TV9 News channel
-
దుబాయ్లో నటుడు శివాజీకి చేదు అనుభవం
సాక్షి, హైదరాబాద్ : అలంద మీడియా కేసులో నిందితుడిగా ఉన్న సినీ నటుడు, గరుడ పురాణం శొంఠినేని శివాజీకి దుబాయ్ విమానాశ్రయంలో మరోసారి చేదు అనుభవం ఎదురైంది. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దుబాయ్ మీదగా అమెరికా వెళుతున్న అతడిని ఈ నెల 26న దుబాయ్ విమానాశ్రయంలో ఇమ్మిగ్రేషన్ అధికారులు అడ్డుకున్నారు. శివాజీపై క్రిమినల్ కేసులు ఉన్నాయంటూ తిరిగి అతడిని హైదరాబాద్ పంపించివేశారు. టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాష్తో పాటు శివాజీపై హైదరాబాద్ పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. గతంలో కూడా హైదరాబాద్ నుంచి అమెరికా వెళ్లే ప్రయత్నంలో శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో పట్టుబడ్డారు. ఆ తర్వాత సైబరాబాద్ సైబర్క్రైమ్ పోలీసులు అతడికి విచారణకు హాజరు కావాలని నోటీసులు కూడా ఇచ్చారు. కాగా విదేశాలకు వెళ్లేందుకు శివాజీపై ఎలాంటి ఆంక్షలు లేవని సైబరాబాద్ సీపీ సజ్జనార్ తెలిపారు. దుబాయ్ పోలీసులు ఎందుకు ఆపారో తెలియదని అన్నారు. -
రవి ప్రకాశ్కు హైకోర్టు బెయిల్ మంజూరు
సాక్షి, హైదరాబాద్ : ఫోర్జరీ, నిధుల మళ్లింపు కేసుల్లో నిందితుడిగా ఉన్న టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్కు తెలంగాణ హైకోర్టు శుక్రవారం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. పోలీసుల విచారణకు సహకరించాలని హైకోర్టు ఆదేశించింది. వారానికి ఒకసారి పోలీసుల ముందు హాజరు కావాలని హైకోర్టు పేర్కొంది. అదే విధంగా కోర్టు అనుమతి లేకుండా దేశం విడిచి ఎక్కడికి వెళ్లకూడదని రవిప్రకాశ్ను ఆదేశించింది. కాగా గతంలో రవిప్రకాశ్ రెండు సార్లు ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. అయితే తీవ్ర ఆర్థిక నేరాలకు పాల్పడిన రవిప్రకాశ్కు బెయిల్ మంజూరు చేస్తే సాక్షుల్ని ప్రభావితం చేస్తారని, కేసు దర్యాప్తుపై తీవ్ర ప్రతికూల ప్రభావం ఉండేలా చేయగలరని ఆయనకు బెయిల్ ఇవ్వద్దని న్యాయవాదులు కోరారు. దాంతో తెలంగాణ హైకోర్టు రవిప్రకాశ్కు బెయిల్ నిరాకరించింది. అయితే హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ రవి ప్రకాశ్ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే, అక్కడ కూడా ఆయనకు ఎదురుదెబ్బ తగిలింది. ముందస్తు బెయిల్ కోసం హైకోర్టుకే వెళ్లాలని సుప్రీం కోర్టు రవి ప్రకాశ్కు సూచించిన సంగతి తెలిసిందే. -
ముగిసిన రవిప్రకాశ్ కేసు విచారణ
సాక్షి, హైదరాబాద్ : ఫోర్జరీ, నిధుల మళ్లింపు కేసుల్లో నిందితుడిగా ఉన్న టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్ కేసు విచారణ ముగిసింది. మంగళవారం ఇరువర్గాల వాదనలు విన్న ధర్మాసనం తీర్పును రిజర్వడ్లో ఉంచింది. రవిప్రకాశ్ తరపున దిల్జిత్సింగ్ అహువాల్యా వాదనలు వినిపిస్తూ.. టీవీ9 షేర్ల అగ్రిమెంట్ కుట్రపూర్వకంగా జరిదిందని ఆరోపించారు. రవిప్రకాశ్ 40వేల షేర్లను సినీ నటుడు శివాజీకి విక్రయించిన విషయం వాస్తవమన్నారు. టీవీ9 లోగో రవిప్రకాశ్కే చెందుతుందని తెలిపారు. ప్రభుత్వం తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. టీవీ9 షేర్ల కొనుగోలు నిబంధనల ప్రకారమే జరిగిందన్నారు. అగ్రిమెంట్కు సంబంధించిన పేపర్లను కోర్టుకు సమర్పించారు. టీవీ9 లోగో ఒక వ్యక్తి ప్రాపర్టీ కాదని, అది కంపెనీ ప్రాపర్టీగా ఉంటుందన్నారు. నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్లో ఎలాంటి కేసు పెండింగ్లో లేదన్నారు. రవిప్రకాశ్, శివాజీలకు సంబంధించిన పిటిషన్పై నేషనల్ కంపెనీ అప్లియేట్ లా ట్రిబ్యునల్ స్టే ఇచ్చిందని హైకోర్టుకు తెలియజేశారు. అనంతరం తీర్పును రిజర్వడ్లో పెట్టినట్లు హైకోర్టు వెల్లడించింది. -
రవిప్రకాశ్కు మరో షాక్
సాక్షి, హైదరాబాద్: ఫోర్జరీ, నిధుల మళ్లింపు కేసుల్లో నిందితుడిగా ఉన్న టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్కు మరో షాక్ తగిలింది. ఆయన వాడుతున్న ఖరీదైన కార్లను అలంద మీడియా యాజమాన్యం స్వాధీనం చేసుకుంది. టీవీ9 నుంచి అలంద మీడియా రవిప్రకాశ్ను తొలగించినప్పటికీ.. కంపెనీ వాహనాలను మాత్రం తిరిగి ఇవ్వలేదు. దీంతో యాజమాన్యం కోర్టును ఆశ్రయించింది. తమ వాహనాలకు తిరిగి ఇప్పించాలని వారు కోర్టును కోరారు. రవిప్రకాశ్ వాడుతున్న ఖరీదైన వాహనాలకు అలంద మీడియా యాజమాన్యానికి తిరిగి ఇవ్వాలని కోర్టు ఆదేశించడంతో కార్లను స్వాధీన పరుచుకున్నారు. కోర్టు ఆదేశాలతో రవి ప్రకాశ్ ఇంటికి చేరుకున్న పోలీసులు ముందుగా కార్లను సీజ్ చేశారు. ఆయన డ్రైవర్స్ ఫోన్లను తీసుకున్నారు. అయితే ముందస్తు నోటీసులు లేకుండా ఇంటికి ఎలా వస్తారని రవిప్రకాశ్ భార్య పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తీవ్ర ఆర్థిక నేరాలకు పాల్పడిన రవిప్రకాశ్కు బెయిల్ మంజూరు చేస్తే సాక్షుల్ని ప్రభావితం చేస్తారని, కేసు దర్యాప్తుపై తీవ్ర ప్రతికూల ప్రభావం ఉండేలా చేయగలరని ఆయనకు బెయిల్ ఇవ్వద్దని ఇదివరకే న్యాయవాదులు కోరిన విషయం తెలిసిందే. రవిప్రకాశ్పై వచ్చిన ఆరోపణలను విచారిస్తున్న ధర్మాసనం ఇరువర్గాల వాదనలు విన్న అనంతరం.. కేసు విచారణ వచ్చే మంగళవారానికి వాయిదా వేస్తున్నట్లు ఇదివరకే ప్రకటించింది. -
టీవీ9 షేర్లకు ఒక్క రూపాయి ఇవ్వలేదు : అలందా
సాక్షి, హైదరాబాద్ : టీవీ9 కొనేందుకు హవాలా డబ్బును వాడారన్న ఆ చానెల్ మాజీ సీఈవో రవిప్రకాశ్ ఆరోపణలను అలందా మీడియా తీవ్రంగా ఖండించింది. నిబంధనల ప్రకారమే టీవీ9 షేర్లను కొనుగోలు చేశామని సృష్టం చేసింది. కేసును తప్పుదోవ పట్టించేందుకే రవిప్రకాశ్ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడింది. ఈ మేరకు మంగళవారం అలందా సంస్థ ఓ ప్రకటన విడుదల చేసింది. టీవీ9 షేర్లను పూర్తిగా బ్యాంకు రూపంలోనే కొనుగోలు చేశామని, ఒక్క రూపాయి కూడా నగదు రూపంలో ఇవ్వలేదని పేర్కొంది. షేర్ల కొనుగోలుకు హవాల డబ్బు వాడారన్న రవిప్రకాశ్ ఆరోపణలు అవాస్తవాలని, కేసు నుంచి తప్పించుకోవడానికే ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడని తెలిపింది. కాగా టీవీ 9 ఏర్పాటు సమయంలో మారిషస్ నుంచి ఫెమా నిబంధనలకు విరుద్ధంగా రూ. 60 కోట్ల అక్రమ నిధులు వచ్చాయని రవిప్రకాశ్ ఆరోపించిన సంగతి తెలిసిందే. టీవీ 9లో వాటాను విక్రయించిన సందర్భంలో కూడా హవాలా మార్గాల్లోనే నిధులు సమకూర్చారని ఆయన ఆరోపించారు. కశ్మీర్లో ఉగ్రవాదులకు నిధులను అందజేసే మార్గాల్లో ఈ నిధులను తరలించారని సంచలన ఆరోపణలు చేశారు. వీటిపై దర్యాప్తు చేయాలంటూ సీబీఐ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్లకు తాను ఇటీవల ఫిర్యాదు చేశానని, అప్పటి నుంచి తెలంగాణ ప్రభుత్వం తనను వేధిస్తోందని రవిప్రకాశ్ ఆరోపించారు. టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్ ఫోర్జరీకి పాల్పడినట్టు అలంద మీడియా ఫిర్యాదు చేయడంపై కోర్టులో విచారణ జరుగుతున్న సంగతి తెలిసిందే. నిన్న హైకోర్టులో ఈ కేసు విచారణకు రాగా.. నేటికి వాయిదా వేశారు. నేడు ఇరువర్గాల వాదనలు విన్న ధర్మాసనం.. కేసు విచారణ వచ్చే మంగళవారానికి వాయిదా వేసింది. -
రవిప్రకాశ్ కేసు విచారణ మళ్లీ వాయిదా
సాక్షి, హైదరాబాద్ : ఫోర్జరీ, నిధుల మళ్లింపు కేసుల్లో నిందితుడిగా ఉన్న టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్ కేసు విచారణ మళ్లీ వాయిదా పడింది. నేడు ఇరువర్గాల వాదనలు విన్న ధర్మాసనం.. కేసు విచారణ వచ్చే మంగళవారానికి వాయిదా వేసింది. టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్ ఫోర్జరీకి పాల్పడినట్టు అలంద మీడియా ఫిర్యాదు చేయడంపై కోర్టులో విచారణ జరుగుతున్న సంగతి తెలిసిందే. నిన్న హైకోర్టులో ఈ కేసు విచారణకు రాగా.. నేటికి వాయిదా వేశారు. నేడు హైకోర్టులో ప్రారంభమైన రవిప్రకాశ్ కేసు విచారణలో ఇరు వర్గాలు తమ వాదనలు వినిపించాయి. రవిప్రకాశ్కు బెయిల్ ఇవ్వొద్దని పోలీసుల తరపు లాయర్ వాదనలు వినిపించారు. సాక్షులను ప్రలోభాలకు గురిచేసే అవకాశం ఉందని... అందుకే బెయిల్ను నిరాకరించాలని హైకోర్టుకు విన్నవించారు. దేవేందర్ అగర్వాల్ రిజైన్ లెటర్లో సంతకం ఫోర్జరీ చేసినట్లు ఆధారాలతో సహా హైకోర్టుకు పోలీసులు చూపించారు. సాక్షులను ప్రలోభాలకు గురిచేస్తూ.. వారితో జరిపిన ఫోన్ చాటింగ్ స్ర్కీన్షాట్స్ను కూడా హోకోర్టుకు సమర్పించారు. రవిప్రకాశ్ విచారణకు సహకరించడంలేదని పోలీసులు తెలిపారు. ఈ కేసులో లోతైన దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉందని, అందుకే రవిప్రకాశ్కు బెయిల్ ఇవ్వొద్దని పోలీసుల తరపు లాయర్ హైకోర్టులో వాదనలు వినిపించారు. రవిప్రకాశ్కు బెయిల్ ఇవ్వమని ఆయన తరపు న్యాయవాది హైకోర్టును కోరగా.. ఏ ప్రాతిపదికన బెయిల్ మంజూరు చేయాలని హైకోర్టు ప్రశ్నించింది. ఇరువర్గాల వాదనలు విన్న హైకోర్టు.. ఈ కేసును వచ్చే మంగళవారానికి వాయిదా వేసింది. -
రవిప్రకాశ్కు బెయిలా? జైలా?
సాక్షి, హైదరాబాద్: ఫోర్జరీ కేసు నిందితుడు, టీవీ 9 మాజీ సీఈవో రవి ప్రకాష్ అరెస్ట్ ఎప్పుడనేది మంగళవారం తేలే అవకాశం కనిపిస్తోంది. రవిప్రకాశ్ ముందస్తు బెయిల్ పిటిషన్పై హైకోర్టు తన విచారణను మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేసింది. పలు నేరారోపణ కేసులలో రవిప్రకాష్ తనకు బెయిల్ కావాలని కోరుతుంటే.. రవికి బెయిల్ ఇస్తే సాక్ష్యాధారాలను తారుమారు చేసే ప్రమాదం ఉందని, కాబట్టి బెయిల్ ఇవ్వద్దని పోలీసుల తరపు న్యాయవాదులు హైకోర్టుకు విజ్ఞప్తి చేసుకున్నారు. ఇరువర్గాల వాదనలూ విన్న న్యాయస్థానం సోమవారం తన విచారణను మంగళవారానికి వాయిదా వేసిన సంగతి తెలిసిందే. టీవీ9 చానెల్లో పలు ఆర్ధిక అవకతవకలు, అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటోన్న మాజీ సీఈవో రవిప్రకాష్ సైబర్ క్రైమ్ విచారణకు హాజరైనా ఏ మాత్రం విచారణకు సహకరించడంలేదన్నది పోలీసులు అంటున్నారు. అదేవిధంగా టీవీ 9 లోగోని పాతసామాను అమ్మేసినట్లు 99 వేలకి చిల్లరగా అమ్మేసిన కేసులో బంజారాహిల్స్ పోలీసులు రవిని విచారించారు. అయితే ఈ విచారణలోనూ రవిప్రకాష్ పోలీసుల ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పకుండా తప్పించుకున్నాడని తెలుస్తోంది. మొత్తానికి రవి ప్రకాష్ పై నమోదైన కేసులకు సంబంధించి అన్ని సాక్ష్యాధారాలనూ సేకరించిన పోలీసులు విచారణ అనంతరం నివేదికను రూపొందించి హైకోర్టుకు సమర్పించారు. -
రవిప్రకాశ్ కేసు విచారణ వాయిదా
సాక్షి, హైదరాబాద్ : ఫోర్జరీ, నిధుల మళ్లింపు కేసుల్లో నిందితుడిగా ఉన్న టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్ ముందస్తు బెయిల్ పిటిషన్ కేసు రేపటికి వాయిదా పడింది. టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్ ఫోర్జరీకి పాల్పడినట్టు అలంద మీడియా ఫిర్యాదు చేయడంపై కోర్టులో విచారణ జరుగుతున్న సంగతి తెలిసిందే. దీనిపై సైబర్ క్రైమ్ పోలీసులు కూడా దర్యాప్తు చేసి రవిప్రకాశ్ ను కొన్నిరోజులపాటు విచారించారు. ఈ రోజు(సోమవారం) హైకోర్టులో ఈ కేసు విచారణ జరిగింది. రవిప్రకాశ్ దర్యాప్తు నివేదికను పోలీసులు హైకోర్టుకు సమర్పించారు. అడ్వొకేట్ జనరల్(ఏజీ) తమ వాదనలు వినిపిస్తూ..రవిప్రకాశ్ తన 9శాతం షేర్లలో 40 వేల షేర్లను నటుడు శివాజీకి అమ్మినట్లు తప్పుడు ధ్రువపత్రాలు సృష్టించారని ఆరోపించారు. మెజారిటీ షేర్హోల్డర్స్కు తెలియకుండా రూ. 99వేలకు టీవీ9 లోగోను రవిప్రకాశ్ అమ్మేశాడని కోర్టుకు తెలిపారు. కావాలనే శివాజీతో ఎన్సీఎల్టీలో కేసులు వేయించాడని ఆరోపించారు. పోలీసులు ఎన్నిసార్లు విచారణకు పిలిచిన హాజరు కాలేదని, ఏ తప్పు చేయకపోతే ఎందుకు విచారణకు హాజరు కాలేదని ప్రశ్నించారు. సైబర్ క్రైమ్ పోలీసులు ఇప్పటికే రవిప్రకాశ్ కు 41 సీఆర్పీసీ కింద నోటీసులు జారీచేసిన క్రమంలో ఆయన అరెస్ట్ తప్పదన్న భావనలు వ్యక్తమవుతున్నాయి. అంతకుముందు ఫోర్జరీ కేసులో బెయిల్ కోరుతూ రవిప్రకాశ్ హైకోర్టును ఆశ్రయించగా, ఆయన పిటిషన్ తిరస్కరణకు గురైంది. దీంతో ఆయన సుప్రీంకోర్టుకు వెళ్లినా ఫలితం దక్కలేదు. దిగువ కోర్టుకే వెళ్లాలని, పోలీసుల ముందు విచారణకు హాజరవ్వాల్సిందేనని సుప్రీం స్పష్టం చేయడంతో రవిప్రకాశ్ అజ్ఞాతం వీడి సైబర్ క్రైమ్ పోలీసుల ముందు విచారణకు వచ్చారు. ఈ క్రమంలో రవిప్రకాశ్ ను అరెస్ట్ చేయాలంటే 48 గంటల ముందు నోటీసులు ఇచ్చిన తర్వాతే అదుపులోకి తీసుకోవాలని సుప్రీం పేర్కొనడంతో, సైబర్ క్రైమ్ పోలీసులు ఆయనకు 41 సీఆర్పీసీ కింద నోటీసులు పంపారు. ఈ నేపథ్యంలో, కోర్టు తీర్పును అనుసరించి రవిప్రకాశ్ ను అరెస్ట్ చేసే అవకాశాలు ఆధారపడి ఉన్నాయి. -
రవిప్రకాశ్ సమాధానాల్లో వాస్తవాలు వెలికితీస్తాం
-
అరెస్ట్కు రంగం సిద్ధం
-
రవి ప్రకాష్కు బంజారాహిల్స్ పోలీసుల నోటీసులు
-
రవిప్రకాశ్కి శల్యపరీక్ష!
-
కొనసాగుతున్న రవిప్రకాశ్ విచారణ
-
ముందస్తు బెయిల్ రద్దు.. పోలీసుల ఎదుటకు రవిప్రకాశ్
-
రవిప్రకాశ్కు సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ
-
సుప్రీంకోర్టులో రవిప్రకాశ్కు చుక్కెదురు
సాక్షి, న్యూఢిల్లీ : ఫోర్జరీ, డేటా చౌర్యం కేసులో టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్కు మరోసారి చుక్కెదురైంది. తెలంగాణ పోలీసులు నమోదు చేసిన మూడు కేసుల్లో ఆయనకు ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ కేసును హైకోర్టులోనే తేల్చుకోవాలని స్పష్టం చేసింది. ఈ విషయంలో గతంలో ఇచ్చిన ఉత్తర్వులను పక్కనపెడుతూ తాజాగా మెరిట్ ఆధారంగా కేసును విచారించాలని హైకోర్టును ఆదేశించింది. ముందస్తు బెయిల్ పిటిషన్ను హైకోర్టు కొట్టేయడాన్ని సవాల్ చేస్తూ రవిప్రకాశ్ ఇటీవల దాఖలు చేసిన పిటిషన్ను జస్టిస్ ఇందూ మల్హోత్రా, జస్టిస్ ఎంఆర్ షాలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం సోమవారం విచారించింది. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం తరఫున మాజీ సొలిసిటర్ జనరల్ రంజిత్ కుమార్ వాదనలు వినిపిస్తూ.. సీఆర్పీసీ సెక్షన్లు 160, 41ఏ కింద రెండు సార్లు నోటీసులు జారీ చేసినప్పటికీ రవిప్రకాశ్ విచారణకు హాజరుకాలేదని వాదించారు. రవిప్రకాశ్ తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ వాదనలు వినిపిస్తూ.. రవిప్రకాశ్ను అరెస్టు చేసే ఉద్దేశంతోనే పోలీసులు పదేపదే ఆయన ఇంటికొచ్చి సోదాలు చేస్తున్నారని చెప్పగా, అది తప్పుడు విశ్లేషణ అంటూ తెలంగాణ ప్రభుత్వం తరఫు న్యాయవాది కౌంటర్ చేశారు. కాగా, సీఆర్పీసీ సెక్షన్ 41ఏ కింద పోలీసులు నోటీసులు జారీ చేస్తే తప్పుకుండా విచారణకు హాజరుకావాలని స్పష్టం చేసిన ధర్మాసనం, ఈ కేసులో తాము ముందస్తు బెయిల్ ఇవ్వబోమని తెలిపింది. ముందస్తు బెయిల్ కోసం తిరిగి హైకోర్టునే ఆశ్రయించాలని చెప్పింది. హైకోర్టు రవిప్రకాశ్ బెయిల్ పిటిషన్ను మెరిట్స్ ఆధారంగా విచారణ జరపకుండా కొట్టేయడంతో.. ఈ కేసును హైకోర్టు తిరిగి విచారించాలని ఆదేశించింది. గతంలో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను పక్కనపెట్టింది. జూన్ 10న మెరిట్స్ ఆధారంగా కేసును విచారించి తేల్చాలని ఆదేశించింది. పోలీసులు ఒకవేళ రవిప్రకాశ్ను అరెస్టు చేయదలిస్తే 48 గంటల ముందు నోటీసులు జారీ చేసి అరెస్టు చేయవచ్చునని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. -
రవిప్రకాశ్కు సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ
-
ఆ ముగ్గురు కనబడుట లేదు!
-
ఇంకా అజ్ఞాతంలో రవిప్రకాశ్
-
అజ్ఞాతం నుంచి రవిప్రకాశ్ వీడియో సందేశం!
సాక్షి, హైదరాబాద్ : ఫోర్జరీ, డేటాచౌర్యంతోపాటు పలు కేసులు ఎదుర్కొంటు అజ్ఞాతంలో ఉన్న టీవీ 9 చానల్ మాజీ సీఈవో రవిప్రకాశ్ బుధవారం ఓ వీడియోను విడుదల చేశారు. టీవీ9 కొత్త యాజమాన్యంతో నెలకొన్న వివాదం వల్లే తనపై తప్పుడు కేసులు పెట్టారని ఆరోపించారు. తన కేసుల విషయంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని, ఓ ఉగ్రవాదిలా ట్రీట్ చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. టీవీ9 స్థాపన దగ్గర నుంచి అమ్మకం వరకు చోటు చేసుకున్న పరిణామాలను వివరించారు. తనను పాలేరులా పనిచేయాలన్నారని, దీనికి అంగీకరించకపోవడంతోనే కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆరోపించారు. మరోవైపు రవిప్రకాశ్ కోసం తెలంగాణ పోలీసులు గాలింపును తీవ్రతరం చేశారు. తాజాగా విడుదల చేసిన వీడియో ఆధారంగా రవిప్రకాష్ ఎక్కడ ఉన్నాడనే కూపీ లాగుతున్నట్లు సమాచారం. ఇక ముందస్తు బెయిల్ కోసం రవిప్రకాశ్ మూడు పిటిషన్లు దాఖలు చేశారు. దీనిపై హైకోర్టు నేడు విచారించే అవకాశముంది. రవిప్రకాశ్పై సైబరాబాద్ సైబర్క్రైమ్లో రెండు, బంజారాహిల్స్ పోలీస్స్టేషన్లో ఒక కేసు నమోదైంది. -
రవిప్రకాశ్ మరోసారి...
సాక్షి, హైదరాబాద్: ఫోర్జరీ, డేటాచౌర్యంతోపాటు పలు కేసులు ఎదుర్కొంటున్న టీవీ 9 చానల్ మాజీ సీఈవో రవిప్రకాశ్ ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. తాజాగా మరోసారి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ముందస్తు బెయిల్ కోసం ఆయన మూడు పిటిషన్లు దాఖలు చేశారు. దీనిపై హైకోర్టు నేడు విచారించే అవకాశముంది. రవిప్రకాశ్పై సైబరాబాద్ సైబర్క్రైమ్లో రెండు, బంజారాహిల్స్ పోలీస్స్టేషన్లో ఒక కేసు నమోదైంది. మరోవైపు రవిప్రకాశ్ కోసం తెలంగాణ పోలీసులు గాలింపును తీవ్రతరం చేశారు. హైదరాబాద్, సైబరాబాద్ పోలీసులతోపాటు టాస్క్ఫోర్స్ పోలీసుల బృందం రవిప్రకాశ్ జాడ కనిపెట్టేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. సినీనటుడు శొంఠినేని శివాజీ కూడా తెలంగాణ పోలీసుల విచారణకు హాజరుకాకుండా కోర్టులో మాత్రం ముందస్తు బెయిల్ కోసం పిటిషన్లు వేస్తూ వస్తున్నారు. వీరిద్దరిని ప్రశ్నిస్తేనే కేసులు కొలిక్కి వస్తాయని పోలీసులు భావిస్తున్నారు. -
రవిప్రకాశ్ ఆస్ట్రేలియా జారుకున్నట్లు పోలీసుల అనుమానం
-
శివాజీ, రవిప్రకాశ్పై లుక్ అవుట్ నోటీసులు జారీ
-
రవిప్రకాశ్, శివాజీపై లుక్ అవుట్ నోటీసులు జారీ
సాక్షి, హైదరాబాద్ : నిధుల మళ్లింపు, ఫోర్జరీకి పాల్పడి అజ్ఞాతంలో ఉన్న టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్పై సైబరాబాద్ పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. రవిప్రకాశ్తో పాటు సినీ నటుడు గరుడ పురాణం శివాజీ, మాజీ సీఎఫ్వో మూర్తికి కూడా నిన్న అర్థరాత్రి సమయంలో ఈ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు దేశంలోని అన్ని ఎయిర్పోర్టులను పోలీసులు అప్రమత్తం చేశారు. వీరిరువురు దేశం విడిచి పారిపోకుండా ఉండేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు. కాగా ఇప్పటికే రవిప్రకాశ్ పాస్పోర్టును పోలీసులు సీజ్ చేసిన విషయం విదితమే. ఈ కేసులో విచారణకు హాజరు కావాలని రవిప్రకాశ్తో పాటు శివాజీకి పోలీసులు పలుమార్లు నోటీసులు ఇచ్చినా...వారు గైర్హాజరు అయ్యారు. దీంతో వాళ్లకు ఇచ్చిన గడువు పూర్తి కావడంతో రవిప్రకాశ్, శివాజీలను సైబరాబాద్ పోలీసులు ఏ క్షణంలో అయినా అరెస్టు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. మరోవైపు మాజీ సీఎఫ్వో మూర్తి విచారణ నిమిత్తం సైబరాబాద్ పోలీసుల ఎదుట హాజరు అయ్యారు. ఈ విచారణలో ఆయన పలు కీలక విషయాలు వెల్లడించినట్లు సమాచారం. ఇక టీవీ9లో వీరు చేసిన అక్రమాలు, తప్పుడు అగ్రిమెంట్లు, ఫోర్జరీ సంతకాలతో తప్పుదోవ పట్టించటం, నిధులు మళ్లింపు, టీవీ9 లోగోను విక్రయించాలనే దురాలోచన... ఇలాంటి అక్రమాలపై ఇప్పటికే సైబర్ క్రైం, బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు అయ్యాయి. 2018 ఫిబ్రవరిలో నటుడు శివాజీ, రవి ప్రకాష్, శక్తి, టీవీ9 మాజీ సీఎఫ్వో మూర్తి, మోజో టీవీ చైర్మన్ హరికిషణ్ మధ్య ఈ-మెయిల్స్ ద్వారా జరిగిన కుట్రను కూడా సైబర్ క్రైం పోలీసులు బయటపట్టారు. టీవీ9 లోగోను సైతం రూ. 99వేలకు విక్రయించటానికి తప్పుడు అగ్రిమెంట్ కూడా చేసినట్లు పోలీసులు గుర్తించారు. తాజాగా పోలీసులు లుక్ ఔట్ నోటీసులు జారీ చేయడంతో ఇప్పటికైనా రవి ప్రకాష్, శివాజీ అజ్ఞాతం వీడుతారా ? లేదా ? మరింత ఆసక్తిగా మారింది. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి : శివాజీ, రవిప్రకాశ్పై లుక్ అవుట్ నోటీసులు జారీ -
ఫోర్జరీ కేసు.. రోజుకో మలుపు!
-
23 తర్వాత టీడీపీ ముక్క చెక్కలే...
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్పై వైఎస్సార్ సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ట్విటర్ వేదికగా విమర్శనాస్త్రాలు సంధించారు. షేర్ హోల్డర్ల అనుమతి లేకుండా టీవీ9 లోగోను రవిప్రకాశ్ అమ్మేయడంపై సాయిరెడ్డి స్పందించారు. ‘అప్పట్లో నట్వర్లాల్ అనే చీటర్ తాజ్మహల్నే అమ్మేశాడని తెలిసి విస్తుపోయాం. ఫోర్జరీ, నిధుల స్వాహా, షేర్ల అమ్మకాలు(బోగస్), టీవీ9 ట్రేడ్మార్క్, కాపీరైట్ అమ్మకాలు... రోజుకొకటి చొప్పున వెలుగు చూస్తున్న ‘మెరుగైన సమాజం’ ప్రొడ్యూసర్ మోసాలు నైజీరియన్ మోసగాళ్ళను తలపిస్తున్నాయి. మీడియా 'నయీం' నేరాలపై దర్యాప్తు ఆధికారులు పక్కా ఆధారాలు సేకరించారు. గరుడ పురాణం బ్రోకర్ శొంఠినేని శివాజీ కూడా తప్పించుకోలేడు. 14 నెలల క్రితం రవి ప్రకాష్ తనకు షేర్లు విక్రయించాడని రాసుకున్న అగ్రిమెంటు పత్రం తాజాగా సృష్టించినదే అని వెల్లడైంది. చట్టాలంటే ఎంత చులకనో వీళ్లకు.’ అని వ్యాఖ్యానించారు. 23 తర్వాత టీడీపీ ముక్క చెక్కలవుతుంది అలాగే చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో అయిదు పోలింగ్ బూత్ల్లో రీ పోలింగ్ నిర్వహణపై చంద్రబాబు నాయుడు రాద్దాంతం చేయడంపై కూడా విజయసాయి రెడ్డి మండిపడ్డారు. ‘ పశ్చిమ బెంగాల్లోని ఒక పోలింగ్ బూత్లో ఓటర్లకు బదులు ఓ మహిళా అధికారి తానే తృణమూల్ గుర్తు బటన్ నొక్కుతున్న వీడియో వైరల్గా మారింది. ఇది చంద్రబాబుకు కనిపించలేదా?. ఎన్నికల కమిషన్ మెత్తగా వ్యవహరించి ఉంటే తాను కూడా ఏపీలో అదే తరహా రిగ్గింగ్కు పాల్పడేవాడు కాదా?.చంద్రగిరి నియోజకవర్గంలోని 5 పోలింగ్ బూతుల్లో దళితులను బెదిరించి టీడీపీ రిగ్గింగుకు పాల్పడిన ఆరోపణలు రుజువు కావడంతో ఈసీ రీపోలింగుకు ఆదేశించింది. అక్రమాలకు పాల్పడకపోతే వాళ్లకెందుకు భయం. రీపోలింగు అన్యాయం అంటూ ఆందోళనకు దిగడమేమిటి సిగ్గులేకుండా? దళితులు ఈసారి సత్తా చూపాలి. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి : గరుడ బ్రోకర్ శివాజీ కూడా తప్పించుకోలేడు 23 తర్వాత తెలుగుదేశం పార్టీ ముక్క చెక్కలవుతుంది. ఎన్టీఆర్ స్థాపించిన పార్టీని తన స్వార్థ ప్రయోజనాల కోసం భ్రష్టు పట్టించినందుకు చంద్రబాబుపై తిరుగుబాటు జరుగుతుంది. ఇది గమనించే పరువు కాపాడుకునేందుకు మహానాడును రద్దు చేశాడు. ఇంకా చాలా వింతలు, విడ్డూరాలు చూడబోతున్నాం.’ అంటూ ట్వీట్ చేశారు. కాగా చంద్రగిరి నియోజకవర్గంలో రీ పోలింగ్ నిర్వహణపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇవాళ సాయంత్రం 4.30 గంటలకు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలవనున్నారు. -
గరుడ పురాణం 2.0
-
కథ,స్క్రీన్ ప్లే,డైరెక్షన్ రవిప్రకాశ్!
-
కథ, స్క్రీన్ప్లే, దర్శకత్వం రవిప్రకాశ్!
సాక్షి, హైదరాబాద్: టీవీ9 యాజమాన్య బదిలీని నిలువరించేందుకు ప్రయత్నించిన కేసులో.. ఆ సంస్థ మాజీ సీఈవో రవిప్రకాశే సూత్రధారనే అంశం తేలిపోయింది. సినీ నటుడు శివాజీకి తన షేర్లు కొన్ని విక్రయించినట్లుగా రవిప్రకాశ్ నకిలీ పత్రాలు సృష్టించిన వైనం బట్టబయలైంది. ఈ మొత్తం వ్యవహారాన్ని æతెరవెనక ఉండి నడిపింది రవిప్రకాశేనని సైబర్ క్రైమ్ పోలీసుల విచారణలో వెల్లడైంది. షేర్ల బదిలీ అంటూ కొత్త వ్యక్తి శివాజీని తెరపైకి తెచ్చిందీ.. పాత తేదీలతో పత్రాలు సృష్టించిన రవిప్రకాశ్ తనపైన తానే కేసు వేయించుకున్నారని స్పష్టమైంది. ఈ వ్యవహారం మొత్తానికి ప్రణాళిక రచించి, అమలు చేయడం, ఎవరేపనిచేయాలో నిర్దేశించడం వరకు అన్నీ రవిప్రకాశ్ కనుసన్నల్లోనే జరిగాయి. ఈ మేరకు రవిప్రకాశ్, శివాజీ, మాజీ ఉద్యోగుల మధ్య ఈ–మెయిల్ సంభాషణలను తెలంగాణ పోలీసులు వెలికి తీయడం సంచలనం సృష్టిస్తోంది. ఈ కేసులో ఇప్పటికే అన్ని ఆధారాలు సేకరించిన పోలీసులు ఏ క్షణాన్నైనా రవిప్రకాశ్ను అరెస్టు చేసే అవకాశముందని సమాచారం. దీంతో కొంతకాలం క్రితం టీవీ9ని టేకోవర్ చేసిన అలందా మీడియా సంస్థ ఆరోపిస్తున్నట్టుగా ఈ వ్యవహారం మొత్తం నడిపిందీ రవిప్రకాశేనని తేటతెల్లమైంది. అసలేం జరిగింది? 2018 ఆగస్టులో టీవీ9 మాతృ సంస్థ ఏబీసీఎల్ కార్పొరేషన్ నుంచి మేఘా ఇంజినీరింగ్స్, మైంహోమ్ గ్రూప్ సంయుక్త వెంచర్ టీవీ9 దాని అనుబంధ చానెళ్లను కొనుగోలు చేసింది. ఈ డీల్ను రవిప్రకాశ్ మొదటి నుంచి వ్యతిరేకిస్తూ వచ్చారు. రవిప్రకాశ్, తన అనుచరులతో కలిపి 8.5% షేర్లను కలిగి ఉండటమే దీనికి కారణం. సంస్థ సీఈఓ కూడా కావడంతో రవిప్రకాష్ ఈ డీల్ను భగ్నం చేసేందుకు తనకున్న అన్ని అవకాశాలను వినియోగించారు. కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖ అనుమతిచ్చినా.. కొత్త బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లను నియమించేందుకు అభ్యంతరం చెప్పడం, సంస్థ కార్యదర్శి కౌశిక్రావు సంతకాన్ని ఫోర్జరీ చేయడం, శివాజీ అనే సినీనటుడిని తెరపైకి తీసుకవచ్చి రవిప్రకాశ్పై కేసు వేయడం అన్నింటిపైనా అలందా మీడియా మొదట నుంచి గుర్రుగానే ఉంది. దీంతో రవిప్రకాశ్ ఆగడాలకు కళ్లెం వేసేందుకు నిర్ణయించి ఫోర్జరీ, డేటాచౌర్యం, నిధుల మళ్లింపుపై సైబరాబాద్ పోలీసులకు కౌశిక్రావు ద్వారా ఫిర్యాదు చేయించింది. ఆ రోజు మాత్రం టీవీ9 స్టూడియోలో తానెక్కడీ పారిపోలేదని, తన వార్తలను తానే చదువుకున్న రవిప్రకాశ్ ఇప్పటివరకూ పరారీలోనే ఉండటం గమనార్హం. కుట్ర బయటపడిందిలా! తాను నిరపరాధినని రవిప్రకాశ్ పైకి చెబుతున్నా.. పోలీసుల విచారణకు హాజరుకాకపోవడంతో అతని తీరుపై అనుమానం పెరుగుతోంది. దీంతో కేసు దర్యాప్తు వేగవంతం చేశారు. రవిప్రకాశ్, శివాజీ, మాజీ ఉద్యోగులు ఎంవీకేఎన్ మూర్తి, మరో అధికారి మూర్తి, న్యాయవాది శక్తి మధ్య సర్క్యులేట్ అయిన ఈ–మెయిల్స్ పోలీసుల చేతికి అందినట్లు ప్రచారం జరిగింది. ఈ ఆధారాలు దొరక్కుండా సర్వర్ల నుంచి ఈ–మెయిల్స్ సంభాషణను తొలగించినప్పటికీ పోలీసులు వాటిని తిరిగి సంపాదించారంటూ బుధవారం ఉదయం వార్తలొచ్చాయి. 2018 ఫిబ్రవరి 20న రవిప్రకాశ్ రూ.20 లక్షలకు 40వేల షేర్లు విక్రయించారంటూ ఆరోపిస్తూ సినీనటుడు శివాజీ నేషనల్ కంపెనీ లా ఆఫ్ ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ)ని ఆశ్రయించిన సంగతి తెలిసిందే. అయితే.. ఇందుకు ఆధారంగా చూపించిన డ్రాఫ్ట్ను ఈ ఏడాది ఏప్రిల్ 13న సృష్టించినట్లు పోలీసులు గుర్తించారని తెలుస్తోంది. ఆ ఈ–మెయిల్ను అదేరోజు సాయంత్రం 5.46 గంటలకు టీవీ9 మాజీ సీఎఫ్ఓ ఎంవీఎన్కే మూర్తికి, రవిప్రకాశ్కు, ఆయన సన్నిహితుడు హరికిషన్కు.. రవి లాయర్ శక్తి మెయిల్ చేశారని సమాచారం. ఈ డ్రాఫ్ట్ మాత్రం 2018 ఫిబ్రవరి 20 తేదీతో సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఇదే విషయమై ఈ బృందం అందరి మధ్యా రాత్రి 9.35 గంటల వరకు పలు రకాల మెయిల్స్ వెళ్లినట్లు పోలీసులు గుర్తించారని సమాచారం. ఈ కేసు దాఖలు చేయడానికి అవసరమైన డ్రాఫ్ట్ను విజయవాడకు చెందిన ఓ లాయర్ రూపొందించినట్టు తెలుస్తోంది. ఏప్రిల్ 14న ఉదయం 5.38 గంటలకు ఆ పిటిషన్ కాపీని, మార్పులు చేర్పులు సరిచూసుకున్నాక ఉదయం 9గంటలకల్లా లాయర్ వద్దకు పంపాలని రవిప్రకాశ్ తన అనుచరులకు ఆదేశించారని.. పక్కా ఆధారాలు లభించిన తర్వాతే పోలీసులు ఈనెల 13న సీఆర్పీసీ సెక్షన్ 41–ఏ ప్రకారం నోటీసులు జారీ చేసినట్లు వార్తలొచ్చాయి. అయితే పోలీసులు మాత్రం ఈ అంశాలను ధ్రువీకరించలేదు. రవిప్రకాశ్ను కచ్చితంగా అరెస్టు చేసే అవకాశాలు ఉండటంతో ఆయన నేటికీ పరారీలో ఉన్నారు. బుధవారం ముందస్తు బెయిల్ కోసం చేసిన ప్రయత్నాలు బెడిసి కొట్టడంతో ఏపీలో తలదాచుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరోవైపు రవిప్రకాశ్ స్నేహితుడు, లాయర్ శక్తి, నటుడు శివాజీ కూడా పరారీలో ఉన్నారు. ట్రిబ్యునల్లోనూ దక్కని ఊరట టీవీ9 కొనుగోలు డీల్ని నిలిపివేయాలంటూ నటుడు శివాజీ దాఖలు చేసిన పిటిషన్ను ట్రిబ్యునల్ తోసిపుచ్చింది. శివాజీ దాఖలు చేసిన పిటిషన్పై ఇపుడు విచారణ జరపలేమని తేల్చిచెప్పింది. రవిప్రకాశ్ తనకు 40వేల షేర్లు విక్రయించానని చెప్పి మోసగించారని.. ఏబీసీఎల్ కంపెనీ యాజమాన్య మార్పుల విషయమై తనకు సమాచారం అందించలేనందున.. ఈ డీల్ను నిలిపివేయాలని కోరుతూ.. శివాజీ ఈ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. మరోవైపు టీవీ9 డైరెక్టర్ల పదవుల్లో నుంచి కొత్త యాజమాన్యం తమను తొలగించకుండా చూడడంతో పాటు, కొత్తవారిని విధులు నిర్వహించకుండా ఉత్తర్వులు ఇవ్వాలంటూ రవిప్రకాశ్, ఆయన సన్నిహితులు కలిసి హైదరాబాద్లోని ఎన్సీఎల్టీని ఆశ్రయించిన సంగతి తెలిసిందే. దీనిపై కొత్త యాజమాన్యం అలందా మీడియా ఢిల్లీలోని నేషనల్ కంపెనీ లా ఆఫ్ అప్పిలేట్ ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ)ని ఆశ్రయించింది. దీన్ని విచారించిన త్రిసభ్య ధర్మాసనం రవిప్రకాశ్ వేసిన పిటిషన్పై జూన్ 9 వరకు స్టే విధిస్తూ.. తీర్పునిచ్చింది. దీంతో ఇదేరోజు హైదరాబాద్లోని ఎన్సీఎల్ఏటీ ధర్మాసనం కూడా రవిప్రకాశ్ వాజ్యంపై విచారణను వాయిదా వేసింది. ఎన్సీఎల్ఏటీ తరువాత ప్రొసీడింగ్స్ వచ్చేవరకు అంటే జూన్ 12 వరకు కేసును వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. రవిప్రకాశ్ వెనక పెద్ద తలలు తానెక్కడికి పారిపోలేదని ప్రకటనలు ఇచ్చిన రవిప్రకాశ్ తాజాగా గురువారం సైబరాబాద్ పోలీసులకు ఓ సందేశం పంపినట్లు సమాచారం. విచారణకు హాజరయ్యేందుకు తనకు మరింత గడువు కావాలని, ఈ–మెయిల్ పంపినట్లు వార్తలొచ్చినా.. పోలీసులు వీటిని ధ్రువీకరించడం లేదు. వాస్తవానికి రవిప్రకాశ్ ప్రస్తుతం విజయవాడలోనే ఉన్నాడని ప్రచారం జరుగుతోంది. అతని వెనక ఏపీలోని అధికార పార్టీకి చెందిన పలువురు పెద్దతలల అండ ఉందని, వారి సాయంతోనే రవిప్రకాశ్ అక్కడ తలదాచుకుంటున్నాడని సమాచారం. దీనికితోడు రవిప్రకాశ్, అతని సన్నిహితులు టీవీ9 నుంచి నిధులను ఇతర మార్గాల్లో మళ్లించాడన్న ఆరోపణల్లో రవిప్రకాశ్ సన్నిహితుడు హరికిషన్పై పోలీసులు ఫోకస్ పెట్టినట్లు తెలిసింది. -
ఎన్సీఎల్టీలో శివాజీకి ఎదురు దెబ్బ
-
ఎన్సీఎల్టీలో శివాజీకి చుక్కెదురు
సాక్షి, హైదరాబాద్ : నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్లో సినీనటుడు, గరుడ పురాణం శివాజీకి చుక్కెదురు అయింది. ఇప్పటికే అలందా మీడియాకు అనుకూలంగా ఢిల్లీలోని ఎన్సీఎల్టీ అప్పిలేట్ ట్రిబ్యునల్ ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో ఈ పిటిషన్పై ప్రస్తుతం ప్రొసీడింగ్స్ జరపలేమని తేల్చి చెప్పింది. కాగా టీవీ9 మాతృసంస్థ ఏబీసీఎల్లో జరిగిన మార్పులు, తనకు తెలియకుండా రవిప్రకాశ్ మోసపూరితంగా వ్యవహరించారని, ఏబీసీఎల్లో మార్పులపై స్టే విధించి యధాతథ స్థితిని కొనసాగించాలంటూ ఆయన ఎన్సీఎల్టీని ఆశ్రయించిన విషయం తెలిసిందే. మరోవైపు అలందా మీడియా ఒప్పందాలపై స్టే కోరుతూ రవిప్రకాశ్ కూడా వారం క్రితం ఎన్సీఎల్టీలో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ను విచారణకు స్వీకరించిన ట్రిబ్యునల్ ఎనిమిది మందికి నోటీసులు ఇచ్చింది. అయితే దీన్ని సవాల్ చేస్తూ.. ఏబీసీఎల్ను టేకోవర్ చేసిన అలంద మీడియా నేషనల్ ఢిల్లీలోని కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్లో అప్పీల్ పిటిషన్ వేసింది. దీనిపై విచారణ జరిపిన ట్రిబ్యునల్ ...హైదరాబాద్ ఎన్సీటీఎల్లో జరిగే కేసు విచారణపై జూలై 9వ తేదీ వరకూ స్టే ఇచ్చింది. దీంతో స్టే కారణంగానే జూలై 12 వరకూ ఎలాంటి ప్రొసిడింగ్స్ జరగడానికి వీల్లేదని ఎన్సీఎల్టీ స్పష్టం చేస్తూ తదుపరి విచారణను జూలై 12వ తేదీకి వాయిదా వేసింది. ఈ కేసు విచారణకు రవిప్రకాశ్, శివాజీ గైర్హాజరు కాగా, వాళ్ల తరఫు న్యాయవాదులు హాజరు అయ్యారు. మరోవైపు ఎన్సీఎల్టీ వద్ద సైబర్ క్రైమ్, ఎస్వోటీ పోలీసులు కూడా మోహరించారు. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి : ఎన్సీఎల్టీలో శివాజీకి ఎదురు దెబ్బ -
ఫోర్జరీ పెకాశం, ఆపరేషన్ గరుడ శివాజీ ఎక్కడ?
సాక్షి, అమరావతి : ఫోర్జరీ పెకాశం, ఆపరేషన్ గరుడ శివాజీలు ఎక్కడున్నా వచ్చేయండి.. మిమ్మల్నేమీ అనరు అంటూ టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్, నటుడు శివాజీలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ వి.విజయసాయిరెడ్డి సెటైర్ వేశారు. 'మెరుగైన సమాజం కోసం ఫోర్జరీ ఎలా చేయాలనే సలహాలు మాత్రమే పెకాశం గారిని అడుగుతారట.. శివాజీ కోసం స్టేషన్లో వైట్ బోర్డు, మార్కర్ పెన్ను సిద్ధంగా ఉంది.. ఫోర్జరీ పురాణం చెప్తే చాలట' అంటూ సైరా పంచ్ హ్యాష్ ట్యాగ్తో పోస్ట్ పెట్టారు. తనకు కులం లేదు, మతం లేదంటూనే సొంత సామాజిక వర్గానికే ప్రమోషన్లలో చంద్రబాబు వ్యవహరించిన తీరుపై మరో సైరా పంచ్ వేశారు. #SaiRaaPunch #సైరాపంచ్ pic.twitter.com/BsBdw98tt0 — Vijayasai Reddy V (@VSReddy_MP) May 15, 2019 తను చేయించిన 4 సర్వేల్లో టీడీపీ గెలుస్తుందని తేలినట్టు చెప్పిన చంద్రబాబు నాయుడు, ఎగ్జిట్ పోల్స్ను మాత్రం నమ్మొద్దనడం వింతగా ఉందని విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు. ఏ సర్వేలను ప్రామాణికంగా తీసుకోవద్దంటే అర్థం చేసుకోవచ్చు కానీ, మీడియా ఇంతగా విస్తరించిన తర్వాత దేన్ని నమ్మొచ్చో దేన్ని పట్టించుకోకూడదో ప్రజలందరికీ తెలుసని ట్విటర్లో మరో పోస్ట్ పెట్టారు. చంద్రబాబు మరో వారం రోజుల్లో మాజీ అయిపోతాడని అర్థం కావడంతో పచ్చ చొక్కాల ఇసుక మాఫియా విజృంభిస్తోందని తెలిపారు. పగలు, రాత్రి తేడా లేకుండా వాగులు, నదులను కొల్లగొడుతున్నారని మండిపడ్డారు. గవర్నర్ నరసింహన్ జోక్యం చేసుకుని ప్రతి జిల్లాలో ప్రత్యేక టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేసి మాఫియాను నియత్రించాలని డిమాండ్ చేశారు. పోలవరం పేరును ప్రస్తావించి కాటన్ దొర ఆత్మ క్షోభించేలా చేయొద్దని చంద్రబాబుపై విజయసాయిరెడ్డి నిప్పులు చెరిగారు. ఎక్కడో జన్మించిన ఆ మహనీయుడు ఏ సౌకర్యాలు లేని రోజుల్లో ధవళేశ్వరం బ్యారేజి నిర్మించి చరిత్ర పురుషుడయ్యారని కొనియాడారు. చంద్రబాబు మాత్రం నాలుగేళ్లలో పూర్తి కావాల్సిన పోలవరం ప్రాజెక్టును ఏటీఏమ్లా మార్చుకుని వేల కోట్లు మింగారని ధ్వజమెత్తారు. ఏ సలహా, సహాయం కోసం రామోజీ రావుని కలిశావు చంద్రబాబూ? ప్రజాధనంతో హెలికాప్టర్లో వెళ్లి ఆయనను కలవాల్సినంత ముఖ్యమైన పనేమిటో ప్రజలకు చెప్పే ధైర్యం ఉందా? ఓడిపోయిన తర్వాత ఎక్కడ ఆశ్రయం పొందాలో అడగడానికా? కేసీఆర్తో రాజీ చేయమని ప్రాధేయపడటానికి వెళ్లావా? ఇంత దిగజారిపోయావేంటి బాబూ? అంటూ తూర్పారబట్టారు. చంద్రబాబు కుల మీడియా ఒక మాఫియా రేంజ్లో ఎదిగిన తీరు గమనిస్తే రవిప్రకాశ్ లాంటి వాళ్లు అనేకమంది కనబడతారని మండిపడ్డారు. ప్రజాధనాన్ని దోచిపెట్టడం, బ్లాక్ మెయిల్ చేసుకోమని సమాజం మీదకు వదలడం ‘40 ఇయర్స్ ఇండస్ట్రీ’ ఇన్నాళ్లుగా చేసిన ఘనకార్యమని ధ్వజమెత్తారు. బాబు నీడలో ఈ మాఫియా దేశమంతా విస్తరిస్తోందని పోస్ట్ చేశారు. #SaiRaaPunch #సైరాపంచ్ pic.twitter.com/dvAk3f8ESl — Vijayasai Reddy V (@VSReddy_MP) May 15, 2019 -
టివి9 మాజీ సీఈవో రవిప్రకాశ్ కుట్ర బట్టబయలు
-
రవిప్రకాశ్ శివాజీ కుట్ర బట్టబయలు
సాక్షి, హైదరాబాద్ : టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్, సినీ నటుడు గరుడ పురాణం శివాజీల మధ్య జరిగిన కుట్ర బట్టబయలైంది. ప్రస్తుతం పరారీలో ఉన్న రవిప్రకాశ్ ఈ మెయిల్స్ను పోలీసులు తనిఖీలు చేయగా పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇందుకు సంబంధించిన ఈ మెయిల్స్ బయటపడ్డాయి. టీవీ9 మాతృసంస్థ అసోసియేటెడ్ బ్రాడ్ కాస్టింగ్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ (ఏబీసీఎల్) కొత్త యాజమాన్యానికి ఇబ్బందులు సృష్టించే ఉద్దేశంతో నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ)ని అడ్డుపెట్టుకుని పావులు కదిపారని తేటతెల్లమయ్యింది. రవిప్రకాశ్, శివాజీ మధ్య కుదిరింది పాత ఒప్పందం కాదని, ఎన్సీఎల్టీలో కేసు వేయడం కోసం కుట్ర చేసి, పాత తేదీతో నకిలీ షేర్లు కొనుగోలు ఒప్పందం కుదుర్చుకున్నట్లు సైబర్ క్రైమ్ పోలీసులకు పక్కా సాక్ష్యాధారాలు లభించినట్లు తెలిసింది. ఈ కేసు మరో కొత్త మలుపు తిరగడంతో పాటు రవిప్రకాశ్ చుట్టూ మరింత ఉచ్చు బిగుసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. చదవండి: (బెజవాడలో రవిప్రకాశ్, శివాజీ!) కుట్రకు సంబంధించిన పలువురు వక్తుల మధ్య బదిలీ అయిన పలు ఈ మెయిల్స్ను సైబర్ క్రైమ్ పోలీసు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఆధారాలు దొరకకుండా సర్వర్ల నుంచి రవిప్రకాశ్, ఆయన అనుచరులు డిలీట్ చేసినప్పటికీ, సైబర్ క్రైమ్ పోలీసులు అత్యాధునిక పరిజ్ఞానం ఉపయోగించి వీటిని వెలికి తీశారు. రవిప్రకాశ్ నుంచి 40 వేల షేర్లను కొనుగోలు చేసేందుకు శివాజీ ఫిబ్రవరి 20, 2018న ఒప్పందం కుదుర్చుకున్నట్లు సృష్టించిన ఒప్పందపు డ్రాఫ్ట్... వాస్తవానికి ఏప్రిల్13, 2019న తయారు చేశారు. ఈ డ్రాఫ్ట్ను ఆ రోజు సాయంత్రం 5:46 గంటలకు టీవీ9 మాజీ సీఎఫ్వో మూర్తికి రవిప్రకాశ్ సన్నిహితుడు, న్యాయవాది శక్తి మెయిల్ చేశారు. ఈ మెయిల్ను రవిప్రకాశ్, ఎంవీకేఎన్ మూర్తి, రవిప్రకాశ్ సన్నిహితుడు హరిలకూ కాపీలు పంపించారు. ఫిబ్రవరి 20, 2018న కుదుర్చుకున్నట్లు పాత తేదీతో చేసుకోబోయే ఒప్పందం వివరాలు ఇందులో ఉన్నాయి. ఆ తర్వాత సాయంత్రం 6:45 గంటల నుంచి రాత్రి 9:39 గంటల మధ్య వీరందరి మధ్య మెయిల్స్ సర్క్యులేట్ అయినట్లు పోలీసులకు ఆధారాలు లభించాయి. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి ఇక శివాజీ ఎన్సీఎల్టీలో దాఖలు చేయడానికి అవసరమైన పిటిషన్ను విజయవాడకు చెందిన ఓ అడ్వకేట్ రూపొందించారు. ఆ మరుసటి రోజున అంటే, ఏప్రిల్14, 2019న ఉదయం 5:38 గంటలకు ఆ పిటిషన్ కాపీని, అందులో చేయాల్సిన మార్పులను ఈ మెయిల్లో ప్రస్తావించడంతో పాటు, తగిన మార్పులు చేర్పులతో ఉదయం తొమ్మిది గంటల కల్లా, విజయవాడ అడ్వకేట్కు పంపించాల్సి ఉంటుందంటూ శక్తి ... రవిప్రకాశ్, ఆయన అనుచరులకు మెయిల్ పంపించారు. అదే రోజు ఈ పిటిషన్పై రవిప్రకాశ్ ఆయన అనుచరులు మెయిల్లో సంప్రదింపులు జరిపినట్లు పోలీసులు ఆధారాలు సేకరించారు. వీటి ఆధారంగానే సెక్షన్ 41 సీఆర్పీసీ కింద పోలీసులు రవిప్రకాశ్కు నోటీసులు జారీ చేశారు. ఈ సెక్షన్ కింద అరెస్టయ్యే ప్రమాదాన్ని తప్పించుకోవడం కోసం.. ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో రవిప్రకాశ్ దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్ను కూడా న్యాయస్థానం తిరస్కరించింది. ఈ వ్యవహారం అంతా బట్టబయలు కావడంతో, ఎన్సీఎల్టీలో జరగబోయే విచారణ మీదే ఇప్పుడు ఆసక్తి నెలకొని ఉంది. మరోవైపు రవిప్రకాశ్ సన్నిహితుడు, న్యాయవాది శక్తి కూడా అజ్ఞాతంలోకి వెళ్లినట్లు తెలుస్తోంది. -
బెజవాడలో రవిప్రకాశ్, శివాజీ!
సాక్షి, హైదరాబాద్ : నిధుల మళ్లింపులు, ఫోర్జరీ కేసులో అజ్ఞాతంలో ఉన్న టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్...సైబర్ క్రైమ్ పోలీసులకు ఈ మెయిల్ పంపించారు. విచారణకు హాజరయ్యేందుకు మరో పది రోజులు పాటు ఆయన గడువు కోరారు. తాను వ్యక్తిగత కారణాల వల్ల విచారణకు హాజరు కాలేనని రవిప్రకాశ్ ఈ మెయిల్లో తెలిపారు. అలాగే ఈ కేసుతో సంబంధం ఉన్న సినీనటుడు శివాజీ కూడా తనకు ఆరోగ్యం సరిగా లేదని మెయిల్ పంపించారు. అయితే వీరిద్దరి ఈ మెయిల్స్పై పోలీసులు సంతృప్తి చెందనట్లు తెలుస్తోంది. కాగా ఇప్పటికే రెండుసార్లు నోటీసులిచ్చినా రవిప్రకాశ్ నుంచి స్పందన లేకపోవడంతో తదుపరి చర్యలపై సైబరాబాద్ పోలీసులు దృష్టిపెట్టారు. ప్రస్తుతం రవిప్రకాశ్, శివాజీ విజయవాడలో ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఏపీలో తలదాచుకున్నారన్న సమాచారం మేరకు వీరిద్దరిని అదుపులోకి తీసుకోవడంపై పోలీసులు దృష్టి సారించారు. మరోవైపు తనపై పోలీసులు సీఆర్పీసీ 154 కింద కేసు నమోదు చేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్ను (భోజన విరామం) విచారణకు చేపట్టాలన్న రవిప్రకాశ్ తరఫు న్యాయవాది వినతిని హైకోర్టు తోసిపుచ్చింది. అత్యవసరంగా విచారణ చేపట్టాల్సిన అవసరమేమీ లేదని న్యాయస్థానం తేల్చిచెప్పింది. తదుపరి విచారణను వచ్చే జూన్కు వాయిదా వేసింది. -
పోలీసులకు మెయిల్ పంపిన టివి9 మాజీ సీఈవో రవిప్రకాశ్
-
బాబు, రామోజీ మధ్యలో రవిప్రకాశ్
సాక్షి, హైదరాబాద్: ఫోర్జరీ కేసును ఎదుర్కొంటున్న టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్ను కాపాడేందుకు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నేరుగా రంగంలోకి దిగారు. రవిప్రకాశ్ అరెస్టు కాకుండా చూడటంతో పాటు ఆయనను ఈ కేసు నుంచి తప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా చంద్రబాబు బుధవారం మధ్యాహ్నం రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఈనాడు’చైర్మన్ రామోజీరావును కలిశారు. విజయవాడ నుంచి హెలికాప్టర్లో నేరుగా ఫిల్మ్సిటీకి వచ్చిన చంద్రబాబు దాదాపు 3 గంటల పాటు వివిధ అంశాలపై రామోజీరావుతో చర్చలు జరిపారు. టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్పై అరెస్ట్ వారంట్ జారీ చేస్తారన్న వార్తల నేపథ్యంలో బాబు, రామోజీరావు కలయిక అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. టీవీ9 సీఈవోగా తన ప్రభుత్వంపై ఎన్ని ఆరోపణలు, విమర్శలు వచ్చినా ప్రాధాన్యత ఇవ్వకుండా వెనకేసుకొచ్చిన రవిప్రకాశ్పై కేసులు వద్దంటూ ఇప్పటికే రెండు, మూడు సార్లు టీవీ9 కొత్త యాజమాన్యానికి చంద్రబాబు సూచించారు. కొత్త యాజమాన్యంలో ముఖ్యుడైన ఓ పారిశ్రామికవేత్తను విజయవాడకు పిలిపించి బెదిరించినట్లు కూడా తెలిసింది. అయినా కొత్త యాజమాన్యం తనమాట ఖాతరు చేయకపోవడంతో నేరుగా రంగంలోకి దిగారు. తను రాజగురు రామోజీరావు ద్వారా కొత్త యాజమాన్యానికి నచ్చజెప్పేలా చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. కొత్త యాజమాన్యంలో ప్రధాన భాగస్వామి రామేశ్వరరావుకు రామోజీరావుకు మధ్య సన్నిహిత సంబంధాలున్నాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబు.. రామోజీరావు ద్వారా రాయబారం నెరుపుతున్నారు. పరారీలో ఉన్న రవిప్రకాశ్పై ఇప్పటికే ఉన్న ఫోర్జరీ కేసుతోపాటు నిధుల దుర్వినియోగంపై పోలీసులకు ఫిర్యాదు అందినట్లు తెలిసింది. టీవీ9 నిధులను యథేచ్చగా ఓ టీవీ ఛానల్ ఉద్యోగుల జీతభత్యాలకు, తాను వ్యక్తిగతంగా నడుపుతున్న ఓ పత్రిక ఖర్చులకు వినియోగించినట్లు ఫిర్యాదులున్నాయి. దీంతో రవిప్రకాశ్కు ఇబ్బందులు తప్పవన్న ఉద్దేశంతో చంద్రబాబు రంగంలోకి దిగినట్టున్నారని ఓ సీనియర్ పోలీసు అధికారి అన్నారు. చంద్రబాబుకు ఎందుకంత ప్రేమ చంద్రబాబుకు టీవీ9 సీఈవోగా రవిప్రకాశ్ అన్ని రకాలుగా మద్దతు ఇవ్వడంతో పాటు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ను లక్ష్యంగా చేసుకున్నారు. అవసరమైన సందర్భాలలో రవిప్రకాశ్ ద్వారా టీవీ9ను వాడుకుంటూ.. ప్రత్యక్షంగా, పరోక్షంగా జగన్పై చంద్రబాబు దుష్ప్రచారానికి పాల్పడ్డారు. సీబీఐ దర్యాప్తు సమయంలోనూ జగన్ నివాసమైన లోటస్పాండ్లో స్విమ్మింగ్ పూల్ ఉందంటూ, ఇంట్లో బార్ ఉందంటూ టీవీ9 ద్వారా చంద్రబాబు అసత్య ప్రచారం చేయించారు. రాజకీయంగా ఎదురీదుతున్న సమయంలో తన ప్రత్యర్థి జగన్ను దెబ్బతీయడానికి రవిప్రకాశ్ జరిపిన అసత్య ప్రచారానికి బదులుగా.. ఇప్పుడు ఆయన్ను కాపాడేందుకు చంద్రబాబు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. రామేశ్వరరావుపై ఒత్తిడి తేవడానికి వీలుగా రామోజీరావును చంద్రబాబు ఎంచుకున్నాడు. అయితే, ఈ విషయంలో రామోజీరావు ఎంతమేరకు సహకరిస్తారన్నది వేచి చూడాల్సిందే. జాతీయ రాజకీయాలపైన చర్చ ఏపీ శాసనసభ ఎన్నికలతో పాటు జాతీయ రాజకీయాలపైన చంద్రబాబు, రామోజీరావు మధ్య చర్చ జరిగినట్లు సమాచారం. జాతీయ స్థాయిలో మళ్లీ ఎన్డీయే కూటమి అధికారంలోకి వస్తే టీడీపీ వ్యూహం ఎలాగుంటే బాగుంటుందన్న అంశాన్నీ చర్చించినట్లు సమాచారం. ఎన్డీయే నుంచి బయటకు రావడంలో టీడీపీ వ్యూహాత్మకంగా వ్యవహరించలేదని రామోజీరావు అభిప్రాయపడినట్లు తెలిసింది. మళ్లీ ఎన్డీయే అధికారంలోకి వస్తే కలిసిపోవడమే మంచిదనే అభిప్రాయం వీరిద్దరి మధ్య చర్చల్లో వ్యక్తమైనట్లు సమాచారం. రవిప్రకాశ్కు ఎదురుదెబ్బ టీవీ 9 మాజీ సీఈవో రవిప్రకాశ్కు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. తనపై పోలీసులు సీఆర్పీసీ 154 కింద కేసు నమోదు చేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్ను (భోజన విరామం) విచారణకు చేపట్టాలన్న ఆయన తరఫు న్యాయవాది వినతిని హైకోర్టు తోసిపుచ్చింది. అత్యవసరంగా విచారణ చేపట్టాల్సిన అవసరమేమీ లేదని న్యాయస్థానం తేల్చిచెప్పింది. సీఆర్పీసీలోని 154 సెక్షన్ చెల్లుబాటును ప్రశ్నిస్తే.. ఇప్పటికిప్పుడు విచారణ చేయాల్సిన అవసరమేమీ లేదని హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అక్తర్లతో కూడిన ధర్మాసనం ప్రశ్నించింది. అయితే.. రవిప్రకాశ్పై పోలీసులు 2 ఎఫ్ఐఆర్లు నమోదు చేశారని, పోలీసులు అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని ఆయన తరపు న్యాయవాది చెప్పారు. అలాంటి పరిస్థితులు ఉంటే ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చన్న ధర్మాసనం.. విచారణను వచ్చే జూన్కు వాయిదా వేసింది. -
ఈ ‘మీడియా నయీం’ను ఏ ‘బాబు’ రక్షిస్తాడో!
సాక్షి, హైదరాబాద్ : పరారీలో ఉన్న టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్పై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి పలు వంగ్యోక్తులు విసిరారు. ‘పోలీసులు వస్తే ఇంట్లో కనిపించడు. నోటీసులకు స్పందించడు. పరారీలో లేనంటాడు. పోలీసులు, చట్టాలు, కోర్టులు తనంతటి ‘ప్రవక్త’ను టచ్ చేయవన్న భ్రమలో ఉన్నాడు. బెయిల్ పిటిషన్ను కోర్టు కొట్టేసింది. తప్పించుకునే దారులన్నీ బంద్. ఇక ఈ ‘మీడియా నయీం’ను ఏ ‘బాబు’ రక్షిస్తాడో చూడాలి. నిజం చెప్పులు తొడుక్కునే లోపు అబద్దం పరారైపోయింది!. విచారణకు రండి అని పోలీసులు చాలా మర్యాదగా రవిప్రకాష్ ఇంటికి నోటీసులు అంటిస్తుంటే ‘నకిలీ ప్రవక్త’ రాత్రికి రాత్రి దొడ్డి దారిలో గోడ దూకేసి బోర్డర్ దాటేశాడు. రేపో మాపో మాల్యాతో సెల్ఫీ దిగుతూ కనిపించి పట్టుకోండి చూద్దాం అంటాడేమో!’ అని ఆయన ట్విట్ చేశారు. మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై కూడా ఆయన సెటైర్లు వేశారు. ‘సొంత పార్టీ నేతలే ఎక్కడికక్కడ వెన్నుపోటు పొడిచారంటూ ఎన్నికల సమీక్షల్లో తమ్ముళ్ళు బావురుమంటుంటే వారిని ఎలా ఓదార్చాలో తెలియక బాబు బిక్క చచ్చిపోతున్నారట. పార్టీ శ్రేణుల్లో ధైర్యం నూరిపోయడం సంగతి సరే. సమీక్షలను ఇలాగే కొనసాగిస్తే కౌంటింగ్కు ముందే కొంప కొల్లేరని గ్రహించే రద్దు చేశారట.’ అంటూ విజయసాయి రెడ్డి ట్విటర్లో వ్యాఖ్యానించారు. -
హైకోర్టులో రవిప్రకాశ్కు చుక్కెదురు
సాక్షి, హైదరాబాద్ : టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్కు తెలంగాణ హైకోర్టులో చుక్కెదురు అయింది. సైబర్ క్రైం పోలీసులు తనపై నమోదు చేసిన కేసులు రాజ్యాంగ విరుద్ధమంటూ రవిప్రకాశ్ బుధవారం హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై అత్యవసరంగా విచారణ జరపాలని ఆయన న్యాయస్థానాన్ని కోరారు. అయితే దీనిపై అత్యవసర విచారణ అవసరం లేదంటూ పిటిషన్ను న్యాయస్థానం కొట్టేసింది. కాగా గత మూడు రోజులుగా అజ్ఞాతంలో ఉన్న రవిప్రకాశ్ కోసం పోలీసులు గాలిస్తున్న విషయం విదితమే. ఫోర్జరీ, డేటా చౌర్యం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రవిప్రకాశ్కు పోలీసులు సీఆర్పీసీ సెక్షన్ 41 కింద నోటీసులు జారీ చేసినా ఆయన స్పందించలేదు. దీంతో ఇచ్చిన గడువు ముగియడంతో రవిప్రకాశ్ను పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉంది. మరోవైపు న్యాయస్థానంలో కూడా ఎదురుదెబ్బ తగలడంతో రవిప్రకాశ్ సైబర్ క్రైమ్ పోలీసుల ఎదుట విచారణకు హాజరు అవుతారా? లేక పోలీసుల ఎదుట లొంగిపోతారా అనే దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. ప్రస్తుతం పరారీలో ఉన్న రవిప్రకాశ్ బుధవారం ఉదయం పోలీసుల ఎదుట హాజరుకాకపోతే అరెస్టు వారెంట్ జారీ చేయాలనుకుంటున్నట్లు తెలిసింది. ఇందులో భాగంగానే సీఆర్పీసీ సెక్షన్ 41ఏ ప్రకారం నోటీసులు ఇచ్చారని సమాచారం. ఈ కేసులో మరో నిందితుడు సినీనటుడు శొంఠినేని శివాజీ కూడా పరారీలోనే ఉండటం గమనార్హం. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి ఇంతకీ రవిప్రకాశ్ ఎక్కడ? ఇంతకీ రవిప్రకాశ్ ఎక్కడున్నాడన్న విషయం ఎవరికీ అంతుబట్టట్లేదు. ఆయన ముంబైలో ఉన్నారని, హైదరాబాద్లోని సన్నిహితుల వద్ద ఉన్నారని ప్రచారం జరుగుతోంది. ఆయన సెల్ఫోన్, సోషల్ మీడియాలో ఎవరికీ అందుబాటులో లేకపోవడంతో ఆయన ఆచూకీపై స్పష్టత లేకుండాపోయింది. కుటుంబ సభ్యులు, ఆయన సన్నిహితులు తమకేం తెలియదని సమాధానమిస్తున్నారు. ఆరోపణలు వచ్చిన తొలిరోజు ‘తానెక్కడికీ పారిపోలేదని, తన వార్తలు తానే చదువుకున్న రవిప్రకాశ్ పరారీలో ఉండాల్సిన అవసరం ఏమొచ్చింది’అని నెట్టింట్లో రకరకాల కామెంట్లు వినిపిస్తున్నాయి. -
రవిప్రకాశ్, శివాజీలకు బిగుస్తున్న ఉచ్చు!
సాక్షి, హైదరాబాద్ : అక్రమంగా నిధులు బదలాయింపు, ఫోర్జరీ కేసులో టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్, సినీ నటుడు శివాజీలకు పోలీసుల ఉచ్చు బిగుస్తోంది. సైబర్ క్రైమ్ పోలీసులు ఇచ్చిన రెండు నోటీసులకు వీరివురు స్పందించని విషయం తెలిసిందే. దీంతో రవిప్రకాశ్, శివాజీలకు 41ఏ సీఆర్పీసీ నోటీస్ ఇచ్చేందుకు పోలీసులు రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. రేపు సాయంత్రం లోపు సైబర్ క్రైమ్ పోలీసుల ఎదుట విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేయనున్నారు. అప్పటికీ స్పందించని పక్షంలో కోర్టు ద్వారా అరెస్ట్ వారెంట్ జారీ చేసేందుకు పోలీసులు న్యాయస్థానాన్ని ఆశ్రయించనున్నారు. రెండు రోజులుగా అజ్ఞాతంలో ఉన్న వీరి కోసం పోలీసులు గాలిస్తున్న విషయం తెలిసిందే. వీరు ఆంధ్రప్రదేశ్లో తలదాచుకుంటున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. రంగంలోకి దిగిన ప్రత్యేక బృందాలు...వీరిని ఏ క్షణంలో అయినా అరెస్ట్ చేసే అవకాశం ఉంది. మరోవైపు రవిప్రకాశ్, శివాజీ ముందస్తు బెయిల్ కోసం క్వాష్ లేదా కోర్టును ఆశ్రయించే యోచనలో ఉన్నారు. రవిప్రకాశ్, నటుడు శివాజీ, టీవీ9 మాజీ సీఎఫ్వో మూర్తిపై అలంద మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సైబర్ క్రైమ్లో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. వీరిపై కేసులు నమోదు చేసిన పోలీసులు విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేశారు. అయితే విచారణకు రవిప్రకాశ్తో పాటు శివాజీ గైర్హాజరు కాగా, మాజీ సీఎఫ్వో మూర్తి మాత్రం పోలీసులు విచారణకు హాజరు అయ్యారు. విచారణలో ఎంవీఎస్ మూర్తి నుంచి పోలీసులు పలు కీలక ఆధారాలు సేకరించినట్లు సమాచారం. బ్యాంకు లావాదేవీల ఆధారంగా తప్పుడు బదలాయింపులు జరిగినట్లు పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది. -
పరారీలో ఎందుకున్నావ్ ప్రవక్తా?: విజయసాయి రెడ్డి
సాక్షి, హైదరాబాద్ : టీవీ 9 మాజీ సీఈవో రవిప్రకాశ్ అజ్ఞాతంలోకి వెళ్లడంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి ట్విటర్ వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. టీవీ9లో వాటాల వ్యవహారంలో సొంత లబ్ధి కోసం నకిలీ పత్రాలు సృష్టించడంతోపాటు కంపెనీ సెక్రటరీ సంతకం ఫోర్జరీ అభియోగాలతో రవిప్రకాశ్తో పాటు సినీనటుడు శివాజీపై కేసులు నమోదు అయిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా స్పందించిన విజయసాయి రెడ్డి... ‘మెరుగైన సమాజ ఉద్యమకారుడు శుక్రవారం మధ్యహ్యం 3గంటల నుంచి ఫోన్ స్విచ్ఛ్ ఆఫ్ చేశాడట. సైబరాబాద్ ఎస్వోటీ పోలీసులు గాలిస్తున్నారు. అమరావతి వెళ్తే ఈ నెల 23వ తేదీ తర్వాత దొరికే ప్రమాదం ఉండటంతో కర్ణాటక మీదుగా ముంబాయి చేరినట్టు సమాచారం. నన్నెవరూ టచ్ చేయలేరని బీరాలు పలికి పరారీలో ఎందుకున్నావు ప్రవక్తా?’ అంటూ ట్వీట్ చేశారు. కాగా రవిప్రకాశ్తో పాటు సినీనటుడు శివాజీ ఆదివారం తమ ఎదుట హాజరు కావాలంటూ సైబర్ క్రైమ్ పోలీసులు రెండోసారి నోటీసులు జారీ చేశారు. అయితే వాళ్లిద్దరూ ఇప్పటివరకూ సైబర్ క్రైమ్ పోలీసుల విచారణకు హాజరు కాలేదు. రవిప్రకాశ్ ఫోన్ నిన్న మధ్యాహ్నం నుంచి స్విచ్ఛాఫ్ చేసి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ప్రస్తుతం ఆయనతో పాటు శివాజీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. -
రవిప్రకాశ్కు మరోసారి నోటీసులు
సాక్షి, హైదరాబాద్: టీవీ 9 వాటాల వ్యవహారంలో సొంత లబ్ధి కోసం నకిలీ పత్రాలు సృష్టించడంతోపాటు కంపెనీ సెక్రటరీ సంతకం ఫోర్జరీ చేశారని నమోదైన కేసులో రవిప్రకాశ్కు సైబర్ క్రైమ్ పోలీసులు రెండోసారి నోటీసులు జారీ చేశారు. ఆదివారం తమ ఎదుట హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. సినీనటుడు శొంఠినేని శివాజీ, టీవీ 9 ఫైనాన్స్ డైరెక్టర్ ఎంకేవీఎన్ మూర్తికి కూడా ఇంతకుముందు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. మూర్తి శుక్రవారం సైబర్ క్రైమ్ పోలీసుల ఎదుట హాజరయ్యారు. రవిప్రకాశ్ మాత్రం విచారణకు రాలేదు. వ్యక్తిగత విచారణకు మరో పది రోజుల సమయం ఇవ్వాలని ఆయన తరఫు న్యాయవాది పోలీసులను కోరినట్టు సమాచారం. పరారీలో ఉన్న శివాజీకి మరోసారి నోటీసు జారీ చేసి విచారణకు హజరుకాకపోతే చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని పోలీసులు భావిస్తున్నట్టు సమాచారం. కాగా, టీవీ9 సీఈవో, డైరెక్టర్ పదవి నుంచి రవిప్రకాశ్ను తొలగిస్తున్నట్లు అలందా మీడియా గ్రూపు శుక్రవారం ప్రకటించిన సంగతి విదితమే. -
పత్తాలేని గరుడ పురాణం శివాజీ
సాక్షి, హైదరాబాద్ : టీవీ 9 వాటాల వ్యవహారంలో సొంత లబ్ధి కోసం నకిలీ పత్రాలు సృష్టించడంతోపాటు కంపెనీ సెక్రటరీ సంతకం ఫోర్జరీ చేశారని నమోదైన కేసులో టీవీ 9 మాజీ ఫైనాన్స్ డైరెక్టర్ ఎంకేవీఎన్ మూర్తిని శనివారం మరోసారి సైబర్ క్రైమ్ పోలీసులు విచారిస్తున్నారు. ఫోర్జరీ, నిధుల మల్లింపు అంశాలపై మూర్తిని ప్రశ్నిస్తున్నారు. ఈ కేసులో రవిప్రకాశ్, గరుడ పురాణం నటుడు శివాజీ పోలీసు విచారణకు హాజరుకాలేదు. శుక్రవారం విచారణకు రావాలంటూ సైబర్ క్రైమ్ పోలీసులు వారిద్దరితోపాటు ఎంకేవీఎన్ మూర్తికి నోటీసులు జారీచేసిన సంగతి తెలిసిందే. రవిప్రకాశ్, శివాజీ విచారణకు డుమ్మా కొట్టగా.. మూర్తి శుక్రవారం మధ్యాహ్నం 12.30 గంటల ప్రాంతంలో గచ్చిబౌలిలోని సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్కు వచ్చారు. క్రైమ్ డీసీపీ రోహిణి ప్రియదర్శిని, సైబర్ క్రైమ్ ఏసీపీ శ్రీనివాస్ నేతృత్వంలోని బృందం ఆయన్ను రాత్రి 11 గంటల వరకు విచారించింది. కాగా, రవిప్రకాశ్ వ్యక్తిగత విచారణకు మరో పది రోజుల సమయం ఇవ్వాలని ఆయన తరఫు న్యాయవాది పోలీసులను కోరినట్టు తెలిసింది. పరారీలో ఉన్న శివాజీకి మరోసారి నోటీసు జారీ చేసి విచారణకు హజరుకాకపోతే చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని పోలీసులు భావిస్తున్నట్టు సమాచారం. మరోవైపు బంజారాహిల్స్లోని టీవీ 9 కార్యాలయంలో కంపెనీ సెక్రటరీ దేవేంద్ర అగర్వాల్ను సైబర్ క్రైమ్ పోలీసులు ప్రశ్నించారు. కంపెనీ సెక్రటరీ సంతకాన్ని రవిప్రకాశ్ ఫోర్జరీ చేశారనే ఆరోపణల నేపథ్యంలో దేవేంద్ర అగర్వాల్ను విచారించారు. కాగా, టీవీ 9 కార్యాలయం వద్ద శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు హైడ్రామా చోటుచేసుకుంది. ఉదయం 8 గంటలకు సీఈవో హోదాలో రవిప్రకాశ్ కార్యాలయానికి వచ్చారు. ఆయన లోనికి వెళుతున్నప్పుడు టీవీ చానళ్ల ప్రతినిధులు కెమెరాల్లో రికార్డు చేయడానికి ప్రయత్నించగా.. అక్కడి సిబ్బంది అడ్డుకున్నారు. తాము రోడ్డు మీద నిలబడి రికార్డు చేస్తున్నామని సాక్షి టీవీ ప్రతినిధులు చెప్పినప్పటికీ, అక్కడి నుంచి ప్రత్యక్ష ప్రసారాలు చేయడానికి వీల్లేదంటూ వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో పోలీసులు రంగప్రవేశం చేయడంతో పరిస్థితి సద్దుమణిగింది. కాగా, రవిప్రకాశ్ ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు తన చాంబర్లోనే ఉన్నారు. మధ్యాహ్నం సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు టీవీ 9 కార్యాలయానికి రావడంతో రవిప్రకాశ్ అక్కడి నుంచి బయటకు వెళ్లిపోయారు. ఆ తర్వాత కొద్దిసేపటికి అసోసియేట్ బ్రాడ్కాస్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్ (ఏబీసీపీఎల్) బోర్డు సభ్యులు అక్కడకు చేరుకుని సమావేశమయ్యారు. అనంతరం అక్కడున్న సెక్యూరిటీని తొలగించి, కొత్తవారిని నియమించారు. రవిప్రకాశ్ మళ్లీ కార్యాలయానికి వస్తే లోనికి అనుమతించొద్దని కొత్త సెక్యూరిటీకి ఆదేశాలు జారీచేశారు. అదే సమయంలో తాను సీఈఓ పదవికి రాజీనామా చేస్తున్నట్టుగా రవిప్రకాశ్ ఓ సహచరుడి ద్వారా లేఖ పంపించారు. -
విచారణకు రవిప్రకాశ్, శివాజీ డుమ్మా
సాక్షి, హైదరాబాద్: టీవీ 9 వాటాల వ్యవహారంలో సొంత లబ్ధి కోసం నకిలీ పత్రాలు సృష్టించడంతోపాటు కంపెనీ సెక్రటరీ సంతకం ఫోర్జరీ చేశారని నమోదైన కేసులో రవిప్రకాశ్, సినీనటుడు శివాజీ పోలీసు విచారణకు హాజరుకాలేదు. శుక్రవారం విచారణకు రావాలంటూ సైబర్ క్రైమ్ పోలీసులు వారిద్దరితోపాటు టీవీ 9 ఫైనాన్స్ డైరెక్టర్ ఎంకేవీఎన్ మూర్తికి నోటీసులు జారీచేసిన సంగతి తెలిసిందే. రవిప్రకాశ్, శివాజీ విచారణకు డుమ్మా కొట్టగా.. మూర్తి శుక్రవారం మధ్యాహ్నం 12.30 గంటల ప్రాంతంలో గచ్చిబౌలిలోని సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్కు వచ్చారు. క్రైమ్ డీసీపీ రోహిణి ప్రియదర్శిని, సైబర్ క్రైమ్ ఏసీపీ శ్రీనివాస్ నేతృత్వంలోని బృందం ఆయన్ను రాత్రి వరకు విచారించింది. కాగా, రవిప్రకాశ్ వ్యక్తిగత విచారణకు మరో పది రోజుల సమయం ఇవ్వాలని ఆయన తరఫు న్యాయవాది పోలీసులను కోరినట్టు తెలిసింది. పరారీలో ఉన్న శివాజీకి మరోసారి నోటీసు జారీ చేసి విచారణకు హజరుకాకపోతే చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని పోలీసులు భావిస్తున్నట్టు సమాచారం. మరోవైపు బంజారాహిల్స్లోని టీవీ 9 కార్యాలయంలో కంపెనీ సెక్రటరీ దేవేంద్ర అగర్వాల్ను సైబర్ క్రైమ్ పోలీసులు ప్రశ్నించారు. కంపెనీ సెక్రటరీ సంతకాన్ని రవిప్రకాశ్ ఫోర్జరీ చేశారనే ఆరోపణల నేపథ్యంలో దేవేంద్ర అగర్వాల్ను విచారించారు. టీవీ 9 కార్యాలయం వద్ద హైడ్రామా... టీవీ 9 కార్యాలయం వద్ద శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు హైడ్రామా చోటుచేసుకుంది. ఉదయం 8 గంటలకు సీఈవో హోదాలో రవిప్రకాశ్ కార్యాలయానికి వచ్చారు. ఆయన లోనికి వెళుతున్నప్పుడు టీవీ చానళ్ల ప్రతినిధులు కెమెరాల్లో రికార్డు చేయడానికి ప్రయత్నించగా.. అక్కడి సిబ్బంది అడ్డుకున్నారు. తాము రోడ్డు మీద నిలబడి రికార్డు చేస్తున్నామని సాక్షి టీవీ ప్రతినిధులు చెప్పినప్పటికీ, అక్కడి నుంచి ప్రత్యక్ష ప్రసారాలు చేయడానికి వీల్లేదంటూ వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో పోలీసులు రంగప్రవేశం చేయడంతో పరిస్థితి సద్దుమణిగింది. కాగా, రవిప్రకాశ్ ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు తన చాంబర్లోనే ఉన్నారు. మధ్యాహ్నం సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు టీవీ 9 కార్యాలయానికి రావడంతో రవిప్రకాశ్ అక్కడి నుంచి బయటకు వెళ్లిపోయారు. ఆ తర్వాత కొద్దిసేపటికి అసోసియేట్ బ్రాడ్కాస్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్ (ఏబీసీపీఎల్) బోర్డు సభ్యులు అక్కడకు చేరుకుని సమావేశమయ్యారు. అనంతరం అక్కడున్న సెక్యూరిటీని తొలగించి, కొత్తవారిని నియమించారు. రవిప్రకాశ్ మళ్లీ కార్యాలయానికి వస్తే లోనికి అనుమతించొద్దని కొత్త సెక్యూరిటీకి ఆదేశాలు జారీచేశారు. అదే సమయంలో తాను సీఈఓ పదవికి రాజీనామా చేస్తున్నట్టుగా రవిప్రకాశ్ ఓ సహచరుడి ద్వారా లేఖ పంపించారు. -
రవిప్రకాష్, శివాజీ కుట్రకు ముగింపు
సాక్షి, హైదరాబాద్: సినీ నటుడు శొంఠినేని శివాజీని అడ్డుపెట్టుకుని టీవీ9లో రవిప్రకాష్ సాగించిన కుట్ర బట్టబయలైంది. తాము బాధ్యతలు చేపట్టకుండా శివాజీని అడ్డుపెట్టుకుని రవిప్రకాష్ ఆడిన నాటకానికి కొత్త యాజమాన్యం ముగింపు పలికింది. తన పట్టు సడలిపోకూడదన్న దురుద్దేశంతో అడ్డదారులు తొక్కిన ఆయనను టీవీ9 నుంచి సాగనంపింది. ఇక టీవీ9తో రవిప్రకాష్కు ఎటువంటి సంబంధం లేదని, కైవలం మైనార్టీ షేర్హోల్డర్గా మాత్రమే కొనసాగుతారని అలందా గ్రూపు తేల్చిచెప్పింది. ఈ నెల 8న జరిగిన డైరెక్టర్ల సమావేశంలోనే రవిప్రకాష్ను తొలగిస్తూ నిర్ణయం జరిగిందని, ఈ రోజు షేర్హోల్డర్ల ఆమోదం కూడా తీసుకున్నామని వెల్లడించింది. తనకు తల్లిదండ్రుల కంటే రవిప్రకాష్ ఎక్కువని ఓ సందర్భంలో శివాజీ చెప్పారు. చాలా ఏళ్లుగా వీరి బంధం కొనసాగుతోంది. శివాజీని అడ్డుపెట్టుకుని ఏపీ సీఎం చంద్రబాబుకు అనుకూలంగా రవిప్రకాష్ ‘ఆపరేషన్ గరుడ’కు రూపకల్పన చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. జర్నలిజం విలువలను తుంగలో తొక్కి తన వర్గానికి కొమ్ముకాసిన రవిప్రకాష్ తాజాగా శివాజీ పేరుతో ఆడిన నాటకం టీవీ9 కొత్త యాజమాన్యానికి తెలిసిపోవడంతో ఆయన కుతంత్రాలు వెలుగులోకి వచ్చాయి. తన భక్తుడు శివాజీతో కలిసి రవిప్రకాష్ మొదట డ్రామాకు తెర తీశారు. టీవీ9 చానళ్లను నిర్వహిస్తున్న అసోసియేటెడ్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ (ఏబీసీఎల్) నుంచి 90.54 శాతం షేర్లను కొనుగోలు చేసిన అలందా గ్రూపుకు యాజమాన్య బాధ్యతలు అప్పగించకుండా ఉండేందుకు కుయుక్తులు పన్నారు. శివాజీతో నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్కు ఫిర్యాదు చేయించి కొత్త యాజమాన్యానికి అడ్డంకులు కల్పించారు. ఈ విషయాన్ని పసిగట్టిన అలందా గ్రూపు వ్యూహాత్మకంగా వ్యవహరించడంతో మొత్తం డొంకా కదిలింది. మరోవైపు తాను రాజీనామా చేసినట్టు ఫోర్జరీ డాక్యుమెంట్లు సృష్టించారని రవిప్రకాష్పై కంపెనీ సెక్రటరీ దేవేంద్ర అగర్వాల్ స్వయంగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. అధికారంపై వ్యామోహంతో అడ్డదారులు తొక్కిన రవిప్రకాష్ను ఎట్టకేలకు కొత్త యాజమాన్యం సాగనంపింది. జర్నలిజం విలువలు పాటిస్తూ, ఉద్యోగులకు అన్నివిధాలుగా సహకారం అందిస్తూ ముందుకు సాగుతామని అలందా గ్రూపు ప్రకటించింది. నోరు విప్పని శివాజీ గత రెండు రోజులుగా టీవీ9 వ్యవహారంపై జరుగుతున్న పరిణామాలపై నటుడు శివాజీ ఇప్పటివరకు స్పందించలేదు. తమ ఎదుట హాజరుకావాలని సైబర్ క్రైమ్ పోలీసులు జారీ చేసిన నోటీసులకు ఆయన సమాధానం ఇవ్వలేదు. తాను ఎంతో ఇష్టపడే రవిప్రకాష్కు కష్టం వచ్చినా శివాజీ బయటకు రాకపోవడం అనుమానాలకు బలం చేకూరుస్తోంది. తాను బయటకు వచ్చి మాట్లాడితే ఎక్కడ తమ కుట్ర బయటపడుతుందన్న భయంతోనే శివాజీ మౌనంగా ఉన్నాడన్న వాదనలు విన్పిస్తున్నాయి. -
‘టీవీ9పై కుట్ర అంతా అక్కడే జరిగింది’
సాక్షి, హైదరాబాద్: టీవీ9 చానల్ను అడ్డుపెట్టకుని ఇన్నాళ్లు చంద్రబాబు నాయుడు సాగించిన నాటకం బట్టబయలైందని రాజ్యసభ సభ్యుడు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి వి. విజయసాయి రెడ్డి అన్నారు. టీవీ9పై పెత్తనం రవిప్రకాష్ చేతుల్లోంచి జారిపోతే రాజకీయంగా తనకు తీరని నష్టం జరుగుతుందన్న భయంతో నటుడు శివాజీని అడ్డం పెట్టుకుని చంద్రబాబు పావులు కదుపుతున్నారని ఆరోపించారు. కొత్త యాజమాన్యాన్ని అడ్డుకోవడానికి కుయుక్తులు పన్నారని తెలిపారు. టీవీ9లో చోటుచేసుకున్న తాజా పరిణామాలపై తన ఫేస్బుక్ పేజీలో విజయసాయిరెడ్డి స్పందించారు. విజయసాయిరెడ్డి ఫేస్బుక్ పోస్ట్.... మెరుగైన సమాజం కోసం... కులం గోడలు కూల్చేద్దాం...! అంటూ మహత్తరమైన ఆదర్శాలను వల్లి వేస్తూ ఒక సాదాసీదా జర్నలిస్టు బుల్లి తెరపై దూసుకువచ్చినపుడు సమాజం ఆశగా అతనిని అక్కున చేర్చుకుంది. అదే జర్నలిస్టు తాను వల్లించిన ఆదర్శాలను తుంగలో తొక్కేసి కల్లబొల్లి వార్తలతో అనేక మందిని బ్లాక్ మెయిల్ చేస్తూ, బెదిరిస్తూ బలవంతపు వసూళ్ళకు నడుంకట్టినపుడు ఈ పగటి మోసగాడిని చూసి సమాజం సిగ్గుతో తలవంచుకుంది. కులం గోడలు కూల్చడానికి బదులుగా తానే కులం రొచ్చులో పీకల వరకు మునిగి చంద్రబాబు నాయుడే ఆదర్శంగా జర్నలిజంలో విలువలు, సంప్రదాయాలను అధఃపాతాళానికి దిగజార్చాడు. ఒక పారిశ్రామికవేత్త కూడా సాధించలేని రీతిలో అతి తక్కువ కాలంలోనే వందల కోట్లకు పడగలెత్తాడు. అక్రమంగా ఆర్జించిన వందల కోట్లను విదేశాల్లో ముఖ్యంగా దక్షిణాఫ్రికాలో పెట్టుబడులుగా పెట్టాడు. ఆదరించి, అక్కున చేర్చుకున్న పౌర సమాజానికి, తాను ఎంచుకున్న జర్నలిజం వృత్తికి అపారమైన నష్టం కలిగించాడు రవిప్రకాష్. ఒక కులానికి ఛత్రీ పడుతూ కులం గోడలను చైనా గోడకంటే ఎత్తుగా కట్టేశాడు. ఆ ఆదర్శవాది ఇప్పుడు జైలు గోడలు తప్పించుకోవడానికి పోలీసులకు దొరక్కుండా చంద్రబాబు అండతో అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిపోయాడు. నేను ఎవరి గురించి మాట్లాడుతున్నానో మీకు ఈపాటికి అర్థమయ్యే ఉంటుందని భావిస్తున్నా..! సంస్థ నిధులు కాజేసి, ఫోర్జరీ పత్రాలు సృష్టించారన్న అభియోగంపై టీవీ9 సీఈఓ రవిప్రకాష్ నివాసంలో ఈరోజు తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులు సోదాలు జరిపారన్న బ్రేకింగ్ న్యూస్ నిజానికి నాకేమీ ఆశ్చర్యంగా అనిపించలేదు. టీవీ9 చానల్లో 91 శాతం వాటాలు కొనుగోలు చేసిన అలందా మీడియా సంస్థ ఫిర్యాదుపై స్పందించిన పోలీసులు రవిప్రకాష్తోపాటు ఆయన రహస్య మిత్రుడు, చంద్రబాబు పెయిడ్ ఆర్టిస్ట్ ‘గరుడ పురాణం’ శివాజీ ఇంట్లో కూడా సోదాలు చేయడం కొంత ఆసక్తికరంగా అనిపించింది. రవిప్రకాష్, ‘శుంఠ’ శివాజీల మధ్య బంధం ఈనాటిది కాదు. కొన్నేళ్ళుగా కొనసాగుతున్న వారి రహస్య మైత్రి వెనుక బలమైన ఒక రాజకీయ అజెండా ఉందన్న మా అనుమానం తిరుగులేని సత్యమని ఈ ఉదంతం ధృవపరుస్తోంది. మెరుగైన సమాజం వెనుక చీకటి రాజ్యం... టీవీ9తో తెలుగు జర్నలిజంలో నిన్నటి వరకు ఒక వెలుగు వెలిగిన రవిప్రకాష్కు అంతే చీకటి చరిత్ర కూడా ఉందన్న విషయం జర్నలిస్టు మిత్రులలో చాలా మందికి తెలిసిందే. గత ఏడాది టీవీ9లో 91 శాతం వాటాలను శ్రీనిరాజు విక్రయించినప్పటి నుంచి రవిప్రకాష్ ‘మెరుగైన జీవితం’లో చీకట్లు అలుముకోవడం మొదలయ్యాయి. టీవీ9 చానల్ కొత్త యాజమాన్యం చేతిలోకి వచ్చినప్పటి నుంచి రవిప్రకాష్ చీకటి సామ్రాజ్యం గుట్లు ఒక్కొక్కటిగా వెలుగులోకి రావడం ప్రారంభం అయ్యాయి. అప్పటి వరకు తన మాటే శాసనంగా చానల్ను నడిపించిన రవిప్రకాష్ ఈ దశాబ్దంన్నర కాలంలో పాల్పడిన అక్రమాలు జాబితా రాస్తే ఒక పెద్ద గ్రంధమే అవుతుంది. వాటిలో మచ్చుకు కొన్ని... 1. టీవీ9ను అడ్డం పెట్టుకుని రవిప్రకాష్ ఉభయ తెలుగు రాష్ట్రాల్ల అనేక మందిని బ్లాక్ మెయిల్ చేసి కూడబెట్టిన సంపాదనే వందల కోట్లు దాటిపోయింది. ఎవరికీ చెప్పుకోలేక లోలోపలే కుమిలిపోయన రవి ప్రకాష్ బాధితుల సంఖ్య వేలల్లోనే ఉంది. 2. సీఈవోగా టీవీ9 రాబడిని, నిధులను రవి ప్రకాష్ భారీ ఎత్తున అక్రమ మార్గంలో తన సొంత ఖాతాలకు మళ్ళించుకున్నట్లు కొత్త యాజమాన్యం చేసిన ఆడిట్లో వెల్లడైంది. దక్షిణాఫ్రికాలో భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టాడు. 3. ఇటీవల ప్రారంభించిన భారత్వర్ష్ హిందీ జాతీయ చానల్ విషయంలోను రవి ప్రకాష్ కొన్ని నిధులు స్వాహా చేయడం వలన ఆ చానల్ నాణ్యత బాగా దెబ్బతిన్నట్లు వెల్లడైంది. 4. టీవీ9పై తన పెత్తనం యధాప్రకారం కొనసాగేందుకు రాజకీయంగా కూడా రవి ప్రకాష్ పావులు కదిపాడు. 5. టీవీ9పై రవి ప్రకాష్ పెత్తనం కొనసాగించమని చంద్రబాబు నాయుడుతోపాటు ఆయన అనుచరగణం (గూండాలు) కొత్త యాజమాన్యాన్ని తీవ్రస్థాయిలో బెదిరించడం కూడా జరిగింది. చంద్రబాబు నాయుడు పదికాలాల పాటు అధికారంలో నిర్విఘ్నంగా కొనసాగేందుకు టీవీ9 తెర ముందు శివాజీ, తెర వెనుక రవిప్రకాష్ తమ పాత్రలను శక్తి వంచన లేకుండా పోషిస్తూ వచ్చారు. చంద్రబాబు రాసిన స్క్రిప్ట్ ప్రకారమే వీరిద్దరూ ప్రత్యక్షంగా, పరోక్షంగా మా పార్టీపైన, మా పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారిపైనా టీవీ9 ద్వారా విషం కక్కుతూ, విషపూరిత కథనాలు, గరుడ పురాణాలు ప్రసారం చేస్తూ వచ్చారు. అదే విషయం మేము అనేకసార్లు బాహాటంగానే చెప్పాం కూడా. పాపం బద్దలయ్యే సమయం దగ్గర పడింది. కాబట్టే వారి రహస్య బంధం కూడా బట్టబయలైంది. రవిప్రకాష్ టీవీ9లోని తన వాటాల్లో కొన్ని నాకు అమ్మి ఆ షేర్లు బదలాయించకుండా నన్ను మోసం చేశారంటూ శివాజీ నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్ (ఎన్సీఎల్టీ)ని ఆశ్రయించి మరో పెద్ద నాటకానికి తెర తీశాడు. షేర్ల కొనుగోలు కోసం వీళ్ళద్దరూ ఒక తెల్ల కాగితంపై ఒప్పందం రాసుకున్నారంటేనే ఇంత ఎంత హంబగ్గో అర్థం చేసుకోవచ్చు. ఎవరైనా వాటాలు కొనుక్కుంటే తక్షణమే అవి బదిలీ కావాలని కోరుకుంటారు. కానీ ఏడాది తర్వాత చూసుకుందాంలే అనుకున్నారంటేనే దీనిలో నిజానిజాలు ఏమిటో ఎవరికైనా ఇట్టే బోధపడతాయి. టీవీ9పై పెత్తనం కొత్త యాజమాన్యం చేతుల్లోకి పోకుండా నిలువరించేందుకు ఏడాది క్రితమే పెయిడ్ ఆర్టిస్ట్ శివాజీని రవిప్రకాష్ రంగంలోకి దింపాడు. ఈ వ్యూహ రచన అంతా అమరావతిలోని కరకట్టపైనే జరిగింది. దానికి అనుగుణంగానే శివాజీ తెరపైకి వచ్చి ఎన్సీఎల్టీలో తన షేర్ల పురాణం విప్పాడు. రవి ప్రకాష్, శివాజీ తెర వెనుక నడిపిస్తున్న బాగోతం ఏమిటో ఆరా తీయడానికే సైబర్ క్రైమ్ పోలీసులు ఈరోజు వారి ఇళ్ళల్లో సోదాలు చేసినట్లు తెలుస్తోంది. టీవీ9పై పెత్తనం రవిప్రకాష్ చేతుల్లోంచి జారిపోతే అది రాజకీయంగా తమకు తీరని నష్టం జరుగుతుందన్న ఆందోళనతోనే దీనిని ఒక లీగల్ సమస్యగా మార్చి యాజమాన్య మార్పును అడ్డుకోవడానికి శివాజీ లాంటి కేరెక్టర్లను అడ్డం పెట్టుకుని చంద్రబాబు పావులు కదుపుతున్నారు. -
టీవీ9 సీఈవో రవిప్రకాష్పై కేసు
మేజిస్ట్రేట్ ఆదేశాలతో దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు హైదరాబాద్: తెలంగాణ ప్రజాప్రతినిధులను కించపరిచేలా కథనం ప్రసారం చేసిన టీవీ9 న్యూస్చానల్పై, ఆ సంస్థ సీఈవో రవిప్రకాష్పై ఎల్బీనగర్ పోలీస్స్టేషన్లో శుక్రవా రం కేసు నమోదైంది. ఈనెల 12వ తేదీ రాత్రి8.30 గంటలకు టీవీ9లో తెలంగాణ ప్రజాప్రతినిధులను కించపరిచే విధంగా కథనం ప్రసారం చేసిందని ఆరోపిస్తూ 18 తేదీన ఎల్బీనగర్కు చెందిన న్యాయవాది సుంకరి జనార్దన్గౌడ్ సైబరాబాద్ రెండో మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదును స్వీకరించిన న్యాయస్థానం.. టీవీ9 సంస్థ, దాని సీఈవో రవిప్రకాష్పై కేసు నమోదు చేయాలని ఆదేశిం చింది. కోర్టు ఆదేశాల మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ శ్రీనివాస్రెడ్డి తెలిపారు.