిగా పూర్తిగా చర్చించాం. అసలు సంబంధంలేని సీమెన్ కంపెనీ పేరుతో చంద్రబాబు అవినీతికి పాల్పడ్డాడు. సీమెన్ కంపెనీలో పనిచేసే ఒక వ్యక్తితో మాట్లాడి ఈ విధంగా అవినీతికి పాల్పడిన సంగతి అందరికీ తెలిసిందే. ఆ కంపెనీ కూడా ఎంక్వయిరీ చేసి దీనికి మాకు సంబంధం లేదని తేల్చేసింది. పూర్తిస్థాయిలో చర్చించి రూ. 370 కోట్లు ఏ విధంగా అవినీతి జరిగింది అని ప్రభుత్వ సంస్థలు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసిన తర్వాతే చంద్రబాబును అరెస్టు చేశారు. దీనిలో ఏ విధమైన రాజకీయ కోణం గానీ కక్ష సాధింపులు గాని లేవు. దొరికిపోయాడు కాబట్టే నన్ను ఏ క్షణమైనా అరెస్టు చేస్తారంటూ మూడు రోజుల నుంచి చంద్రబాబు చెబుతున్నాడు. -నందిగామ ఎమ్మెల్యే,మొండితోక జగన్ మోహన్ రావు చంద్రబాబు అరెస్టు సమంజసమే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అవినీతిలో కూరుకు పోయారు. సీఐడీ పూర్తిస్థాయిలో విచారణ జరిపింది. 2018లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే స్కిల్ డెవలప్మెంట్ కేసులో నిధులు దారిమళ్లాయి. హవాలా రూపంలో చంద్రబాబు స్కాంకు పాల్పడ్డాడు. చంద్రబాబు అరెస్టు సమంజసమే. అవినీతికి పాల్పడిన వ్యక్తిని అరెస్టు చేస్తే రాజకీయం చేయడం తగదు. -అనకాపల్లి జిల్లా ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ చంద్రబాబు నాయుడు అవినీతి సామ్రాట్ చంద్రబాబు నాయుడు అవినీతి సామ్రాట్. స్కిల్ డెవలప్మెంట్ స్కాం సూత్రధారి చంద్రబాబే. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు అనేక కుంభకోణాల్లో భాగస్వామి. చంద్రబాబు వేల కోట్ల అక్రమాల్లో స్కిల్ డెవలప్మెంట్ స్కాం చాలా చిన్నది. చంద్రబాబు పాపం పండింది.. చంద్రబాబు ను జైలుకు పంపాలి. -రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్రెడ్డి పూర్తి ఆధారాలతో అరెస్ట్ చంద్రబాబు నాయుడు అరెస్టుపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. పూర్తి ఆధారాలతోనే ఆయన్ను అరెస్ట్ చేశారు. కక్ష సాధింపు చర్యలు తీసుకోవాలనుకుంటే 2021లోనే అరెస్టు చేయొచ్చు. స్కిల్ డెవలప్మెంట్ పేరిట ప్రజల సొమ్ము రూ. 360 కోట్లు దోచేసశాడు. జీఎస్టీ,ఇంటెలిజెన్స్, ఐటీ, ఈడీ, సెబ్ ఇలా అన్ని కూడా మూడు సంవత్సరాల నుంచి దర్యాప్తు చేస్తూ పూర్తి ఆధారాలతో అరెస్టు చేశారు. - ఎమ్మెల్యే తలారి వెంకట్రావు -
‘రాయలసీమ ద్రోహి చంద్రబాబు’
సాక్షి, కర్నూలు: రాష్ట్రాభివృద్ధిపై టీడీపీ అధినేత చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదు. చంద్రబాబును ప్రజలు ఇప్పటికే తిరస్కరించారని మంత్రి గుమ్మనూరు జయరాం అన్నారు. కాగా, మంత్రి జయరాం మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు సానుభూతి మాటలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. చంద్రబాబుకు ఇప్పటికే చివరి ఎన్నికలు అయిపోయాయి. 2024 ఎన్నికల్లో చంద్రబాబు పోటీ చేయరు. చంద్రబాబును ఇప్పటికే ప్రజలు తిరస్కరించారు అని అన్నారు. ప్రజలను మోసం చేయడమే చంద్రబాబు నైజం.. సాక్షి, అనంతపురం: తన రాజకీయ భవిష్యత్తుపై చంద్రబాబు ఫ్రస్ట్రేషన్లో ఉన్నారని రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అన్నారు. ప్రజలను నిత్యం మోసం చేయడమే చంద్రబాబు నైజం. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలంటే దుర్భాషలాడతారా?. వికేంద్రీకరణవాదులపై అనుచిత వ్యాఖ్యలు చేసి నిజస్వరూపాన్ని చూపించారు. ఏపీ ప్రతిపక్ష నేతగా చంద్రబాబు ఉండటం ప్రజల దురదృష్టం. రాష్ట్ర ప్రయోజనాలతో చంద్రబాబు, పవన్ చెలగాటం ఆడుతున్నారు. అమరావతిపై చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే ఎందుకు రాజధాని నిర్మించలేకపోయారు. రాయలసీమ ద్రోహి చంద్రబాబు.. సాక్షి, విజయవాడ: అభివృద్ధిని, సంక్షేమాన్ని చూడలేక చంద్రబాబు అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని మల్లాది విష్ణు ఆగ్రహం వ్యక్తంచేశారు. అమరావతి నా నినాదం అని చంద్రబాబు రాయలసీమలో చెప్పలేకపోయాడు. చంద్రబాబు వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. రాయలసీమ ద్రోహి చంద్రబాబు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గురించి మాట్లాడే నైతిక హక్కు చంద్రబాబుకు లేదు. ఇకనైనా మీ భాషను మార్చుకోకపొతే రాబోయే రోజుల్లో ప్రజలే బుద్ధి చెబుతారు. -
తోపుదుర్తి ప్రకాష్రెడ్డి పెద్దమనసు.. ఆ రైతులకు 5వేల ఉచిత బోర్లు
సాక్షి, అనంతపురం(రాప్తాడు): నియోజకవర్గంలో 5 వేల మంది రైతులకు తోపుదుర్తి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఉచితంగా బోరుబావులు తవ్వించి వారి కలను సాకారం చేస్తున్నట్లు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్రెడ్డి పేర్కొన్నారు. బుధవారం రాప్తాడుకు వచ్చిన ఆయన స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రూ.10 కోట్లతో బోర్ల ఏర్పాటు తోపుదుర్తి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా గతంలో రాప్తాడు నియోజకవర్గంలో రెండు వేల మంది రైతులకు ఉచితంగా బోరు బావులు తవ్వించినట్లు ప్రకాష్రెడ్డి గుర్తు చేశారు. స్ఫూర్తిదాయకమైన ఈ కార్యక్రమాన్ని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ‘వైఎస్సార్ జలకళ’ కార్యక్రమం కింద తీసుకురావడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమం కింద నియోజకవర్గంలో ఇప్పటి వరకూ 600 మంది రైతులకు బోర్లు వేయించామన్నారు. బోర్లు వేయించాలంటూ ప్రభుత్వ లక్ష్యానికి మించి 10,600 దరఖాస్తులు అందడంతో తోపుదుర్తి కుటుంబం చర్చించి ట్రస్ట్ ద్వారా ఉచిత బోర్లు వేయించాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఇందులో భాగంగా రూ.10 కోట్ల వ్యయంతో రాప్తాడు, కనగానపల్లి, చెన్నేకొత్తపల్లి, రామగిరి మండలాలకు సంబంధించి ప్రతి మండలానికి వెయ్యి బోర్లు, ఆత్మకూరు, అనంతపురం రూరల్ మండలాలకు కలపి వెయ్యి బోర్లు వేయించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఇందుకు సంబంధించి తొలి విడతగా కనగానపల్లి మండలంలో 150, రాప్తాడులో 150, రామగిరిలో 100, చెన్నేకొత్తపల్లి మండలాల్లో 100 బోర్లు వేయిస్తామన్నారు. ఇవి పూర్తి కాగానే రెండో విడతలో మరో 500 బోర్లు వేయిస్తామన్నారు. ఇలా ప్రతి విడతలోనూ 500 బోర్లు వేయించేలా చర్యలు తీసుకుంటామన్నారు. అర్హులు వీరే.. పేద రైతులు, ఇప్పటి దాకా బోర్లు వేయని రైతులు, ఎన్నిమార్లు బోర్లు వేసినా నీళ్లు పడని రైతులు మాత్రమే ఈ పథకం కింద అర్హులని ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్రెడ్డి పేర్కొన్నారు. గత రెండేళ్లుగా పేరూరు డ్యాం మరువ పారుతోందని, ఈ సారి దాదాపు 12 టీఎంసీల నీటిని పేరూరు డ్యాం నుంచి దిగువన పెన్నాలోకి వదిలినట్లు తెలిపారు. సీఎం వైఎస్ జగన్ ఆశీర్వాదంతో పీఏబీఆర్ కుడికాలువ ద్వారా ప్రతి చెరువునూ నింపడం జరిగిందన్నారు. నియోజకవర్గంలో భూగర్భజలాలు భారీగా పెరిగాయని, 200 అడుగుల్లోపే నీళ్లు పడే పరిస్థితి నెలకొందన్నారు. ప్రతి కార్యకర్త గడప గడపకూ వెళ్లాలి ప్రతి గడపకూ వెళ్లి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ఈ మూడేళ్లలో ఒనగూరిన లబ్ధిని వివరించాలని కార్యకర్తలకు సూచించారు. గత ప్రభుత్వం ఖజానాను కొల్లగొట్టి వెళ్లిపోయినా ఎన్నో కష్టాలను ఎదుర్కొని నిధులు సమకూర్చుకుంటూ పేద, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఇప్పటికే నియోజకవర్గంలో 8,900 ఇళ్లు మంజూరయ్యాయని, మరో 8,500 ఇళ్ల నిర్మాణాలకు ఆమోదం కోసం ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు. నియోజకవర్గంలోని పేదలు ఎవరైతే ఆప్షన్–3లో ఇళ్ల నిర్మాణాలు చేసుకుంటారో వారందరికీ రూ.35 వేల రుణాన్ని ఎన్నికల లోపు కాంట్రాక్టింగ్ సంస్థకు తామే చెల్లించి, ఆ రుణాన్ని మాఫీ చేయిస్తామన్నారు. సమావేశంలో వైస్ ఎంపీపీ బోయ రామాంజినేయులు, వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ జూటూరు శేఖర్, యూత్ మండల కన్వీనర్ చిట్రెడ్డి సత్యనారాయణరెడ్డి, బీసీ సెల్ నాయకుడు పసుపుల ఆది పాల్గొన్నారు. -
బాబుది దోపిడీ బాట.. జగన్ది సంక్షేమ పాలన
సాక్షి,కనగానపల్లి(అనంతపురం): నాడు జన్మభూమి కమిటీల పేరుతో చంద్రబాబు దోపిడీ పాలన సాగిస్తే, నేడు వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో వలంటీర్ల ద్వారా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజా సంక్షేమ పాలన అందిస్తున్నారని రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్రెడ్డి అన్నారు. ఆరు గ్రామ పంచాయతీల్లోని 75 మంది ఉత్తమ గ్రామ వలంటీర్లకు కనగానపల్లి ఎంపీడీఓ కార్యాలయం వద్ద శనివారం సాయంత్రం ఆయన పురస్కారాలు అందజేసి సత్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. ప్రతి సంక్షేమ పథకం ప్రతి ఇంటికీ నేరుగా చేరాలన్న ఉద్దేశంతో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి దేశంలో తొలిసారిగా వలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చారన్నారు. ప్రభుత్వ పాలనను ప్రజల ముంగిటకు తీసుకొచ్చేందుకు సచివాలయ వ్యవస్థను ప్రవేశపెట్టారన్నారు. వలంటీర్లు, సచివాలయ వ్యవస్థ సీఎం జగన్కు రెండు కళ్లులాంటివని అన్నారు. టీడీపీ ప్రభుత్వంలో చంద్రబాబు తన పార్టీ నాయకులతో జన్మభూమి కమిటీలు ఏర్పాటు చేసి ప్రజాధనాన్ని దోచిపెట్టారని ఆరోపించారు. ఫ్యాక్షన్, వర్గ రాజకీయాలకు పరిటాల కుటుంబం పుట్టినిల్లు: రాప్తాడు నియోజక వర్గంలో ఫ్యాక్షన్, వర్గ రాజకీయాలకు పరిటాల కుటుంబం çపుట్టినిల్లని ఎమ్మెల్యే ప్రకా‹Ùరెడ్డి విమర్శించారు. నియోజకవర్గంలో 25 ఏళ్లలో జరగని అభివృద్ధి పనులను తాము చేస్తున్నామన్నారు. పేరూరు డ్యాంను నీటితో నింపడంతోపాటు రామగిరి బంగారు గనులు తెరిపిస్తున్నారు. తాము చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక టీడీపీ నాయకులు తమపై అసత్య ఆరోపణలు చేస్తున్నారన్నారు. పరిటాల కుటుంబం గ్రామాల్లో వర్గ రాజకీయాలను ప్రేరేపిస్తోందన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ కుంపటీ భాగ్యమ్మ, జెడ్పీటీసీ సభ్యుడు మారుతీప్రసాద్, వైస్ ఎంపీపీలు నరసింహారెడ్డి, పద్మావతి, తహసీల్దార్ మురళీ, ఎంపీడీఓ విజయభాస్కర్, సొసైటీ అధ్యక్షుడు భాస్కర్, డైరెక్టర్ ప్రభాకర్, అగ్రి బోర్డు చైర్మన్ వెంకటరాముడు, నియోజకవర్గ వైఎస్సార్సీపీ నాయకుడు తోపుదుర్తి రాజశేఖర్రెడ్డి, కన్వీనర్ అమరనాథ్రెడ్డి, పలువురు ఎంపీటీసీలు, సర్పంచ్లు పాల్గొన్నారు. రాప్తాడు: స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీపీ చిట్రెడ్డి జయలక్ష్మి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకా‹Ùరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని మండలంలోని 8 గ్రామ సచివాలయాలకు చెందిన వలంటీర్లను సన్మానించి సేవా వజ్ర, సేవా రత్న, సేవా మిత్ర అవార్డులు ప్రదానం చేసి ప్రశంసా పత్రాలు అందజేశారు. వలంటీర్లు, సచివాలయ వ్యవస్థ దేశానికే ఆదర్శమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారని గుర్తు చేశారు. సేవా దృక్పథంతో పని చేస్తున్న వలంటీర్లను టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అవహేళనగా మాట్లాడడం సిగ్గుచేటన్నారు. జెడ్పీటీసీ సభ్యురాలు పసుపుల హేమావతి, వైస్ ఎంపీపీలు బోయ రామాంజినేయులు, మన్నల వరలక్షి్మ, ఎంపీడీఓ సాల్మన్, తహసీల్దార్ ఈరమ్మ, ఈఓఆర్డీ మాధవి, యూత్ విభాగం మండల కన్వీనర్ చిట్రెడ్డి సత్యనారాయణ రెడ్డి, నాయకులు పసుపుల ఆది, యర్రగుంట కేశవ రెడ్డి, సర్పంచులు, ఎంపీటీసీలు, సచివాలయ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. -
పరిటాల సునీతకు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సవాల్
సాక్షి, అనంతపురం: టీడీపీ పాలనలో అవినీతి, దౌర్జన్యాలు చేసింది పరిటాల కుటుంబీకులేనని రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ధ్వజమెత్తారు. ఈ మేరకు ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. పరిటాల సునీత, శ్రీరామ్ వంటి వ్యక్తులు అవినీతి గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. తోపుదుర్తి మహిళా డైరీలో ఒక్క రూపాయి దుర్వినియోగం కాలేదని పేర్కొన్నారు. అక్రమాలు జరిగినట్లు నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమని పరిటాల సునీత, శ్రీరామ్కు సవాల్ విసిరారు. చదవండి: (ఫిట్మెంట్తో పాటు ఉద్యోగులకు సీఎం జగన్ మరో గుడ్న్యూస్) -
శ్రీరాం.. నీ బండారం బయటపెడతా!
సాక్షి, అనంతపురం : ‘‘టీడీపీ పాలనలో జిల్లాకు, ముఖ్యంగా రాప్తాడు నియోజకవర్గానికి జరిగిన ప్రయోజనమేమీ లేదు. మేము సాగునీరిచ్చామంటున్నావు.. ఏ నియోజకవర్గానికిచ్చావో చెప్పు. దోపిడీ తప్ప మీ కుటుంబం చేసిందేమీ లేదు. గతంలో మీకున్న ఆస్తులెన్ని.. ఇప్పుడున్న ఆస్తులెన్ని..? ఎక్కడి నుంచి వచ్చాయో చెప్పగలవా? పరిటాల రవీంద్ర పేరు చెప్పి ఇష్టారాజ్యంగా భూములను లాక్కున్న ఘనత మీది. ప్రజాసేవే పరమావధిగా పనిచేసే మనస్తత్వం మాది. జిల్లాలో కియా ఫ్యాక్టరీ పరిసరాల్లో, రాజధాని అమరావతి ప్రాంతంలో బినామీల పేర్లతో మీరు భూములు కొనుగోలు చేయలేదా?’’ అని ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్రెడ్డి పరిటాల శ్రీరాంను ప్రశ్నించారు. వీటన్నింటికీ సంబంధించిన పూర్తి వివరాలతో పరిటాల శ్రీరాం బండారం బయటపెడతానన్నారు. మంగళవారం ఆయన వైఎస్సార్ సీపీ రాప్తాడు నియోజకవర్గ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. పరిటాల కుటుంబం లాగా కక్షలతో దిగజారుడు రాజకీయాలను చేయాల్సిన అవసరం తమకు లేదన్నారు. చదవండి: విద్యార్ధినులపై వేధింపులు.. గురువుకు 49 ఏళ్ల జైలు శిక్ష జిల్లాలో చేసిన అభివృద్ధి ఏమిటో చూపించు టీడీపీ హయాంలో అభివృద్ధి జరిగిందని చెబుతున్న శ్రీరాం కుటుంబమే రాప్తాడు, పెనుకొండ ప్రాంతాల్లో ఏళ్ల తరబడి ఎమ్మెల్యేలుగా ఉన్నారని, నిజంగా వారు అభివృద్ధి చేసి ఉంటే.. ఒకసారి ప్రజలకూ చుపించగలరా? అని ఎమ్మెల్యే ప్రకాష్రెడ్డి సవాల్ విసిరారు. తాము ఏదో సాధించామని చెబుతున్న శ్రీరాం పేరూరు డ్యాంకు నీరు ఎందుకు తీసుకురాలేకపోయారో వివరించాలన్నారు. రూ.800 కోట్ల కాంట్రాక్టు పనులు మంజూరైతే వాటిలో పరిటాల కుటుంబం వాటా రూ.300 కోట్లు ఉందని ఎమ్మెల్యే ప్రకాష్రెడ్డి మండిపడ్డారు. టీడీపీ హయాంలో అభివృద్ధే జరిగి ఉంటే.. రాప్తాడు నియోజకవర్గాన్ని ఎందుకని ‘అహుడా’ పరిధిలోకి చేర్చలేదో చెప్పాలన్నారు. రాప్తాడులో జరుగుతున్న అభివృద్ధితో ఇక్కడ తమకు దిక్కు లేదని తెలిసిన పరిటాల శ్రీరాం.. ఇప్పుడు ధర్మవరానికి చేరుకుని ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నాడన్నారు. ప్రజా శ్రేయస్సుపై దృష్టి సారించాం తాము అధికారంలోకి వచ్చి 18 నెలలు పూర్తి కాగా.. ప్రతి క్షణం నియోజకవర్గ అభివృద్ధికి పనిచేశామన్నారు. పరిటాల కుటుంబీకులు మాత్రం మండలానికో ఇన్చార్జ్ని నియమించుకొని దోచుకుతిన్నారన్నారు. పేదల ఇండ్ల కోసం ఇష్టారాజ్యంగా వసూలు చేసిన ఘనత మీ మహేంద్రదనే విషయాన్ని శ్రీరాంకు ఎమ్మెల్యే ప్రకాష్రెడ్డి గుర్తుచేశారు. జాకీ పరిశ్రమతో కేవలం వెయ్యి కుటుంబాలకు లబ్ధి చేకూర్చాలని గత ప్రభుత్వం ప్రయత్నించిందన్నారు. కానీ తాము మాత్రం 15వేల కుటుంబాలకు ఉపాధి కల్పించాలని చూస్తున్నామన్నారు. పాల డెయిరీ ద్వారా మహిళలకు అండగా నిలవాలని వారి కుటుంబాల్లో వెలుగులు నింపాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామన్నారు. -
మీ నాన్న బాటలో నడిస్తే ఊరుకోం
అనంతపురం సెంట్రల్: ‘‘మీ నాన్న పరిటాల రవి వందల మందిని చంపి హీరో అయ్యాడనుకుంటున్నావ్. దేశంలోనే క్రిమినల్ చరిత్రలో మొదటి స్థానం సంపాదించుకున్నాడు. మీ నాన్న చేసినట్లు నువ్వూ చేస్తానంటే ఊరుకునేది లేదు. ఆ కాలం ఎప్పుడో పోయింది. ఇప్పుడు మా మంచితనాన్ని చేతగాని తనంగా తీసుకోవద్దు’’ అని మాజీ మంత్రి పరిటాల సునీత కుమారుడు శ్రీరామ్ను రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్రెడ్డి హెచ్చరించారు. సోమవారం ఆయన అనంతపురంలోని తన స్వగృహంలో హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్తో కలిసి విలేకరులతో మాట్లాడారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాప్తాడు నియోజకవర్గ అభివృద్ధిని ఒక యజ్ఞంలా చేపడుతున్నామన్నారు. టీడీపీ హయాంలో కందుకూరు గోదాము మూసివేయడం వల్ల 500 కుటుంబాలు రోడ్డుపడ్డాయని, తాము అధికారంలోకి వచ్చిన 8 నెలల్లో గోదాము తెరిపించామన్నారు. పరిటాల కుటుంబం పాతిక సంవత్సరాలుగా నసనకోట ముత్యాలమ్మ దేవాలయానికి భక్తులు, దాతలు ఇచ్చిన సొమ్మును బొక్కుతూ దేవునికే శఠగోపం పెట్టిందన్నారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ఆలయాన్ని దేవాదాయశాఖ పరిధిలోకి తీసుకువచ్చామ్నారు. నియోజకవర్గంలో 60 వేల జనాభాకు తాగునీరు అందించేందుకు అనుమతులు తీసుకొచ్చామని, ఆ పనులను కూడా త్వరలోనే ప్రారంభిస్తున్నామన్నారు. నియోజకవర్గాన్ని ఆహుడా పరిధిలోకి తీసుకొచ్చి 20వేల ఇళ్లను మంజూరు చేయించామన్నారు. పేరూరు డ్యాం, గంగులకుంట, బోగినేపల్లి చెరువులకు నీటిని తీసుకొస్తుస్తున్నామన్నారు. నియోజకవర్గంలో పది వేల మంది మహిళలకు లబ్ధి కలిగించేందుకు ప్రత్యేకంగా డెయిరీని తీసుకొస్తున్నట్లు వివరించారు. రాప్తాడు నియోజకవర్గం అభివృద్ధి కోసం తాము పనిచేస్తుంటే.. గ్రామాల్లో ఫ్యాక్షన్ రెచ్చగొట్టే కార్యక్రమాలకు పరిటాల శ్రీరామ్ ప్రయత్నిస్తున్నాడన్నారు. దౌర్జన్య పద్ధతుల్లో ప్రజలను, అధికారులను బెదిరిస్తున్నాడన్నారు. గత ప్రభుత్వ హయాంలో వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాలను ధ్వంసం చేసి ఈడ్చుకెళ్లినట్లు స్వయంగా శ్రీరామ్ ప్రకటించాడన్నారు. రాప్తాడు నియోజకవర్గంలో స్థానిక సంస్థలకు టీడీపీ తరఫున నిలబడేందుకు అభ్యర్థులు దొరకడం లేదని, వంద మందిని వెంట వేసుకొని అరాచకం సృష్టించాలని చూస్తున్నారన్నారు. ప్రస్తుతం రామగిరిలో జరిగిన ఘటనతో పాటు గతంలో జరిగిన దాడులు, హత్యలపై విచారణ చేసి బాధిత కుటుంబ సభ్యులు కోరిన విధంగా పరిటాల శ్రీరామ్, వారి కుటుంబ సభ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ అంశంపై ఎస్పీకి ఫిర్యాదు చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రజాస్వామ్యవాదులారా ఏకంకండి ప్రజాస్వామ్య వాదులందరూ ఏకమై ఒక తాటిపైకి రావాల్సిన సమయం ఆసన్నమైందని హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ పిలుపునిచ్చారు. లోటు బడ్జెట్లోనూ సంక్షేమ కార్యక్రమాలతో రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ముందుకు తీసుకెళ్తున్నారని తెలిపారు. 14వ ఆర్థిక సంఘం నిధులు రూ.5 వేల కోట్లు రావాల్సి ఉండడంతో యుద్ధ ప్రాతిపదికన ఎన్నికలు నిర్వహణకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. అయితే రాష్ట్రాభివృద్ధికి విఘాతం కలిగించేందుకు అతిపెద్ద కరోనా వైరస్ అయిన చంద్రబాబు కుట్రలు పన్నుతున్నాడని మండిపడ్డారు. కదిరి బ్రహ్మోత్సవాల్లో లక్షలాది ప్రజలు పాల్గొన్నా.. ఎవరికీ ఎలాంటి జబ్బు రాలేదన్నారు. అలాంటిది ఎన్నికలు నిర్వహించడం వల్ల కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుందని ఎన్నికల కమిషనర్ దుష్ప్రచారం చేయడం దుర్మార్గమని మండిపడ్డారు. సమావేశంలో వైఎస్సార్సీపీ రూరల్ మండల కన్వీనర్ గోపాల్రెడ్డి, రాప్తాడు మార్కెట్యార్డు చైర్మన్ నాగేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు. పరిటాల శ్రీరామ్పై కేసు నమోదు రామగిరి: మాజీ మంత్రి పరిటాల సునీత కుమారుడు పరిటాల శ్రీరామ్పై ఐపీసీ 153ఏ సెక్షన్ కింద కేసు నమోదు చేసినట్లు రామగిరి ఎస్ఐ నాగస్వామి తెలిపారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, ఈనెల 15వ తేదీ (ఆదివారం) రామగిరి టీడీపీ కార్యాలయ ఆవరణలో కార్యకర్తలనుద్దేశించి పరిటాల శ్రీరావ్ు చేసిన ప్రసం మతం, వర్గం, పార్టీలను ప్రభావితం చేస్తుండటంతో కేసు నమోదు చేశామన్నారు. ఎన్నికల నిబంధనల ప్రకారం ప్రజలను, ఇతర పార్టీల వర్గీయులను రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తే తగిన చర్యలు తీసుకుంటామన్నారు. ఇదిలాఉండగా పరిటాల శ్రీరామ్ గతంలో రామగిరిలోని వైఎస్సార్ విగ్రహాన్ని కూల్చేశామని, తాము అధికారంలోకి వస్తే 15 నిమిషాల్లోనే ప్రస్తుతం ఉన్న విగ్రహాన్ని కూల్చేస్తామని బాహాటంగా చెప్పడం విమర్శలకు తావిస్తోంది. -
'బినామి ఆస్తులు కాపాడాలనేది బాబు తాపత్రయం'
సాక్షి, అనంతపురం : అధికార వికేంద్రీకరణ సదస్సు ఎస్కే యునివర్సిటీలోని భువనవిజయం ఆడిటోరియంలో బుధవారం ఘనంగా జరిగింది. ఈ సెమినార్కు విద్యార్థి,విద్యార్థినులు భారీగా హాజరై అధికార వికేంద్రీకరణకు జైకొట్టారు. అధికార వికేంద్రీకరణ ద్వారానే అభివృద్ధి సాధ్యమవుతుందని పలువురు ప్రొఫెసర్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఏపీ కార్పొరేషన్ చైర్మన్,ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మాట్లాడుతూ... రాష్ట్ర విభజన వల్ల ఏపీ చాలా నష్టపోయిందని పేర్కొన్నారు. బినామి ఆస్తులు కాపాడుకునేందుకు చంద్రబాబు తాపత్రయమని దుయ్యబట్టారు. అమరావతిలో మాత్రమే లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టి, అభివృద్ధి ఒకే చోట జరగాలంటే ఎలా అని విమర్శించారు. ప్రస్తుతం ఉన్న దృష్యా ఏపీకి మూడు రాజధారుల అవసరం ఎంతో ఉందని, అధికార వికేంద్రీకరణ ద్వారా సమగ్ర అభివృద్ధి జరగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. అమ్మ ఒడి,రైతు భరోసా పథకాలు చారిత్రాత్మకం అని తెలిపారు.(చంద్రబాబు ఇప్పటికైనా కళ్లు తెరవాలి..) ఏపీలోని 13 జిల్లాలను అభివృద్ధి చేయాలన్నదే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సంకల్పమని రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్రెడ్డి పేర్కొన్నారు. లక్షకోట్ల రూపాయలతో అమరావతి నిర్మాణం అవసరమా అని, అభివృద్ధి ఒకచోట జరిగితే మిగిలిన ప్రాంతాలు ఏంకావాలని ఆయన ప్రశ్నించారు. పరిపాలన వికేంద్రీకరణ ద్వారానే అభివృద్ధి సాధ్యం అవుతుందని ప్రకాశ్ రెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్ రెడ్డి, ఏపీ పాఠశాల విద్య కమిషన్ సీఈఓ ఆలూరు సాంబశివారెడ్డి, వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహాలక్ష్మి శ్రీనివాస్, విద్యార్థి సంఘాల నేతలు లింగారెడ్డి, రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
ఫలించిన తోపుదుర్తి కృషి
అనంతపురం రూరల్: అనంతపురం రూరల్ మండల పరిధిలోని పాపంపేట, విద్యానగర్, ఎంఎన్ఆర్ కాలనీ, కక్కలపల్లి కాలనీ పంచాయతీలోని నీటి సమస్య తీరనుంది. ఆయా గ్రామాలకు పీఏబీఆర్ పైపులైన్ ద్వారా నీటిని అందించడానికి గురువారం ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఫలించిన ఎమ్మెల్యే ప్రకాష్రెడ్డి కృషి గత ఎన్నికల్లో తాము అధికారంలోకి వస్తే పీఏబీఆర్ పైపులైను ద్వారా అక్కంపల్లి, పాపంపేట, విద్యారణ్య నగర్, కక్కలపల్లి కాలనీ పంచాయతీలోని పలు కాలనీలకు పీఏబీఆర్ ద్వారా నీళ్లను తీసుకొచ్చి ప్రతి ఇంటికి తాగునీరు అందిస్తామని తోపుదుర్తి ప్రకాష్రెడ్డి హామీ ఇచ్చారు. ఇందులో భాగంగా ఆయా గ్రామాలకు రోజుకు 22 లక్షల లీటర్ల నీరు అందించే విధంగా ప్రభుత్వం జీవో జారీ చేసింది. దీంతో తమ గ్రామాల్లో నెలకొన్న నీటి సమస్య తీరిందని, ఆయా గ్రామాల ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. -
చంద్రబాబు జాతీయ నాయకుడు కాదు..
సాక్షి, అనంతపురం : లక్ష కోట్ల రాజధాని వద్దు-ఇరిగేషన్ ప్రాజెక్టులు ముద్దు పేరుతో జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు భారీ ర్యాలీ నిర్వహించారు. నగరంలోని క్లాక్ టవర్ నుంచి సప్తగిరి సర్కిల్ దాకా ఈ ర్యాలీ కొనసాగింది. ఈ ర్యాలీలో అనంతపురం ఎమ్మెల్యే అనంతవెంకట్రామిరెడ్డి, రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్రెడ్డి, ఎమ్మెల్సీ ఇక్బాల్, పుట్టపర్తి ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి, కదిరి ఎమ్మెల్యే డాక్టర్ సిద్ధారెడ్డి, మడకశిర ఎమ్మెల్యే డాక్టర్ తిప్పేస్వామి, ఎమ్మెల్సీ ఇక్భాల్, డీసీసీబీ ఛైర్మన్ పామిడి వీరాంజనేయులు, మాజీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి, పార్టీ నేతలు నదీం అహ్మద్, గంగుల భానుమతి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ ఏపీలో అధికార, అభివృద్ధి వికేంద్రీకరణ దిశగా వైఎస్ జగన్ ప్రభుత్వం అడుగులు వేస్తుంటే. అమరావతి కోసం చంద్రబాబు జోలె పట్టడం హాస్యాస్పదంగా ఉందని విమర్శించారు. రాయలసీమలో ఆకలి చావులు జరిగినప్పుడు చంద్రబాబు ఎందుకు జోలి పట్టలేదని ప్రశ్నించారు. సీమ వెనుకబాటుకు చంద్రబాబే కారణమని విమర్శించారు. చంద్రబాబు జాతీయ నాయకుడు కాదని, ఒక జాతి నాయకుడని వ్యాఖ్యానించారు. వైఎస్సార్ ప్రారంభించిన ఇరిగేషన్ప్రాజెక్టులపై చంద్రబాబు నిర్లక్ష్యం వహించారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాయలసీమ కరువుపై మానవతా దృక్పథంతో స్పందించి.. సీమ ప్రాజెక్టులకు పెద్దపీట వేస్తున్నారని అన్నారు. ముఖ్యమంత్రి అధికార వికేంద్రీకరణ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని ఏపీలోని 13 జిల్లాలు అభివృద్ధి చెందాలని తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి తెలిపారు. చంద్రబాబు జోలె పట్టడం హాస్యాస్పదం అవినీతిని కప్పిపుచ్చుకునేందుకే చంద్రబాబు డ్రామాలు అడుతున్నాడని ఎమ్మెల్సీ ఇక్బాల్ దుయ్యబట్టారు. అమరావతిలో చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారని, ఇన్ సైడర్ ట్రెడింగ్ ద్వారా 4000 ఎకరాలు టీడీపీ నేతలు కొన్నారని పేర్కొన్నారు. బినామీ ఆస్తులను కాపాడుకునేందుకు చంద్రబాబు పాకులాడటం విడ్డూరంగా ఉందన్నారు. చంద్రబాబు జోలె పట్టడం హాస్యాస్పదమని, ఏపీ లోని 13 జిల్లాల అభివృద్ధికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కట్టుబడి ఉన్నారన్నారు. అన్ని ప్రాంతాలూ అభివృద్ధి చెందితే చంద్రబాబుకు ఎందుకు బాధ అని నిలదీశారు. రాయలసీమలో హైకోర్టు ఏర్పాటుకు చంద్రబాబు అనుకూలమా.. కాదో చెప్పాలని ఎమ్మెల్సీ ఇక్బాల్ డిమాండ్ చేశారు. రాయలసీమ కష్టాలు బాబుకు కనిపించవా సొంత ప్రయోజనాల కోసమే చంద్రబాబు అమరావతి పోరాటం చేస్తున్నారని పుట్టపర్తి ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి విమర్శించారు. అమరావతిలో చంద్రబాబు గ్రాఫిక్స్ మమాజాలం సృష్టించిందని, నాలుగు లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేసినా అమరావతిలో రాజధాని కట్టలేమని పేర్కొన్నారు. రాయలసీమ కష్టాలు చంద్రబాబుకు కనిపించవా అని ప్రశ్నించారు. వైఎస్సార్ కృషి ఫలితమే హంద్రీనీవా ప్రాజెక్టు అని తెలిపారు. చంద్రబాబు 3 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారని, కనీసం రూ. 25000 కోట్లు సీమ కోసం ఎందుకు ఖర్చు పెట్టలేదని నిలదీశారు. తమకు లక్షల కోట్ల రూపాయల రాజధాని అక్కర్లేదని.. పుష్కలంగా తాగు, సాగు నీరు అందింతే చాలన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు అండగా నిలుస్తామని, రాయలసీమలో జ్యూడిషియల్ క్యాపిటల్ ను స్వాగతిస్తున్నామని అన్నారు. -
వెనుకబడిన ప్రాంత ప్రజల కష్టాలు గుర్తుకురాలేదా?
-
చంద్రబాబు ఆ పని చేసుంటే..
సాక్షి, తాడేపల్లి : రాజధాని విషయంలో టీడీపీ నాయకులు పెయిడ్ ఆర్టిస్ట్లను తీసుకొచ్చి ఉద్యయం చేయిస్తున్నారని రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ధ్వజమెత్తారు. రాజధాని విషయంలో టీడీపీ మీడియా అతిగా చూపిస్తోందని, రాజధానిలో రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఉద్యమాలు చేయిస్తున్నారని విమర్శించారు. మంగళవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అద్భుతమైన రాజధానిని నిర్మిస్తానని చెప్పి చంద్రబాబు రైతులను మోసం చేశారని మండిపడ్డారు. రాజధానిలో టీడీపీ నేతలు ఇన్సైడర్ ట్రేడింగ్కు పాల్పడ్డారని, తన బినామీలు కొన్న భూములకు రేట్లు పలకడం కోసం ప్రపంచ స్థాయి రాజధాని నిర్మిస్తామని చంద్రబాబు నమ్మబలికారని దుయ్యబట్టారు. రాజధాని ప్రజలను బాబు రెచ్చగొడుతున్నారు చంద్రబాబు రాజధాని పూర్తి చేసి ఉంటే రాజధాని తరలించే పరిస్థితి వచ్చేది కాదని, ఢిల్లీని తలదన్నే విధంగా రాజధాని నిర్మిస్తామని బాబు గ్రాఫిక్స్ చూపించారని మండిపడ్డారు. రాజధాని ప్రజలను చంద్రబాబు రెచ్చగొడుతున్నారని, శ్రీబాగ్ ఒడంబడిక ప్రకారం హైకోర్టు రాయలసీమలో ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. రూ. లక్షా 70 వేల కోట్లు అప్పు తెచ్చి కేవలం అయిదు వేల కోట్లు రాజధానికి చంద్రబాబు ఖర్చు చేశారని విమర్శించారు. ఢిల్లీ, ముంబై, చెన్నై, హైదరాబాద్ లాంటి రాజధాని ఆంధ్రప్రదేశ్కు అవసరం లేదా అని ప్రశ్నించారు. ప్రపంచ స్థాయి రాజధాని నిర్మిస్తామని అంటేనే సీఎం జగన్ అమరావతికి మద్దతు తెలిపారని స్పష్టం చేశారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు చందాలు వసూళ్లు చేసి రాజధానిలో ఉద్యమాన్ని అమరావతిలో నడిపిస్తున్నారని దుయ్యబట్టారు. అదే విధంగా.. మూడు లక్షల కోట్ల అప్పుతో మరొక లక్ష కోట్లు అప్పు చేస్తే రాజధాని నిర్మిస్తే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏం కావాలని నిలదీశారు. ఇప్పటికే అభివృద్ధి చెందిన వైజాగ్ను రాజధానిగా చేసుకుంటే ఆర్థికంగా ఎలాంటి ఇబ్బంది ఉండదని, సీఎం జగన్ ప్రజా ఆకాంక్షకు అనుగుణంగానే నిర్ణయాలు తీసుకుంటున్నారని పేర్కొన్నారు. గత పాలకులు రెండు లక్షల కోట్లు అప్పు తెచ్చి కమిషన్లు దండుకున్నారని విమర్శించారు. పార్టీలకు అతీతంగా ప్రజలు మూడు రాజధానులను స్వాగతిస్తున్నారని.. చిరంజీవి, జీవీఎల్, కేఈ, గంటా వంటి వారు జీఎస్ రావు కమిటీని స్వాగతిస్తున్నారని తెలిపారు. ప్రజలు అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం కేబినేట్ భేటీ తరువాత వస్తుందని పేర్కొన్నారు. -
బాబు పాలనలో టెండర్ల పేరుతో 46 వేల కోట్లు దుర్వినియోగం
-
రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి శంకరనారాయణ
వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తోందని మంత్రి శంకరనారాయణ, రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్రెడ్డి అన్నారు. వైఎస్సార్ జయంతిని పురస్కరించుకుని సోమవారం చెన్నేకొత్తపల్లిలో జరిగిన రైతు దినోత్సవంలో కలెక్టర్ సత్యనారాయణతో కలిసి వారు పాల్గొన్నారు. సంక్షేమం, అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోందన్నారు. అన్ని వర్గాల అభ్యున్నతే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందిస్తామన్నారు. అంతకుముందు వైఎస్సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించడంతో పాటు కేక్కట్ చేసి పంచిపెట్టారు. సాక్షి, కనగానపల్లి: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాలకు అనుగుణంగా రైతు సంక్షేమమే ధ్యేయంగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం పనిచేస్తుందని బీసీ సంక్షేమశాఖ మంత్రి శంకరనారాయణ పేర్కొన్నారు. వైఎస్సార్ జయంతిని పురస్కరించుకుని సోమవారం మండల కేంద్రంలో రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్రెడ్డి ఆధ్వర్యంలో రైతు దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మంత్రితో పాటు జిల్లా కలెక్టర్ సత్యనారాయణ, రాష్ట్ర వ్యవసాయశాఖ మిషన్ సభ్యులు బోయ నరేంద్ర హాజరయ్యారు. జలయజ్ఞం పేరుతో ఎన్నో సాగునీటి ప్రాజెక్టులను నిర్మించిన వైఎస్సార్ రైతు బాంధవుడయ్యారని మంత్రి గుర్తు చేశారు. అందుకే వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఆయన జయంతిని రైతు దినోత్సవంగా నిర్వహిస్తోందన్నారు. వైఎస్సార్ ఆశయాలకు అనుగుణంగా సీఎం వైఎస్ జగన్మెహన్రెడ్డి రైతుల సంక్షేమం అనేక పథకాలను ప్రకటించారన్నారు. ‘రైతు భరోసా’ కింద పంట పెట్టుబడి కోసం ఏటా రూ.12,500, వడ్డీ లేని పంట రుణాలు, ఉచిత పంటల బీమా సౌకర్యాన్ని కల్పిస్తామన్నారు. వీటితో పాటు సాగునీటి ప్రాజెక్టులన్నీ పూర్తి చేసి అన్ని ప్రాంతాలకు సాగు, తాగునీరు అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారన్నారు. వైఎస్సార్ కలలను సాకారం చేస్తాం ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్రెడ్డి మాట్లాడుతూ రాజన్న రాజ్యం తిరిగి రావాలని ప్రజలంతా వైఎస్సార్సీపీకి ఓటు వేసి గెలిపించారన్నారు. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఆయన కలలను సాకారం చేసేందుకు పాటుపడతామన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాల సాధనే లక్ష్యంగా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కూడా రాప్తాడు నియోజక వర్గానికి లక్ష ఎకరాలకు సాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారన్నారు. నిత్యం కరువుతో అల్లాడుతున్న చెన్నేకొత్తపల్లి, రామగిరి, కనగానపల్లి మండలాల్లో కొత్తగా సాగునీటి రిజర్వాయర్లు నిర్మించటంతో పాటు, త్వరలోనే పేరూరు డ్యాంను కృష్ణా జలాలతో నింపుతామన్నారు. అంతేకాకుండా ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకు మహిళల డ్వాక్రా రుణాలను మాఫీ చేయటంతో పాటు ‘అమ్మఒడి’ పథకం ద్వారా విద్యాభివృద్ధి కృషి చేస్తామన్నారు. ఇల్లు లేని నిరుపేదలందరికి ఇళ్లు మంజూరు చేయిస్తామన్నారు. వ్యవసాయ, వాటి అనుబంధ శాఖలు ఏర్పాటు చేసిన స్టాల్స్ ఆకట్టుకున్నాయి. డీఆర్డీఏ పీడీ నాగేశ్వరరావు, జేడీఏ హబీబ్బాషా, వైఎస్సార్సీపీ నాయకులు తోపుదుర్తి రాజశేఖరరెడ్డి, బిల్లే ఈశ్వరయ్య, గంగుల భానుమతి, సానే ఉమాదేవి, రాజారెడ్డి, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. -
రాప్తాడులో టీడీపీ ఏజెంట్లుగా రౌడీ షీటర్ల నియామకం
-
ఓటు వేయకపోతే చంపేస్తాం: పరిటాల వర్గీయుల బెదిరింపులు
-
పరిటాల వర్గీయుల బెదిరింపులు
సాక్షి, అనంతపురం: సార్వత్రిక ఎన్నికల ప్రచారం గడువు ముగిసినప్పటికీ అధికార పార్టీ అండతో టీడీపీ నేతలు బుధవారం కూడా ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. ఎన్నికల కోడ్ను ఉల్లంఘిస్తూ.. ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నారు. అనంతపురం జిల్లా రాప్తాడు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పరిటాల శ్రీరామ్.. రామగిరి, చెర్లోపల్లిలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ.. కోడ్ను ఉల్లంగిస్తున్నారు. శ్రీరామ్కు ఓటు వేయకపోతే చంపుతామని ఆయన వర్గీయులు బహిరంగ బెదిరింపులకు పాల్పడుతున్నారు. అంతేకాకుండా వైఎస్సార్సీపీ నేతలపై దాడులకు పాల్పడుతున్నారు. టీడీపీకి సహరించకపోతే అంతుచూస్తామని స్థానిక నేత ముత్యాలుపై పరిటాల అనుచరులు దాడికి దిగారు. పరిటాల దౌర్జన్యాలపై పోలీసులు ప్రేక్షకపాత్ర పోషించడంపై ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సునీత వర్గీయులను చెర్లోపల్లి గ్రామస్తులు అడ్డుకుని.. పోలీసులు సమాచారం ఇచ్చినా.. అధికారులు చూసీచూడనట్టు వదిలేశారు. ఓటర్లకు బెదిరింపులు, పోలీసుల తీరును వైఎస్సార్సీపీ రాప్తాడు అభ్యర్థి తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి తీవ్రంగా తప్పుపట్టారు. మంత్రి సునీతలకు పోలీసులు తొత్తులుగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం చేశారు. ఎన్నికలు నిష్పక్షపాతంగా నిర్వహించాలని, ఓటర్లను బెదిరిస్తున్నా పరిటాల వర్గీయులపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాడ్ చేశారు. -
నీళ్ల కోసం కాదు..నిధుల దోపిడికే! పేరూరు
రాప్తాడు నియోజకవర్గ రైతుల కల పేరూరు ప్రాజెక్టు. 70 ఏళ్ల క్రితం నిర్మితమైన ఆ ప్రాజెక్టుకు నీళ్లొస్తే ఈ ప్రాంతాల ముందు కోనసీమ దిగదుడుపే. ఎటు చూసినా పచ్చని పంట చేలతో వ్యవసాయాన్ని పండుగలా చేసేవారు. అలాంటి పేరూరు ప్రాజెక్ట్కు నీటి వనరులు లేకుండా పోయాయి. సాగునీళ్లు అందుతాయని, బీడు భూముల్లో పంటలు పండి తమ బతుకులు మారుతాయని వేల కుటుంబాలు ఏళ్ల తరబడి నిరీక్షిస్తూ వచ్చాయి. ప్రతి ఎన్నికల్లోనూ పేరూరు ప్రాజెక్ట్ను నీటితో నింపుతామంటూ నాయకులు లబ్ధి పొందుతూ వచ్చారు. రాప్తాడు నియోజకవర్గం ఏర్పడిన తర్వాత జరిగిన రెండు ఎన్నికల్లోనూ పరిటాల సునీతనే ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఈ రెండు ఎన్నికల్లోనూ పేరూరు ప్రస్తావనే ఆమెకు ఓట్లు పడేలా చేశాయి. కానీ నీళ్లవ్వలేదు. తాజా ఎన్నికల్లో సునీత తనయుడు శ్రీరాం బరిలో నిలిచారు. ఇప్పుడు కూడా ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు పేరూరు ప్రస్తావనే తెరపైకి తీసుకువచ్చారు. అసలు ప్రాజెక్ట్ను తామే తెచ్చామని, దానికి నీళ్లు రావాలంటే తిరిగి తనను గెలిపించాలని ఓటర్లను మభ్య పెట్టే ప్రయత్నాలకు తెరలేపారు. వాస్తవానికి ప్రాజెక్టు నిర్మాణంలో పరిటాల కుటుంబానికి రాజకీయ కోణం మినహా మానవీయ కోణం లేదనేది అక్షర సత్యం. ప్రకాష్రెడ్డి పోరాటాలు.. పేరూరు ప్రాజెక్టుకు నీళ్లివ్వాలని వైఎస్సార్ సీపీ రాప్తాడు సమన్వయకర్త, ప్రస్తుత ఆ పార్టీ అభ్యర్థి తోపుదుర్తి ప్రకాష్రెడ్డి పలు పోరాటాలు చేశారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చొరవ తీసుకుని ప్రకాష్రెడ్డి అందించిన ఫీజుబులిటీ రిపోర్టు ఆధారంగా రూ.119కోట్లతో ప్రాజెక్టుకు నీళ్లిచ్చేందుకు అధికారులు ప్రణాళిక రూపొందించారు. హంద్రీ–నీవాలో భాగంగా ‘పేరూరు బ్రాంచ్కెనాల్’ ఏర్పాటు చేసి నీళ్లు ఇవ్వాలని భావించారు. వైఎస్సార్ మరణానంతరం ఈ ప్రణాళికను చెత్తబుట్టలో పడేశారు. తర్వాత మడకశిర బ్రాంచ్ కెనాల్ ద్వారా తురకలాపట్నం నుంచి నీళ్లిస్తే పైసా ఖర్చు లేకుండా పేరూరుకు నీళ్లివ్వొచ్చని విపక్షపార్టీల నేతలను కలుపుకుని ప్రకాష్రెడ్డి పలుమార్లు ప్రభుత్వానికి విన్నవించారు. అయినా నాలుగేళ్లుగా పేరూరు ప్రాజెక్టును మంత్రి సునీత పట్టించుకోలేదు. ప్రణాళిక ప్రకారమే నిధుల దోపిడీ పేరూరు ప్రాజెక్ట్కు నీరు ఇవ్వాలనే అంశాన్ని ఎన్నికలకు ముందు మంత్రి సునీత తెరపైకి తెచ్చారు. గత ప్రభుత్వం డీపీఆర్ ప్రకారం బోరంపల్లి లిప్ట్ నుంచి రూ.119 కోట్లతో ఈ ప్రాజెక్టుకు నీళ్వివ్వొచ్చు. ఈ అంచనా వ్యయాన్ని రూ.803కోట్లకు పెంచేలా సునీత పావులు కదిపారు. కేవలం అడ్డగోలు గా నిధులు దోచుకోవడంలో భాగం గానే అంచనా వ్యయాన్ని పెంచినట్లు తెలుస్తోంది. ప్రాజెక్టు పరిధిలో పుట్టకనుమ, సోమరవాండ్లపల్లి వద్ద రెండు రిజర్వాయర్లు నిర్మించనున్నారు. ఇందులో 0.6 టీఎంసీలతో 26లక్షల క్యూబిక్ మీటర్ల విస్తీర్ణంలో పుట్టకనుమ రిజర్వాయర్ నిర్మించి నీళ్లివ్వాలని అప్పటి ఎమ్మెల్యే బి.నారాయణరెడ్డి ప్రభుత్వానికి లేఖ కూడా రాశారు. ఇప్పుడు ప్రభుత్వం నిర్మిస్తున్న పుట్టకనుమ సామర్థ్యం కూడా 0.6టీఎంసీలే! అయితే విస్తీర్ణం మాత్రం 26లక్షల నుంచి 76లక్షలకు పెంచారు. అంటే 50లక్షల క్యూబిక్ మీటర్ల పనిని పెంచారు. నిల్వ సామర్థ్యం పెరగనప్పుడు ప్రాజెక్టు విస్తీర్ణం పెరగడం దోపిడీకి అద్దం పట్టింది. దోపిడీపై న్యాయ పోరాటం.. పేరూరుకు నీళ్లిచ్చేందుకు ప్రత్యామ్నాయాలు ఉన్నా, తక్కువ ఖర్చుతో పనులు పూర్తి చేసే మార్గాలు ఉన్నా,కేవలం ప్రజాధనాన్ని దోపిడీ చేసేందుకు రూ.803కోట్లతో ప్రభుత్వం పాలన అనుమతులు ఇవ్వడంపై ఆయకట్టు రైతులు జెడ్పీటీసీ రవీంద్రారెడ్డి, పి.నల్లపురెడ్డి తదితరులు లోకాయుక్తను ఆశ్రయించారు. ప్రభుత్వం జారీ చేసిన జీవో 59లోని లోపాలు, నిపుణుల కమిటీ వ్యవహరించిన తీరు, ప్రభుత్వం ఆమోదించిన డీపీఆర్లోని లోపాలు, ఆయకట్టు పరిస్థితి తదితర అంశాలను ససాక్ష్యాలతో వివరించారు. పేరూరుకు నీళ్లిచ్చే పేరుతో సోమరవాండ్లపల్లి, పుట్టకనుమ రిజర్వాయర్లను పొందుపరిచారని, నిజానికి ఆ రిజర్వాయర్ల పరిధిలో ఆయకట్టు లేదని, కేవలం కాస్ట్బెనిఫిట్ రేషియో ప్రకారం పాలన అనుమతులు వచ్చేందుకే వాటిని పొందుపరిచారని పిటీషన్లో పేర్కొన్నారు. ఆ రిజర్వాయర్ల పరిధిలో పేర్కొన్న గ్రామాలకు హంద్రీ–నీవా, పీఏబీఆర్ డిస్ట్రిబ్యూటరీల ద్వారా నీరు ఇచ్చే అవకాశం ఉందని వివరించారు. కేవలం పెంచిన అంచనాలకు ఆమోద ముద్ర వేయించుకుని, ప్రజాధనాన్ని దోచుకునేందుకే ఈ రిజర్వాయర్లను డీపీఆర్లో పొందుపరిచారని అభ్యంతరం వ్యక్తం చేశారు. అయినప్పటికీ ప్రభుత్వం స్పందించలేదు. ఇదీ ప్రాజెక్టు చరిత్ర స్వాతంత్య్రం వచ్చిన తర్వాత పేరూరు ప్రాజెక్టును 1950–58లో నిర్మించారు. 1.82 టీఎంసీల సామర్థ్యం ఉన్న ఈ ప్రాజెక్టు నిర్మాణానికి అప్పట్లో రూ.1.69 కోట్లు ఖర్చు చేశారు. 3.5 కిలో మీటర్లున్న ప్రాజెక్టు పరిధిలో 10,048 ఎకరాల ఆయకట్టును స్థిరీకరించారు. కుడికాలవ పరిధిలో 9,448, ఎడమకాలవ పరిధిలో 600 ఎకరాల ఆయకట్టుకు నీరివ్వాలి. గత 60 ఏళ్లలో ఈ ప్రాజెక్ట్కు పూర్తిస్థాయిలో 14 సార్లు నీళ్లు వచ్చాయి. 75 శాతం ఒకసారి, 25 శాతం ఒకసారి వచ్చాయి. దాదాపు 34 ఏళ్లు ఈ ప్రాజెక్ట్కు చుక్కనీరు చేరలేదు. 25 సంవత్సరాల పాటు ఈ ప్రాంతానికి ఎమ్మెల్యేలుగా ఎన్నికవుతూ వచ్చిన పరిటాల కుటుంబీకులు ఈ పాతికేళ్లలో ఏనాడూ ప్రాజెక్ట్ గురించి పట్టించుకోకపోవడం గమనార్హం. ఫలితంగా ప్రాజెక్టుపై ఆధారపడిన భూములన్నీ బీళ్లుగా మారాయి. బతికే మార్గం లేక రైతులు వలసబాట పట్టారు. గుడ్విల్ కింద రూ.47 కోట్లు? పేరూరుకు నీటిని తరలించే పనులను మెయిల్ అనే నిర్మాణసంస్థ దక్కించుకుంది. ఈ సంస్థకు టెండర్ దక్కేలా సునీత ముందే పథకం రచించారు. దీంతో ‘గుడ్విల్’ కింద రూ.47కోట్లను మంత్రి కుటుంబీకులకు ఆ సంస్థ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ డబ్బులే ఇప్పుడు ఎన్నికల్లో పరిటాల కుబీంకులు విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్నారు. ఈ క్రమంలో అసలు రాప్తాడు ఎమ్మెల్యేగా ఇన్నేళ్లుగా ఎవరు కొనసాగుతున్నారు? ఎందుకు ఈ ప్రాజెక్టుకు నీరు రాలేదు? ఇందులో ఎవరి వైఫల్యం ఉంది? పేరూరు ప్రాజెక్టు పేరుతో దోపిడీ ఎలా జరిగింది? రైతులకు ఏతీరున అన్యాయం జరిగింది? అనే అంశాలపై నియోజకవర్గంలో ఎక్కడ చూసినా చర్చ నడుస్తోంది. పొలాన్ని బలవంతంగా లాక్కొన్నారు కేఎన్ పాళ్యం రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 336–1లో ఐదు ఎకరాల భూమికి 1976లో నా భర్త మంగల ముత్యాలప్ప పేరున ప్రభుత్వం డి–పట్టా ఇచ్చిం ది. 4 నెలల క్రితం పేరూరు డ్యాంకు కాలువ పనులకంటూ మా భూమిని ఇతరుల పేరుమీద మార్చి బలవంతంగా లాక్కొన్నారు. ఈ విషయంపై జిల్లా అధికారులు సైతం మాకు న్యాయం చేయలేదు. – మంగల నరసమ్మ, మద్దెలచెరువు, కనగానపల్లి మం‘‘ -
ఓటమి భయంతోనే సునీత ఆరోపణలు
సాక్షి, అనంతపురం సెంట్రల్: ఓటమి భయం వెంటాడటం వల్లే రాప్తాడు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి, మంత్రి పరిటాల సునీత తమపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని వైఎస్సార్సీపీ అభ్యర్థి తోపుదుర్తి ప్రకాష్రెడ్డి మండిపడ్డారు. రాప్తాడులో పాతిక వేల ఓట్ల మెజార్టీతో వైఎస్సార్సీపీ గెలవబోతోందనే విషయాన్ని మంత్రి జీర్ణించుకోలేకపోతున్నారన్నారు. నియోజకవర్గంలో టీడీపీ నేతలు సాగిస్తున్న అరాచకాల గురించి ఆదివారం సాయంత్రం అనంతపురంలో ఎస్పీ అశోక్కుమార్ను క్యాంపు కార్యాలయంలో కలిసి వివరించారు. తాము రెచ్చగొట్టే పనులు చేస్తున్నామని, కక్షలకు ఆజ్యం పోస్తున్నామని ఎటువంటి ఆధారం లేకుండానే మంత్రి ఫిర్యాదు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఆత్మకూరు మండలం తోపుదుర్తిలో గొర్రెల కాపరులను తమ పొలాల్లోకి రాకుండా అడ్డుకుంటున్నామని చెబుతుండడం బాధాకరమన్నారు. తమ గ్రామంలో 600 మంది గొర్రెల కాపరులుంటే అన్ని ఓట్లూ తమకే పడుతాయని, టీడీపీ నేతలు సైతం మా భూముల్లో వ్యవసాయం చేసుకుంటున్నారని చెప్పారు. రెండు రోజుల క్రితం తమ ప్రచార కార్యక్రమంలో పాల్గొనేందుకు వ చ్చిన తమ పార్టీ నాయకుడు నరేందర్రెడ్డి వాహనంలో జెండా కర్రలు దొరికాయని కేసులు నమోదు చేయించారన్నారు. దీన్ని టీడీపీ నాయకుడు సోషల్మీడియాలో షేర్ చేయడం, ఇదే విషయాన్ని బలపరుస్తూ మంత్రి పరిటాల సునీత ఎస్పీకి ఫిర్యాదు చేశారన్నారు. ముఖ్య నాయకులను పొట్టనపెట్టుకున్నారు! రాప్తాడు నియోజకవర్గంలో కనీసం ప్రతిపక్ష పార్టీ జెండా కర్రలు కూడా పట్టుకొని తిరిగే పరిస్థితి కల్పించకుండా టీడీపీ నాయకులు గత ఐదేళ్ల కాలంలో వైఎస్సార్సీపీ ముఖ్యమైన నాయకులను పొట్టన పెట్టుకున్నారని ప్రకాష్రెడ్డి ఆరోపించారు. నిరాధాయుడైన రాప్తాడు మండల కన్వీనర్ ప్రసాద్రెడ్డిని తహసీల్దార్ కార్యాలయంలో దారుణంగా హత్య చేశారన్నారు. కందుకూరు శివారెడ్డి, ఆత్మకూరు కేశవరెడ్డిలను వేటకొడవళ్లతో నరికి చంపారన్నారు. ఆ సమయంలో వారి వద్ద వైఎస్సార్సీపీ జెండా కర్రలున్నా ప్రాణాలతో బయటపడేవారని అన్నారు. సదరు హత్య కేసుల్లో నిందితులకు పరిటాల శ్రీరామ్ ఆశ్రయం కల్పిస్తున్నాడని, తమ వద్ద సాక్షాలున్నాయని స్పష్టం చేశారు. సదరు కేసుల్లో బాధిత కుటుంబాలు రాతపూర్వకంగా పరిటాల శ్రీరామ్, బాలాజీ, పరిటాల కుటుంబ సభ్యులపై ఫిర్యాదులు చేసినా పోలీసులు పట్టించుకోలేదన్నారు. గతంలో పరిటాల రవి పీపుల్స్ వార్, ఆర్వోసీ సంస్థలు ఏర్పరుచుకొని హిట్లిస్టులు ప్రకటించి మరీ కాంగ్రెస్ నేతలను హత్య చేసిన చరిత్ర వారిదని తెలిపారు. రక్త చరిత్ర సినిమాలో కూడా ఇదే చూపించారన్నారు. ప్రస్తుతం ఓటమి అంగీకరించలేక రక్త చరిత్ర–3 ద్వారా ప్రత్యర్థులను హత్య చేయడానికి పన్నాగం పన్నుతున్నారన్నారు. సాగునీరు ఇవ్వకపోవడంతో పంటలు పండక 20వేల మంది వలసలు పోయారన్నారు. ఫిర్యాదు చేసినా స్పందించని పోలీసులు వైఎస్సార్సీపీ కార్యకర్త వడ్డే రాజయ్యను పార్టీ మారాలని ఒత్తిడి తెచ్చారని, ప్రకాష్రెడ్డిని పదిరోజుల్లో చంపుతామని శ్రీరామ్ హెచ్చరించినా, సునీత తమ్ముడు మురళి మహిళలపై రాళ్లు రువ్వినా, ముకుందనాయుడు అనే వ్యక్తి పరిటాల సునీత సమక్షంలోనే ఎస్సీ, బీసీలకు వార్నింగ్లు ఇచ్చినా, హత్య కేసుల్లో బాధిత కుటుంబాలు రాతపూర్వకంగా ఫిర్యాదు చేసినా పోలీసులు చర్యలు లేకపోవడం బాధాకరమన్నారు. తెల్లకాగితంలా బతుకుతున్న తమపై బురుదజల్లే కార్యక్రమాలు పరిటాల సునీత ఇకనైనా మానుకోవాలని హితవు పలికారు. కార్యక్రమంలో రాప్తాడు జెడ్పీటీసీ వెన్నపూస రవీంద్రారెడ్డి, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు రాజారాం, నాయకులు ప్రసాద్రెడ్డి, నరేంద్రరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ప్రకాష్రెడ్డి ప్రచారానికి పోలీసుల అడ్డంకులు
సాక్షి, కనగానపల్లి: రాప్తాడు నియోజక వర్గంలోని రామగిరి మండలంలో వైఎస్సార్సీపీ అభ్యర్థి తోపుదుర్తి ప్రకాష్రెడ్డి గురువారం నిర్వహించిన ఎన్నికల ప్రచారానికి పోలీసులు అడుగడుగునా అడ్డంకుల వేశారు. టీడీపీ ప్రభుత్వ ఐదాళ్ల కాలంలో శాంతిభద్రతల పేరుతో ప్ర కాష్రెడ్డిని రామగిరి మండలంలోకి రాకుండా అడ్డుకొన్న పోలీసులు సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో కూడా అదేతంతు కొనసాగిస్తున్నారు. ఎన్నికల అధికారుల నిబంధనల ప్రకారం అభ్యర్థులు ఎక్కడికైనా వెళ్లి స్వేచ్ఛగా ప్రచారం చేసుకొనే హక్కు ఉంది. ఒకవైపున నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి ప్రచారానికి ఎటువంటి నిబంధనలు పాటించని పోలీస్ అధికారులు తోపుదుర్తి ప్రకాష్రెడ్డి ప్రచారానికి మాత్రం అడ్డంకులు చెపుతున్నారు. రామగిరి మండలంలో కలికివాండ్లపల్లి, గంత్రిమర్రి, పోలేపల్లి, చెర్లోపల్లి, కుంటిమద్ది జరిగిన ఎన్నికల ప్రచారంలో స్థానిక వైఎస్సార్సీపీ నాయకులు కూడా రాకుండా పోలీస్ అధికారులు అడ్డుకట్టలు వేశారు. అయినప్పటికీ మంత్రి పరిటాల సునీత సొంత మండలంలో ప్రజలు తోపుదుర్తి ప్రకాష్రెడ్డికి బ్రహ్మరథం పట్టారు. కలికివాండ్ల, గంతిమర్రి గ్రామాల్లో ప్రచారంలో పాల్గొనేందుకు వెళ్తున్న వైఎస్సార్సీపీ నియోజకవర్గ నాయకులు వేపకుంట రాజన్న, రామగిరి, చెన్నేకొత్తపల్లి మండలాల కన్వీనర్లు గోవిందరెడ్డి, నాగరాజులతో పాటు పలువురు వైఎస్సార్సీపీ నాయకులు జాతీయ రహదారి వద్దనే పోలీసులు అడ్డుకొన్నారు. ఎన్నికల అధికారి అనుమతులు ఉన్న వాహనాలు తప్ప ద్విచక్ర వాహనాలు కూడా వెళ్లకూడదని పోలీసులు అడ్డుచెప్పారు. దీంతో పాటు కుంటమద్ది, పోలేపల్లికి వెళ్లే ఎన్ఎస్ గేట్ వద్ద కూడా పోలీసులు కాపుకాచి వైఎస్సార్సీపీ నాయకులను అడ్డుకొన్నారు.పోలీసులు అడ్డంకులతో వాహనాలకు పక్కన పెట్టి చివరకు పొలాల మీదుగా నడుచుకొని వెళ్తున్న కార్యకర్తలను పోలీసులు పోలేపల్లి వద్ద ఆపి వారిపై లాఠీ చార్జీ చేశారు. రామగిరి ఎస్ఐ హేమంత్కుమార్తో పాటు స్పెషల్ పార్టీ పోలీసులు చేసిన లాఠీ చార్జీలో పలువురు పార్టీ కార్యకర్తలకు గాయపడినట్లు వైఎస్సార్సీపీ నాయకులు తెలిపారు. దీంతో పాటు ధర్మవరం రూరల్ పోలీస్ స్టేషన్కు చెందిన పోలీస్ అధికారి ప్రచారంలో పార్టీ నాయకుల పట్ల దురుసుగా ప్రవర్తించటంతో పాటు అనుమతి ఉన్న వాహనాలను కూడా అడ్డంకులు చెప్పారని వారు తెలిపారు. -
పోలీసులను అడ్డుపెట్టుకుని రాజకీయాలా?
అనంతపురం: రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన మంత్రి పరిటాల సునీతనే.. చట్టాన్ని ఉల్లంఘించేలా వ్యవహరించడం చూస్తే మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా...? అన్న అనుమానం కలుగుతోందని వైఎస్సార్ సీపీ రాప్తాడు సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్రెడ్డి అన్నారు. సోమవారం ఆయన నగరంలోని తన స్వగృహంలో విలేకరులతో మాట్లాడారు. పోలీసులను అడ్డుపెట్టుకుని రాజకీయం చేయడం మానుకోవాలని మంత్రికి హితవు పలికారు. డ్వాక్రా మహిళలకు ‘పసుపు–కుంకుమ’ కింద ఇస్తున్న డబ్బు కంటే ప్రభుత్వ ప్రచారమే ఎక్కువగా ఉందన్నారు. డ్వాక్రా రుణాలన్నీ మాఫీ చేస్తామని హామీ ఇచ్చి మోసం చేసిన మంత్రి సునీత..తమ గ్రామం వస్తుందని తెలుసుకునే తోపుదుర్తి మహిళలు ఆమెను నిలదీయాలని రెండు రోజుల కిందటే నిర్ణయించుకున్నారన్నారు. ఇది గ్రహించిన మంత్రి పోలీసులను అడ్డుపెట్టుకుని రాజకీయం చేయాలని చూస్తున్నారన్నారు. పోలీసులను అడ్డుపెట్టుకుని గ్రామాల్లోకి రానివ్వకుండా రాజకీయాలు చేసేది ఆడమగ కానివారేననీ, అదీ గతంలో ఎవరు... ఎక్కడ.... చేశారో వారికే తెలుసన్నారు. పదేళ్లలో మంత్రి సునీతను ఎన్నోమార్లు అడ్డుకున్నామనీ, నేడు సమస్య వచ్చింది కాబట్టే మహిళలు తిరగబడ్డారన్నారు. దీన్ని కూడా రాజకీయం చేస్తారా..?ప్రకాష్రెడ్డికి పోయేకాలం వచ్చిందని మాట్లాడతారా...? అని ప్రశ్నించారు. తాము ఎంతో సంస్కారవంతంగా మాట్లాడతామనీ, తమ కుటుంబం చాలా బాధ్యతాయుతంగా వ్యవహరిస్తుందన్నారు. ఈ సందర్భంగా ప్రకాష్రెడ్డి మంత్రి సునీతకు పలు ప్రశ్నలు సంధించారు. ♦ స్వచ్ఛభారత్ కింద మరుగుదొడ్ల నిర్మాణాల్లో రాప్తాడు నియోజకవర్గంలోనే రూ. వందల కోట్ల అవినీతి జరిగలేదా...? ఈ విషయంలో మహిళలను ఇబ్బంది పెట్టలేదా..? నిధులను మీ కార్యకర్తలు స్వాహా చేయలేదా..? కాణిపాకం వినాయకుడి మీద లేదంటే నీ భర్త పరిటాల రవి మీద ప్రమాణం చేసి అవినీతి జరగలేదని చెబుతారా...? ♦ రూ.వేల కోట్ల నిధులు ఉపాధి హామీ నిధులు నియోజకవర్గానికి వస్తే అందులో ఫారంపాండ్లకు నిధులు మళ్లించి జేసీబీలతో తవ్వించి, పాత వాటికి బిల్లులు చేసుకోలేదా..? నియోజకవర్గంలో 82 వేల మంది ఉపాధి కూలీల కడుపు కొట్టలేదా..? దీనిపై శ్వేతపత్రం విడుదల చేయండి. విచారణకు ఆదేశించండి. ♦ మహిళలకు జరిగిన అన్యాయంపై కనీసం గొంతెత్తలేని మంత్రి ఈరోజు దమ్ముధైర్యం గురించి మాట్లాడతారా..? దమ్ము అనేది ప్రజలకు అండగా నిలబడడంలో ఉండాలి. వారు కష్టాల్లో ఉంటే నేనున్నానంటూ ఆదుకునే విషయంలో దమ్ముండాలి. ఇచ్చిన మాట నిలుపుకునే దానిలో దమ్ముండాలి. అలాంటి దమ్మున్న నాయకుడు వైఎస్ రాజశేఖరరెడ్డి మాత్రమేనని ప్రకాష్రెడ్డి స్పష్టం చేశారు. ♦ ఊసరవెళ్లిలా రంగులు మారుస్తూ ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి రావాలి.. వచ్చిన తర్వాత దోచుకోవాలని ఆలోచించేది మీరు. రాజకీయాల పట్ల అవగాహన లేకపోతే పాఠాలు చెప్పించుకోండని మంత్రికి సూచించారు. ♦ ఐదేళ్ల కరువుతో రైతులు విలవిల్లాడుతున్నా.. ఇన్సూరెన్స్ గురించి ఆలోచించారా..? ఇన్పుట్ సబ్సిడీ ఏమైంది..? జిల్లాలో 300 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే మీ మనసు కరగలేదా..? ♦ మంత్రిగా ఉంటూ కియా పరిశ్రమలో స్థానికులకు ఉపాధి కల్పించే విషయమై మాట్లాడారా...? 3 వేలమంది ఉద్యోగులుంటే జిల్లాకు చెందిన వారికి 300 మందికైనా అవకాశం ఇప్పించారా...? జేజేలు పలికించుకోవాలంటే ముందుగా ప్రజల మన్నలు పొందాలని ప్రకాష్రెడ్డి హితవు పలికారు. ఈ విషయం మీ కుమారుడికి తెలియజెప్పండని సూచించారు. ♦ 25 ఏళ్లుగా మీ క్షుద్ర రాజకీయాలు చూసి ప్రజలు అలిసిపోయారనీ, అందుకే మార్పు కోసం ఎదురు చూస్తున్నారని ప్రకాష్రెడ్డి అన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజలకు అండగా నిలుస్తున్నారనీ, రాప్తాడు నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు సాగునీరిస్తామని భరోసా ఇచ్చారన్నారు. డ్వాక్రా మహిళలు, రైతులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీకు అండగా ఉంటామంటున్నామన్నారు. అందుకే ప్రజలు వైఎస్ జగన్ వెంట నడుస్తున్నారన్నారు. సమావేశంలో రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు బోయ రాజారాం పాల్గొన్నారు. -
సాక్షి కార్యాలయం ఎదుట పరిటాల శ్రీరామ్ వీరంగం
-
సాక్షి కార్యాలయం ఎదుట పరిటాల శ్రీరామ్ వీరంగం
సాక్షి, అనంతపురం : అనంతపురంలో మంత్రి పరిటాల సునీత వర్గీయులు వీరంగం సృష్టించారు. తమకు వ్యతిరేకంగా వార్తలు రాస్తున్నారంటూ అనంతపురం కమలానగర్లోని సాక్షి ప్రాంతీయ కార్యాలయం ఎదుట మంత్రి పరిటాల వర్గీయులు ధర్నా చేశారు. ఈ ధర్నాకు నేతృత్వం వహించిన మంత్రి సునీత తనయుడు పరిటాల శ్రీరామ్.. సాక్షి మీడియా పై తన అక్కసు వెళ్లగక్కారు. సాక్షి కార్యాలయం వద్ద మంత్రి పరిటాల సునీత వర్గీయుల ధర్నాను వైఎస్సార్ సీపీ రాప్తాడు సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. నిజాలు నిర్భయంగా తెలియజేసే సాక్షి మీడియాపై అనవసర రాద్ధాంతం చేయటం మంత్రి పరిటాల సునీతకు తగదన్నారు. రాప్తాడు నియోజకవర్గంలో మంత్రి పరిటాల సునీత, ఆమె కుటుంబ సభ్యులు వందల కోట్ల అవినీతికి, అక్రమాలకు పాల్పడ్డారని ధ్వజమెత్తారు. వాటిని ప్రజలకు ఆధారాలతో సహా వివరిస్తున్న సాక్షి మీడియా పై అక్కసు వెళ్లగక్కటం మంత్రి పదవిలో ఉన్న పరిటాల సునీతకు తగదని తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మండిపడ్డారు. వైఎస్సార్ సీపీ రాప్తాడు సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి -
ఎర్రచేళ్లను మాగాణిగా మారుస్తాం
అనంతపురం, ఆత్మకూరు: తాను ఎమ్మెల్యేగా గెలిచి వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తే ఎర్ర చేళ్లను మాగాణులుగా మార్చి రాప్తాడు నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేస్తామని, ఆరు నెలలు తిరక్కుండానే హంద్రీ–నీవా ద్వారా ప్రతి ఎకరాకూ సాగునీరు అందిస్తామని వైఎస్సార్సీపీ రాప్తాడు నియోజకవర్గ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్రెడ్డి అన్నారు. కరువు పోరు రైతు యాత్రలో భాగంగా ఆదివారం ఆయన ఆత్మకూరు మండలంలోని పంపనూరు, వై.కొత్తపల్లి నుంచి పి.యాలేరు మీదుగా ఆత్మకూరు వరకు పాదయాత్ర చేపట్టారు. దారి పొడవునా అన్ని గ్రామాల్లో ఆయనకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. బాణాసంచా పేలుళ్లు, డప్పుల మోతల నడుమ పూలు చల్లుతూ ఘన స్వాగతం పలికారు. పాదయాత్ర ముగిసిన అనంతరం ఆత్మకూరులో బహిరంగ సభ ఏర్పాటు చేశారు. అందులో తోపుదుర్తి ప్రకాష్రెడ్డి మాట్లాడుతూ ఒక్క అవకాశం ఇస్తే నియోజకవర్గాన్ని ససశ్యామలం చేసి చూపిస్తానన్నారు. హంద్రీ నీవా నీరు కళ్లముందు కనపడుతున్నా... చేళ్లలోకి తెచ్చుకోలేకుండా ప్రజలు ఏ విధంగా మోసపోయారో, కరువు వల్ల ఎన్ని కష్టాలు పడుతున్నారో ప్రభుత్వానికి చెప్పడానికే తాను పాదయాత్ర చేస్తూ ప్రజల ముందుకు వచ్చానన్నారు. కరువుబారిన పడిన వేరుశనగ రైతుకు ఎకరాకు రూ.20 వేలు నష్ట పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. పంటకు పెట్టిన పెట్టుబడి కూడా రాక, ఇన్పుట్ సబ్సిడీ, ఇన్సూ్యరెన్స్లు అందక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అనంత రైతుల గోడు కోట్టుకోకముందే, ప్రభుత్వం బంగాళాఖాతంలో కలవకముందే కళ్లు తెరిచి రైతులకు న్యాయం చేయాలన్నారు. మంత్రిగా పరిటాల సునీత ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రెండు నిర్ణయాలు తీసుకున్నారని, పిల్ల కాలువలు రద్దు చేసి రైతుల పొలాలకు రావాల్సిన నీళ్లను కుప్పం తీసుకెళ్లడం ఒకటైతే... రెండోది ఆత్మకూరు మండలంలో రూ.9 కోట్ల విలువజేసే పనులను సీఎం రమేష్కు రూ.90 కోట్లకు అప్పగించడమన్నారు. పొలాలకు నీళ్లివ్వాలని అడిగితే సోలార్ పవర్ప్లాంట్లు తెచ్చి ఆ భూములను స్వాధీనం చేసుకుంటున్నారని, సోలార్, గాలిమరల ప్రాజెక్టుల్లో కమీషన్లు తీసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసైన్మెంట్ భూములన్నీ ఆన్లైన్లో పరిటాల సునీత బంధువుల పేర్ల మీద మార్చుకుంటున్నారని విమర్శించారు. ఒక్క రూపాయి ఖర్చు కాకుండా నీరు ఇవ్వచ్చు కంబదూరు, కళ్యాణదుర్గం మండలాల మీదుగా పేరూరు డ్యాంకు నీరు తీసుకురావచ్చని, తురకలాపట్నం నుంచి పెన్నానదిలోకి నీరు వదిలితే రూపాయి ఖర్చు లేకుండా నీళ్లు వస్తాయని ప్రకాష్రెడ్డి తెలిపారు. ఈ విషయాన్ని సమావేశాలు, పత్రికల ద్వారా తెలియజేసినా మంత్రి వాటిని వక్రీకరిస్తున్నారని విమర్శించారు. 2009, 2014 సంవత్సరాల్లో ఆత్మకూరు చెరువుకు నీళ్లిస్తామని మంత్రి మాట ఇచ్చారని, కానీ దివంగత నేత వైఎస్ రాజశేఖర్రెడ్డి 2008లోనే హంద్రీ–నీవా రెండోదశ టెండర్లు పిలిచి ఆత్మకూరు ఎగువ ప్రాంతాలకు నీరు అందాలంటే ఆత్మకూరుకు రెండు కిలోమీటర్లు ఎగువన కాలువ వెళ్లాలని చెప్పారన్నారు. ఆ కాలువ పనులు పూర్తయి ఉంటే ఇప్పటికే ఆత్మకూరు మండలంలోని 12వేల ఎకరాలకు నీళ్లు అందేవన్నారు. వైఎస్సార్ ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయడానికి వరమిస్తే... ఆయన మరణానంతరం టీడీపీ అధికారంలోకి వచ్చాక మంత్రి పరిటాల సునీత జీఓ 22 తీసుకొచ్చి పిల్లకాలువల నిర్మాణాన్ని రద్దుచేసి రైతులకు అన్యాయం చేశారని దుయ్యబట్టారు. పేరూరుకు కాలువ తీసుకుపోవడం తమకూ సంతోషమేనని, కానీ ఆత్మకూరు మండలానికి నీళ్లు ఇవ్వకుండా కాలువను కిందకు దించి అన్యాయం చేశారని విచారం వ్యక్తం చేశారు. తోపుదుర్తి చందు మాట్లాడుతూ ప్రకాష్రెడ్డి అధికారంలో లేకపోయినా ఉచితంగా బోర్లు వేయించారని, గొర్రెల సంఘాలు ఏర్పాటు చేసి ప్రజలను అదుకున్నారని చెప్పారు. హంద్రీ నీవా కాలువను రాజశేఖర్రెడ్డి తీసుకొస్తే మంత్రి సునీత గంగపూజలు, తెప్పోత్సవాలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. 30 సంవత్సరాల టీడీపీ పాలనలో నియోజకవర్గప్రజలు నలిగిపోతున్నారని, తమకు ఒక్క అవకాశం ఇచ్చి చూడాలని కోరారు. రాగే పరుశురామ్ మాట్లాడుతూ చంద్రబాబునాయుడు 600 అపద్దాలతో అధికారంలోకి వచ్చారన్నారు. రాష్ట్రంలో 63 లక్షల మంది నిరుద్యోగులుంటే ఏ కొద్దిమందికో నిరుద్యోగ భృతి ఇచ్చారన్నారు. వైఎస్సార్ హయాంలో 45 లక్షల ఇళ్లు మంజూరు చేస్తే ప్రస్తుత టీడీపీ ప్రభుత్వం 4 లక్షలు కూడా మంజూరు చేయలేదన్నారు. అనంతరం గంగుల భానుమతి, రాజారాం మాట్లాడుతూ ప్రకాష్రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాల్సిన బాధ్యత మన అందరిపైనా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ హిందూపురం పార్లమెంట్ అధ్యక్షుడు శంకర్నారాయణ, రిటైడ్ జడ్జ్ కిష్టయ్య, జెడ్పీ ఫ్లోర్ లీడర్ వెన్నపూస రవీంద్రారెడ్డి, వైఎస్సార్సీపీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు రాజారాం, రాష్ట్ర కార్యదర్శి మహానందరెడ్డి, జెడ్పీటీసీ బిల్లే ఈశ్వరయ్య, జిల్లా అధికార ప్రతినిధిè చంద్రశేఖర్రెడ్డి, ఆయా మండలాల కన్వీనర్లు బాలపోన్న, రామాంజి, నాగముణి, వరప్రసాద్రెడ్డి, నాగరాజు, శ్రీధర్, నాగమళ్లేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆయకట్టు రద్దు చేసి అన్యాయం చేశారు రైతుల గరించి ఆలోచించి హంద్రీ నీవా కాలువను తీసుకొచ్చింది దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్రెడ్డి అయితే టీడీపీ నాయకులు గంగపూజలు చేస్తూ ఆనందపడుతున్నారు. వైఎస్సార్ హయాంలో హంద్రీ నీవా కాలువ పనులు 90 శాతం పూర్తయ్యాయి. మిగిలిన 10 శాతం టీడీపీ వారు పూర్తి చేసి తామే చేశామంటూ గొప్పలు చెబుతున్నారు. కానీ వాస్తవంగా వాళ్లు ఆయకట్టు రద్దు చేసి రైతులకు అన్యాయం చేశారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తే కోస్తాంధ్రాలను తలపించే విధంగా అనంతకు హంద్రీ నీవా నుంచి పిల్ల కాలువల ద్వారా నీటిని అందిస్తాం.– నదీమ్ అహమ్మద్, హిందూపురం పార్లమెంట్ సమన్వయకర్త కరువు నివారణ పథకాలు కరువు జిల్లాలో కరువును నివారించే పథకాలే కరువయ్యాయి. దీంతో చాలామంది రైతులు పొలాల్లో నీరులేక భూములను బీళ్లుగా వదిలేసి వలసలు వెళ్తున్నారు. కోస్తాంధ్రాలో ప్రతి ఎకరాకూ నీళ్లు వెళ్లాయి. రాయలసీమలో ఆ పథకం మొదలైతే రైతులు రాజు అవుతారు. రాష్ట్రంలో పండించిన పంటలకు గిట్టుబాటు ధరల్లేక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా ప్రభుత్వం పట్టించుకోలేదు. అనంతలో నిరుద్యోగుల సంఖ్య పెరిగిపోతోంది. గతంలో జిల్లాకు రూ.7,676 కోట్లతో ప్రాజెక్టు ఉన్నా టీడీపీ ప్రభుత్వం దానిని పట్టించుకోలేదు.– పీడీ రంగయ్య, అనంతపురం పార్లమెంట్ సమన్వయకర్త -
పరిటాల సునీత వ్యాఖ్యలు అభ్యంతరకరం
అనంతపురం: వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తనపై తానే దాడి చేయించుకున్నారని మంత్రి పరిటాల సునీత వ్యాఖ్యలు చేయడం అభ్యంతరకరమని వైఎస్సార్సీపీ రాప్తాడు సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి అన్నారు. అనంతపురంలోని పార్టీ కార్యాలయంలో తోపుదుర్తి విలేకరులతో మాట్లాడుతూ.. పరిటాల రవి హత్య కేసులో ఆరోపణలు వస్తే వైఎస్సార్ సీబీఐ విచారణకు ఆదేశించిన విషయాన్ని గుర్తు చేశారు. వైఎస్ జగన్ హత్యాయత్నం వెనక సాక్షాత్తూ ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఆరోపణలు ఉన్నాయని వ్యాఖ్యానించారు. టీడీపీ నేతలు ఎందుకు సీబీఐ విచారణ అంటే భయపడుతున్నారని ప్రశ్నించారు. ఘటన జరిగిన అర గంటకే పబ్లిసిటీ కోసమంటూ డీజీపీ చెప్పటం దారుణమన్నారు. తాము తలచుకుంటే కైమా చేసేవాళ్లం అంటూ మంత్రులు, ఎంపీలే వ్యాఖ్యానించడం దేనికి సంకేతమన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ గల్లంతవుతుందన్న భయంతోనే జగన్పై హత్యకు కుట్ర పన్నారని ఆరోపించారు. వైఎస్ జగన్ను చంపేందుకు పక్కా ప్లాన్ జరిగిందని, అదృష్టవశాత్తూ అది విఫలమైందని పేర్కొన్నారు. కేసును తప్పు దాడి పట్టించేందుకే ప్రభుత్వ పెద్దలు దొంగ ఫ్లెక్సీలు విడుదల చేశారని ఆరోపించారు. -
అసెంబ్లీ సాక్షిగా అంగీకరించారు
రాప్తాడు: ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై రాప్తాడు వైఎస్సార్సీపీ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. డ్వాక్రా రుణాలు మాఫీ కాలేదని మంత్రి పరిటాల సునీత అసెంబ్లీ సాక్షిగా అంగీకరించినా మొత్తం మాఫీ చేసినట్లు టీడీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. అనంతపురం జిల్లా రాప్తాడులో తోపుదుర్తి విలేకరులతో మాట్లాడుతూ..చంద్రబాబు జరిపే జిల్లా పర్యటనలు వృధా అని విమర్శించారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ నెరవేర్చలేదని తీవ్రంగా దుయ్యబట్టారు. అనంతలో లక్ష ఇంకుడు గుంతల నిర్మాణం బోగస్ అని వెల్లడించారు. యంత్రాలతో ఉపాధి పనులు చేసి టీడీపీ నేతలు కోట్ల రూపాయలు దోచుకున్నారని విమర్శించారు. ఆధారాలతో ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం 4.3 టీఎంసీలు భైరవానితిప్ప ప్రాజెక్టుకు నీరు కర్నాటక నుంచి రావాలి కానీ చంద్రబాబు, ఆయన మంత్రులు ఎందుకు అడగలేదని ప్రశ్నించారు. హంద్రినీవా నుంచి భైరవానితిప్ప ప్రాజెక్టుకు నీరు తరలించే సాకుతో 968 కోట్ల రూపాయల పనులు చేపట్టడం భావ్యమా అని ప్రశ్నించారు. మంత్రి కాలువ శ్రీనివాస్కు దోచిపెట్టేందుకే ఈ ప్రాజెక్టు చేపట్టారని ధ్వజమెత్తారు. -
‘చంద్రబాబు నిర్వాకం వల్లే వలసలు’
సాక్షి, అనంతపురం : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్వాకం వల్లే వలసలు పెరిగాయని వైఎస్సార్సీపీ నేతలు తోపుదుర్తి ప్రకాష్రెడ్డి, శంకర్ నారాయణ, నదీం అహ్మద్ విమర్శించారు. ఆదివారం బెంగళూరు వలస కూలీలతో వైఎస్సార్సీపీ నేతలు ముఖాముఖి నిర్వహించారు. అనంతపురం జిల్లానుంచి బెంగళూరుకు వలస వెళ్లిన వారి స్థితిగతులను వారు ఆరా తీశారు. వైఎస్సార్సీపీ నేతలు మాట్లాడుతూ.. వలసలు పెరగటం వల్ల రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కర్నాటక, కేరళ వంటి రాష్ట్రాలకు వేలాదిగా వలస వెళ్లారన్నారు. ఉపాది పనులు కల్పించనందుకే ఈ దుస్థితి వచ్చిందన్నారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయిన వెంటనే వలస కూలీలంతా సొంత గ్రామాలకు తిరిగిరావాలని కోరారు. ఉపాధి అవకాశాలు కల్పిస్తామని బరోసా ఇచ్చారు. వ్యవసాయాన్ని పండుగ చేస్తామని హామీ ఇచ్చారు. -
ఓటమి భయంతోనే టీడీపీ దుశ్చర్య
హిందూపురం అర్బన్: టీడీపీకి ఓటమి భయం పట్టుకుందని, అందుకే నంద్యాల తరహా రాజకీయాలకు హిందూపురం నియోజకవర్గంలో శ్రీకారం చుట్టిందని వైఎస్సార్సీపీ జిల్లా నాయకులు తోపుదుర్తి ప్రకాష్రెడ్డి, శ్రీధర్రెడ్డి, సిద్దారెడ్డి, నదీంఅహ్మద్లు అన్నారు. ఆదివారం సాయంత్రం వారు హిందూపురం ఆర్అండ్బీ అతిథిగృహంలో విలేకరులతో మాట్లాడారు. పోలీసుశాఖ ఏకపక్షంగా వ్యవహరిస్తూ కేవలం స్పార్క్ సంస్థ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదులను మాత్రమే పరిగణనలోకి తీసుకుని, వైఎస్సార్సీపీ నాయకులు ముందుగా ఇచ్చిన ఫిర్యాదులను బుట్టదాఖలు చేశారన్నారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఇక్కడ గెలుస్తుందన్న భయంతోనే.. ఏవిధంగానైనా టీడీపీ పట్టు నిలుపుకునేందుకు స్వయంగా సీఎం కుమారుడు మంత్రి నారా లోకేష్, బావమరిది ఎమ్మెల్యే బాలకృష్ణ, జిల్లామంత్రి పరిటాల సునీతలు పోలీసులపై ఒత్తిడి తెచ్చి వైఎస్సార్సీపీ నాయకులపై కేసులు బనాయిస్తున్నారన్నారు. సర్వే వ్యక్తుల వద్ద దొరికిన పేపర్లలో ఉన్న సమాచారంలో వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నాయకుల వ్యక్తిగత వివరాలు, ప్రలోభాలు చూపిన వివరాలు అన్నీ స్పష్టంగా ఉన్నా ఏమాత్రం చర్యలు లేవన్నారు. ఎవరైనా అభివృద్ధి చేసి ఓట్లు అడగడం పరిపాటనీ... అవేవీ చేయకుండా ప్రజలు ఓట్లు వేయడానికి సముఖంగా లేరని గ్రహించి ఆయా వార్డుల్లో ప్రభావితం చేసే వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలను ప్రలోభాలు, బెదిరింపులతో లొంగదీసుకోవడానికి బాలకృష్ణ ఇలాంటి ప్రయత్నాలు చేయడం సిగ్గుచేటన్నారు. సొంతింటిని చక్కదిద్దుకోండి శాంతికి మారుపేరుగా నిలిచిన హిందూపురంలో భయానక వాతావరణం సృష్టించడం బాధకరమన్నారు. టీడీపీలో ఉన్న వారే అసంతృప్తితో ఉన్నారని, ముందు సొంతింట్లో పరిస్థితులు చక్కదిద్దుకోండని హితవు పలికారు. ఆ ప్రయత్నం చేయకుండా వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలను టార్గెట్ చేయడం ఏమిటని ప్రశ్నించారు. స్పార్క్ సంస్థ వెనుకున్నవారిపై, సర్వేచేస్తున్న వారిపై చర్యలు తీసుకోకపోతే చట్టం ద్వారా సమస్యను పరిష్కరించుకుంటామన్నారు. చట్ట వ్యతిరేకంగా సర్వే చేస్తున్న వారిని, సామగ్రిని అప్పగిస్తే కిడ్నాప్ ఎక్కడ ఉందని ప్రశ్నించారు. నవీన్నిశ్చల్ను కేసులతో ఇబ్బందులు పెడితే వైఎస్సార్సీపీ చూస్తూ ఊరుకోదన్నారు. పోలీసులు పక్షపాతం వీడి.. న్యాయబద్ధంగా వ్యవహరించాలని కోరారు. నవీన్నిశ్చల్పై అక్రమ కేసులు ఎత్తేయాలని, స్పార్క్ సంస్థపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. డబ్బుతో కొనొచ్చని పేపర్లలో స్పష్టీకరణ బీసీ, మైనార్టీ, దళితులను డబ్బుతో కొనవచ్చని సర్వే కాగితాల్లో స్పష్టంగా రాసి ఉందన్నారు. నాలుగేళ్లు అధికారంలో ఉండి ఈ కులాల వారికి ఏమీ చేయకుండా ఎన్నికలు దగ్గరపడుతున్నాయని కుయుక్తులు పన్నుతున్నారన్నారు. అనంతరం వన్టౌన్ పోలీసుస్టేషన్కు వెళ్లి ఇన్చార్జి డీఎస్పీ వెంకటనారాయణను కలిసి మాట్లాడారు. సమావేశంలో వైఎస్సార్సీపీ జిల్లా రైతు సంఘం అధ్యక్షుడు బాలచంద్రారెడ్డి, మండల కన్వీనర్ నారాయణస్వామి, జగన్మోహన్రెడ్డి, కౌన్సిలర్లు నాగభూషణరెడ్డి, రజనీ, మహిళా మండల కన్వీనర్ నాగమణి, స్థానిక నాయకులు పాల్గొన్నారు. పోలీసుల హైడ్రామా హిందూపురం అర్బన్: వైఎస్సార్సీపీ నాయకులు ఫజుల్రెహమాన్, మల్లికార్జున, ఇర్షాద్, టైలర్ జబీ, షేక్షాలను శనివారం సాయంత్రం అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆదివారం రాత్రి వరకు కోర్టులో హాజరుపర్చకుండా వన్టౌన్ పోలీసుస్టేషన్లో ఉంచారు. ఈ విషయం తెలుసుకున్న పార్టీ జిల్లా నాయకులు అరెస్టయిన వారిని కలవడానికి పోలీసుస్టేషన్కు బయల్దేరారు. సమాచారం అందుకున్న డీఎస్పీ వెంకటనారాయణ, సీఐలు హైడ్రామాకు తెరలేపారు. ఒక్కసారిగా పోలీసుస్టేషన్లో సిబ్బందిని అప్రమత్తం చేసి అదుపులోకి తీసుకున్న ఐదుగురిని వాహనంలో బలవంతంగా ఎక్కించి మరోచోటికి తరలించే ప్రయత్నం చేశారు. ఈ తతంగాన్ని విలేకరులు ఫొటోలు తీçస్తుండగా అడ్డుకున్నారు. అరెస్టయినవారిని వాహనంలో తీసుకుని బయటకు వస్తుండగా వైఎస్సార్సీపీ జిల్లా నాయకుల వాహనం వారి ముందుకు వచ్చింది. దీంతో పోలీసులు తమ వాహనాన్ని వేగంగా ఆస్పత్రికి వైపునకు తీసుకెళ్లారు. విలేకరులు పసిగడతారని ఆస్పత్రిలోని చీకటి ప్రాంతంలో వాహనాన్ని ఉంచారు. మీడియా వస్తుండటంతో వాహనాన్ని తిరిగి టూటౌన్ స్టేషన్కు తీసుకెళ్లారు. దీనిపై వన్టౌన్ సీఐ చిన్నగోవిందును అడుగగా తనకేమీ సంబంధం లేదని, కేసు టూటౌన్ పరిధిలోకి వస్తుందని చెప్పారు. టూటౌన్ సీఐ తమీంఅహ్మద్ను విలేకరులు ప్రశ్నించగా సాయంత్రమే అదుపులోకి తీసుకున్నామని, కోర్టులో హాజరుపరుస్తాం అంటూ చెప్పుకొచ్చారు. -
కేశవనాయక్ది రాజకీయ హత్య
అనంతపురం రూరల్: టీడీపీ నాయకులకు తొత్తులుగా మారి రైతులకు అన్యాయం చేస్తున్న అధికారులను మాత్రమే విమర్శించాననీ, నీతి నిజాయతీతో పనిచేసే అధికారులను ఎప్పటికీ గౌరవిస్తామని వైఎస్సార్సీపీ రాప్తాడు నియోజకవర్గ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఇటీవల ఆత్మహత్య చేసుకున్న కేశవనాయక్ భార్య, కూతుళ్లతో కలిసి మాట్లాడారు. రాప్తాడు నియోజకవర్గంలో మంత్రి పరిటాల సునీత బంధువులు మండలాలకో ఇన్చార్జిగా ఉంటూ అధికారులపై తీవ్ర ఒత్తిళ్ల తెస్తున్నారన్నారు. ప్రతి పనీ వారి కనుసన్నల్లోనే జరిగేలా అధికారులను వేధిస్తున్నారన్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని నియోజకవర్గంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్నా... పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు. నియోజకవర్గంలో అనేక మంది రైతుల భూముల రికార్డులు మార్పులు చేస్తూ దౌర్జన్యంగా భూములు లాకుంటున్నారన్నారు. వారి ఆగడాలను ప్రశ్నిస్తున్న ప్రతిపక్ష నాయకలపై దాడులు, హత్యలకు తెగబడుతున్నా..పోలీసులు చూస్తే ఊరుకుంటున్నారన్నారు. వేపచర్ల లో రైతు కేశవా నాయక్ భార్య శాంతమ్మకు భూపంపిణీ కింద ఇచ్చిన భూమికి సంబంధించి ఆన్లైన్లో పేరుమార్చి టీడీపీ నేతలు దౌర్జంగా ఆక్రమించుకున్నారనీ, కేశవానాయక్ అక్కడి తహసీల్దార్, రెవెన్యూ అధికారులను వేడుకున్నా పట్టించుకోలేదన్నారు. పైగా టీడీపీలో చేరితే నీ భూమి నీకు వస్తుందని ఉచిత సలహా ఇచ్చారన్నారు. అందుకే కేశవనాయక్ జిల్లా కేంద్రంలో జరిగే ‘మీకోసం’కు వచ్చి ఏకంగా జిల్లా కలెక్టర్కే తన పరిస్థితిని వివరిస్తూ అర్జీ ఇచ్చారన్నారు. అయితే కేశవనాయక్ ఇచ్చి అర్జీ తిరిగి తహసీల్దార్కు పంపారనీ...అందువల్లే ఇక తనకు న్యాయం జరగదన్న బాధతోనే కేశవనాయక్ ఆత్మహత్య చేసుకున్నాడన్నారు. కేశవానాయక్ ఆత్మహత్యకు కారణమైన అధికారులను మాత్రమే విమర్శించానన్నారు. కేశవనాయక్ కుటుంబాన్ని ఆదుకుంటామని హామీ ఇచ్చి తర్వాత శాంతమ్మ ఆ భూమిలో సాగులో లేదని ఈ భూమికి ఆమెకు ఎటువంటి సంబంధంలేదని ఆత్మకూరు రెవెన్యూ అధికారులకు, జిల్లా కలెక్టర్కు నివేదిక ఇస్తే పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవాలన్నారు. కుటుంబానికి అండగా ఉన్న భర్త పోయి ఉన్న భూమిపోయి బ్యాంకులో అప్పులు మిగిలితే కలిగే బాధ ఏ కుటుంబానికీ రాకుడదన్నారు. భర్త లేకపోతే కలిగే బాధ మంత్రి కి కూడా తెలిసే ఉంటుందన్నారు. కనీసం మహిళ అనే కనికరం లేకుండా మానవత్వం మరచి టీడీపీ నాయకులు ప్రవర్తించడం దుర్మాగమన్నారు. టీడీపీ నాయకలు వారి రాజకీయ లబ్ధి కోసం అధికారులను రెచ్చగొడుతున్నారనీ, దయ చేసి వారు చేస్తున్న కుట్రలను గమనించాలన్నారు. టీడీపీ నాయకులకు రైతులు, పేద ప్రజల సంక్షేమంపై చిత్తశుద్ధి ఉంటే కేశవనాయక్ కుటుంబానికి న్యాయం చేయాలన్నారు. అపుడు తాను క్షమాపణ చెప్పేందుకు కూడా సిద్ధంగా ఉన్నానన్నారు. వనజాక్షిపై దాడి జరిగినప్పుడు ఎందుకు మాట్లాడలేదు? ప్రకాష్రెడ్డి అధికారులపై చేసిన వాఖ్యలను ఖండిస్తానని చెప్పిన ఎంపీ జేసీ దివాకర్రెడ్డి..మహిళా తహసీల్దార్ వనజాక్షిపై టీడీపీ నేతలు దాడి చేసినప్పుడు ఎక్కడకు పోయారని వైఎస్సార్సీపీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు బోయనరేంద్ర, కనగానపల్లి జెడ్పీటీసీ సభ్యుడు బిల్లే ఈశ్వరయ్య ప్రశ్నించారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారులపై దాడులకు పాల్పడుతున్నది ఎవరో ఉద్యోగులందరికీ తెలుసన్నారు. ఇంత అన్యాయమా మా భూమి రికార్డులు మార్చి ఆక్రమించుకున్నారని ఆధికారులను వేడుకున్నామనీ.. అయినా న్యాయం జరగపోవడంతోనే కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలో దిక్కుతోచక తన భర్త ఆత్మహత్య చేసుకున్నాడని కేశవానాయక్ భార్య శాంతమ్మ కన్నీటిపర్యంతమైంది. ఆసరాగా ఉండాల్సిన తండ్రి లేడనీ...ఉన్న భూమిని అన్యాయంగా ఆక్రమించుకుంటే తమకు దిక్కెవరంటూ కేశవానాయక్ కూతుళ్లు త్రివేణి, భారతి వాపోయారు. -
రైతుల కోసమే పుట్టాం.. వారి కోసమే చస్తాం
ఆత్మకూరు: ‘రైతులకు అన్యాయం జరిగితే సహించేది లేదు. రైతుల బాగు కోసం ప్రాణాలైనా ఇస్తాం. రైతుగా పుట్టాను. రైతుల కోసమే జీవిస్తాను.. అవసరమైతే వారి కోసమే చస్తాను’ అని వైఎస్సార్సీపీ రాప్తాడు నియోజకవర్గ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్రెడ్డి అన్నారు. వేరుశనగ పంటకు మద్దతు ధర విత్తుకు ముందే ప్రకటించాలని ఆత్మకూరు తహసీల్దార్ కార్యాలయం ఎదుట గురువారం చేపట్టిన రైతు ధర్నాలో ఆయన ప్రసంగించారు. ఖరీఫ్లో వేరుశనగ సాగు చేసే రైతులకు భరోసానందించేందుకు కిలో రూ.61 చొప్పున పంటకు ముందస్తుగా మద్దతు ధర ప్రకటించాలని డిమాండ్ చేశారు. రేషన్ దుకాణాల ద్వారా వేరుశనగ నూనె సరఫరా చేయిస్తే రైతులకు లబ్ధి చేకూరుతుందన్నారు. ఉపాధి పనులను వ్యవసాయానికి అనుసంధానం చేయాలన్నారు. రాప్తాడులో బ్రోకర్లదే రాజ్యం ప్రస్తుతం రాప్తాడు నియోజకవర్గంలో బ్రోకర్లదే రాజ్యం నడుస్తోందని ప్రకాష్రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. ప్రజాధనాన్ని కొల్లగొట్టేందుకు మంత్రి సునీత తన బంధువులను మండలానికో ఇన్చార్జ్గా నియమించుకుని దోపిడీ సాగిస్తున్నారన్నారు. నిధులు కొల్లగొట్టేందుకే వంద కోట్లు కూడా ఖర్చు కాని అప్పర్ పెన్నార్ ప్రాజెక్టు అంచనాలను రూ.1140 కోట్లకు పెంచారన్నారు. గాలి మరల ఏర్పాటుకు భూసేకరణ విషయంలోనూ రైతులను దగా చేసి సొమ్ము కూడబెట్టుకున్నారన్నారు. వీరి భూదాహానికి రైతు కేశవ్నాయక్ పురుగుల మందు తాగి ప్రాణాలు వదిలాడని, వడ్డుపల్లికి చెందిన ఓ మహిళా రైతు తహసీల్దార్ కార్యాలయం వద్ద పురుగుల మందు తాగారని గుర్తు చేశారు. మంత్రి సునీత తన పదవిని అడ్డుపెట్టుకుని బీఎల్వో, వెలుగు వీవోలను లోబర్చుకుని 25 వేల దొంగ ఓట్లను జాబితాలోకి చేర్చారని విమర్శించారు. జగన్తోనే సంక్షేమ రాజ్యం రాజన్న రాజ్యం రావాలంటే వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి కావాలన్నారు. ఆయన సీఎం అయితే రైతులకు గిట్టుబాటు ధర వేరుశనగకు రూ. 61 ప్రకటిస్తామని చెప్పారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు రాజారాం, చంద్రఖర్రెడ్డి, మధు, కేశవరెడ్డి, మల్లన్న, మహానందరెడ్డి, మల్లన్న, వాసుదేవరెడ్డి, ముత్యాలన్న, వెంకటేష్, ఈశ్వరరెడ్డి, ఈశ్వరయ్య, వరప్రసాద్రెడ్డి, బాలపోతన్న, సుభద్రమ్మ, పార్వతమ్మ, నరసింహారెడ్డి, శ్రీధర్, హనుమంతునాయక్, నరసింహులు, సోము, లక్షినారాయణరెడ్డి, అనీల్, మురళి, దామోదర్రెడ్డి, అతికిరెడ్డి, పెదయ్య, సీపీఐ నాయకులు రామకృష్ణ, రమేష్, దిలీప తదితరులు పాల్గొన్నారు. -
పేదల భూములు కొల్లగొడుతున్న పరిటాల వర్గీయులు
సాక్షి, అనంతపురం : గతంలో పేద రైతులకు పంపణీ చేసిన భూములను పరిటాల వర్గీయులు ఆక్రమిస్తున్నారని, అధికారులపై పెత్తనం చెలాయిస్తూ రైతుల భూములను తమ పేరిట మార్చుకుంటున్నారని వైఎస్సార్ సీపీ రాప్తాడు సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఆరోపించారు. టీడీపీ కార్యకర్తల నిర్వాకంతో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్న రైతు కేశవనాయక్ కుటుంబాన్ని ఆయన ఆదివారం పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... కేశవనాయక్ ఆత్మహత్యకు మంత్రి పరిటాల సునీత బాధ్యత వహించాలని ఆయన డిమాండ్ చేశారు. జిల్లా రెవెన్యూ అధికారులు ఆత్మకూరు మండలం వేపచర్ల రైతు కేశవనాయక్కు చెందిన భూమి పట్టాను రద్దు చేసి అదే భూమిని టీడీపీ కార్యకర్తలకు కేటాయించడంతో మనస్తాపానికి గురైన కేశవనాయక్ ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. -
రౌడీరాజ్యం!
వైఎస్సార్సీపీ నేత తోపుదుర్తి చంద్రశేఖర్రెడ్డి ఈ నెల ఏడో తేదీన రామగిరి మండలంలో పర్యటించారు. నసనకోట పంచాయతీకి చెందిన బోయ సూర్యనారాయణ అలియాస్ సూర్యం ఉదయం నుంచి సాయంత్రం వరకు చంద్రశేఖర్రెడ్డి వెంటే ఉన్నాడు. ఇది తెలుసుకున్న టీడీపీ వారు బోయ సూర్యనారాయణపై దాడి చేసి గాయపరిచారు. పైగా అతడిని స్టేషన్కు పిలుచుకెళ్లి తనపై వైఎస్సార్సీపీ నాయకుడు చంద్రశేఖర్రెడ్డే దాడి చేయించినట్లు కేసు పెట్టించారు. తమ నాయకుడు తోపుదుర్తి ప్రకాష్రెడ్డి పర్యటిస్తున్నారనే సమాచారంతో రామగిరి మండలం పేరూరుకు చెందిన వైఎస్సార్సీపీ సానుభూతిపరుడు సుబ్బుకృష్ణ 2017 నవంబరు 12న గ్రామంలో ఏర్పాట్లు చేసుకుంటున్నారు. జీర్ణించుకోలేని టీడీపీ నాయకులు సుబ్బుకృష్ణపై దాడి చేసి తిరిగి అతనిపైనే పోలీస్స్టేషన్లో కేసు నమోదు చేయించారు. ఈ రెండు ఉదాహరణలు చాలు రాప్తాడు నియోజకవర్గంలో శాంతిభద్రతలు ఎలా గాడితప్పాయనేందుకు. అనంతపురం: ప్రజాస్వామ్యంలో ఎవరు ఎక్కడికైనా వెళ్లి తమ భావాలను వ్యక్తపరచవచ్చు. కానీ రాప్తాడు నియోజకవర్గంలో అధికార పార్టీ ప్రజాస్వామ్యానికి పాతరేసింది. ఓ ముఖ్య ప్రజాప్రతినిధి, వారి బంధువులు చెప్పినట్లు వినాల్సిందే. మాట వినని వారిపై పోలీసులను ఉసిగొలుపుతున్నారు. ‘ఎద్దు ఈనిందంటే గాడికి కట్టేయ్’ అన్న చందంగా పోలీసుల తీరు ఉందనే ఆరోపణలు ఉన్నాయి. కొందరు పోలీసులు అధికార పార్టీ నేతల కనుసన్నల్లో ఉంటూ తప్పొప్పులను ఏమాత్రం పరిగణనలోకి తీసుకోకుండా కేసులు నమోదు చేయడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రతిపక్ష వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలే లక్ష్యంగా అధికార పార్టీ నేతలు దౌర్జన్యానికి పాల్పడుతున్నారు. పోలీసులతో అక్రమ కేసులు బనాయిస్తున్నారు. చివరికి తెగబడి అధికారులపై కూడా దాడులు చేస్తుంటే చోద్యం చూడాల్సిన పరిస్థితి. కనగానపల్లి ఎంపీపీ భర్త ముకుందనాయుడు స్వయంగా ప్రభుత్వ ఉద్యోగులపై దాడులు చేశారు. రామగిరి ప్రవేశానికి ప్రత్యేక ఆంక్షలు రామగిరి మండలంలోకి విపక్ష నేతలు వెళ్లనీయకుండా ప్రత్యేక ఆంక్షలు విధించారు. శాంతిభద్రతల సమస్య తలెత్తుతుందని చెబుతున్న పోలీసులు.. విపక్షనేతలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత లేదా అని ప్రజాస్వామ్యవాదులు ప్రశ్నిస్తున్నారు. అధికార పార్టీ నేతల దౌర్జన్యాలు, బెదిరింపులు, పోలీసుల ఏకపక్ష తీరుపై ఇప్పటికే వైఎస్సార్సీపీ నేతలు ఎస్పీ అశోక్కుమార్ను కలిసి ఫిర్యాదు చేశారు. ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని రాప్తాడు నియోజకవర్గంలో శాంతిభద్రతలను పరిరక్షించకపోతే అధికార పార్టీ నేతల ఆగడాలు మరింత ఎక్కువవుతాయని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికార పార్టీ ఆగడాల్లో కొన్ని.. ► 2016 మే 30న కనగానపల్లి మండలం కుర్లపల్లిలో వైఎస్సార్సీపీ కార్యకర్తలపై టీడీపీ నాయకులు దాడి చేశారు. బాధితులు అనంతపురం సర్వజన ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా పరామర్శించడానికి వెళ్లిన తోపుదుర్తి ప్రకాష్రెడ్డిపై కూడా దాడికి యత్నించారు. ► 2016 సెప్టెంబర్ 2న వైఎస్ వర్ధంతి రోజున కనగానపల్లి మండలం యలకుంట్ల గ్రామంలో వైఎస్సార్సీపీ కార్యకర్తలపై టీడీపీ శ్రేణులు దాడి చేశాయి. ► 2016 నవంబరు 16న రాప్తాడు మండలం బండమీదపల్లిలో మంత్రి లోకేష్ పర్యటనలో భాగంగా ఫ్లెక్సీలు చింపేశారనే సాకుతో యర్రగుంటలో ఓ మహిళపై టీడీపీ నాయకులు దాడి చేశారు. ► గొందిరెడ్డిపల్లిలో 2017 నవంబరులో భూ సమస్య కారణంగా సర్పంచ్ కుమారుడు బాబయ్య, బంధువులపై టీడీపీ వారు దాడి చేశారు. ఓటమి భయంతోనే ఫ్యాక్షన్కు బీజం మంత్రి సునీతపై ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు పెన్నోబులేసు ధ్వజం ఆత్మకూరు: ఎన్నికలకు ముందే ఓటమి భయం వెంటాడటంతో మంత్రి పరిటాల సునీత ప్రతిపక్ష నాయకులపై అక్రమ కేసులు బనాయిస్తూ, గ్రామాల్లో ఫ్యాక్షన్ను ప్రోత్సహిస్తున్నారని వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు పెన్నోబులేసు ఆరోపించారు. ఫ్యాక్షన్ సంస్కృతిని ఆత్మకూరుకు తీసుకురావద్దంటూ ఆదివారం వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఆయన ర్యాలీ నిర్వహించారు. వైఎస్సార్సీపీ నాయకులు తోపుదుర్తి చంద్రశేఖరరెడ్డి, రాప్తాడు మండల కన్వీనర్ మీనుగ నాగరాజుపై బనాయించిన అక్రమ కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. అనంతరం పోలీస్స్టేషన్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పెన్నోబులేసు మాట్లాడుతూ నాలుగేళ్ల పాలనలో ఏ ఒక్క హామీనీ పూర్తిగా నెరవేర్చకపోవడంతో వచ్చే ఎన్నికల్లో ఓటమి తప్పదని తెలిసి.. ఎలాగైనా గెలిచేందుకు ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తూ ఫ్యాక్షన్కు బీజం వేస్తున్నారని మండిపడ్డారు. ఇందులో భాగంగానే రామగిరి మండలంలో తోపుదుర్తి ప్రకాష్రెడ్డి పర్యటించకుండా టీడీపీ నేతలు అడ్డుపడ్డారని విరుచుకుపడ్డారు. పద్ధతి మార్చుకోకపోతే మంత్రిని కూడా నియోజకవర్గంలో ఎక్కడా తిరగకుండా అడ్డుకుంటామని హెచ్చరించారు. పోలీసులు అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని, ప్రజాస్వామ్యం ఖూనీ అవుతున్నా తమకేమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. మంత్రి సోదరుడు బాలాజీ వైఎస్సార్సీపీ నాయకులను బెదిరింపులకు గురిచేస్తున్నారని, అమాయక ప్రజలను నేర వృత్తిలోకి బలవంతంగా దింపుతున్నారని అన్నారు. అనంతరం గూలి కేశవరెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గానికి దాదాపు 1.20 లక్షల ఎకరాలకు సాగు నీరు ఇచ్చే అవకాశం ఉండగా ..వాటిని పూర్తిగా రద్దు పరిచి కొత్త స్కీములను ప్రవేశపెడుతున్నారన్నారు. ఆత్మకూరుకు లిఫ్ట్ ఇరిగేష్న్ ఏర్పాటు చేయాలని కోరారు. అనంతరం తోపుదుర్తి చంద్రశేఖర్రెడ్డిపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తి వేయాలంటూ వినతిపత్రం అందచేశారు. -
మాటలతో మభ్యపెడుతున్నారు
- చేసిన కార్యక్రమాలే మళ్లీ మళ్లీ చేస్తున్న చంద్రబాబు - రాప్తాడు నియోజకవర్గ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్రెడ్డి అనంతపురం: చేసిన ప్రారంభోత్సవాలు.. కార్యక్రమాలే మళ్లీ మళ్లీ చేస్తూ తానేదో చేస్తున్నానని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రజలను మభ్యపెడుతున్నారన్నారని రాప్తాడు నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్రెడ్డి ధ్వజమెత్తారు. శనివారం ఆయన జిల్లా పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. కృష్ణా జలాలతో రాయలసీమను సస్యశ్యామలం చేస్తానని మూడున్నరేళ్లుగా చెబుతూనే ఉన్నారన్నారు. గతేడాది హంద్రీనీవా రెండోదశలో రాప్తాడు నియోజకవర్గం వరకు నీళ్లు పారించి మమ అనిపించారని మండిపడ్డారు. 2014 ఆగస్టు 15 నుంచి ఇప్పటివరకు అనంతపురం, కర్నూలు జిల్లాల్లో సీఎం అనేక ప్రాజెక్టులు ప్రకటించారని గుర్తుచేశారు. పేరూరు డ్యాంకు, బీటీపీకి నీళ్లిస్తామని చెప్పారు. కానీ ఇంతవరకు ఒక్క ప్రాజెక్టు కూడా వాస్తవరూపం దాల్చలేదన్నారు. ఉరవకొండ నియోజకవర్గానికి రూ.850 కోట్లతో లిఫ్ట్ ఇరిగేషన్ సిస్టం అని చెబుతున్నారు.. 52వ ప్యాకేజీకి సంబంధించి రాకెట్ల లిఫ్ట్ పైన 8 వేల ఎకరాలకు డిస్ట్రిబ్యూటరీలు ఏర్పాటు చేయడమనేది ఇప్పటికే లైవ్లో ఉందన్నారు. మళ్లీ లిఫ్ట్ ఇరిగేషన్ ఏంటని ప్రశ్నించారు. ఉరవకొండలో ప్రకటించిన లిఫ్ట్ ద్వారా 20 వేల ఎకరాలు, బీటీపీ ద్వారా 20 వేల ఎకరాలు, పేరూరు లిఫ్ట్ ద్వారా 10 వేల ఎకరాలకు నీళ్లిచ్చేందుకు రూ.3,500 కోట్లు ఖర్చు చేసేందుకు అంచనాలు వేస్తున్నారన్నారు. కేవలం రూ.300 కోట్లతో 2.50 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్లు ఇచ్చే వీలున్నా దానిపై దృష్టి పెట్టడం లేదని మండిపడ్డారు. సమావేశంలో జిల్లా పరిషత్ ఫ్లోర్ లీడర్ (కనగానపల్లి జెడ్పీటీసీ సభ్యుడు) బిల్లే ఈశ్వరయ్య, రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు వెంకటచౌదరి, లీగల్ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పేరూరు నాగిరెడ్డి, పార్టీ నాయకులు ప్రసన్నాయపల్లి మహానందరెడ్డి, విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నరేంద్రరెడ్డి పాల్గొన్నారు. -
విప్లవం పేరుతో దోపిడీ!
- మంత్రి సునీతపై తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ధ్వజం - అధికారంలోకి వస్తే నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు నీళ్లిస్తామని హామీ - రాప్తాడు వైఎస్సార్ సీపీ ప్లీనరీ విజయవంతం అనంతపురం : ఒకవైపు గాంధేయ వాదులం, విప్లవ వీరుల కుటుంబం అంటూనే మరోవైపు దోపిడీ, దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాప్తాడు నియోజకవర్గ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్రెడ్డి మంత్రి పరిటాల సునీతపై మండిపడ్డారు. ఆదివారం అనంతపురం రూరల్ మండలంలోని కళ్యాణదుర్గం రోడ్డు పిల్లిగుండ్లకాలనీ వద్ద రాప్తాడు నియోజకవర్గ ప్లీనరీ సమావేశం నిర్వహించారు. అందులో ప్రకాష్రెడ్డి మాట్లాడుతూ విశాఖపట్నం ప్రాంతంలో 26 మంది నక్సలైట్లను ఎన్కౌంటర్ చేస్తే విప్లవవీరులు ఎందుకు నోరెత్తలేదని మంత్రి సునీతను ఉద్దేశించి అన్నారు. విప్లవాలను అమ్ముకున్నారని, ఆ ముసుగులో దౌర్జన్యాలు, దోపిడీలు చేస్తున్నారని విమర్శించారు. గత రెండు ఎన్నికల్లోనూ తనను గెలిపించేందుకు నియోజకవర్గ కార్యకర్తలు, నాయకులు శక్తివంచన లేకుండా కృషి చేశారన్నారు. తనను పిలిచి అక్కున చేర్చుకున్న దివంగత నేత వైఎస్ రాజశేఖర్రెడ్డి ప్రజలకు సేవ చేస్తూ చేరువ కావాలని సూచించారన్నారు. తాను ఆ ప్రకారమే నడుచుకుంటున్నానని చెప్పారు. నియోజకవర్గంలో దాదాపు 14 వేల కుటుంబాలకు ఏదో ఒక రూపంలో సొంత సంపాదనతో సేవ చేసే అవకాశం దేవుడు కల్పించాడన్నారు. అందరి ఆశీస్సులతో 2014లో గెలుస్తామనే అనుకున్నామన్నారు. అయితే చంద్రబాబు మోసపూరిత హామీలను ప్రజలు నమ్మారన్నారు. పట్టిసీమ వల్లే హంద్రీనీవాకు నీళ్లొస్తున్నాయని అంటున్నారని, హంద్రీ - నీవా ద్వారా 2012 నుంచి వచ్చింది కృష్ణా జలాలు కాదా? అని ప్రశ్నించారు. తామైతే ఒక్క రూపాయి ఖర్చు లేకుండా పేరూరు డ్యాంకు నీళ్లు తీసుకొస్తామన్నారు. ప్రభుత్వానికి దమ్ముంటే గొల్లపల్లి రిజర్వాయర్కు నీళ్లు ఇవ్వాలని, అక్కడి నుంచి ఎగువగా మడకశిర బ్రాంచ్ కెనాల్కు నాలుగు లిఫ్ట్ల ద్వారా పంపింగ్ చేసి చూపించాలని సవాల్ విసిరారు. 26వ కిలోమీటరు వద్దనున్న తురకలాపట్నం వంకకు నీళ్లొదిలితే అవి నేరుగా పెన్నానదిలో పడి దిగువ భాగాన ఉన్న పేరూరు డ్యాంకు వస్తాయన్నారు. కానీ అలా చేయకుండా రూ.1,100 కోట్లతో పనుల అంచనాలను రూపొందించుకున్నారని, ఇదంతా మంత్రి పరిటాల సునీత ఆధ్వర్యంలో చేస్తున్న దోపిడీ అని విమర్శించారు. తాము అధికారంలోకి రాగానే రాప్తాడు నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు 10 టీఎంసీలు నీరిస్తామని హామీ ఇచ్చారు. ప్రజలు వైఎస్సార్సీపీ పక్షానే ఉన్నారు మాజీ ఎంపీ, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనంత వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ ప్రస్తుతం ప్రజలంతా వైఎస్సార్సీపీ పక్షాన ఉన్నారన్నారు. చంద్రబాబు కుట్రలు, కుతంత్రాలను సమర్థవంతంగా ఎదుర్కోవాలని కార్యకర్తలకు సూచించారు. వలసల నివారణకు కేంద్రం ప్రవేశపెట్టిన ఉపాధి హామీ పథకం నిధులను కూడా టీడీపీ కార్యకర్తలు స్వాహా చేస్తున్నారన్నారు. ప్రసుత్తం అనంతపురం నుంచి 4 లక్షల మంది రైతులు, రైతు కూలీలు వలసలు వెళ్లారని చెప్పారు. జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఏ ఒక్కరికైనా దీనిపై చంద్రబాబును అడిగే ధైర్యం ఉందా? అని ప్రశ్నించారు. తెలుగుదేశం రాక్షక పాలన సాగిస్తోందని, ప్రసన్నాయపల్లి ప్రసాద్రెడ్డి హత్య కేసులో నిందితులైన మంత్రి సునీత సోదరుడు, కుమారుడు, బంధువులతో కలిసి తిరుగుతుంటే ప్రభుత్వానికి కనిపించలేదా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో రాజన్న రాజ్యం రావాలంటే వైఎస్సార్సీపీ అధికారంలోకి రావాలన్నారు. సమావేశంలో జెడ్పీ మాజీ చైర్పర్సన్ తోపుదుర్తి కవిత, గుంతకల్లు సమన్వయకర్త వై.వెంకటరామిరెడ్డి, నాయకులు గిర్రాజు నగేష్, పామిడి వీరాంజనేయులు, మీసాల రంగన్న, ఎల్ఎం మోహన్రెడ్డి, మాజీ మేయర్రాగే పరుశురాం, విద్యార్థి విభాగం సలాంబాబు, లింగారెడ్డి, పరుశురాం, నరేంద్రరెడ్డి, ఆలుమూరు శ్రీనివాసరెడ్డి, మరువపల్లి ఆదినారాయణరెడ్డి, రంగంపేట గోపాల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రకాష్రెడ్డి గెలుపు జగన్కు కానుక వచ్చే ఎన్నికల్లో రాప్తాడు నియోజకవర్గం నుంచి తోపుదుర్తి ప్రకాష్రెడ్డిని గెలిపించి అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి కానుకగా ఇద్దాం. అపద్ధాలతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబుతో అన్ని వర్గాల ప్రజలు విసిగిపోయారు. ఈ ప్రభుత్వాన్ని బంగాళాఖాతం, అరేబియా సముద్రంలో కలుపుదాం. - వెన్నపూస గోపాల్రెడ్డి, ఎమ్మెల్సీ ప్లీనరీ భారీ సక్సెస్ జిల్లాలో ఎక్కడా లేని విధంగా రాప్తాడు నియోజకవర్గ ప్లీనరీ భారీ సక్సెస్ అయింది. చంద్రబాబు పరిపాలన అవినీతిమయమైంది. అరాచకాలు, దౌర్జన్యాలు, అధికారులపై కక్షసాధింపు చర్యలు చేపడుతున్నారు. కొందరు అధికారులు తొత్తులుగా మారారు. ముఖ్యమంత్రి నీచుడు, దరిద్రుడు. 60 ఏళ్లలో చూడని కరువు గతేడాది జిల్లాలో చూశాం. - శంకరనారాయణ, జిల్లా అధ్యక్షుడు . ప్రకాష్రెడ్డిని ఆశీర్వదించండి నియోజకవర్గానికి ప్రకాష్రెడ్డి ఆశాకిరణం లాంటివాడు. సొంత నిధులతో బోర్లు వేయించాడు. మహిళలకు గ్యాస్ కనెక్షన్లు ఇప్పించాడు. గొర్రెలు ఇప్పించాడు. వచ్చే ఎన్నికల్లో ఆయనను ఆశీర్వదించండి. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆల్ ఫ్రీ బాబుగా మారారు. రాజన్న రాజ్యం రావాలంటే జగనన్న సీఎం కావాలి. - నదీంఅహ్మద్, మైనార్టీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు రాష్ట్రంలో అరాచక పాలన - మాజీ మంత్రి పార్థసారథి ధ్వజం అనంతపురం : ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలో రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని మాజీమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కొలుసు పార్థసారథి ధ్వజమెత్తారు. ప్లీనరీలో ఆయన మాట్లాడుతూ రైతు బాగుంటేనే దేశం బాగుంటుందని భావించిన దివంగత నేత వైఎస్సార్ ముఖ్యమంత్రి కాగానే రాష్ట్రంలో నీటి ప్రాజెక్టుల ఏర్పాటుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటే, చంద్రబాబు సీఎం కాగానే రాజధాని పేరుతో దోపిడీకి తెర తీశారని ధ్వజమెత్తారు. రౌడీయిజాన్ని అంతమొందిస్తామని ఓ వైపు ముఖ్యమంత్రి చెబుతుండగా, ఆయన అనుచరులు దౌర్జన్యాలతో జనాన్ని భయపెడుతున్నారని అన్నారు. మరోవైపు పోలీసులు కూడా టీడీపీ నేతల్లా వ్యహరిస్తున్నారని ఆరోపించారు. కళ్లముందే దౌర్జన్యాలు జరుగుతున్నా పట్టించుకోవడం లేదన్నారు. టీడీపీ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్న పోలీసులు ఖాకీ కాకుండా పచ్చ దుస్తులు వేసుకుంటే బాగుంటుందన్నారు. చంద్రబాబు ఆయన టీం ఆలీబాబా 60 దొంగల్లా మారారని ధ్వజమెత్తారు. దివంగత వైఎస్ పేరు చెబితే అనేక పథకాలు గుర్తుకొస్తాయని, అలా చెప్పుకోవడానికి చంద్రబాబు ఏ ఒక్క పథకమూ అమలు చేయలేదని అన్నారు. జేసీ సోదరులు కేవలం వైఎస్ జగన్ను లక్ష్యంగా చేసుకుని మాట్లాడుతున్నారని, ఇచ్చిన హామీలను నెరవేర్చని చంద్రబాబు కాలర్ పట్టుకోవాలని వారికి సూచించారు. -
కబ్జాలకు మారుపేరే ‘పరిటాల’
– ఓనామాలు రాని మంత్రిని బర్తరఫ్ చేయాలి – రాప్తాడు సమన్వయకర్తి తోపుదుర్తి ప్రకాష్రెడ్డి డిమాండ్ అనంతపురం రూరల్ : బడుగు బలహీన వర్గాలకు చెందిన భూములను కబ్జాచేయడంతో పాటు అధికారులను భయపెడుతూ అనంతపురం చుట్టూ అత్యంత విలువైన భూములను ఆక్రమిస్తూ పరిటాల కుటుంబం కబ్జాలకు మారుపేరుగా నిలుస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాప్తాడు నియోజకవర్గం సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్రెడ్డి విమర్శించారు. మంగళవారం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో పుట్టిపెరిగిన అనేక మంది అనంతపురం జిల్లా ఖ్యాతిని ఇనుమడింప చేస్తూంటే మంత్రి పరిటాల సునీత కుమారుడు శ్రీరామ్ దాన్ని చెడగొడుతున్నాడన్నారు. విజయవాడ గవర్నర్ పేటలోని అత్యంత విలువైన రెండతస్తుల భవనాన్ని అతని ముఖ్య అనుచరుడైన కనగానపల్లి మండలం పాతపాలెంకు చెందిన పూజారి వేణుగోపాల్ అనే వ్యక్తి పేరు మీద విక్రయ డాక్యుమెంట్ సృష్టించి దందా చేస్తున్నారని మండిపడ్డారు. ఇళ్లు ఖాళీ చేయకుంటే చస్తారు? నేను ఎవరో తెలుసా పరిటాల శ్రీరామ్ అనుచరుడినంటూ ఇంటి యజమాని మల్లికార్జునను భయబ్రాంతులకు గురి చేశారన్నారు. ఇదే విషయంపై అక్కడి పోలీసు స్టేషన్లో కేసు సైతం నమోదైందన్నారు. ఓనమాలు కూడా రాని మంత్రి ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ఆడిస్తూ తమ పబ్బాన్ని గడుపుకుంటున్నారని విమర్శించారు. 4వ పట్టణ పోలీసు స్టేషన్లో సీఐగా విధులు నిర్వహిస్తున్న శివశంకర్ను వీఆర్కు పంపడంతో పాటు ఏఎస్సై సస్పెండ్ వెనుక మంత్రి అనుచరుల ఓ భూ వివాదమే కారణమన్నారు. ఆర్డబ్ల్యూఎస్ ఈఈ కనకసింహన్ ఆత్మహత్య వెనుక సైతం మంత్రి పరిటాల సునీత వేధింపులే కారణమని మృతుని కుటుంబ సభ్యులు చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రికి సిగ్గూ లజ్జా ఉంటే వెంటనే సునీతను మంత్రి వర్గం నుంచి బర్త్రఫ్ చేసి , భూ దందాపై సిట్టింగ్ జడ్జీతో విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధనుంజయ్యయాదవ్, జెడ్పీ ఫ్లోర్ లీడర్ వెన్నపూస రవీంద్రారెడ్డి, కనగానపల్లి జెడ్పీటీసీ బిల్లే ఈశ్వరయ్య, రాష్ట్ర నాయకులు సురేష్గౌడ్, మహానందరెడ్డి, జిల్లా సంయుక్త కార్యదర్శి బిల్లే నరేంద్ర తదితరులు పాల్గొన్నారు. -
ఆర్నెళ్లలో సంపూర్ణ రుణమాఫీ చేయాలి
– 27 టీఎంసీల నీటిలెక్కలు చెప్పు సునీతమ్మా.. – 6న ఆత్మకూరులో రైతు సదస్సు – హాజరుకానున్న ఎంపీ మిథున్రెడ్డి, మాజీ ఎంపీ అనంత, ఎమ్మెల్యేలు విశ్వ, రోజా – రాప్తాడు నియోజకవర్గ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్రెడ్డి అనంతపురం : జిల్లా రైతులకు ప్రభుత్వం ఆర్నెళ్లలో సంపూర్ణ రుణమాఫీ చేయాలని రాప్తాడు నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్రెడ్డి డిమాండ్ చేశారు. ఆయన బుధవారం జిల్లా పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. నాలుగేళ్లుగా జిల్లా అంతా కరువు ప్రాంతంగా ప్రకటిస్తున్నారని, ఇక్కడి ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా సంపూర్ణ రుణమాఫీ చేయాల్సిందేనని స్పష్టం చేశారు. జిల్లావ్యాప్తంగా 15 లక్షల ఎకరాల్లో వేరుశనగ నష్టపోయారని, అయితే.. ప్రభుత్వం రెయిన్గన్ల ద్వారా పంటను కాపాడామని అబద్ధాలు చెబుతూ ఏడు లక్షల ఎకరాలకు మాత్రమే ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చేందుకు ప్రయత్నిస్తోందని విమర్శించారు. అలాకాకుండా వేరుశనగ సాగు చేసిన ప్రతి రైతుకూ ఎకరాకు రూ. 15 వేల చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. వాతావరణ బీమా పోనూ తక్కిన మొత్తాన్ని ఇన్పుట్ సబ్సిడీగా ఇస్తామని ప్రభుత్వం చెప్పడం దారుణమన్నారు. హంద్రీ–నీవా డిస్ట్రిబ్యూటరీలు ఆర్నెళ్లలో పూర్తి చేసి ఖరీఫ్ నాటికి నీళ్లివ్వాలని డిమాండ్ చేశారు. రైతులు, ప్రజా సమస్యలపై రాప్తాడు నియోజకవర్గంలోని ప్రతి మండల కేంద్రంలో నెలకో సదస్సు ఏర్పాటు చేస్తామన్నారు. ఇందులో భాగంగా ఈ నెల 6న సాయంత్రం మూడు గంటలకు ఆత్మకూరులో సదస్సు నిర్వహిస్తామన్నారు. పార్టీ జిల్లా పరిశీలకులు, రాజంపేట ఎంపీ మిథున్రెడ్డి, మాజీ ఎంపీ అనంత వెంకటరామిరెడ్డి, ఎమ్మెల్యేలు విశ్వేశ్వరరెడ్డి, రోజా, పార్టీ జిల్లా అధ్యక్షుడు శంకరనారాయణ, మాజీ ఎమ్మెల్యే గురునాథరెడ్డి, జెడ్పీ మాజీ చైర్పర్మన్ కవిత తదితరులు హాజరవుతారన్నారు. వామపక్ష పార్టీల మద్దతు కూడా కోరుతున్నట్లు చెప్పారు. మంత్రి నీటి లెక్కలు చెప్పాలి జిల్లాకు 27 టీఎంసీల నీళ్లు తెచ్చామని చెబుతున్న మంత్రి పరిటాల సునీత ఆ నీటిని ఎక్కడ వాడారు, ఎన్ని ఎకరాల్లో పంటలు పండించారో శ్వేతపత్రం విడుదల చేయాలని ప్రకాష్రెడ్డి డిమాండ్ చేశారు. రాప్తాడు నియోజకవర్గానికి 0.7 టీఎంసీ మాత్రమే తెచ్చారని, ఇందుకు మంత్రి సిగ్గుతో తల దించుకోవాలని అన్నారు. నియోజకవర్గంలో పీఏబీఆర్ కుడికాలువ కింద 50 వేల ఎకరాలు, హంద్రీ–నీవా కింద 70 వేల ఎకరాలకు నీళ్లివ్వాల్సి ఉందన్నారు. ఇందుకోసం 12 టీఎంసీలు అవసరమన్నారు.అలాగే హిందూపురం, కదిరి, పెనుకొండ, మడకశిర నియోజకవర్గాల్లో మరో 1.50 లక్షల ఎకరాలకు నీళ్లివ్వాలంటే మొత్తం 20 టీఎంసీలు అవసరమన్నారు. అయితే.. 0.7 టీఎంసీ మాత్రమే తెచ్చి వైఎస్సార్సీపీ నాయకులను విమర్శించడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందన్నారు. పొలాలకు నీళ్లివ్వాలని రైతులు అడుగుతుంటే కాలువ వెంట పోతున్న నీటిలో గంగపూజ చేస్తే ఏం లాభమని ప్రశ్నించారు. సమావేశంలో కనగానపల్లి జెడ్పీటీసీ సభ్యుడు బిల్లే ఈశ్వరయ్య, పార్టీ జిల్లా అధికార ప్రతినిధి చంద్రశేఖర్రెడ్డి, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు పెన్నోబులేసు, విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నరేంద్రరెడ్డి, ఎంపీటీసీ సభ్యుడు సుబ్బారెడ్డి, ఆత్మకూరు మండల కన్వీనర్ నరసింహారెడ్డి, సింగిల్విండో అధ్యక్షుడు వాసుదేవరెడ్డి, యువజన విభాగం నాయకుడు వరప్రసాద్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
మంత్రికి బినామీ అమిలినేని
– వైఎస్సార్సీపీ నేత తోపుదుర్తి ప్రకాశ్రెడ్డి అనంతపురం టౌన్ : మంత్రి పరిటాల సునీతకు ఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ అధినేత అమిలినేని సురేంద్రబాబు బినామీ అని వైఎస్సార్సీపీ రాప్తాడు నియోజకవర్గ ఇన్చార్జ్ తోపుదుర్తి ప్రకాశ్రెడ్డి విమర్శించారు. ఈ మేరకు గురువారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. హంద్రీనీవా పనుల్లో అర్హత లేకున్నా రూ.110 కోట్ల పనులను నామినేషన్ కింద అమిలినేనికి ఎలా ఇస్తారని ప్రశ్నించారు. మంత్రి సునీత రాసిన లేఖ ఆధారంగానే అతడిని పనులు కట్టబెట్టారన్నారు. గొల్లపల్లి రిజర్వాయర్ పనుల్లో కట్ట ఎత్తు మూడు మీటర్లు తగ్గించారని, దీంతో రూ.12 కోట్లు ప్రభుత్వానికి కట్టాలని అధికారులు లేఖ రాసినా పట్టించుకోకుండా ఆ మొత్తాన్ని విడుదల చేయడంలో ఆంతర్యమేమిటన్నారు. 8వ ప్యాకేజీలో కూడా రూ.19 కోట్లు అదనంగా చెల్లింపులు చేశారన్నారు. ఎన్నికలకు ముందు సబ్ కాంట్రాక్టర్గా ఉన్న అమిలినేని చేతుల్లో ఇప్పుడు రూ.1,000 కోట్ల పనులు ఉన్నాయన్నారు. రాప్తాడు, పెనుకొండ నియోజకవర్గాల్లో జరిగే పనులకు సంబంధించి ఇతడికి పోటీగా ఎవరూ టెండర్ వేయరని, దీని వెనుక మంత్రి హస్తం లేదా అని ప్రశ్నించారు. ఈ రెండేళ్ల కాలంలోనే అతడు రూ.200 కోట్లు సంపాదించారని, ఈ లెక్కలు చూపకపోవడంతోనే ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడులు చేశారని ప్రజలు చర్చించుకుంటున్నట్లు పేర్కొన్నారు. పెద్ద నోట్ల రద్దు తర్వాత భారీగా ఈయన వద్ద నగదు ఉందన్న ప్రచారమూ సాగిందన్నారు. సుమారు రూ.100 కోట్లు (రూ.500, రూ.1000 నోట్లు) రూ.2000 నోట్లుగా అనంతలో మార్చుకున్నట్లు ప్రచారంలో ఉందన్నారు. ఈ నగదు ఆయనదేనా? లేక మంత్రిదా? అని ఆయన ప్రశ్నించారు. జిల్లాలో రోడ్లు, హంద్రీనీవా కాలువలు, పైప్లైన్ పనులను ప్రజాప్రతినిధికి కప్పం కట్టాకే సొంతం చేసుకుంటున్నట్లు ఆరోపించారు. ఆ డబ్బులను ఈ కంపెనీలోనే దాచుకున్నారన్న ప్రచారం జరుగుతోందని, దీనికి సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఐటీ దాడుల్లో పెద్ద ఎత్తున నగదు స్వాధీనం చేసుకున్నట్లు జనం అనుకుంటున్నారని, అవి ఎవరివో చెప్పాలన్నారు. లేనిపక్షంలో 2019లో ప్రజలే వారికి సమాధానం చెబుతారన్నారు. -
ఒక్క ఎకరాకైనా నీళ్లిచ్చారా..?
– హంద్రీ–నీవా లక్ష్యాన్ని నీరుగారుస్తున్నారు - వైఎస్సార్సీపీ నేత తోపుదుర్తి ప్రకాష్రెడ్డి అనంతపురం : 2012 నుంచి హంద్రీ–నీవా ప్రాజెక్టు ద్వారా జిల్లాకు నీళ్లు వస్తున్నా ఇప్పటిదాకా కనీసం ఒక ఎకరాకు నీళ్లిచ్చారా..? అని వైఎస్సార్సీపీ రాప్తాడు నియోజకవర్గ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్రెడ్డి ప్రశ్నించారు. ఈ మేరకు మంగళవారం జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. హంద్రీ–నీవా లక్ష్యాన్ని అధికార పార్టీ నీరుగారుస్తోందని ప్రకాష్రెడ్డి విమర్శించారు. కేవలం ప్రచారం కోసం అప్పుడప్పుడు వంకలు, చెరువులకు నీళ్లిచ్చినట్లు ఫోజులు ఇస్తున్నారని ఎద్దేవా చేశారు. జిల్లా రైతాంగం బాగు పడాలనే తపనతో మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు పని చేయడం లేదన్నారు. హంద్రీ–నీవా నీటిని తామే తెప్పించామంటూ చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. మొదటి దశలో జీడిపల్లికి నీటిని తెచ్చిన ఘనత వైఎస్ఆర్కే దక్కుతుందన్నారు. రెండోదశ పనులు రూ. 212 కోట్లతో 80 శాతం పూర్తయ్యాయన్నారు. రాప్తాడు నియోజకవర్గంలో 1,7 ప్యాకేజీల్లో దాదాపు 1.72 కోట్ల క్యూబిక్ మీటర్ల తవ్వకం పనులు ఈ ప్రభుత్వం రాకముందే పూర్తయ్యాయని స్పష్టం చేశారు. ఈ రెండున్నరేళ్లలో కేవలం 20 శాతం పనులు చేసి అందుకోసం రూ. 200 కోట్లు ఖర్చు చేశారన్నారు. 20 శాతం పనులకు వందశాతం నిధులా? అని ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారని చెప్పారు. జిల్లాకు వస్తున్న 17 టీఎంసీల నీటికి సంబంధించి టీఎంసీకి రూ. 12 కోట్లు కరెంటు ఖర్చు వస్తోందన్నారు. ఈ నీటిని ఖచ్చితంగా 2 లక్షల ఎకరాలకు ఇవ్వొచ్చన్నారు. ఆరుతడి పంటలకైతే 3 లక్షల ఎకరాలకు ఇవ్వొచ్చని తెలిపారు. పీఏబీఆర్ కుడికాలువకు నీళ్లిచ్చే విషయంలో నెల రోజులుగా రైతులు ఆందోళన చేస్తున్నా పట్టించుకోలేదన్నారు. నీళ్లిస్తున్నా...ప్రకాష్రెడ్డికి కనిపించలేదా? అని మంత్రి సునీత అంటున్నారని ఆమె లష్కరు డ్యూటీ చేస్తోంది తప్ప ప్రత్యేకంగా తెప్పించిందేమీలేదని ఎద్దేవా చేశారు. 20న బస్సుయాత్ర డెల్టా ప్రాంతంలో ఆయకట్టు సాగు, పంట కాలువలు, పొలాలకు నీళ్లు ఎలా వెచ్చిస్తున్నారు తదితర అంశాలను పరిశీలించేందుకు ఈనెల 20న సాయంత్రం అనంతపురం నుంచి బస్సుయాత్ర చేపడుతున్నట్లు ప్రకాష్రెడ్డి తెలిపారు. రెండు రోజుల పాటు కృష్ణా, నాగార్జునసాగర్, గోదావరి డెల్టా ప్రాంతాలను సందర్శించనున్నట్లు వెల్లడించారు. ఇందుకోసం రెండు బస్సులు ఏర్పాటు చేస్తున్నామన్నారు. జిల్లా నుంచి ఆసక్తిగల రైతు ప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు, ఎన్జీఓలు, మీడియా ప్రతినిధులు రావొచ్చని తెలిపారు. రావాలనుకునే వారు వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో కాని, 70325 81653, 86866 1086 నంబర్లలో సంప్రదించి వివరాలు నమోదు చేసుకోవాలని తెలిపారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మీసాల రంగన్న, యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధనుంజయయాదవ్, నాయకులు వరప్రసాద్రెడ్డి, మద్దిరెడ్డి నరేంద్రరెడ్డి, నరసింహారెడ్డి పాల్గొన్నారు. -
హవ్వా! ఇదెక్కడి లూటీ
రూ. 85 కోట్ల విలువైన పనులకు రూ. 850 కోట్లు! బినామీ పేర్లతో మంత్రి సునీత దోపిడీ తోపుదుర్తి ప్రకాష్రెడ్డి ఆత్మకూరు : ప్రజాధనాన్ని మంత్రి పరిటాల సునీత యథేచ్ఛగా దోపిడీ చేస్తోందని ౖÐð ఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాప్తాడు నియోజకవర్గ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్రెడ్డి ఆరోపించారు. రూ. 85 కోట్లతో పూర్తి అయ్యే పేరూరు డ్యాం పనులకు రూ. 850 కోట్లు మంజూరు చేయించుకున్నారని తెలిపారు. మండలంలోని వేపచెర్లలో ఆదివారం సాయంత్రం ఆయన రైతుల సమావేశంలో మాట్లాడారు. 20.8లో జిల్లా పర్యటనకు వచ్చిన చంద్రబాబు నాయుడు నాడు ప్రతిపక్ష హోదాలో మాట్లాడుతూ... జిల్లాలో బీటీపీ, పేరూరు డ్యాంకు రూ. 1,300 కోట్లు కేటాయిస్తే అభివృద్ధి సాధ్యమని ప్రకటించారని గుర్తు చేశారు. పెరిగిన వ్యయంతో పోలిస్తే ఇప్పుడు ఈ పనులకు రూ. 85 కోట్లు సరిపోతాయని వివరించారు. అయితే ఇందుకు విరుద్ధంగా రూ. 850 కోట్లు ప్రకటించడం టీడీపీ నేతల దోపిడీకి నిదర్శనమని పేర్కొన్నారు. బినామీలతో సర్వే పేరూరు డ్యాం పనులకు సంబంధించి అంచనాలు రూపొందించేందుకు చేపట్టిన సర్వేలో ప్రభుత్వాధికారుల ప్రమేయాన్ని మంత్రి సునీత తప్పించారని, ఆ స్థానంలో తన బినామీలతో పనులు చక్కబెట్టించారని ప్రకాష్రెడ్డి విమర్శించారు. దీంతో కేంద్రం నుంచి తెచ్చిన నిధులకు లెక్కలు లేకపోవడంతో వాటిని జిల్లా మంత్రులు అడ్డగోలుగా స్వాహా చేస్తున్నారని మండిపడ్డారు. జిల్లా రైతులపై చిత్తశుద్ధి ఉంటే హంద్రీనీవా ఆయకట్టును పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో వైఎస్ఆర్ సీపీ అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే హంద్రీనీవా జలాలతో జిల్లాను సస్యశ్యామలం చేస్తామని అన్నారు. కార్యక్రమంలో వైఎస్ఆర్ సీపీ నాయకులు, కార్యకర్తలు, వందలాది మంది రైతులు పాల్గొన్నారు. -
కక్షలను ప్రేరేపిస్తున్న పరిటాల వర్గం
కనగానపల్లి: వర్గ విభేదాలతో ఫ్యాక్షన్ కక్షలను ప్రేరేపించేందుకు పరిటాల వర్గం ప్రయత్నిస్తోందని వైఎస్ఆర్సీపీ రాప్తాడు నియోజకవర్గ సమన్వకర్త తోపుదుర్తి ప్రకాష్రెడ్డి విమర్శించారు. శుక్రవారం అనంతపురంలోని తన స్వగృహంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చిన ఈ రెండేళ్లలో తన సొంత రాప్తాడు నియోజకవర్గం అభివృద్ధికి మంత్రి పరిటాల సునీత ఎలాంటి కృషి చేయలేదని అన్నారు. ఆగస్టు నాటికి హంద్రీనీవా జలాలను ఈ ప్రాంతంలోని 1,160 చెరువులకు అందిస్తామంటూ హామీలు గుప్పించిన మంత్రి... తన మాట నిలబెట్టుకోవడంలో విఫలమయ్యారన్నారు. ఈ విషయం పక్కదారి పట్టించేందుకు మంత్రి తనయుడు శ్రీరాం, అనుచరులు పథకం ప్రకారం నియోజకవర్గం లో వైఎస్ఆర్ విగ్రహాలను ధ్వంసం చేయిస్తున్నారని మండిపడ్డారు. రామగిరి మండలం మాదిరి గానే నియోజకవర్గాన్ని మొత్తం సమస్యాత్మక ప్రాంతంగా మార్చి తమ పబ్బం గడుపుకునేందుకు పథకం వేశారని ఆరోపించారు. అధికార టీడీపీ వైఫల్యాలపై ప్రజలు చైతన్యవంతులై ఎక్కడికక్కడ నిలుదీస్తుంటే సహించలేక ప్రజా ఉద్యమాలను అణిచివేసేందుకు పోలీసులను ఉపయోగిస్తున్నారని, ఇందుకు ధర్మవరం డివిజన్లోని పోలీస్ అధికారులు అండగా నిలవడం శోచనీయమని అన్నారు. పరిటాల వర్గీయుల దురాగతాలకు చెక్ పెట్టేందుకు రాప్తాడు నియోజకవర్గ ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. -
సివిల్ సప్లయ్ స్టేజ్–1 కాంట్రాక్టర్కు మంత్రి బినామీ
- ఎఫ్సీఐ కార్మిక వ్యవస్థను నిర్వీర్యం చేసే కుట్ర - ఆందోళన చేస్తాం: తోపుదుర్తి ప్రకాష్రెడ్డి అనంతపురం : పౌర సరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత ఆశాఖ స్టేజ్–1 కాంట్రాక్ట్కు బినామీగా వ్యవహరిస్తున్నారని రాప్తాడు నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్రెడ్డి విమర్శించారు. శనివారం వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా పౌర సరఫరాల స్టేజ్–1 కాంట్రాక్ట్లన్నీ మంత్రి, టీడీపీ నాయకుల చేతుల్లో ఉన్నాయన్నారు. ఎఫ్సీఐ గోదాముల నుంచి కాకుండా వేర్హౌస్ల నుంచి ఎంఎల్ఎస్ పాయింట్లకు ఆహారధాన్యాలు తరలించేందుకు చర్యలు తీసుకుంటున్నారన్నారు. భారత ఆ హార సంస్థ (ఎఫ్సీఐ)కు ప్రతి జిల్లాలోనూ గోదాములు ఉన్నాయన్నారు. జిల్లాలో జంగాలపల్లి, తిమ్మనచెర్లలో ఉన్నాయన్నారు. ప్రస్తుతం కర్నూలు జిల్లా ఆదోని, నంద్యాలలోని వేర్హౌస్ల నుంచి ఎంఎల్ఎస్ పాయింట్లకు తరలించేందుకు చర్యలు తీసుకుంటున్నారన్నారు. మరోవైపు ఎఫ్సీఐ గోదాముల్లో పని చేస్తున్న కార్మికులు రోడ్డున పడే పరిస్థితి ఉందన్నారు. కందుకూరులోనే దాదాపు 400 మంది కార్మికులు ఉపాధి కోల్పోతున్నారన్నారు. రామగిరి మండలంలో గనులు మూసివేసి 3 వేల కుటుంబాలు రోడ్డున పడేలా చేసిన చరిత్ర పరిటాల కుటుంబానిదేనన్నారు. ఎస్కేయూలో పని 400 మంది ఫ్రీఫుడ్ కార్మికులను తొలిగించారన్నారు. వేలాది మంది ఆరోగ్యమిత్రలు, ఫీల్డ్ అసిస్టెంట్లు, ఉపాధి మేట్లు, ఆదర్శరైతులు, ఇతర కాంట్రాక్ట్ ఉద్యోగులను తొలిగించారన్నారు. ఆత్మకూరు మండలం బి. యాలేరులో చెరువు ఆక్రమణతో 400 వాల్మీకి కుటుంబాలు వీధిన పడ్డాయన్నారు. సమావేశంలో యువజన విభాగం అనంతపురం రూరల్ మండలం అధ్యక్షుడు కట్టకిందపల్లి వరప్రసాద్రెడ్డి, విద్యార్థి విభాగం రాష్ట్ర కార్యదర్శి మద్దిరెడ్డి నరేంద్రరెడ్డి పాల్గొన్నారు.