Vijayadashami
-
హైదరాబాద్: వేడుకగా రావణ దహనం
హైదరాబాద్, సాక్షి: చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రత్యేకగా జరుపుకునే దసరా ఉత్సవాలు జూబ్లీహిల్స్ డివిజన్ ఇందిరా నగర్ లో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా నిర్వహించిన రావణ దహన వేడుకలు బస్తీలో కన్నుల పండుగగా నిర్వహించారు. టి పి సి సి కార్యదర్శి విజయా రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొని రావణ దహనాన్ని నిర్వహించారు. డప్పు చప్పులు, రంగురంగుల బాణా సంచాల మెరుపుల మధ్య రావణ దహన వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో ఇందిరానగర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు పి మోహన్ యాదవ్, రమేష్ చారి, సత్తి గౌడ్, సల్మాన్ రాజ్, సింహం వెంకటేష్, బాబా గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
‘హిందువులు ఎక్కడున్నా ఐక్యంగా మెలగాలి’
నాగ్పూర్: దేశవ్యాప్తంగా విజయదశమి వేడుకలు జరుగుతున్నాయి. దసరా సందర్భంగా మహారాష్ట్రలోని నాగ్పూర్లోగల రేషమ్బాగ్లో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్ ఆయుధ పూజలు చేశారు. అనంతరం సంఘ్ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు.సంఘ్ త్వరలోనే 100వ ఏడాదిలోకి అడుగుపెడుతున్నట్లు మోహన్ భగవత్ తెలిపారు. భారతదేశం అన్ని రంగాల్లోనూ పురోగమిస్తున్నదని, మన దేశ విశ్వసనీయత, ప్రతిష్ట మరింతగా పెరిగిందన్నారు. జమ్మూకశ్మీర్లో ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని మోహన్ భగవత్ పేర్కొన్నారు. యువత మార్గనిర్దేశకత్వంలో భారత్ అన్ని రంగాల్లో ముందుకు సాగుతున్నదన్నారు.బంగ్లాదేశ్లో హిందూ సమాజంపై హింసాకాండ జరుగుతున్నదని, అయితే హిందువులు ఐక్యంగా ఉన్నప్పుడు ఇలాంటి అకృత్యాలకు అడ్డుకట్ట వేయవచ్చన్నారు. బంగ్లాదేశ్లోని హిందువులు తమను తాము రక్షించుకునేందుకు వీధుల్లోకి వచ్చారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు వారికి సహాయం అందించాలని అన్నారు. అఘాయిత్యాలకు పాల్పడే స్వభావం ఉన్నంత కాలం.. హిందువులే కాదు మైనార్టీలందరూ ప్రమాదంలో పడతారని మోహన్ భగవత్ వ్యాఖ్యానించారు. #WATCH | Nagpur, Maharashtra | #VijayaDashami | RSS chief Mohan Bhagwat says, "What happened in our neighbouring Bangladesh? It might have some immediate reasons but those who are concerned will discuss it. But, due to that chaos, the tradition of committing atrocities against… pic.twitter.com/KXfmbTFZ5D— ANI (@ANI) October 12, 2024ఇది కూడా చదవండి: భక్తిభావంతో మెలగాలి -
ధూంధాం... దసరా.. ఐదు రోజుల్లో 25 శాతం పెరిగిన మద్యం అమ్మకాలు
సాక్షి, హైదరాబాద్: దసరా పండుగ ఈసారి రాష్ట్రంలో ధూంధాంగా జరుగుతోందని మద్యం విక్రయ గణాంకాలు చెప్పకనే చెబుతున్నాయి. సాధారణ రోజులతో పోలిస్తే గత ఐదు రోజుల్లో 25 శాతం, అమ్మకాలు పెరిగాయి. గత ఏడాది దసరాతో ఆయన పోలిస్తే.. ఈ ఐదు రోజుల్లో 15 శాతం మేర అమ్మ కాలు పెరగ్గా, ప్రతిరోజు రాష్ట్రంలో సగటున రూ.124 కోట్ల మద్యం అమ్ముడవుతోంది. రికార్డు విద్యుత్ స్థాయిలో ఈనెల 10వ తేదీన ఏకంగా రూ.139 కోట్ల విలువైన మద్యాన్ని డిపోల నుంచి వైన్షావు లకు తరలించారు. అదే రోజున ఏకంగా 2.35 లక్షల కేసుల బీర్లు వైన్షాపులకు చేరడం గమనార్హం . ఈ స్థాయిలో బీర్ అమ్మకాలు ఏడాది కాలంలోనే రికార్డు అని ఎక్సైజ్ వర్గాలు చెబుతున్నా వాస్తవానికి, సాధారణ రోజుల్లో సగటున రోజు రూ.100 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరుగుతుంటాయి. లక్ష కేసుల వరకు లిక్కర్ అమ్ముడవు తుంది. కానీ, దసరా సందర్భంగా ఈ అమ్మకాల జోరు పెరిగింది. ఐదు రోజుల సగటు చూస్తే రోజుకు 1.20 లక్షల కేసుల లిక్కర్, 2 లక్షల కేసుల బీర్లు అమ్ముడుపోయాయి. ఇక, ఈనెల 1వ తేదీ నుంచి గణాంకాలను పరిశీలిస్తే 8 రోజుల్లో రూ.852.38 కోట్ల విలువైన మద్యం అమ్ముడుపో యింది. ఇందులో 8.37లక్షల కేసుల లిక్కర్ ఉం డగా, 14:53 లక్షల కేసుల బీర్లు ఉన్నాయి. అదే గత ఏడాది అక్టోబర్1 నుంచి 10వ తేదీ వరకు రూ.800 కోట్ల విలువైన మద్యం విక్రయాలు జరిగాయి. గత ఏడాదితో పోలిస్తే పది రోజుల్లో కూడా 6.55 శాతం మేర మందుబాబులు పుల్లుగా లాగించేశారని ఈ గణాంకాలు చెబుతున్నాయి. -
దసరా పండుగకు ఆ పేరు ఎలా వచ్చింది?
Vijayadashami: దసరా హిందువుల ముఖ్యమైన పండుగ. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి ఆశ్వయుజ శుద్ధ నవమి వరకు తొమ్మిది రోజులు దేవీ నవరాత్రులూ, పదవ రోజు విజయ దశమినీ కలిపి దసరా అంటారు. ఇది ముఖ్యంగా శక్తి ఆరాధనకు ప్రాధాన్యమిచ్చేపండుగ. ఈ పండుగను నవరాత్రి, శరన్నవరాత్రి అని అంటారు. శరదృతువు ఆరంభంలో వచ్చే పండుగ కనుక ఈ పేరు వచ్చింది. కొందరు ఈ పండుగకు మొదటి మూడు రోజులు పార్వతిదేవికీ, తరువాతి మూడు రోజులు లక్ష్మీదేవికీ, తరువాత మూడురోజులు సరస్వతీ దేవికీ పూజలు నిర్వహిస్తారు. ముఖ్యంగా శాక్తేయులు దీనిని ఆచరిస్తారు.తెలంగాణలో ఈ తొమ్మిది రోజులు అమావాస్య నుంచి నవమి వరకు బతు కమ్మ ఆడుతారు. విజయదశమి రోజున చరిత్ర ప్రకారం రాముడు రావణునిపై గెలి చిన సందర్భమే కాక... పాండవులు అజ్ఞాత వాసం ముగిసిన తర్వాత జమ్మి చెట్టు మీద నుంచి తమ ఆయుధాలు తీసుకున్నరోజు కూడా! ఈ సందర్భంగా ‘రావణ వధ’, జమ్మి ఆకుల పూజ వంటివి చేయటం ఆచారం. జగన్మాత అయిన దుర్గాదేవి మహిషాసురుడనే రాక్షసునితో తొమ్మిది రాత్రులు యుద్ధం చేసి అతనిని వధించి విజయాన్ని పొందినందుకు 10వ రోజు ప్రజలంతా సంతోషంతో పండగ జరుపుకొంటారు.బ్రహ్మ దేవుని వరాల వలన వరగర్వితుడైన మహిషాసురుడు దేవతలతో ఘోరమైన యుద్ధం చేసి వారిని ఓడించి ఇంద్రపదవి చేపట్టాడు. దేవేంద్రుడు త్రిమూర్తులతో మొరపెట్టుకొనగా మహిషునిపై వారిలో రగిలిన క్రోధాగ్ని ప్రకాశ వంతమైన తేజంగా మారింది. త్రిమూర్తుల తేజం కేంద్రీకృతమై ఒక స్త్రీ జన్మించింది. సర్వ దేవతల ఆయుధాలు సమకూర్చుకొని మహిషాసురుని సైన్యంతో తలపడింది. ఈ యుద్ధంలో ఆ దేవి వాహనమైన సింహమూ శత్రువులను చీల్చి చెండాడింది. దేవితో తలపడిన అసురుడు మహిష రూపం, సింహం రూపం, మానవ రూపంతో భీకరంగా పోరాడి చివరకు మహిషం రూపంలో దేవి చేతిలో హతుడైనాడు.చదవండి: దసరా సరదాలు: "ప్యారీ మనవరాలు... పూరీ ముచ్చట్లు"తెలంగాణలో పాలపిట్టను చూసిన తర్వాత జమ్మి చెట్టు వద్దకు పోయి పూజలు చేసి జమ్మి ఆకులు (బంగారం) పెద్ద వాళ్లకు ఇస్తూ వారి దీవెనలు తీసుకుంటారు. ఒకరినొకరు ‘అలాయ్ బలాయ్’ చేసుకుంటూ మురిసిపోతుంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే తెలంగాణలో దసరా ఒక మహోన్నతమైన పర్వదినం. – దండంరాజు రాంచందర్ రావు -
Devi Navaratrulu 2024: అయ్యవారికి చాలు ఐదు వరహాలు
(ఈ ఫొటోలో ఉన్నది రావణుడు. దసరాకి రావణ దహనం చేస్తారు. అందుకు తయారవుతున్న బొమ్మ ఇది. ఢిల్లీలోనిది ఈ ఫొటో) పిల్లలూ... దేవీ నవరాత్రులను దసరా పండగగా పిలుస్తారు. పూర్వపు రోజుల్లో దసరా సెలవలప్పుడు ఉపాధ్యాయులు తమ తమ పాఠశాలలో చదువుకునే బాల బాలికలను వెంటబెట్టుకుని గ్రామం లోని ఇంటింటికీ వెళ్ళే వారు, గహస్తులను ఆశీర్వదంచేవాళ్ళు. పిల్లలు కొత్త బట్టలు వేసుకుని చేతుల్లో విల్లంబులు పట్టుకుని అయ్యవారి వెంట వెళ్ళే వారు. ఈ అంబులను గిలకలు అంటారు. వీటిని సంధించి వదిలితే, ఎదుటి వారి మీద పూలూ ఆకులు పడేవి. బడి పిల్లలు అలా ఊరంతా తిరుగుతూ పాటలు, పద్యాలు పాడేవారు. వీటినే దసరా పద్యాలు అంటారు. దసరా పద్యాలు చాలా సులభంగా, వీనులకు విందుగా ఉంటాయి. ఈ పద్యం చూడండి.ఏ దయా మీ దయా మా మీద లేదు,ఇంత నిర్లక్ష్యమా ఇది మీకు తగదు,దసరాకు వస్తిమనీ విసవిసలు పడకచేతిలో లేదనక అప్పివ్వరనకపావలా.. .అర్ధయితే ...పట్టేది లేదు,ముప్పావలా అయితే ముట్టేది లేదు,హెచ్చు రూపాయయితే పుచ్చుకుంటాము,అయ్య వారికి చాలు ఐదు వరహాలుపిల్ల వారికి చాలు పప్పు బెల్లాలుజయీభవా...దిగ్విజయీభవా -
ఈ రోజే ఎందుకు విజయదశమి జరుపుకుంటున్నాం?
మంగళవారం రోజున లేని శ్రవణ నక్షత్రం శమీ పూజకు ప్రధానం శ్రవణా నక్షత్రం అందులో భాగంగా ఈ సంవత్సరం కూడా విజయదశమి ఏ రోజున అనే విషయంలో దోబూచులాడుతుంది. ధర్మశాస్త్ర గ్రంథాలైన నిర్ణయ సింధు, ధర్మసింధు ప్రకారము విజయదశమి 23న సోమవారం రోజు జరుపుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. అసలు కారణం ఏమిటి? విజయదశమి పండగ ఏ రోజున అనే విషయమై గందరగోళ పరిస్థితులను తెరదించే ప్రయత్నంలో భాగంగా విజయదశమి పండుగపై పూర్తి వివరణ ఇది... ఎందుకీ గందరగోళం.. విజయదశమి పండుగకు ప్రధానంగా కావలసినది దశమితో కూడిన శ్రవణా నక్షత్రం... ఈ శ్రవణా నక్షత్రం సమయంలోనే శమీ పూజ జరపవలసి ఉంటుంది. శమీ పూజకు అత్యంత ప్రాధాన్యమైనది. శ్రవణా నక్షత్రం 22వ తారీకు ఆదివారం సాయంత్రం గంటలు 3:35 నిమిషములకు వచ్చి తెల్లవారి సోమవారం 23వ తేదీ సాయంత్రం గంటలు 3:35 నిమిషముల వరకు ఉంటుంది. మంగళవారం నాడు ధనిష్ట నక్షత్రం చొరబడుతుంది.ధనిష్ట నక్షత్రం విజయదశమి పండుగకు విరుద్ధం. ఈ ప్రకారంగా సోమవారంనాడు అపరాహ్ణ ముహూర్తం లో దశమి పగలు గంటలు 2:29 నిమిషములకు ప్రారంభమవుతోంది. అపరాహ్ణ కాలము(మధ్యాహ్నాం) పగలు గంటలు 1:00 నుంచి మధ్యాహ్నము 3: 28 వరకు శ్రవణా నక్షత్రం ఉంటుంది. .అంటే ఈ సమయంలో శ్రవణా నక్షత్రముతో దశమి కూడితే అది విజయదశమి అవుతుంది. కనుక దశమితో శ్రవణ నక్షత్రం కూడినందున అక్టోబర్ 23 సోమవారం రోజున దసరా లేదా విజయదశమి పండుగ జరుపుకుంటున్నాం. అందుకే ఈ రోజునే శమీ పూజ నిర్వహించాలని పండుతులు నిర్ణయించారు. శృంగేరిలో కూడా.. శృంగేరి పీఠంలో కూడా విజయదశమి శమీ పూజ సోమవారము నిర్వహిస్తున్నట్లు పీఠం నిర్వాహకులు వెల్లడించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని పలు దేవస్థానాలలో 23వ తారీఖున జరుపుకోవాలని చెబుతున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో 23 సోమవారం నాడే విజయదశమిని ఆచరిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ దేవాదాయ ధర్మాదాయ శాఖ పంచాంగం అనుసరించి విజయవాడ కనకదుర్గ దేవాలయంలో కూడా 23 సోమవారం రోజున దసరా పండగ అని వేద పండితులు నిర్ణయించారు. పంచాంగ కర్తలందరూ కలసి గత మాసంలోనే విజయదశమి 23 సోమవారం జరుపుకోవాలని నిర్ణయించడం జరిగింది. అందువల్ల 23వ తేది సోమవారం రోజున దసరా పండుగ శమీ జరుపుకోవడం అందరికీ శ్రేయస్కరం. (చదవండి: స్త్రీ శక్తి విజయం విజయ దశమి) -
విజయదశమి సందర్భంగా దేవాలయాలకు పోటెత్తిన భక్తులు
-
స్త్రీ శక్తి విజయం విజయ దశమి
ఈ చరాచర జగత్తుని నడిపించేది శక్తి. ఈ శక్తి లేనట్టయితే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు తమ తమ కృత్యాలైన సృష్టి స్థితిలయాలు నిర్వర్తించటమే కాదు, కదలటం కూడా చేత కాని వారవుతారు. ఆ శక్తినే అదిశక్తి, పరాశక్తి అంటారు. ఆ శక్తి త్రిగుణాత్మకంగా ఉంటుంది. సత్వరజస్తమో గుణాలతో శక్తిబీజం సంయోగం చెందితే ‘స్త్రీ’అవుతుంది. అటువంటి త్రిగుణాలతో కూడిన శక్తి ఆవిర్భవించి దుష్టరాక్షస సంహారం చేసిన సమయం శరదృతువు. ఇవే కాదు మహాశక్తి ఎప్పుడు ఎక్కడ దుష్టసంహారం చేయవలసిన అవసరం వచ్చినా, శిష్టరక్షణ చేయవలసిన అవసరం కలిగినా జీవులపై ఉన్న అంతులేని ప్రేమతో అవతరిస్తూ వచ్చింది. ఎంతైనా జగన్మాత కదా! అన్ని సందర్భాలలోను ఆ తల్లి ఆశ్వయుజ శుద్ధ పాడ్యమినాడు అవతరించి నవమి నాడు రాక్షససంహారం చేయటం జరిగింది. కనుక ఆదిపరాశక్తిని ఆ సమయంలో పూజించి ఆ తల్లి అనుగ్రహం పొందటం సంప్రదాయం అయింది. అందరు దేవతల శక్తి ఏకీకృతమై రూపుదాల్చిన శ్రీదేవి రాక్షసులతో యుద్ధంచేసే సమయంలో దేవతలు, ఋషులు ఆమెకు పుష్టి కలగటానికి – యజ్ఞాలు, హోమాలు, జపాలు, తపాలు, పూజలు, పారాయణలు మొదలైన దీక్షలు పూనారు. మానవులు కూడా ఉడతాభక్తిగా తమకు తోచిన విధంగా దీక్షలు చేయటం మొదలు పెట్టారు. ప్రథమంగా ఆవిష్కృతమైన శక్తి తమోగుణ ప్రధానమైనది. నిర్గుణయైన పరాశక్తి మొదటి సగుణ ఆవిర్భావం తమోగుణమయమైన మహాకాళి. అందువల్లనే మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ అని జగదంబిక త్రిశక్తులలో మొదటిదిగా మహాకాళినే పేర్కొనటం జరుగుతుంది. ఇది వైవస్వత మన్వంతర వృత్తాంతం. సావర్ణి మన్వంతరంలో ఆదిపరాశక్తి రజోగుణ ప్రధానమైన మహాలక్ష్మిగా అవతరించింది. దానికి హేతువు మహిషాసురుడు.ఈ తత్త్వాన్ని వంట పట్టించుకోవటం ఏ కాలం లోనైనా అవసరమే. మహిషాసురులు ఎప్పుడూ ఉంటారు. అందుకే మహిషాసుర మర్దినులైన మహాలక్ష్ముల అవసరం ఎప్పుడూ ఉంటుంది. మహిషుని సంహరించేందుకు త్రిమూర్తుల నుంచి ఉద్భవించిన తేజస్సు అమ్మవారిగా ఆకారం ధరించింది. దేవతలందరూ ఆమెకు తమ తేజస్సును, ఆయుధాలను సమకూర్చారు. తన సంహారం కోసమే ఆమె ఆవిర్భవించిందని తెలిసినా మహిషుడు రకరకాలుగా ఆమెను ప్రలోభ పెట్టాలని చూశాడు. ఆమె అంగీకరించకపోయేసరికి కామరూపి గనుక ఆమెతో రకరకాల రూపాలతో యుద్ధం చేశాడు. ఆ రూపాలకు తగిన రూపాలను ధరించి దేవి మహిషరూపంలో ఉన్న రాక్షసుని సంహరించింది. ఇది జరిగింది ఆశ్వయుజ శుద్ధ నవమి రోజున. అప్పటివరకు దీక్ష వహించిన వారందరు దశమి నాడు జగదంబను స్తుతించి, అమ్మకు పట్టాభిషేకం చేసి, స్త్రీ శక్తి విజయానికి వేడుకలు చేసుకుని ఆనందించారు. వారి స్తుతులకు సంతసించిన శ్రీ దేవి వారిని వరం కోరుకోమన్నది. తమకు అవసరమైనప్పుడు ఈ విధంగా కాపాడమని కోరారు. ఆమె వారు తలచినప్పుడు అవతరిస్తానని మాట ఇచ్చింది. మరొకప్పుడు శుంభ నిశుంభులనే దానవ సోదరులు వేల ఏండ్లు తపస్సు చేశారు. బ్రహ్మ వారి తపసుకి మెచ్చి, ప్రత్యక్షమై వరం కోరుకోమంటే – తమకు అమరత్వం ప్రసాదించమని కోరారు. బ్రహ్మ అది తన చేతులలో లేదని, ఇంకేదైన వరం కోరుకోమని అన్నాడు. వారు తమకు అమర, నర, పశు, పక్షి పురుషుల వల్ల చావులేని వరం ఇమ్మని కోరారు. అంతటితో ఆగలేదు. స్త్రీలు బలహీనులు కనుక మాకు వారి వల్ల భయం లేదు అని చెప్పారు. బ్రహ్మ తథాస్తు అన్నాడు. స్వర్గంపై దాడి చేసి, ఇంద్రుని ఆసనాన్ని అధిరోహించి, త్రైలోక్యాధిపత్యాన్ని, యాగభాగాలని కూడా హరించారు. దిక్పాలకులను సూర్యచంద్రాది దేవతలను గెలిచి, వారి పదవులను కూడా గ్రహించాడు. వారి పనులు కూడా తానే చేయటం మొదలు పెట్టాడు. దేవతలు బృహస్పతి సూచనననుసరించి హిమవత్పర్వతం మీద ఉన్న దేవిని శరణు వేడారు. జగదంబ వారికి అభయం ఇచ్చింది. ఆ సమయంలో సర్వదేవతలు తమ తమ శక్తులను జగదంబకు తోడుగా పంపారు. అవన్నీ ఆయా దేవతలకు చెందిన ఆభరణాలను, ఆయుధాలను ధరించి, వాహనాలను అధిరోహించి వచ్చి రక్తబీజుని సైన్యాన్ని మట్టు పెట్టసాగాయి. ఈ శక్తులను మాతృకాగణాలు అంటారు. 1. బ్రహ్మ శక్తి బ్రహ్మాణి. 2. విష్ణువు శక్తి వైష్ణవి 4. కుమారస్వామి శక్తి షష్ఠీ దేవి కౌమారి. 5. ఇంద్రుని శక్తి ఐంద్రి, మాహేంద్రి, ఇంద్రాణి అనే పేర్లు కూడా ఆమెకున్నాయి. 6. ఆదివరాహమూర్తి శక్తి వారాహీ దేవి 7. నృసింహుని శక్తి నరసింహ రూపం నారసింహీ అనే నామం. ఈ మాతృకా గణంతో పాటుగా వరుణుని శక్తి వారుణీదేవి శత్రువులని పాశంతో బంధించి, మూర్చితులను చేసి, ప్రాణాలను తీస్తోంది. యముని రూపంతో యముని శక్తి యామ్యాదేవి మహిషము నెక్కి, దండాన్ని ధరించి, భయం గొలిపే విధంగా రణభూమిలో అడుగు పెట్టి, దానవులని యమసదనానికి పంపుతోంది. వీరికి తోడు శివదూతి కూడ విజృంభించి దానవులను నేలకూల నేస్తూ ఉంటే, చాముండా, కాళికలు వారిని తినేస్తున్నారు. దానవులు భయపడి పారిపోతుంటే రక్తబీజుని కోపం మిన్ను ముట్టి, దేవితో యుద్ధానికి వచ్చాడు. మాతృకాగణాలు అతడిపై ఆయుధాలను వేయగానే వాడి శరీరం నుండి కారిన ప్రతి రక్తబిందువు నుండి, ఒక్కొక్క రక్తబీజుడు పుట్టి వారి సంఖ్య అసంఖ్యాకం అయింది. దేవతలందరు భయభ్రాంతులై పోయారు. అప్పుడు అంబిక కాళికను నోరు పెద్దది చేసి, రక్తబీజుడి నుండి కారుతున్న రక్తాన్నంతా తాగివేయ మని చెప్పింది. వాడి శరీరం నుండి కారుతున్న రక్తాన్ని, కింద పడకుండా తాగటంతో వాడు నీరసించాడు. వాడి శరీరాన్ని శ్రీదేవి ముక్కలు చేస్తుంటే, కాళిక తినేసింది. అంబిక వాహనమైన సింహం కూడా ఎంతో మంది దానవులని తినేసింది. అపుడు నిశుంభుడు శ్రీదేవితో యుద్ధానికి బయల్దేరాడు. ముందుగా నిశుంభుడి తల తెగ నరికింది దేవి. అయినా అతడి మొండెం కత్తి పట్టుకొని తిరుగుతుంటే ఆ మొండెం కాళ్ళు చేతులు నరికింది దేవి. దానితో నిశుంభుడు అసువులు బాసాడు. శుంభుణ్ణి శ్రీదేవి తనతో యుద్ధం చేయలేకపోతే చండికతో గాని, కాళికతో గాని యుద్ధం చెయ్యమంది. అతడు పౌరుషం పెరిగి, శ్రీదేవితోనే యుద్ధం చేయదలచాడు. ఘోరయుద్ధం తరువాత శ్రీదేవి శుంభుని పరిమార్చింది. దేవతలకు తిరిగి స్వర్గ రాజ్యం లభించింది. మాటలతో సాధించిన విజయానికి సంకేతం ఇది. మాట నైపుణ్యంతో యుద్ధానికి ఆహ్వానించి గెలిచిన జగన్మాత అవతారాన్ని మహా సరస్వతిగా చెప్పటం జరిగింది. సామూహికంగా కుంకుమార్చనలు చేసినా, చండీహోమాదులు చేసినా, బొమ్మల కొలువులు పెట్టినా, బతకమ్మలు ఆడినా కనపడేది ఏదైనా పదిమంది కలిసి చేయాలనే ఐక్యభావన. శక్తి స్వరూపమైన స్త్రీ జాతి పట్ల గౌరవ మర్యాదలు నెరపటం. ‘‘యా దేవీ సర్వ భూతేషు శక్తి రూపేణ సంస్థితా నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః.’’ నవరాత్రులు అన్నా, అమ్మవారి పూజలన్నా ప్రధానంగా చేసేది లలితా రహస్య నామ సాహస్ర పారాయణం. కుంకుమార్చన చేసినా సహస్రనామాలతోనే చేస్తారు. జగదంబ లలితాదేవిగా ఆవిర్భవించిన ఇతివృత్తం బ్రహ్మాండ పురాణం లలితో పాఖ్యానంలో వివరించబడింది. ఆమె సర్వచైతన్యస్వరూపిణి కనుక ఆమెను ‘లలిత’ అని పిలిచారు.తమను కన్నతల్లి లాగా భావించి శ్రీమాతా! అని సంబోధించారు. జీవితం అంటే సుఖపడటం – సుఖపడటం అంటే తినటం, నిద్ర పోవటం మాత్రమే అని భావించటమే బండతనం. అటువంటి వారికి ఉండేది శూన్యమే కదా! బండతనం పోవాలంటే తగిన మార్గం ఒకటే. అది చైతన్యవంతులు కావటమే. అందుకే జగదంబ భండాసురవధ చేయటానికి సర్వచైతన్యస్వరూపిణిగా అవతరించింది. బండతనం మీద చైతన్యం విజయం సాధించటానికి సంకేతం విజయదశమి. శరన్నవరాత్రులలో అమ్మ అవతారాలలో లలితాదేవి అవతారం ఎంతో ప్రాధాన్యాన్ని కలిగి ఉంటుంది. నిజానికి శక్తి అన్నా చైతన్యమన్నా ఒకటిగానే భాసిస్తాయి. చైతన్యం లేనిదే శక్తి వ్యక్తం అయ్యే అవకాశం లేదు కదా! సమాజంలో ఎప్పుడూ మంచి చెడూ కలిసే ఉంటాయి. వాటి మధ్య జరిగే సంఘర్షణలో మంచి గెలవటానికి ప్రతీక విజయ దశమి. అలా మంచి గెలవటానికి ఎప్పుడు ఏ శక్తి కావాలో ఆ శక్తిగా అవతరించి సజ్జనులకు తోడుపడుతుంది జగన్మాత. అది శరీరంలో అనారోగ్యం కావచ్చు, మనస్సులో ఉన్న దుర్గుణాలు, దురాలోచనలు కావచ్చు, సమాజంలో ఉన్న దురాచారాలు, మూఢనమ్మకాలు కావచ్చు, ప్రకృతిని, పర్యావరణాన్ని కలుషితం చేసే మాలిన్యాలు కావచ్చును, సృష్టి నియమాలకి విరుద్ధంగా కలకాలం బతికి ఉండాలనే స్వార్థం కావచ్చును, ఒక జాతినో, వర్గాన్నో చులకన చేసే అహంకారం కావచ్చు ఒక జాతినో, వర్గాన్నో అవమానం చెయ్యటం కావచ్చును – ఇటువంటి ఎన్నో చెడులక్షణాల మీద విజయం సాధించిన రోజు విజయ దశమి. ముఖ్యంగా స్త్రీ పట్ల చులకన భావం కలిగిన దున్నపోతు మనస్తత్వం మీద స్త్రీ శక్తి విజయానికి సంకేతం విజయ దశమి. సద్భావనలు పెంపొందించుకునే రోజు. అందుకే ఒకరినొకరు అభినందించుకుంటూ జమ్మి పత్రాలని బంగారం, వెండి అనే పేరుతో పంచుకుంటూ ఉంటారు. – డాక్టర్ ఎన్ .అనంతలక్ష్మి -
రహదారులు.. రద్దీ
బీబీనగర్/చౌటుప్పల్: విజయదశమి, బతుకమ్మల పండుగల ప్రభావం జాతీయ రహదారులపై పడింది. హైదరాబాద్–వరంగల్, హైదరాబాద్– విజయ వాడ జాతీయ రహదారులపై శనివారం వాహనా లు భారీగా బారులు తీరాయి. పండుగలకు హైదరాబాద్తో పాటు ఇతర ప్రాంతాల నుంచి ప్రజలు స్వస్థలాలకు వెళ్తున్నారు. దీంతో యాదాద్రి భువనగిరి జిల్లా గూడూరు టోల్ప్లాజా వద్ద ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు రద్దీ కొనసాగింది. జాతీయ రహదారిపై మండల వ్యాప్తంగా ఉన్న అన్ని గ్రామాల కూడళ్ల వద్ద రోడ్డు దాటేందుకు ప్రజలు, వాహనదారులు అవస్థలు పడ్డారు. -
విజయవాడ : సాంస్కృతిక సంబరం అంబరాన్నంటింది (ఫొటోలు)
-
కొత్తగా వెయ్యి ఎలక్ట్రిక్ బస్సుల కొనుగోలు
నర్సీపట్నం (అనకాపల్లి జిల్లా): ఈ ఏడాది కొత్తగా వెయ్యి ఎలక్ట్రిక్ బస్సులు కొనుగోలు చేస్తున్నామని ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు తెలిపారు. మంగళవారం ఆయన నర్సీపట్నం ఆర్టీసీ డిపోను సందర్శించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ విజయదశమి ఆర్టీసీకి ఆదాయం తెచ్చే పండుగ అన్నారు. దసరాకు విజయవాడ కనకదుర్గమ్మ దర్శనానికి విచ్చేసే భక్తుల సౌకర్యార్థం 5,500 స్పెషల్ బస్సులను తిప్పుతున్నామన్నారు. గతంలో దసరా పర్వదినాల్లో 50 శాతం అదనపు చార్జీలు విధించటం జరిగేదని, రెండేళ్లుగా చార్జీల పెంపునకు స్వస్తి పలికామని చెప్పారు. రాను పోను ప్రయాణికులకు 10 శాతం రాయితీ కల్పిస్తున్నామన్నారు. రాయితీలు కల్పించి ఓఆర్ పెంచి ఆదాయ పెంపునకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కొత్తగా 1500 డీజిల్ బస్సులు ఆర్డర్ చేశామన్నారు. డీజిల్ బస్సుల స్థానంలో ఎలక్ట్రిక్ బస్సులను తీసుకొచ్చేందుకు నిర్ణయం తీసుకున్నామన్నారు. ఈ ఏడాది వెయ్యి ఎలక్ట్రిక్ బస్సులు కొనుగోలు చేశామని, మూడు నెలల్లో ఎలక్ట్రికల్ బస్సులు అందుబాటులోకి వస్తాయన్నారు. ఇకపై ప్రతి ఏటా వెయ్యి ఎలక్ట్రిక్ బస్సులు కొనేందుకు నిర్ణయం తీసుకున్నామని వివరించారు. అలాగే పీఎఫ్ బకాయిలు సకాలంలో కేంద్ర ప్రభుత్వానికి చెల్లించటం వల్ల సిబ్బందికి కేంద్ర ప్రభుత్వం హయ్యర్ పెన్షన్ ఆప్షన్ ఇచ్చిందన్నారు. ప్రస్తుతం రూ.3 వేలు నుంచి రూ.4 వేలు పెన్షన్ వచ్చే కేడర్లో ఉన్న వారికి ఇకపై రూ.25 వేలు పెన్షన్, రూ.5 నుంచి 6 వేలు ఉన్న వారికి రూ.30 వేలు నుంచి రూ.50 వేలు వరకు పెన్షన్ వస్తుందన్నారు. ఈ సందర్భంగా ఆయన డిపో ఆవరణలో మొక్కలు నాటారు. స్థానిక ఏఎస్పీ అదిరాజ్ సింగ్ రాణా తిరుమలరావును మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. ఎండీ వెంట జిల్లా ప్రజారవాణా సంస్థ అధికారి పద్మావతి ఉన్నారు. -
సీఎం జగన్కు ‘విశాఖ వందనం’
సాక్షి, విశాఖపట్నం: విజయదశమి నుంచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విశాఖ నుంచి పరిపాలించాలని తీసుకున్న నిర్ణయాన్ని నాన్ పొలిటికల్ జాయింట్ యాక్షన్ కమిటీ స్వాగతించింది. విశాఖకు తరలిరానున్న ముఖ్యమంత్రికి ‘విశాఖ వందనం’ పేరుతో భారీగా స్వాగతం పలకాలని జేఏసీ నిర్ణయించింది. మూడు రాజధానుల అంశంపై న్యాయస్థానంలో ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేయాలని జేఏసీ తీర్మానం చేసింది. సర్క్యూట్ హౌస్లో జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ ప్రొఫెసర్ లజపతిరాయ్ నేతృత్వంలో శనివారం జరిగిన సమీక్షలో వైఎస్సార్సీపీ రీజినల్ కో–ఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి, రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్తో సహా పలువురు జేఏసీ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా లజపతిరాయ్ మాట్లాడుతూ విశాఖకు పరిపాలన రాజధాని వస్తే.. వెనుకబడిన ప్రాంతమైన ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందుతుందని చెప్పారు. పరిపాలన వికేంద్రీకరణతో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు సమగ్ర అభివృద్ధి సాధిస్తాయన్నారు. తాను ఇటీవల కాలంలో సర్వే చేస్తే.. విశాఖను పరిపాలన రాజధానిగా చేయడానికి 98 శాతం వరకు మద్దతు పలికారని తెలిపారు. స్పష్టమైన నిర్ణయంతో సీఎం జగన్ వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ మూడు రాజధానుల విషయంలో సీఎం వైఎస్ జగన్ నాలుగున్నరేళ్ల నుంచి స్పష్టమైన నిర్ణయంతో ఉన్నారని చెప్పారు. గత టీడీపీ ప్రభుత్వం అమరావతి పేరిట ఇన్సైడర్ ట్రేడింగ్కు పాల్పడి వృథా ఖర్చులు చేసిందన్నారు. పదేళ్ల పాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉన్నా.. చంద్రబాబు ఓటుకు కోట్లు కేసులో అడ్డంగా దొరికిపోయి అమరావతిలో రాజధాని నిర్మించాలనుకున్నారని, అదీ సాధ్యం కాకపోవడంతో ఇప్పటికీ రాజధాని లేని రాష్ట్రంగా ఏపీ మిగిలిపోయిందని చెప్పారు. మంత్రి అమర్నాథ్ మాట్లాడుతూ విశాఖకు రాజధానిని తరలించే విషయంలో న్యాయపరమైన చిక్కులున్నా.. సీఎం రాష్ట్రంలో ఏ ప్రాంతం నుంచి అయినా పాలన సాగించవచ్చన్న భావనతో విశాఖ వైపు అడుగులేస్తున్నారని చెప్పారు. కార్యక్రమంలో నాన్ పొలిటికల్ జేఏసీ సభ్యులు.. ప్రొఫెసర్ బాలమోహన్దాస్, ఏయూ విశ్రాంతి ప్రొఫెసర్ విజయకుమార్, నన్నయ్య యూనివర్సిటీ మాజీ వీసీ జార్జ్ విక్టర్, వ్యాపారవేత్త ముస్తఫా, ప్రొఫెసర్ ఎన్ఏడీ పాల్, డాక్టర్ ఎస్.రామారావు, ఏపీ హోటల్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ కార్తీక్, ఏపీ ఎన్జీవో ప్రతినిధి కె.ఈశ్వరరావు, ఏయూ ప్రిన్సిపాల్ శోభాశ్రీ, ఏపీ బార్ కౌన్సిల్ మెంబర్ ప్రతినిధి కృష్ణమోహన్, ప్రొఫెసర్ షారోన్రాజ్, విశాఖ మత్స్యకార సంఘాల అధ్యక్షుడు జానకీరామ్, ఏయూ విశ్రాంతి ప్రొఫెసర్ సూర్యనారాయణ, మేయర్ గొలగాని హరివెంకటకుమారి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విశాఖపట్నం జిల్లా అధ్యక్షుడు కోలా గురువులు, ఎమ్మెల్సీ కుంభా రవిబాబు, ఎమ్మెల్యేలు గొల్ల బాబూరావు, వాసుపల్లి గణే‹Ùకుమార్, అన్నంరెడ్డి అదీప్రాజ్, నెడ్క్యాప్ చైర్మన్ కేకే రాజు, గవర కార్పొరేషన్ చైర్మన్ బొడ్డేడ ప్రసాద్, కొయ్య ప్రసాద్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
విజయాలనిచ్చే విజయదశమి...
-
అప్పుడు చైన్తో వచ్చా... ఇప్పుడు కత్తితో వస్తున్నా
‘‘ముప్పైమూడు సంవత్సరాల క్రితం అక్టోబరు 5న ‘శివ’ అనే ఫ్యామిలీ ఎంటర్టైనింగ్ సినిమాతో సైకిల్ చైన్ పట్టుకుని వచ్చాను. ఇప్పుడు ఈ అక్టోబరు 5న ఓ కత్తితో ‘ది ఘోస్ట్’ అనే సినిమాతో వస్తున్నాను. ఇది కూడా ఫ్యామిలీ ఎంటర్టైనర్. విజయదశమి మా ‘ది ఘోస్ట్’ చిత్రానికి కూడా విజయాన్ని ఇస్తుందనుకుంటున్నాను’’ అని నాగార్జున అన్నారు. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో నాగార్జున, సోనాల్ చౌహాన్ జంటగా నటించిన చిత్రం ‘ది ఘోస్ట్’. నారాయణ్దాస్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్రావు, శరత్ మరార్ నిర్మించిన ఈ చిత్రం అక్టోబరు 5న విడుదల కానుంది. కాగా ఆదివారం కర్నూలులో జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో నాగార్జున మాట్లాడుతూ– ‘‘ఈరోజు ఈ వేదికపై నేను, నాగచైతన్య, అఖిల్ ఇంత ప్రేమను పొందడానికి కారణమైన తెలుగు సినీ పరిశ్రమకి, మా నాన్నగారికి (దివంగత అక్కినేని నాగేశ్వరరావు) థ్యాంక్స్ చెప్పాలి. ఆడియన్స్ ఎలా చూడాలనుకుంటున్నారో ‘ది ఘోస్ట్’ లో అలానే కనపడతాను. నేను, చైతన్య చేసిన ‘బంగార్రాజు’ సినిమా థియేటర్స్లోనే కాదు.. టెలివిజన్ టీఆర్పీ, ఓటీటీ ప్లాట్ఫామ్స్లో కూడా రికార్డ్స్ క్రియేట్ చేసింది. నెక్ట్స్ అఖిల్తో నేను చేయబోయే సినిమా త్వరలో స్టార్ట్ అవుతుంది. మహేశ్బాబు ఎప్పుడంటే అప్పుడు అతనితో కలిసి నటిస్తాను. నాకు ఎంతో ఆప్తులైన చిరంజీవిగారి సినిమా ‘గాడ్ఫాదర్’ కూడా అక్టోబరు 5న రిలీజ్ కాబోతుంది.. ‘ది ఘోస్ట్, గాడ్ఫాదర్’ సినిమాలకు విజయాలు చేకూరాలి’’ అన్నారు. హీరో నాగచైతన్య మాట్లాడుతూ–‘‘గత నాలుగైదు నెలలుగా నాన్నగారిని(నాగార్జున) కలిసిన ప్రతిసారి ‘ది ఘోస్ట్’ గురించే మాట్లాడుకుంటున్నాం.. ఇలాంటి ఎగై్జట్మెంట్ను నాన్నలో చూసి చాలా రోజులైంది. ‘బంగార్రాజు’ చిత్రం నుంచి ‘ది ఘోస్ట్’కి ఆయన ట్రాన్స్ఫార్మ్ అయిన తీరు అద్భుతం. ఈ విధంగా నాకు ఎంతో స్ఫూర్తిని ఇస్తున్నారు. స్క్రీన్పై నాన్నని ఎలా చూడాలనుకున్నానో అలా ప్రవీణ్గారు ఈ సినిమాలో చూపించారు’’అన్నారు. హీరో అఖిల్ మాట్లాడుతూ– ‘‘నేను, అన్నయ్య.. ఇప్పుడు కాలర్ ఎగరేస్తున్నాం. ముప్పై ఏళ్ల తర్వాత కూడా అదే క్రమశిక్షణతో నాన్నగారు సినిమాలు చేస్తున్నారు.. దాన్నిబట్టి మేం ఎంత పరిగెత్తాలనేది అర్థం అవుతోంది. ‘ది ఘోస్ట్’ లో ఏదో ఒక ఫైర్ ఉంది.. సినిమా సక్సెస్ అవుతుంది’’ అన్నారు. ‘‘నాగార్జునగారితో సినిమా చేయడాన్ని చాలా గౌరవంగా భావిస్తున్నాను. ఆయన అభిమానుల అంచనాలను అందుకునేలా ‘ది ఘోస్ట్’ ఉంటుంది’’ అన్నారు ప్రవీణ్ సత్తారు. ‘‘నాగార్జున ఎంత స్టైలిష్గా ఉంటారో అంతే స్టైలిష్గా ఈ సినిమా తీశాం’’ అన్నారు నిర్మాత రామ్మోహన్రావు. ‘‘ది ఘోస్ట్’ తీసినందుకు చాలా గర్వంగా, సంతోషంగా ఉంది’’ అన్నారు నిర్మాత శరత్ మరార్. ఈ కార్యక్రమంలో కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, సోనాల్ చౌహాన్, నటుడు విక్రమాదిత్య, కెమెరామేన్ ముఖేష్, ఆర్ట్ డైరెక్టర్ బ్రహ్మకడలి, మ్యూజిక్ డైరెక్టర్ మార్క్ కె రాబిన్, మ్యూజిక్ డియో భరత్, సౌరభ్ తదితరులు పాల్గొన్నారు. -
Dussehra 2022: నవరాత్రి ఉత్సవాలకు హైదరాబాద్ రెడీ
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ మహానగరం మరో వేడుకకు సిద్ధమవుతోంది. దసరా నవరాత్రి ఉత్సవాలకు సమాయత్తమవుతోంది. దుర్గామాత విగ్రహాలను ప్రతిష్ఠించి తొమ్మిది రోజుల పాటు పూజలు చేసి అనంతరం నిమజ్జనం గావిస్తారు. ఈ నేపథ్యంలో నగరంలోని ధూల్పేట్లో దుర్గామాత ప్రతిమల తయారీ పనులు ఊపందుకున్నాయి. కళాకారులు వీటికి రంగులు అద్ది తుది మెరుగులు దిద్దుతున్నారు. నగరం వేదికగా దసరా నవరాత్రి సందడి వైభవంగా మొదలైంది. ఇందులో భాగంగా ప్రముఖ సామాజికవేత్త బినా మెహతా ఆధ్వర్యంలో జూబ్లీహిల్స్ వేదికగా ఆదివారం ప్రీ నవరాత్రి ఫెస్ట్ను నిర్వహించారు. ఈ వేడుకల్లో సంప్రదాయ గర్బా నృత్యంతో పాటు దాండియాతో అలరించారు. నగరంలో దాండియా సందడి మొదలైంది. శిల్పి ఈవెంట్స్, ఎస్కే క్రియేషన్స్ సంయుక్త ఆధ్వర్యంలో సికింద్రాబాద్ కంటోన్మెంట్లోని ఇంపీరియల్ గార్డెన్స్లో ఈ నెల 26 నుంచి అక్టోబర్ 4 వరకు తొమ్మిదిరోజుల పాటు ఉత్సవాల నిర్వహణకు రంగం సిద్ధమైంది. పోస్టర్ ఆవిష్కరణ ఆదివారం ఇంపీరియల్ గార్డెన్స్లో ఘనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ.. నగరంలోనే అతిపెద్ద ‘నవరాత్రి ఉత్సవ్ను నిర్వహిస్తున్నామన్నారు. సంప్రదాయ దుస్తుల్లో ఉత్సవాల్లో పాల్గొని, ఉత్తమంగా నృత్యం చేసిన వారికి రూ.25 లక్షల విలువ చేసే బహుమతులు అందజేస్తామన్నారు. (క్లిక్: దాండియా జోష్...స్టెప్పులు అదరహో..) 26 నుంచి రామాయణ్ మేళా అబిడ్స్: ఈ నెల 26 నుంచి 50వ రామాయణ మేళా వేడుకలు నిర్వహిస్తున్నట్లు రామాయణ మేళా చీఫ్ కన్వీనర్ గోవింద్రాఠి పేర్కొన్నారు. సోమవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రామాయణ మేళాలో భాగంగా కవి సమ్మేళనం నిర్వహించి పలువురు కవులను సన్మానిస్తామన్నారు. ఎగ్జిబిషన్ గ్రౌండ్లో జరిగే రామాయణ్ మేళాలో ప్రతి రోజు రామాయణం పట్ల అవగాహన కల్పిస్తామన్నారు. 29 నుంచి 3వ తేదీ వరకు గర్బా దాండియా నిర్వహిస్తామన్నారు. ఎగ్జిబిషన్ గ్రౌండ్లో దాండియా వేడుకలు పెద్ద ఎత్తున చేపడతామన్నారు. దసరా రోజు అక్టోబర్ 5న వేలాదిమంది భక్తుల మధ్య రావణ దహనం, శమీ పూజ నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో కమల్నారాయణ అగర్వాల్, గిరిధర్ లాల్, మనోజ్ జైస్వాల్, రామ్దేవ్, సుమిత్రాఠి పాల్గొన్నారు. (క్లిక్ చేయండి: 25 నుంచి బతుకమ్మ ఉత్సవాలు) -
ఆర్టీసీకి ‘విజయ’ దశమి
సాక్షి, హైదరాబాద్: విజయదశమి కానుకగా ప్రయాణికుల ముందుకు ఆర్టీసీ కొత్త బస్సులు తీసుకురానుంది. 1,016 కొత్త బస్సులు కొనేందుకు టెండర్లు పిలిచింది. మూడు రకాల కేటగిరీలకు సంబంధించి రెండింటికి అశోక్ లేల్యాండ్, మరో రకానికి టాటా కంపెనీ తక్కువ మొత్తాన్ని కోట్ చేశాయి. ఆ ధరలను మరికాస్త తగ్గించేందుకు ఆర్టీసీ ఉన్నతాధికారులు సోమవారం ఆయా సంస్థల ప్రతినిధులతో బేరం కోసం భేటీ కానున్నారు. కనీసం ఒక్కో బస్సుపై రూ. లక్ష చొప్పున తగ్గించేలా ఒప్పిం చాలని ఆర్టీసీ యత్నిస్తోంది. ఈ బస్సులను ఆయా కంపెనీలు దసరా నాటికి ఆర్టీసీకి అందించనున్నాయి. తొలిసారి స్లీపర్ బస్సులు.. తెలంగాణ ఆర్టీసీ తొలిసారి స్లీపర్ బస్సులు కొనుగోలు చేస్తోంది. ప్రస్తుతం ప్రైవేటు ట్రావెల్స్ బస్సులు 90 శాతం స్లీపర్ బస్సులే నడుపుతుండటంతో వాటికి ప్రయాణికుల ఆదరణ మెరుగ్గా ఉంది. ప్రైవేటు ట్రావెల్స్ పోటీని తట్టుకోవాలంటే స్లీపర్ బస్సులు సమకూర్చుకోవాలని ఆర్టీసీ ఇటీవల నిర్ణయించింది. ప్రయోగాత్మకంగా 16 స్లీపర్ బస్సులు కొనేందుకు టెండర్లు పిలిచింది. 30 బెర్తులతో కూడిన ఒక్కో ఏసీ బస్సుకు రూ. 50 లక్షల వరకు అశోక్ లేల్యాండ్ కోట్ చేసి ఎల్1గా నిలిచింది. సోమవారం జరిగే చర్చల తర్వాత కొనుగోలు ఆర్డర్ ఇవ్వనుంది. ప్రస్తుతం ఆర్టీసీకి సొంత బస్సులు 6,200 వరకు ఉండగా వీటిలో దాదాపు వెయ్యి బస్సులు కాలంచెల్లి తుక్కుగా మారేందుకు సిద్ధంగా ఉన్నాయి. దీంతో తగినన్ని బస్సులు లేక చాలా ప్రాంతా లకు ప్రజారవాణా దూరమైంది. ఆ సంఖ్య మరింత తగ్గకుండా ఇప్పుడు 1,016 బస్సులు అందుబాటులోకి రానున్నాయి. వాటి తర్వాత హైదరాబాద్ సిటీ రీజియన్ కోసం 300 ఎలక్ట్రిక్ బస్సులు రాబోతున్నాయి. రూ. 340 కోట్ల ఖర్చుతో.. గతంలో ఇంజన్ ఛాసిస్లను మాత్రమే ఆర్టీసీ వివిధ కంపెనీల నుంచి కొనుగోలు చేసి బాడీలను మాత్రం సొంతంగా ఏర్పాటు చేసుకొనేది. ప్రస్తుతం ఆర్టీసీ బస్ బాడీ బిల్డింగ్ యూనిట్ బలహీనపడినందున బాడీలతో కలిపే బస్సులు కొనే యోచనలో ఉంది. ఇందుకోసం టెండర్లలో ఛాసిస్లు, బాడీతో కలుపుకొని అనే రెండు రకాల ధరలను ఆహ్వానించింది. ధరల తగ్గింపుపై కంపెనీలతో చర్చల తర్వాత ఏది కొనాలనే విషయమై నిర్ణయం తీసుకోనుంది. బస్సుల కొనుగోలుకు సుమారు రూ. 340 కోట్లు ఖర్చయ్యే అవకాశం ఉంది. సూపర్ లగ్జరీ బస్సులే ఎక్కువ.. ఆర్టీసీ కొననున్న బస్సుల్లో 630 సూపర్ లగ్జరీ బస్సులున్నాయి. ఈ కేటగిరీలో అశోక్ లేల్యాండ్ కంపెనీ తక్కువ కోట్ చేసింది. ఛాసిస్ అయితే ఒక్కో బస్సు ధరను రూ. 20 లక్షల వరకు, బాడీతో కలుపుకొంటే రూ. 35 లక్షల వరకు కోట్ చేసింది. ఈ బస్సు 12 మీటర్ల పొడవు ఉండనుంది. ఇక 370 ఎక్స్ప్రెస్ బస్సులకు సంబంధించి టాటా కంపెనీ తక్కువ మొత్తాన్ని కోట్ చేసింది. 11 మీటర్ల పొడవుండే ఈ బస్సులకు ఒక్కో దానికి ఛాసిస్ అయితే రూ. 15 లక్షల వరకు, బాడీతో కలుపుకొంటే రూ. 25 లక్షల వరకు కోట్ చేసినట్లు తెలిసింది. ఈ బస్సులకు సంబంధించి ఛాసిస్లే కొనుగోలు చేసి బాడీని విడిగా తయారు చేయించుకోవాలని ఆర్టీసీ భావిస్తోంది. సూపర్ లగ్జరీ వరకు బాడీతో కలుపుకొనే కొంటే బాగుంటుందనే యోచనలో ఉంది. -
Photo Story: ఖండాంతరాలు దాటిన బతుకమ్మ సంబురం
బాసరలో ముగిసిన ఉత్సవాలు భైంసా(ముధోల్): దేవీనవరాత్రుల ముగింపు ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం బాసరలోని మహాలక్ష్మీ, మహంకాళి, వేదవ్యాసుని ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేసి అమ్మవారికి శోభాయాత్ర నిర్వహించారు. హారతి ఘాట్లో గంగమ్మతల్లికి ప్రత్యేక హారతి ఇచ్చారు. ఖండాంతరాలు దాటిన బతుకమ్మ సంబురం సాక్షి వరంగల్: అమెరికాలోని డల్లాస్లో తెలంగాణ పీపుల్స్ అసోసియేషన్ ఆఫ్ డల్లా‹స్ (టీప్యాడ్) ఆధ్వర్యంలో శుక్ర , శనివారం సద్దుల బతుకమ్మ, దసరా సంబురాలుఅంబరాన్నంటాయి. 14 అడుగుల ఎత్తయిన బతుకమ్మ చుట్టూ మహిళలు ఆడిపాడారు. వాయినం ఇచ్చుకుని బంగారు బతుకమ్మలను నీటి కొలనులో నిమజ్జనం చేశారు. అబ్రేటీఎక్స్లోని బిగ్ రాంచ్లో దసరా వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రగతిభవన్లో ఆయుధ పూజ సాక్షి, హైదరాబాద్: విజయ దశమి సందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు శుక్రవారం ప్రగతి భవన్లోని నల్లపోచమ్మ అమ్మవారి దేవాలయంలో కుటుంబ సమేతంగా అమ్మవారికి పూజలు జరిపారు. వాహనపూజ, ఆయుధపూజ ఘనంగా నిర్వహించారు. పూజల్లో సీఎం కేసీఆర్ సతీమణి శోభమ్మ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్, శైలిమ దంపతులు, సీఎం మనుమడు హిమాన్షు, మనుమరాలు అలేఖ్య, టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి శ్రవణ్కుమార్రెడ్డి, సీఎం కార్యదర్శి రాజశేఖర్ రెడ్డి పాల్గొన్నారు. -
Vijayawada: తెప్పోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తి
ఇంద్రకీలాద్రి (విజయవాడ పశ్చిమ): దసరా మహోత్సవాల్లో భాగంగా జరిపే తెప్పోత్సవానికి ఈ నెల 14వ తేదీన ట్రయల్ రన్ నిర్వహిస్తామని ఆలయ ఇంజినీరింగ్ అధికారులు తెలిపారు. ట్రయల్ రన్పై దేవస్థానం ఈఈ భాస్కర్ మంగళవారం ఇంజినీరింగ్ అధికారులతో సమావేశమయ్యారు. హంస వాహనం ఇప్పటికే సిద్ధమవగా, వాహనంపై చేయాల్సిన ఏర్పాట్లు, ఇతర అంశాలపై చర్చించారు. తెప్పోత్సవానికి అన్ని ఏర్పాట్లూ పూర్తయ్యాయని, ఇరిగేషన్, ఆర్ అండ్ బీ శాఖల నుంచి అనుమతులు రావాల్సి ఉందని అధికారులు పేర్కొన్నారు. కృష్ణానదీలో నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో తెప్పోత్సవంపై జిల్లా అధికారులు తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఈ నెల 15వ తేదీ నాటికి నీటి ప్రవాహం తగ్గుముఖం పట్టని నేపథ్యంలో ఎటువంటి ఏర్పాట్లు చేయాలనే అంశంపై చర్చించారు. దుర్గమ్మ ఆదాయం రూ.18.08 లక్షలు వన్టౌన్ (విజయవాడ పశ్చిమ): దేవీ శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా ఆరో రోజు మంగళవారం అమ్మవారికి రూ.18.08 లక్షల ఆదాయం లభించిందని ఆలయ అధికారులు తెలిపారు. మూలానక్షత్రం పర్వదినాన్ని పురస్కరించుకొని అమ్మవారిని భారీ సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. సాయంత్రం వరకూ వివిధ సేవా టిక్కెట్లు, ప్రసాదాల టికెట్ల విక్రయం ద్వారా ఈ ఆదాయం సమకూరిందని అధికారులు పేర్కొన్నారు. -
జయాభి జై భవ! జయోస్తు!
గత స్మృతులు గుర్తు చేసుకుం టున్నకొద్దీ రంగుల కలలుగా కని పించి ఆనందపరుస్తాయి. చిన్న ప్పుడు, కొంచెం ముందునించే దసరా రిహార్సల్స్ మొదలయ్యేవి. ఒక పద్యం తప్పక అయ్యవార్లు పిల్లలకు నేర్పించేవాళ్లు. ‘ధరా సింహాసనమై, నభంబు గొడుగై, తద్దేవతల్ భృత్యులై...’ అనే పద్యం చాలా ప్రసిద్ధి. పిల్లలం దరికీ నోటికి పట్టించేవారు. దసరా అంటే శరన్నవ రాత్రోత్సవాలలో పిల్లల విద్యా ప్రదర్శన, దాంతోపాటు గురు దక్షిణ స్వీకారం జరిగేది. ఈ పద్యం ఏ మహాను భావుడు రచించాడో చాలా గొప్పది. దేవుణ్ణి పొగిడి, పొగిడి ఆఖరికి ‘వర్ధిల్లు నారాయణా’ అంటూ దీవెనలు పెడతాడు. ధరా సింహాసనమై, భూమి ఆసన్నమై, ఆకాశం గొడుగై, దేవతలు సేవకులై, వేదాలు స్తోత్ర పాఠకులై, శ్రీగంగ కుమార్తె కాగా ‘నీ ఘనరాజసంబు వర్ధిల్లు నారా యణా’ అంటూ పూర్తి అవుతుంది. అనాదిగా వస్తున్న దసరా పద్యాలలో ఇదొకటి. తర్వాత పిల్లలు జయాభి జై భవ! దిగ్వి జై భవ! బాలల దీవెనలు బ్రహ్మదీవెనలు అంటూ బడి పిల్లలు జై కొడుతూ అయ్యవారి వెంట బయలు దేరతారు. ఏటా జరిగే ఈ ఉత్సవం కోసం ప్రతి గడపా వేయికళ్లతో ఎదురుచూసేది. ఆడ, మగ పిల్లలు నూతన వస్త్రాలు ధరించి, మగ పిల్లలు విల్లమ్ములు, ఆడ పిల్లలు ఆడే కోతి బొమ్మలు పట్టుకుని పాటలతో, వీధుల వెంట సందడి చేసేవారు. ఆ చిన్న విల్లమ్ములు చిత్రంగా ఉండేవి. దాంతో గులాములు కొట్టడానికి వీలుండేది. ఆడ పిల్లలు కొత్త పరికిణీలు వేసుకుని కోతిని ఆడిస్తూ ఆట పట్టించేవారు. పిల్లలు ఇంటింటికీ తిరిగేవారు. జయాభి జై భవ! దిగ్వి జై భవ! బాలల దీవెనలు బ్రహ్మదీవెనలు! పావలా అయితేను పట్టేది లేదు! అర్ధరూపాౖయెతే అసలే మాకొద్దు! అయ్యవాండ్రకు చాలు ఐదు వరహాలు! పిల్ల వాండ్రకు చాలు పప్పుబెల్లాలు! అంటూ యాగీ చేసేవారు. వీధి బడిలో ఏడాది పొడుగునా చదువు చెప్పిన వారికి ఐదు వరహాలు గురుదక్షిణ. వరహా అంటే నాలుగు రూపా యలు. ఆ రోజుల్లో అయ్యవార్లు ఎంతటి అల్ప సంతో షులు! ఇది విజయదశమి నాటి సంరంభం. ముందు రోజు ఆయుధపూజ. అదీ మరీ పెద్ద ఉత్సవం. రైతుల దగ్గర్నించి, పల్లెల్లో పట్టణాల్లో ఉండే సమస్త చేతివృత్తుల వారు తాము నిత్యం వాడే పరిక రాలను ఆయుధాలుగా భావించి వాటికి సభక్తికంగా పూజలు చేస్తారు. దీనికి రకరకాల ఐతిహ్యాలు చెబుతారు. పాలపిట్టని చూస్తే శుభమని తెలంగాణ ప్రాంతీయులు నమ్ముతారు. వెండి బంగారం అంటూ జమ్మి ఆకులు ఇచ్చి పెద్దల దీవెనలు తీసుకుంటారు. తెలంగాణలో జానపదుల బతుకమ్మ పండుగ దసరాతో కలిసే వస్తుంది. బెజవాడ కనకదుర్గమ్మ నవరాత్రిళ్లలో రోజుకో అవతారంలో భక్తుల్ని అనుగ్రహిస్తుంది. ఇట్లా పదిరోజులు సాగే పెను పండుగ మరొకటి లేదు. దేశమంతా కనకదుర్గ, మహంకాళి అమ్మవారి ఉత్సవాలు రకరకాల పేర్లతో వైభవంగా జరుగు తాయి. మన దేశం అన్ని విషయాలలో మిగిలిన ప్రపంచ దేశాలతో పోటీ పడుతున్నా పండుగలూ పర్వాలనూ పంచాంగం చెప్పిన ప్రకారం జరుపుకుంటోంది. ఇదొక విశ్వాసం, ఇదొక నమ్మకం. ఎన్నో తరాలుగా, ఆర్ష సంప్ర దాయం అనుసరించి వస్తున్న పండుగలు పచ్చాలు భక్తిప్రపత్తులతో చేసుకోవడంలో తప్పులేదు. నిన్న మన సంప్రదాయాన్నీ, ఆచారాన్నీ గౌరవిస్తూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి బెజవాడ దుర్గమ్మకి సభక్తికంగా రాష్ట్ర ప్రజలపక్షాన పట్టు వస్త్రాలు సమర్పించుకున్నారు. ప్రజలు ఆనందించారు. మన దేశంలో పెద్ద నదులన్నింటికీ పుష్కరాలు జరుగుతాయి. గంగానది సాక్షాత్తూ శివుడి తలమీంచి జనావళి కోసం దిగి వచ్చిందని మనం నమ్ముతాం. భగీరథుడి కృషికి దివి నుంచి భూమికి గంగ దిగి వచ్చింది. గంగ పుష్కరాలని కుంభమేళాగా వ్యవహరిస్తారు. సాధు సంతులు, సంసారులు, సామాన్యులు కుంభమేళా గంగ స్నానాలు ఆచరిస్తారు. ఈ ఉత్సవానికి హాజరైన నాటి మన ప్రధాని నెహ్రూని, మీరు ఇలాంటి వాటిని నమ్ముతారా అని ఓ పత్రికా ప్రతినిధి అను మానంగా అడిగాడు. అందుకు జవహర్లాల్ ఏ మాత్రం తొట్రుపడకుండా– ‘కోట్లాది మంది విశ్వాసాల్ని నేను గౌరవిస్తాను. గౌరవం ఉంటే నమ్మకం. గౌరవం అంటే నమ్మకం’ అని జవాబు ఇచ్చారు. ఎక్కువమంది విశ్వసించే వాటిని గౌరవించడం కూడా ఒక సంస్కారం. మంచికి, చెడుకి మధ్య జరిగిన పోరు దసరా. అందుకే విజయదశమి అయింది. ఇహ నించి జాతికి అంతా మంచే జరుగుతుందని ఆశిద్దాం. తెలుగు వారందరికీ విజయదశమి శుభాకాంక్షలు. సర్వే జనా సుఖినోభవన్తు! శ్రీరమణ (వ్యాసకర్త ప్రముఖ కథకుడు) -
పండగే పండగ.. మనకు కాదు.. కరోనాకు..
సాక్షి, హైదరాబాద్: బతుకమ్మ ఒకవైపు... కరోనా వేళ బతుకలేనమ్మ మరోవైపు.. గుంపులు, గుంపులుగా చేరి పండగ చేసుకుందామంటే.. గుబులు గుబులుగా ఉంది పరిస్థితి. ఓనం పండగ తర్వాత కేరళలో ఒక్కసారిగా కరోనా కేసులు పెరిగాయి. వివిధ రాష్ట్రాల నుంచి కేరళీయులు కేరళకు వెళ్లడం, అక్కడ పండగను సందడిగా నిర్వహించడంతో ఈ పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం బతుకమ్మ, దసరా, దీపావళి పండగల విషయంలో అప్రమత్తంగా ఉండాలని కేంద్ర సర్కారు విజ్ఞప్తి చేసింది. తెలంగాణలో వినాయక చవితి సందర్భంగా ప్రజలు స్వచ్ఛందంగా బహిరంగ ఉత్సవాలను జరుపుకోలేదు. కరోనా నిబంధనలను పాటించకుండా పండగలను నిర్వహిస్తే వైరస్ కేసులు పెరిగే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ మేరకు తాజాగా రాష్ట్ర ఉన్నతాధికారులతో కేంద్రం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించింది. తెలంగాణకు ప్రాణం బతుకమ్మ... తెలంగాణ పండగల్లో కీలకమైనది దసరా. బతుకమ్మ ఆటపాటలు మరీ ముఖ్యమైనవి. వీటిని ఆడపడుచులు ఒకచోట గుమిగూడి నిర్వహిస్తారు. రాష్ట్రం ఏర్పడ్డాక ప్రతి ఏడాది బతుకమ్మ పండుగకు ప్రభుత్వం చీరల పంపిణీ చేపడుతోంది. బతుకమ్మ పండగను పురస్కరించుకొని మహిళలు ఒక చోట నుంచి మరోచోటకు పెద్ద ఎత్తున ప్రయాణిస్తారు. ఆ తర్వాత క్రిస్మస్, సంక్రాంతి పండగలు వరుసగా ఉన్నాయి. వాటి విషయంలోనూ ఏం చేయాలన్న దానిపై సర్కారులో తర్జనభర్జన సాగుతోంది. కేసుల పెరుగుదలతో జాగ్రత్తలు తప్పనిసరి రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య దాదాపు రెండు లక్షలకు చేరుకుంది. పల్లెల్లో కరోనా ఘంటికలు మోగుతున్నాయి. కేసుల సంఖ్య తగ్గడంలేదు. రోజుకు పది వరకు కరోనా మరణాలు సంభవిస్తూనే ఉన్నాయి. వర్షాకాలం సీజన్ దాటి చలికాలం ప్రారంభ దశలో ఉన్నాం. సహజంగా వైరస్ వ్యాప్తికి చలికాలం వాహకంగా ఉంటుంది. ఫ్లూ వంటి వ్యాధులు ఈ కాలంలోనే విజృంభిస్తాయి. ఎలా నిర్వహించుకోవాలి? ఈ పండగల నిర్వహణపై అధికారికంగా ఎలాంటి ఆదేశాలు జారీకాలేదు. అయితే వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు మాత్రం కొన్ని సూచనలు చేస్తున్నారు. ► భౌతికదూరం పాటించడం, మాస్క్ ధరించడం, చేతులను శుభ్రం చేసుకోవడం వంటి కరోనా నిబంధనలను తప్పనిసరిగా పాటించాలి. ► పండుగల సందర్భంగా ప్రజలు గుమిగూడకుండా చూసుకోవాలి. ► పండగలకు బంధువులను పిలవకుండానే ఎవరికివారు తమ ఇళ్లలో నిర్వహించుకోవాలి. ► కరోనా అనుమానిత లక్షణాలున్నవారు ఎట్టి పరిస్థితుల్లోనూ ఐసోలేషన్లోనే ఉండాలి. పండగలకు హాజరుకాకూడదు. ► దీపావళి విషయంలో ఇదే మాదిరి చర్యలు తీసుకోవాలి. -
అందుకే ఆమెను పెళ్లాడాను..
కోల్కతా : దేశమంతా విజయదశమి వేడుకల్లో మునిగిపోయిన వేళ ఓ యువజంట దుర్గాదేవి ఆశీస్సులతో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. చాటింగ్ చేస్తూ ఒకరినొకరు అర్థం చేసుకుని.. నేరుగా కలిసిన నాలుగు గంటల్లోనే పెళ్లి చేసుకుని తమ బంధాన్ని శాశ్వతం చేసుకున్నారు. దుర్గామాత సాక్షిగా తమ మధుర క్షణాలను జీవితకాలపు ఆల్బమ్లో పదిలపరచుకున్నారు. ఈ ఘటన పశ్చిమబెంగాల్లోని హుగ్లీ నది ఒడ్డున జరిగిన దసరా వేడుకల్లో చోటుచేసుకుంది. హింద్ మోటార్కు చెందిన సుదీప్ ఆప్టిక్ లెన్స్ కంపెనీలో పనిచేస్తున్నాడు. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే అతడికి సియోరాఫులికి చెందిన ప్రతిమతో పరిచయం ఏర్పడింది. జూలై 25న ఫేస్బుక్లో ఆమెతో చాటింగ్ చేయడం ప్రారంభించాడు. ఈ క్రమంలో ఎన్నోసార్లు వీడియో కాల్స్లో మాట్లాడుకున్న వీరి మధ్య స్నేహబంధం బలపడింది. ఈ క్రమంలో అక్టోబరు 6న హుగ్లీ నది ఒడ్డున జరుగుతున్న విజయదశమి వేడుకలకు సుదీప్ హాజరయ్యాడు. ప్రతిమ కూడా అక్కడికి దగ్గర్లోనే ఉన్న మరో వేదిక వద్ద ఉందని తెలుసుకుని.. ఒకసారి నేరుగా కలుద్దామని ఆమెను కోరాడు. ఇందుకు ప్రతిమ అంగీకరించడంతో ఓ పూజా మండపంలో తొలిసారి కలుసుకున్నారు. చూపులు కలిసిన శుభవేళే సుముహూర్తం అన్నట్లుగా ప్రతిమను చూసిన నాలుగు గంటల్లోనే సుదీప్ ఆమె ముందు పెళ్లి ప్రస్తావన తెచ్చాడు. మోకాళ్లపై కూర్చుని ప్రపోజ్ చేయగా... మౌనమే ఆమె అంగీకారమైంది. ఇక అక్కడే ఉన్న భక్తులు, ప్రతిమ-సుదీప్ల స్నేహితులు హర్షధ్వానాలతో వారిని ఆశీర్వదించారు. ఈ నేపథ్యంలో సుదీప్.. ప్రతిమ నుదుటన సింధూరం దిద్ది పెళ్లి ప్రమాణాలు చేశాడు. ఇరువురు పూలదండలు మార్చుకుని వైవాహిక బంధంలో అడుగుపెట్టారు. ఈ విషయం గురించి సుదీప్ మాట్లాడుతూ..‘ ముందు మేమిద్దరం మంచి స్నేహితులం. తర్వాత తనతో ఎప్పుడు ప్రేమలో పడ్డానో తెలీదు. ప్రతిమ నా పేరిట సింధూరం ధరించాలని భావించింది. ముహుర్తాల గురించి నేను పెద్దగా పట్టించుకోను. అందుకే తనను పెళ్లాడాను అని చెప్పుకొచ్చాడు. ఇక సుదీప్లోని అమాయకత్వం, దయాగుణమే తనను ఆకర్షించిందని.. అందుకే తన మాట కాదనలేకపోయానని చెబుతూ సిగ్గులమొగ్గయింది. ఈ పెళ్లిని తన తల్లిదండ్రులు తొలుత వ్యతిరేకించినా ప్రస్తుతం తమ బంధాన్ని అంగీకరించారని హర్షం వ్యక్తం చేసింది. అత్తగారు కూడా తనను చూసి చాలా సంతోషపడ్డారని.. సుదీప్తో తన పెళ్లి జరగడంతో వారింట ఆనందాలు వెల్లివిరిశాయని పేర్కొంది. -
బన్నీ ఉత్సవం రక్తసిక్తం.. నలుగురి పరిస్థితి విషమం
సాక్షి, కర్నూలు: దేవరగట్టులో బన్నీ ఉత్సవం ఈ సారి కూడా రక్తసిక్తంగా మారింది. మాలమల్లేశ్వరుల విగ్రహాలను దక్కించుకునేందుకు 11 గ్రామాలు ప్రజలు రెండు వర్గాలుగా విడిపోయి కర్రలతో కొట్టుకున్నారు. ఈ రణరంగంలో 60 మందికి పైగా గాయపడ్డారు. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు పరిస్థితి అదుపులోకి తీసుకొచ్చారు. గాయపడిని వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. కర్నూలు జిల్లా దేవరగట్టు కొండలో వెలసిన మాలమల్లేశ్వర స్వామి కల్యాణోత్సవం సందర్భంగా కర్రల యుద్ధానికి దిగడం అక్కడి ప్రజలకు ఆనవాయితీగా వస్తోంది. దీనిని బన్నీ ఉత్సవంగా పిలుస్తారు. దీనిలో భాగంగా ఏటా దసరా పర్వదిననం రోజు దేవరగట్టు పరిధిలోని 11 గ్రామాలు ప్రజలు ఉత్సవ విగ్రహాల కోసం చిన్నపాటి యుద్దమే చేస్తారు. కొంతమంది కర్రలు, మరికొందరు దీవిటీలు చేతపట్టి అర్దరాత్రి కొండల మధ్య నుంచి దేవేరుల విగ్రహాలతో కల్యాణోత్సవానికి బయల్దేరుతారు. ఈ సందర్భంగా విగ్రహాలను దక్కించుకునేందుకు గ్రామాల ప్రజలు పోటీ పడతారు. అయితే ఈ సంప్రదాయంపై పోలీసులు ఎన్ని అంక్షలు విధించినా ఆనవాయితీ పేరిట ఏటా ఈ రక్తపాతం జరుగుతూనే ఉంది. -
పండగకు పోటెత్తిన పూలు
సాక్షి, హైదరాబాద్: దసరా పండగ నేపథ్యంలో నగరానికి పూలు పోటెత్తాయి. గత వారమంతా బతుకమ్మ సందడి, నవరాత్రలతో పూలకు గిరాకీ బాగా ఉండగా...దసరాకు అది మరింత పెరిగింది. దీంతో గ్రేటర్ శివారు జిల్లాలతోపాటు పొరుగు రాష్ట్రాల నుంచి సైతం నగరానికి పూలు దిగుమతి అవుతున్నాయి. ముఖ్యంగా బంతి, చామంతి, గులాబీ పూలతోపాటు డెకరేషన్కు ఉపయోగించే పూలకు డిమాండ్ బాగా ఉంది. దసరాకు ఆయుధపూజలు నిర్వహించడంతోపాటు వాహనాలు, షాపులు, వివిధ సంస్థలను పూలతో అలంకరించడం ఆనవాయితీ. ఈ నేపథ్యంలోనే పూల విక్రయాలు పెరిగాయి. ఈసారి పొరుగు రాష్ట్రాల నుంచి కూడా గులాబీ, చామంతి, బంతితో పాటు ఇతర పూలు ఎక్కువ మొతాదులో మార్కెట్కు వచ్చాయని మార్కెట్ అధికారులు తెలిపారు. సోమవారం గడ్డిఅన్నారం మర్కెట్కు బంతి సుమారు 2 వేల క్వింటాళ్లు, చామంతి 800 క్వింటాళ్లు దిగుమతి అయ్యాయని మార్కెట్ వర్గాల అంచనా. గతంలో ఎన్నడూ లేని విధంగా కనకాంబరం పూల ధర రికార్డు స్థాయిలో కిలో రూ.1500 పలికిందని మార్కెట్ అధికారులు చెప్పారు. గతేడాదితో పోలిస్తే బంతి పూలు రికార్డు స్థాయిలో విక్రయాలు జరిగినట్లు అంచనా. బంతిపూల ధరలు తక్కువగా ఉండడంతో జనం ఇతర పూల కంటే వీటినే ఎక్కువగా కొనుగోలు చేశారు. దిగుమతులు అధికమవడం వల్లే బంతి పూల ధరలు తగ్గాయని వ్యాపారులు, రైతులు అంటున్నారు. గత ఏడాది బంతి రూ.50 నుంచి 80 రూపాయలు ధర పలికితే...ఈ ఏడాది రూ.50–30 మధ్యే ధరలు ఉన్నాయంటున్నారు. దీంతో తమకు పెట్టుబడి ఖర్చులు కూడా రావడం లేదని రైతులు వాపోయారు. కేవలం కనకాంబరాల దిగుమతి తక్కువగా ఉండడం వల్లే రేటు బాగా పలికిందన్నారు. రైతులకు గిట్టుబాటయ్యేలా చర్యలు గతేడాది బంతి పూల ధర కిలో రూ.50 లోపే ఉండగా...చామంతి ధర అత్యధికంగా రూ.100 ఉంది. ఈ ఏడాది శివారు జిల్లాలతో పాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి ఎక్కువ మోతాదులో ప్రత్యేకంగా బంతి, చామంతి, సెంట్గులాబీ, కాగడాలు, లిల్లీ తదితర రకాల పూలు దిగుమతి అయ్యాయి. డిమాండ్కు సరిపడ దిగుమతులు ఉంటే ధరలు సర్వసాధారణంగా పెరగవు. డిమాండ్కు తక్కువగా దిగుమతులు ఉంటే ధరలు పెరుగుతాయి. ధరలు మరింత పడిపోకుండా నియత్రించడానికి ప్రయత్నించాం. రైతులకు గిట్టుబాటు ధరలు అందేలా చర్యలు తీసుకున్నాం. రైతులకు ఇబ్బందులు కలుగకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేశాం. కె. శ్రీధర్, స్పెషల్ గ్రేడ్ కార్యదర్శి, గుడిమల్కాపూర్ మార్కెట్ -
దసరానాడు జమ్మిచెట్టును ఎందుకు పూజిస్తారు?
విజయదశమినాడు శమీవృక్షం అంటే జమ్మిచెట్టును పూజించడం, పాలపిట్టను దర్శించుకోవడం ఆనవాయితీ. ఇంతకీ జమ్మిచెట్టు ప్రత్యేకత ఏమిటో తెలుసా? అజ్ఞాతవాసంలో ఉన్న పాండవులు వారి వారి ఆయుధాలను, వస్త్రాలను జమ్మిచెట్టుపై దాచి, అజ్ఞాతవా సం పూర్తి అవగానే ఆ వృక్షాన్ని పూజించి తిరిగి ఆయుధాలను, వస్త్రాలను ధరించారు. అనంతరం శమీవృక్ష రూపాన ఉన్న ’అపరాజిత’దేవి ఆశీస్సులు పొంది కౌరవులపై విజయ భేరీ మోగించారు. అంతకన్నా ముందు శ్రీ రాముడు కూడా రావణునిపై దండెత్తే ముందు, అనంతరం విజయదశమినాడు విజయం సాధించిన అనంతరం తన నగరానికి బయల్దేరేముందు శమీ వృక్షాన్ని పూజించాడు. అందువల్లనే నవరాత్రి ఉత్సవాలను జరిపి, విజయదశమినాడు అందరూ శమీపూజ చేయడం అనేది ఆనవాయితీగా వస్తోంది. విజయదశమి రోజు సాయంత్రం నక్షత్ర దర్శన విజయ సమయాన జమ్మి చెట్టు వద్ద గల అపరాజితా దేవిని పూజించి శమీ శమయతే పాపం శమీ శత్రు వినాశనీ అర్జునస్య ధనుర్ధారీ రామస్య ప్రియదర్శనం అనే శ్లోకాన్ని చదువుకుంటూ చెట్టుకు ప్రదక్షణలు చేయాలి. ఈ శ్లోకాన్ని రాసిన చీటీలు ఆ చెట్టు కొమ్మలకు తగిలించాలి. ఇలా చేయుట వల్ల అమ్మవారి అనుగ్రహంతోపాటు శనిదోష నివారణ కూడా జరుగుతుందని ప్రతీతి. తెలంగాణాలో శమీ పూజ అనంతరం పాలపిట్ట దర్శనం కోసం వేచివుంటారు. దానిని చూసిన తరువాతే ఇళ్లకు తిరిగి వస్తారు. వచ్చేటప్పుడు తమ వెంట జమ్మి ఆకును తెస్తారు. చిన్న వాళ్లు పెద్దల చేతులలో జమ్మి ఆకును ‘బంగారం’ అని చెప్పి పెట్టి, వారి దీవెనలందుకోవడం ఆచారంగా పాటిస్తారు. ప్రధానంగా జమ్మి, ఆరె ఆకులను పరస్పరం పంచుకొని, కౌగిలించుకోవడం ఒక ఆత్మీయ స్పర్శగా ఈ పండగ సందర్భంగా కొనసాగుతున్న ఆచారం. దీనిని జాతి, కుల, మత, లింగ వివక్షలకు అతీతంగా మనసుల్ని, హృదయాల్ని కలిపే ఐక్యతా రాగానికి ప్రతీకగా భావిస్తారు. -
సర్వం శక్తిమయం
యా దేవీ సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థితా నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః... యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితా నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః... చెడుపై మంచి సాధించిన విజయానికి నిదర్శనంగా విజయదశమి పర్వదినాన్ని జరుపుకుంటారనే సంగతి అందరికీ తెలిసినదే. లోక కంటకుడైన మహిషాసురుడిని దుర్గాదేవి వధించిన సందర్భంగా దసరా పండుగ జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోందని కూడా తెలిసినదే. విజయదశమికి సంబంధించి అనేక పురాణ గాథలు ప్రచారంలో ఉన్నాయి. రాముడు రావణుడిని వధించినది ఆశ్వయుజ శుద్ధ దశమి రోజేనని కూడా పురాణగాథలు ఉన్నాయి. అందుకే విజయదశమి రోజున రావణాసురుడి దిష్టిబొమ్మలను దహనం చేస్తారు. పన్నెండేళ్ల అరణ్యవాసం తర్వాత విరాటరాజు కొలువులో పాండవులు ఏడాది అజ్ఞాతవాసం గడిపారు. అజ్ఞాతవాసంలో ఉన్న సమయంలోనే ద్రౌపదిని వేధించిన కీచకుడిని భీముడు హతమారుస్తాడు. కీచకుడి మరణవార్త విన్న దుర్యోధనుడు పాండవులు విరాటరాజు వద్ద తలదాచుకుని ఉంటారని తలచి, విరాట రాజ్యంపై దండెత్తాడు. అప్పటికి అజ్ఞాతవాసం గడువు తీరిపోతుంది. కౌరవులు ఉత్తర గోగ్రహణానికి పాల్పడినప్పుడు ఉత్తరకుమారుడి సారథిగా బృహన్నల వేషంలో వెళ్లిన అర్జునుడు, కౌరవసేనను చూసి భీతిల్లిన ఉత్తరకుమారుడికి ధైర్యం చెప్పి, జమ్మిచెట్టుపై దాచి ఉంచి ఆయుధాలను బయటకు తీస్తాడు. జమ్మిచెట్టు మీద నుంచి విజయుడనే పేరు గల అర్జునుడు ఆయుధాలను తీసిన రోజు ఆశ్వయుజ శుద్ధ దశమి కావడంతో, ఈ రోజుకు విజయ దశమిగా పేరు వచ్చిందనే గాథ కూడా ప్రాచుర్యంలో ఉంది. విజయదశమి రోజున భారతదేశంలోనే కాకుండా కొన్ని ఇతర దేశాల్లోనూ ఘనంగా వేడుకలు జరుపుకుంటారు. దసరా రోజున దుర్గాదేవిని ప్రధానంగా ఆరాధిస్తారు. దుర్గా ఆలయాలతో పాటు అన్ని శక్తి ఆలయాల్లోనూ శక్తి స్వరూపాలుగా తలచే గ్రామదేవతల ఆలయాల్లోనూ దసరా నవరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతాయి. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి మొదలయ్యే ఈ వేడుకలు దశమి నాటితో పూర్తవుతాయి. సనాతన సంప్రదాయంలో శాక్తేయం ప్రత్యేక మతంగా ఉండేది. కొన్నిచోట్ల జంతుబలుల వంటి పద్ధతులపై ఆంక్షలు ఉన్నా, దసరా వేడుకలు చాలావరకు శాక్తేయ పద్ధతుల్లోనే నిర్వహిస్తారు. నవరాత్రులలో దుర్గాదేవిని నవరూపాలలో ఆరాధిస్తారు. దుర్గాదేవికి గల ఈ తొమ్మిది రూపాలనే నవదుర్గలని అంటారు. ఇదేకాకుండా, అమ్మవారిని దశమహావిద్య రూపాల్లోనూ ఆరాధిస్తారు. నవదుర్గలు నవదుర్గల పేర్లు వరుసగా శైలపుత్రి, బ్రహ్మచారిణి, చంద్రఘంట, కూష్మాండ, స్కందమాత, కాత్యాయిని, కాళరాత్రి, మహాగౌరి, సిద్ధిధాత్రి. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి మొదలుకొని తొమ్మిదిరోజుల పాటు దుర్గా దేవిని ఈ రూపాలలో పూజిస్తారు. ప్రథమం శైలపుత్రీతి ద్వితీయం బ్రహ్మచారిణీ తృతీయం చంద్రఘంటేతి కూష్మాండేతి చతుర్థకం పంచమం స్కందమాతేతి షష్ఠం కాత్యాయినీతి చ సప్తమం కాలరాత్రీతి మహాగౌరీతిచాష్టమం నవమం సిద్ధిదాప్రోక్తా నవదుర్గా ప్రకీర్తితా ఇక్తాన్యేతాని నామాని బ్రహ్మణైవ మహాత్మనా దుర్గాదేవికి గల ఈ తొమ్మిది నామాలను సాక్షాత్తు బ్రహ్మదేవుడే చెప్పినట్లు ప్రతీతి. మహారాష్ట్ర, గోవా ప్రాంతాల్లోని కొందరు నవదుర్గలను కులదైవంగా ఆరాధిస్తారు. చండీ సప్తశతిలో అమ్మవారికి మరో తొమ్మిది పేర్లు ప్రస్తావించి ఉన్నాయి. అవి: మహాలక్ష్మి, మహాకాళి, మహా సరస్వతి, నంద, శాకంబరి, భీమ, రక్తదంతిక, దుర్గా, భ్రామరి. అయితే, ఈ నామాలను నవదుర్గలుగా వ్యవహరించలేదు. నవదుర్గల ప్రాచీన ఆలయం మొదట గోవాలోని రేడి ప్రాంతంలో ఉండేది. ఈ ప్రాంతాన్ని పాలించిన పోర్చుగీసువారు ఆలయ వ్యవహారాల్లో దాష్టీకం చలాయించడంతో పదిహేడో శతాబ్దిలో ఆ ఆలయంలోని దేవీ దేవతా మూర్తులన్నింటినీ మహారాష్ట్రలోని వెంగుర్లకు తరలించి, శాస్త్రోక్తంగా ప్రతిష్ఠించారు. శాక్తేయం చరిత్ర వేదాలలో ఎక్కడా అమ్మవారి ప్రస్తావన ప్రత్యేకంగా లేదు. అయితే, సింధూలోయ నాగరికత కాలంలోనే ఆదిశక్తి ఆరాధన వాడుకలో ఉన్నట్లు పురావస్తు ఆధారాలు ఉన్నాయి. సింధూలోయ నాగరికతకు చెందిన ప్రజలు శివుడిని పశుపతిగా, లింగమూర్తిగా ఆరాధించేవారు. ఆదిశక్తిని జగజ్జననిగా, లోకమాతగా ఆరాధించేవారు. ఉపనిషత్తులలో ‘ఉమ’ పేరిట అమ్మవారి ప్రస్తావన కనిపిస్తుంది. మార్కండేయ పురాణంలో ఆదిశక్తిని ‘మహామాయ’గా ప్రస్తావించడం కనిపిస్తుంది. లలితా సహస్రనామం, చండీ సప్తశతి వంటి అమ్మవారి స్తోత్రాలు దాదాపు మహాభారత కాలం నాటివని చరిత్రకారుల అంచనా. లలితా సహస్రనామం బ్రహ్మాండ పురాణంలోనిది. క్రీస్తుశకం మూడో శతాబ్దం నాటికి భారత ఉపఖండంలో శాక్తేయ మతం బాగా వ్యాప్తిలో ఉండేది. త్రిపురా ఉపనిషత్తును శాక్తేయ సంప్రదాయంలోని తాంత్రిక విధి విధానాలకు మూలంగా భావిస్తారు. పదిహేడో శతాబ్దికి చెందిన పండితుడు భాస్కరరాయలు త్రిపురా ఉపనిషత్తుకు భాష్యాన్ని రాశాడు. దేవీభాగవతం, కాళికా పురాణం వంటి ఉపపురాణాల్లో అమ్మవారి గాథలు విపులంగా ఉంటాయి. దేవీభాగవతంలోని సప్తమ స్కందాన్ని ‘దేవీగీత’గా పరిగణిస్తారు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు తానేనని, సరస్వతి లక్ష్మి పార్వతులు తానేనని, సూర్యచంద్రులు, నక్షత్రాలు తానేనని... సమస్త చరాచర సృష్టి తానేనని అమ్మవారు స్వయంగా వెల్లడించినట్లుగా దేవీభాగవతం చెబుతోంది. దేవీ తత్వాన్ని శ్లాఘిస్తూ, ఆదిపరాశక్తిని స్తుతిస్తూ అద్వైత మత వ్యవస్థాపకుడు ఆదిశంకరాచార్యులు ‘సౌందర్య లహరి’ని రచించారు. ‘సౌందర్యలహరి’ని శ్రీవిద్యా రహస్యాలను బోధించే మంత్రంగా, తంత్రంగా, దేవీ సౌందర్యాన్ని కీర్తించే స్తోత్రంగా, అద్భుత ఛందోవిన్యాసంతో రచించిన కావ్యంగా పరిగణిస్తారు. క్రీస్తుశకం ఒకటో శతాబ్ది నాటికి కశ్మీర్, హిమాచల్ప్రదేశ్, ఉత్తరాఖండ్ ప్రాంతాల్లో ఆదిశక్తిని ప్రధాన దైవంగా లలితా త్రిపురసుందరి రూపంలో ఆరాధించే ‘శ్రీకుల’ సంప్రదాయం ఉంది. శాక్తేయంలో ఇదొక ప్రధాన సంప్రదాయం. ఈ సంప్రదాయం పాటించేవారు శ్రీవిద్య ఆరాధన సాగిస్తుంటారు. క్రీస్తుశకం ఏడో శతాబ్ది నాటికి శాక్తేయం దక్షిణాదికి కూడా విస్తరించింది. దక్షిణాదిలో కూడా ఎక్కువగా శ్రీకుల సంప్రదాయమే పాటిస్తారు. శాక్తేయంలో మరో ప్రధాన సంప్రదాయమైన ‘కాళీకుల’ సంప్రదాయం నేపాల్తో పాటు ఉత్తర భారత, తూర్పు, ఈశాన్య రాష్ట్రాల్లో వాడుకలో ఉంది. కాళీకుల సంప్రదాయానికి చెందిన వారు ఎక్కువగా కాళి, చండి, దుర్గ రూపాల్లో ఆదిశక్తిని ఆరాధిస్తారు. ఆదిశక్తి రూపాలైన దశమహావిద్యల ఆరాధన, సాధన కొనసాగిస్తుంటారు. దసరా నవరాత్రుల వంటి ప్రత్యేకమైన పర్వదినాలలో అమ్మవారికి తాంత్రిక పద్ధతుల్లో కోళ్లు, మేకలు, దున్నపోతులు వంటి జంతువులను బలి ఇస్తారు. నేపాల్, అస్సాం, పశ్చిమబెంగాల్, ఒడిశా వంటి ప్రాంతాల్లో నవరాత్రి వేడుకల్లో జంతుబలులు జరుగుతాయి. దశ మహావిద్యల ప్రశస్తి ఆదిశక్తికి గల పదిరూపాలను దశ మహావిద్యలుగా భావిస్తారు. శాక్తేయ సంప్రదాయం పాటించేవారు ఈ విద్యలను సాధన చేస్తారు. గురుముఖత మంత్రోపదేశం పొంది, నియమబద్ధంగా వీటిని సాధన చేయడం వల్ల ఇహపరాలలో సుఖశాంతులు కలుగుతాయని నమ్ముతారు. దశ మహావిద్యలలో మొదటిది కాళి. ఏళ్ల తరబడి యోగసాధనలో సాధించలేని ఫలితాలను కాళీ సాధనతో శీఘ్రంగానే సాధించవచ్చని ప్రతీతి. కవి కాళిదాసు కాళీ సాధనతోనే గొప్ప విద్యావంతుడయ్యాడంటారు. రెండో విద్య తార. తారా ఉపాసకులలో వశిష్ట మహర్షి ప్రసిద్ధుడు. మూడవది ఛిన్నమస్త. హిరణ్యకశిపుడు వంటివారు ఛిన్నమస్త సాధన చేసినట్లు పురాణాలు చెబుతున్నాయి. నాలుగవది షోడశి. షోడశి ఆరాధన జ్ఞానసంపద, ఐశ్వర్య సంపద కలిగిస్తుందని ప్రతీతి. ఐదవది భువనేశ్వరి. భువనేశ్వరీ సాధన మానసిక స్థైర్యాన్ని, శాంతిని, ఐహిక ఆముష్మిక ఫలితాలను ఇస్తుందని చెబుతారు. ఆరవది త్రిపుర భైరవి. ఈ విద్య సాధన ద్వారా ఇహపర సౌఖ్యాలను పొందవచ్చని అంటారు. ఏడవది ధూమావతి. ధూమావతి సాధనతో దారిద్య్రబాధలు తొలగిపోతాయని విశ్వసిస్తారు. ఎనిమిదవది బగళాముఖి. శత్రుబాధ తొలగడానికి బగళాముఖిని ఆరాధిస్తారు. పరశురాముడు బగళాముఖి సాధన చేసినట్లు పురాణాలు చెబుతున్నాయి. తొమ్మిదవది మాతంగి. మాతంగి సాధనతో సమస్త మనోభీష్టాలూ నెరవేరుతాయని నమ్ముతారు. పదవది కమల. భృగు మహర్షి పూజించడం వల్ల ఈ దేవతను భార్గవి అని కూడా అంటారు. కమలా సాధన వల్ల సుఖశాంతులు లభిస్తాయని చెబుతారు. దశ మహావిద్యల ఆరాధన వల్ల గ్రహదోషాలు తొలగిపోతాయని విశ్వసిస్తారు. కాళీ ఆరాధన వల్ల శని గ్రహదోషం నుంచి ఉపశమనం దొరుకుతుంది. గురుగ్రహ దోషం ఉన్నవారు తారా ఆరాధన చేయడం వల్ల ఫలితం పొందవచ్చు. షోడశి ఆరాధనతో బుధగ్రహ దోషాలు సమసిపోతాయి. చంద్రగ్రహ దోషం నుంచి ఉపశమనానికి భువనేశ్వరిని ఆరాధించాలి. రాహు దోష విమోచన కోసం ఛిన్నమస్తను, కేతు దోష పరిష్కారం కోసం ధూమావతిని ఆరాధించాలి. బగళాముఖి ఆరాధన వల్ల కుజదోషం నుంచి ఉపశమనం దొరుకుతుంది. జాతకంలో రవిగ్రహం బలహీనంగా ఉంటే మాతంగిని ఆరాధించాలి. శుక్రగ్రహ దోషాల నుంచి ఉపశమనానికి కమలను ఆరాధించాలి. ఇక జన్మలగ్నమే దోషభూయిష్టంగా ఉంటే భైరవిని ఆరాధించడం ద్వారా ఫలితం ఉంటుందని జ్యోతిశ్శాస్త్రం చెబుతోంది. గ్రహదోషాలకు ఇతరేతర ఉపశమన పద్ధతులు ఎన్ని ఉన్నా, వాటితో పోల్చుకుంటే దశ మహావిద్యల సాధన వల్ల శీఘ్ర ఫలితాలను పొందడం సాధ్యమవుతుందని పురాణ శాస్త్రాలు చెబుతున్నాయి. ఇతర మతాలపై ప్రభావం దేవీ ఆరాధన ప్రధానమైన శాక్తేయం ఇతర మతాలను కూడా ప్రభావితం చేసింది. బౌద్ధ, జైన మతాలలో శాక్తేయ తాంత్రిక పద్ధతులు కనిపిస్తాయి. ముఖ్యంగా బౌద్ధంలోని వజ్రయాన శాఖకు చెందిన వారు తాంత్రిక పద్ధతుల్లో ఆరాధన చేసే సంప్రదాయం ఉంది. సనాతన మతాలైన శైవ, వైష్ణవాలపైన కూడా శాక్తేయం గణనీయమైన ప్రభావం చూపింది. శక్తి రూపాలైన మాతృకలను బౌద్ధులు పూజించేవారు. బౌద్ధ మాతృక కుడ్యశిల్పాలు ఎల్లోరా గుహలలో ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉన్నాయి. ఇవి క్రీస్తుశకం ఆరు–ఏడు శతాబ్దాల మధ్యకాలం నాటివని చరిత్రకారుల అంచనా. ఈ గుహలలోనే దుర్గాదేవి సహా ఇతర దేవతల శిల్పాలు కూడా కనిపిస్తాయి. జైనులు శక్తిరూపాలైన విద్యాదేవతలను, శాసనదేవతలను పూజించేవారు. ఇక సిక్కుల దశమగ్రంథంలో గురు గోవింద్సింగ్ చాలా శాక్తేయ దేవతలను ప్రస్తావించారు. వీటిలో చండీ ప్రస్తావన ప్రధానంగా కనిపిస్తుంది. – పన్యాల జగన్నాథదాసు దశ మహావిద్యల ఆలయాలు దశ మహావిద్యలకు దేశంలో ఆలయాలు ఉన్నాయి. వీటిలో కొన్ని ప్రసిద్ధ ఆలయాల గురించి తెలుసుకుందాం...కోల్కతాలోని కాళీ ఆలయాలు ప్రసిద్ధమైనవి. వీటిలో ఒకటి కాళీఘాట్ ఆలయం, మరొకటి దక్షిణకాళి ఆలయం. ఉజ్జయినిలోని మహాకాళేశ్వర ఆలయానికి చేరువలోనే కాళీ ఆలయం కూడా ఉంది. భువనేశ్వర్లో రక్షకాళీ ఆలయం, కటక్లో మహానది ఒడ్డున కాళీ ఆలయం, వరంగల్లోని భద్రకాళి ఆలయం ప్రసిద్ధి పొందినవే. పశ్చిమబెంగాల్లో బీర్భూమ్ జిల్లాలోని తారాపీuŠ‡ పట్టణంలో తారాదేవి ఆలయం ఉంది. హిమాచల్ రాజధాని సిమ్లాలోను, అదే రాష్ట్రంలోని నాలాగఢ్లోను, భవన్లోను, బహిదా బాఘ్లోను కూడా తారా ఆలయాలు ఉన్నాయి. ఉత్తరాఖండ్లో అల్మోరా జిల్లా ఉడాల్కోట్లోను, మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లోనూ తారాదేవికి ఆలయాలు ఉన్నాయి.బెంగళూరులోని కెంపపుర ప్రాంతంలోను, చెన్నైలోని భారతీదాసన్ కాలనీలోను భువనేశ్వరి ఆలయాలు ఉన్నాయి. లక్నోలోని అదిల్నగర్ ప్రాంతంలోను, విశాఖపట్నం జిల్లా యాతపాలెం గ్రామంలోనూ భువనేశ్వరి ఆలయాలు ఉన్నాయి.మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లోను, ఉజ్జయినిలో కాలభైరవ ఆలయానికి చేరువలో ఛత్తీస్గఢ్లోని రాజనంద్గాంవ్లో కూడా పాతాళభైరవి ఆలయాలు ఉన్నాయి. ఒడిశాలోని బౌ«ద్ పట్టణంలో భైరవి ఆలయం ఉంది. తమిళనాడులోని సేలం పట్టణంలో లింగభైరవి ఆలయం ఉంది. అస్సాంలో గువాహటిలోని సుప్రసిద్ధ శక్తిపీఠం కామాఖ్య ఆలయానికి చేరువలోనే ఛిన్నమస్త ఆలయం ఉంది.పశ్చిమబెంగాల్లోని బిష్ణుపూర్, బంకురా పట్టణాలతో పాటు జార్ఖండ్లోని రాజ్రప్పలో ఛిన్నమస్తాదేవి ఆలయాలు ఉన్నాయి. కర్ణాటకలోని మంగళూరులోను, ఉడిపిలోనూ ధూమావతి ఆలయాలు ఉన్నాయి. కేరళలోని కాసర్గోడ్ జిల్లా పాలడుక్క గ్రామంలో కూడా ధూమావతి ఆలయం ఉంది.తమిళనాడులోని తిరునల్వేలి జిల్లా పాప్పకుళంలో బగళాముఖి ఆలయం ఉంది. మధ్యప్రదేశ్లోని షాజపూర్ జిల్లా నల్ఖేడా గ్రామంలోను, హిమాచల్ప్రదేశ్లోని కాంగ్రా జిల్లా సమేలి గ్రామంలోను, ఉత్తరాఖండ్లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం హరిద్వార్లోను, ఉత్తరప్రదేశ్లోని అలీగఢ్లోను, పంజాబ్లోని లూధియానాలోను, ఛత్తీస్గఢ్లోని రాయ్గఢ్లోనూ బగళాముఖి ఆలయాలు ఉన్నాయి.కర్ణాటకలోని బెల్గాంలోను, ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లా మదనపల్లిలోను, తమిళనాడులోని నాగపట్టణం జిల్లా నాంగూరులోను, మధ్యప్రదేశ్లోని ఝబువా పట్టణంలోను మాతంగీదేవి ఆలయాలు ఉన్నాయి.కర్ణాటకలోని బెల్గాం జిల్లా చిక్కలదిన్ని గ్రామంలోను, మహారాష్ట్రలోని థానే జిల్లా దండిపడా గ్రామంలోను, తమిళనాడులోని తిరువారూరులో త్యాగరాజ ఆలయానికి చేరువలోను కమలాదేవి ఆలయాలు ఉన్నాయి. -
దేవీ అలంకారాలు
భక్తితో నమస్కరిస్తే చాలు... అమ్మలా అనుగ్రహించి, అన్ని కార్యాలలోనూ విజయాలను ప్రసాదించే బెజవాడ కనకదుర్గాదేవి ఆలయంలో ఏటా ఆశ్వయుజ శుద్ధ ప్రతిపద అంటే పాడ్యమి నుండి విజయదశమి వరకు వైభవంగా శ్రీదేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు నిర్వహిస్తారు. ఇది ఆనవాయితీ. ఈ సందర్భంగా అమ్మవారి రేపటి అలంకార విశేషాలు, పఠించవలసిన శ్లోకం, చేయవలసిన నివేదన, పూజించడం వల్ల కలిగే ఫలితాలను సాక్షి ఫ్యామిలీ పాఠకుల కోసం రోజూ ప్రత్యేకంగా అందిస్తుందని తెలియచేయడానికి సంతోషిస్తున్నాం. శ్రీదేవీ శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా మొదటిరోజు బుధవారం అమ్మవారు శ్రీస్వర్ణ కవచాలంకృత శ్రీదుర్గాదేవిగా దర్శనమిస్తుంది. అమ్మవారిని బంగారు కవచాలతో, ఎరుపురంగు చీరతో అలంకరిస్తారు. నివేదన ఆవునేతితో చేసిన పొంగలి ఈరోజు పఠించవలసిన శ్లోకం: సౌమ్యాని యాని రూపాణి త్రైలోక్యే విచరంతి తే! యాని చాత్యుర్థ ఘోరాణి తైర్మాస్మాంస్తథా భువమ్ భావం: ఓ జననీ! ముల్లోకాలయందు సంచరిస్తుండే నీ సాత్త్విక రూపాలతో, మిక్కిలి భయంకరమైన స్వరూపాలతో మమ్మల్ని, ఈ సమస్త భూమండలాన్ని కాపాడు! ఫలమ్: ఇంటిలో ఉన్న చిక్కులు తొలగి, శక్తి, సంపదలు కలుగుతాయి. -
స్క్రీన్ టెస్ట్
► సముద్ర దర్శకత్వంలో కల్యాణ్రామ్ నటించిన ‘విజయ దశమి’లో ‘దీపావళి దీపావళి...’ అనే డ్యూయెట్లో కల్యాణ్రామ్తో ఆడి పాడిన హీరోయిన్ గుర్తుందా? ఎ) హన్సిక బి) వేదిక సి) కాజల్ అగర్వాల్ డి) ప్రియమణి ► ‘సంబరాలో సంబరాలు దీపావళి పండగ సంబరాలు..’ అంటూ విజయశాంతితో స్టెప్పులేసిన హీరో ఎవరో చెప్పుకోండి? ఎ) చిరంజీవి బి) బాలకృష్ణ సి) వెంకటేశ్ డి) నాగార్జున ► ‘అలుక మానవా...’ అని నరకాసురుని స్తుతిస్తూ ‘దీపావళి’ సినిమాలో నారద పాత్ర పాట పాడుతుంది. ఆ నారద పాత్ర పోషించిన నటుడెవరు? ఎ) పద్మనాభం బి) హరనాథ్ సి) కాంతారావు డి) రాజనాల ► ‘చీకటి వెలుగుల రంగేళి.. జీవితమే ఒక దీపావళి’ అనే పాటలో ఆడి పాడిన నటుడెవరు? ఎ) శోభన్బాబు బి) కృష్ణ సి) అక్కినేని నాగేశ్వరరావు డి) శ్రీధర్ ► 2007లో వచ్చిన ‘దీపావళి’ అనే సినిమాలో సటించిన హీరో ఎవరు? ఎ) సురేశ్ బి) వరుణ్ సందేశ్ సి) సాయిరామ్ శంకర్ డి) వేణు తొట్టెంపూడి ► ‘స్వప్న ప్రియ స్వప్న’ అని సాగే దీపావళి పాటలో బాలకృష్ణ నటించారు. ఈ సినిమా దర్శకుడెవరు? ఎ) ముత్యాల సుబ్బయ్య బి) కె. రాఘవేంద్రరావుసి) ఎ. కోదండ రామిరెడ్డి డి) బి. గోపాల్ ► 1960లో వచ్చిన ‘దీపావళి’ సినిమాలో నరకాసురుని పాత్రను పోషించిన నటుడెవరు? ఎ) యస్వీ రంగారావు బి) కైకాల సత్యనారాయణ సి) సీయస్ఆర్ డి) ధూళిపాళ ► ‘నా నవ్వే దీపావళి నా పలుకే దీపాంజలి..’ అంటూ ‘నాయకుడు’ సినిమాలోని ఈ పాటలో ఏ హీరో కనిపిస్తారు? ఎ) రజనీకాంత్ బి) కమల్హాసన్ సి) అరవింద్స్వామి డి) మమ్ముట్టి ► దీపావళి అంటే సత్యభామ గుర్తొస్తుంది... ఈ పేరుతో కమల్హాసన్ చేసిన సినిమా ఏంటి? ఎ) సత్యభామ బి) భామనే సత్యభామనే సి) శ్రీకృష్ణ సత్ యడి) సత్యభామనే ► భానుమతితో కలిసి సుహాసిని నటించిన ఓ సినిమాలో ‘ఇన్నాళ్లకొచ్చింది దీపావళి..’ అనే పాట ఉంది. ఆ సినిమా పేరేంటి? ఎ) ముద్దుల కూతురు బి) ముద్దుల మనవరాలు సి) ముద్దుల కోడలు డి) ముద్దుల పాప ► దీపావళి అంటే వెలుతురు పండగ. ‘గోరంత దీపం కొండంత వెలుగు’ అనే పాట రచయిత ఎవరో తెలుసా? ఎ) సి. నారాయణ రెడ్ డిబి) దాశరథి సి) వేటూరి డి) సిరివెన్నెల ► ‘ఇంటింటా దీపావళి ’అనే సినిమాలో హీరోగా ఎవరు నటించారో తెలుసా? ఎ) మురళీమోహన్ బి) మోహన్ సి) చంద్రమోహన్ డి) మోహన్బాబు ► వెలుగుతున్న చిచ్చుబుడ్డి పక్కనే ఎగురుతున్న హీరోయిన్... కాళ్ల పట్టీల నుండి హీరోయిన్ ఇంట్రడక్షన్ మొదలవుతుంది. ఆ బ్యూటీ ఎవరు? ఎ) అమీషాపటేల్ బి) కీర్తిరెడ్ డిసి) రేణూ దేశాయ్ డి) భూమిక ► బ్రహ్మానందం సిగరెట్ అనుకుని నోట్లో సీమ టపాకాయ్ ముట్టించుకునే సినిమా పేరేంటి? ఎ) క్షేమంగా వెళ్లి లాభంగా రండి బి) సందడే సందడి సి) తిరుమల తిరుపతి వెంకటేశ డి) అందరూ దొంగలే ► ‘అల్లరి’ నరేశ్ తన సినిమా పేరును దీపావళి టపాసుతో పెట్టుకున్నారు? ఆ సినిమా పేరేంటి? ఎ) సీమ బాంబ్ బి) సీమ టపాకాయ్ సి) సీమ చక్రం డి) సీమ శాస్త్రి ► ఈ సినిమాలో మంచు లక్ష్మి లాయర్. బాంబ్లాంటి పవర్ఫుల్ క్యారెక్టర్ చేశారు. ఆ సినిమా ఏంటో చెప్పుకోండి చూద్దాం? ఎ) ఆటమ్ బాంబ్ బి) హైడ్రొజన్ చక్రం సి) లక్ష్మీరాకెట్ డి) లక్ష్మీబాంబ్ ► ‘ఇక్కడ నా చిచ్చుబుడ్డి మర్చిపోయాను ఎవరన్నా చూశారా..’ అనే డైలాగ్ని ఏ సినిమాలో జగపతిబాబు చెప్పారో గుర్తొచ్చిందా? ఎ) ఫ్యామిలీ బి) అందగాడు సి) ఫ్యామిలీ సర్కస్ డి) సర్కస్ ఫ్యామిలీ ► ‘దీపావళి అంటే ఫెస్టివల్ ఆఫ్ లైట్స్.. నాట్ ఏ ఫెస్టివల్ ఆఫ్ సౌండ్ అండ్ పొల్యూషన్..’ అని ఏ హీరోయిన్ని ఉద్దేశించి ‘జనతాగ్యారేజ్’ సినిమాలో యన్టీఆర్ అన్నారు? ఎ) నిత్యామీనన్ బి) సమంత సి) త్రిష డి) కాజల్ అగర్వాల్ ► ‘గోపాల గోపాల అలకేలరా... దీపాల వేళాయెఅగుపించరా’ అనే పాటఏ సినిమాలోనిది? ఎ) అత్తారింటికి దారేది బి) ఖలేజా సి) జులాయి డి) అ ఆ ► ‘ఇయ్యాలే అచ్చమైన దీపావళి, ఎయ్యేళ్లు నిత్యమైన దీపావళి’ అనే పాటలో నటించిన దర్శకుడెవరు? ఎ) కోడి రామకృష్ణ బి) ఎ. కోదండరామిరెడ్డి సి) కె. విశ్వనాథ్ డి) దాసరి నారాయణరావు మీరు 6 సమాధానాల కంటే తక్కువ చెబితే...మీకు సినిమా అంటే ఇష్టం 10 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే ఇంట్రెస్ట్ 15 సమాధానాల వరకూ చెప్పగలిగితే...మీకు సినిమా అంటే పిచ్చి 20 సమాధానాలూ చెప్పగలిగితే... ఇంకోసారి ఈ క్విజ్ చదవకండి! సమాధానాలు 1) బి 2) ఎ 3) సి 4) సి5) డి 6) బి 7) ఎ 8) బి 9) బి 10) బి 11) ఎ 12) సి 13) బి 14) ఎ 15) బి 16) డి17) సి 18) ఎ 19) డి20) డి -
రమణీయ ప్రదేశం మంగళప్రద క్షేత్రం
అమ్మ చల్లనితల్లి. కర్ణాటక రాష్ట్రం మంగళూరులో కొలువైన సర్వమంగళ స్వరూపిణి. ఆమె పేరు మీదుగానే మంగళూరుకు ఆ పేరొచ్చింది. ఆమె కృపాదృష్టి సోకిందంటే, సకల శుభాలూ జరుగుతాయి. ఈ రాష్ట్రంలోని అత్యంత పురాతనమైన ఆలయాలలో ఒకటి, శ్రీ మహావిష్ణువు అవతారం, మహాతపశ్శాలి పరశురాముడు ప్రతిష్ఠించిన తల్లే మంగళాదేవిగా భక్తుల కోరికలు తీరుస్తూ, తన కరుణాకటాక్షాలతో యావత్ప్రపంచాన్నీ కాపాడుతోంది. శక్తిస్వరూపిణి అయిన అమ్మవారికి దేవీనవరాత్రులప్పుడు అంగరంగవైభవంగా పూజలు జరుగుతాయి. విజయదశమి రోజున విశేషపూజలు, రథోత్సవం జరుగుతాయి. వివాహం ఆలస్యం అవుతున్నవారు అమ్మవారిని పూజిస్తే, వారి వివాహంలో కలుగుతున్న ఆటంకాలు తొలగి, త్వరగా వివాహం అవుతుందనేది భక్తుల విశ్వాసం. అదేవిధంగా సంతాన సౌభాగ్యం కోసం పరితపిస్తున్నవారు, ఇంటిలో తలపెట్టిన శుభకార్యాలు వివిధ రకాల ఆటంకాల వల్ల వెనక్కి వెళుతుంటే, అమ్మవారిని పూజించి, విజయదశమినాడు జరిగే ఆమె రథయాత్రలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులతో తమకు కలుగుతున్న అమంగళాలను తొలగించుకుని, మంగళప్రదమైన జీవితాన్ని అనుభవించడం భక్తుల ప్రత్యక్ష అనుభవాలకు, అమ్మవారి అనుగ్రహానికి నిదర్శనం. ఆలయ శిల్పసంపద కన్నులు తిప్పుకోనివ్వనంత అద్భుతంగా ఉంటుంది. రథోత్సవం ఈ ఆలయంలో జరిగే ప్రధాన వేడుకల్లో ఒకటి. చారిత్రక కథనం: పూర్వం ఈ ప్రాంతాన్ని వీరబాహు అనే రాజు పరిపాలించేవాడు. ఆయనకు అన్నీ ఉన్నా సంతాన భాగ్యం లేదు. దాంతో తన గురువయిన భరద్వాజుని సలహా మేరకు తన రాజ్యాన్ని బంగారు రాజుకి అప్పగించి, తాను వానప్రస్థానికి వెళతాడు. బంగారు రాజుకి మంగళాదేవి కలలో కనిపించి, తాను నేత్రావతి, ఫల్గుణీ నదుల సంగమంలో ఉన్నాననీ, తనకొక ఆలయం నిర్మించమనీ చెబుతుంది. ఆ తల్లి ఆనతి ప్రకారం, ఆమె తనకు కలలో కనిపించి చెప్పిన ఆనవాళ్ల ప్రకారం వెతుక్కుంటూ వెళ్లిన బంగారు రాజుకి అమ్మవారి విగ్రహం కనిపించడంతో అక్కడే ఆమెకు ఒక ఆలయాన్ని నిర్మించాడు. అతని కోరిక మేరకు అమ్మ వీరబాహుకు సంతానాన్ని ప్రసాదించింది. అనంతర కాలంలో కుందవర్మ అనే రాజు మత్సే్యంద్రనాథుడు, గోరఖ్నాథుడు అనే గురువుల ఆశీస్సులతో ఆలయాన్ని పునర్నిర్మించాడు. ఇది అలనాటి చారిత్రక కథనం కాగా, మంగుళూరు ప్రస్తుత స్థితిగతులను పరికిద్దాం... బెంగళూరుకు పశ్చిమంగా 350 కి.మీ.ల విస్తీర్ణంలో అలరారే నగరం మంగుళూరు. కర్ణాటకలో అతి ముఖ్యమైన రేవుపట్టణం ఇది. కోరికలను తీర్చే కొంగు బంగారంగా పేరొందిన మంగళాదేవి కొలువైంది ఇక్కడే. ఆ అమ్మ పేరు మీద ఏర్పడినదే ఈ పట్టణం. నేత్రావతీ నదీ జలాలు, గురువురా నదీ జలాలు, ఇక్కడే సముద్రంలో కలుస్తూ ఉంటాయి. సముద్రంలో ఓడల రద్దీ పెరిగినపుడు ఇక్కడే కొన్నిటిని నిలుపుతూ ఉంటారు. కాఫీ, జీడిపప్పు ఇక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేస్తుంటారు. మంగుళూరు నగరాన్ని గతంలో కదంబులు, విజయనగర రాజులు, చాళుక్యులు, రాష్ట్రకూటులు, హోయసాలులు, పోర్చుగీసు వారు పరిపాలించారు. ఈ విధంగా మారుతున్న పరిణామాల్లో భాగంగా నాటి మైసూర్ ప్రభువైన హైదర్అలీ, 1763లో మంగుళూరు మీద దండెత్తి ఈ నగరాన్ని స్వాధీనం చేసుకున్నాడు. 1767 వరకు ఈ రాజ్యం అతని ఏలుబడిలోనే ఉంది. కాని ఆ తరువాతి పరిణామాల్లో బ్రిటిష్ వారి ఈస్ట్ ఇండియా కంపెనీ తిరుగుబాటుతో హైదర్అలీ పాలన అంతమయింది. నాటి నుంచి అంటే 1767 నుంచి 1783 వరకూ మంగుళూరు వారి అధీనంలోనే ఉంది. ఆ తరువాత హైదర్అలీ కుమారుడు టిప్పుసుల్తాన్ ఈ పట్టణాన్ని తిరిగి తన అధీనంలోకి తెచ్చుకున్నాడు. హోయసాలులు, పోర్చుగీసువారు పరిపాలించారు. ఇలా ఈ ప్రాంతం చాలా కాలం మైసూరు రాజులు, హైదర్ అలీ, టిప్పుసుల్తాన్, బ్రిటిష్ ప్రభువుల మధ్య గొడవల్లో నలిగిపోయింది 1799లో బ్రిటీష్ వారు ఈ పట్టణాన్ని హస్తగతం చేసుకున్నారు. ఈ నగరానికి మంగుళూరు అని పేరు రావడానికి వెనుక చిన్న కథనం కూడా ఉంది.ఇక్కడ కొలువై ఉన్న మంగళాదేవి ఆలయాన్ని నాథ వంశీయుడైన మత్సే్యంద్రనాథుడు నిర్మించాడు. ఒకసారి ఈ మత్సే్యంద్రనాథుడు, కేరళ రాజకుమారి అయిన పరిమళతో కలిసి ఇక్కడికి వచ్చాడు. ఈమెనే ప్రేమలాదేవి అని కూడా పిలిచేవారు. ఆ తరువాత ఈమె నాథ మతాన్ని స్వీకరించి మత్సే్యంద్రునితోనే ఉండిపోయింది. మతం మారిన తర్వాత మత్సే్యంద్రుడు ఆమెకు మంగళాదేవి అని పేరు మార్చాడు. మంగళాదేవి చనిపోయిన తర్వాత ఆమె జ్ఞాపకార్ధం ఇక్కడ బోలార్ అనే ప్రాంతంలో మంగళాదేవి ఆలయాన్ని నిర్మించాడు. టూకీగా మంగుళూరు పూర్వచరిత్ర ఇది. హిందూ చరిత్రలో ఇది చాలా పురాతన, పౌరాణిక ప్రాశస్త్యం గల పట్టణం. రామాయణ కాలంలో శ్రీరాముడు ఈ నగరాన్ని ఏలినట్లు పౌరాణిక ఆధారాలున్నాయి. మహాభారతకాలంలో పాండవుల్లో చివరివాడైన సహదేవుడు ఈ నగరాన్ని పరిపాలించాడని, పాండవ మధ్యముడైన అర్జునుడు కూడా దేశాటన చేస్తున్న కాలంలో గోకర్ణం నుంచి ఆదూరు వెళుతూ మార్గమధ్యంలో ఇక్కడే విడిది చేశాడని పురాణకథనం. ఇలా అనేక రాజుల ఏలుబడిలో , సుదీర్ఘచరిత్ర కలిగిన ఈ మంగుళూరు చుట్టుపక్కల ఉన్న అనేక దర్శనీయస్థలాలు పర్యాటకులకు కనువిందు చేస్తాయి. ఈ పట్టణాన్ని అనుకుని ఉన్న అనేక ప్రాంతాల్లో ఇప్పటికీ చారిత్రక శిథిలాలు, వాటి ఆనవాళ్లు, అనేకం మనకు ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని కలుగజేస్తాయి. సుందరవనాలకు పెట్టిందిపేరైన కర్ణాటక రాష్ట్రంలో ఉన్న మంగుళూరు చుట్టుపక్కలున్న అటవీ ప్రాంతం కూడా ఎంతో మనోహరంగా ఉండి, కనువిందు చేస్తుంది. – డి.వి.ఆర్.భాస్కర్ ఇక్కడ చూడదగ్గ ఇతర ప్రదేశాలు కుద్రోలి గోరఖ్నాథ్ ఆలయం, ఖాద్రి మంజునాథాలయం, కటీల్ శ్రీ దుర్గాపరమేశ్వరి ఆలయం, సోమేశ్వరాలయం, పొలాలి రాజరాజేశ్వరి ఆలయం, శ్రీ వెంకటరమణ ఆలయం, శ్రీ శరావు మహాగణపతి ఆలయం, శ్రీ అనంత పద్మనాభాలయం పుణ్యస్థలాలు. మంగుళూరు బీచ్ అన్నింటికన్నా ముందు అందరికీ గుర్తొస్తుంది. అయితే శూరత్కాల్ బీచ్, మిలేగ్రేస్ చర్చ్, ఎన్ఐటీకే లైట్ హౌస్; డాక్టర్ టిఎంఎ పాయ్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్, ది ఫోరమ్ ఫిజా మాల్, ఖాద్రి మిల్ పార్క్, రొసారియో కెథడ్రల్ చర్చ్, మానసా ఎమ్యూజ్మెంట్ అండ్ వాటర్పార్క్, బటర్ ఫ్లై పార్క్, న్యూ మంగుళూర్ పోర్ట్... ఇవన్నీ కూడా చూడదగ్గ ప్రదేశాలే. విజ్ఞానాన్ని, వినోదాన్ని అందించే రమణీయ స్థలాలే. ఎలా వెళ్లాలి? కర్ణాటక రాష్ట్రంలోని ముఖ్యనగరాలలో మంగుళూరు ఒకటి కాబట్టి ఈనగరానికి రైలు, రోడ్డు, వాయు మార్గాలున్నాయి. జలమార్గం కూడా ఉంది. అన్ని వర్గాల వారికీ సరిపడేవిధంగా భోజన, వసతి సౌకర్యాలు దొరుకుతాయి. -
నేడు శమీ దర్శనం
ప్రొద్దుటూరు కల్చరల్: ప్రొద్దుటూరులో దేవీశరన్నవరాత్రి మహోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. విజయదశమి సందర్భంగా మంగళవారం అమ్మవారి శమీదర్శన మహోత్సవం నిర్వహించనున్నారు. దసరా మహోత్సవాల్లో అత్యంత ప్రాముఖ్యత సంతరించుకున్నది వాసవీమాత శమీదర్శనం, తొట్టిమెరవణి. ఈ ఉత్సవాలను ఏటా 3 లక్షల మందికిపైగా భక్తులు తిలకిస్తారు. మధ్యాహ్నం 2 నుంచి 2.56 గంటల్లోపు మకరలగ్నంలో శమీదర్శనం ప్రారంభం కానుంది. పుర వీధుల మీదుగా అమ్మవారి శమీదర్శన మహోత్సవం వైభవోపేతంగా ప్రారంభమై కొర్రపాడు రోడ్డులోని శ్రీవాసవీ శమీదర్శన మండపం చేరనుంది. విజయానికి, సంపదకు చిహ్నమైన శమీ వృక్షాన్ని దర్శించి అమ్మవారికి పూజలు నిర్వహిస్తే శుభప్రదమని ప్రతీతి. అందువల్లనే విజయదశమి నాడు అమ్మవారికి శమీదర్శనం చేయించి తమకు విజయాలు, సిరిసంపదలు ఇవ్వాలని వేడుకుంటారు. శ్రీమహాలక్ష్మి సమేత చెన్నకేశవస్వామి, రతనాల వేంకటేశ్వరుడు, శివాలయం, రాజరాజేశ్వరి దేవి ఆలయాలతోపాటు పట్టణంలోని అన్ని ఆలయాల నిర్వాహకులు కొర్రపాడు రోడ్డు మిల్లులలోని శమీవృక్ష దర్శనానికి వివిధ కళాబృందాల మధ్య వైభవంగా చేరుకుంటారు. అన్ని ఆలయాల నుంచి వచ్చిన స్వామి, అమ్మవారి వైభవాన్ని తిలకించేదుకు వచ్చిన భక్తులతో కొర్రపాడు రోడ్డు భక్త సంద్రం కానుంది. విజయలక్ష్మిదేవి గ్రామోత్సవం (తొట్టిమెరవణి): శ్రీవాసవీకన్యకా పరమేశ్వరీదేవి అమ్మవారికి అర్ధరాత్రి 12.15 గంటల నుంచి 1 గంటల లోపు మిథునలగ్నంలో నిర్వహించే తొట్టిమెరవణి ప్రారంభం కానుంది. పంచలోహంతో తయారు చేసిన తొట్టి మెరవణి రథంలో అమ్మవారి శ్రీ చక్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ రథం పర్యటించిన ప్రాంతంలో అశుభాలు, చెడులు తొలగిపోయి సర్వశుభాలు కలుగుతాయనేది భక్తుల విశ్వాసం. అమ్మవారు విజయలక్ష్మి అలంకారంలో దర్శనమిస్తారు. పురవీధులలో కన్నుల పండువగా తొట్టిమెరవణిని నిర్వహిస్తారు. అమ్మవారిశాల నుంచి బయలుదేరి మెయిన్ బజారు, పప్పులబజారు మీదుగా పుట్టపర్తి సర్కిల్కు చేరుకుంటారు. కళ్లుమిరుమిట్లు గొలిపే బాణసంచా పేలుళ్లు, వెలుగులతో ఆ ప్రాంతం నూతన శోభ సంతరించుకోనుంది. ఈ తొట్టి మెరవనిలో శమీదర్శనంలోని కళాబృందాలతోపాటు సినీడూప్స్, బ్యాండ్ మేళం ప్రత్యేక ఆకర్షణగా నిలవనుందని ఆర్యవైశ్యసభ అధ్యక్షుడు రామ్మోహన్రావు తెలిపారు. ఉత్సవంలో భక్తులు పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని ఆయన కోరారు. -
నేడు నిజాలంకరణలో భ్రమరాంబాదేవి
శ్రీశైలం: శరన్నవరాత్రోత్సవాలలో భాగంగా మంగళవారం విజయదశమిని పురస్కరించుకొని శ్రీ భ్రమరాంబాదేవిని నిజాలంకరణలో దర్శనమివ్వనున్నారు. స్వామిఅమ్మవార్లను నందివాహనంపై ఊరేగిస్తూ శమి( జమ్మి) వృక్షం వద్దకు చేరుస్తారు. శమిపూజలను శాస్త్రోక్తంగా నిర్వహించి ఉత్సవమూర్తులను తిరిగి యథాస్థానంలో ఆవహింపజేస్తారు.అలాగే దసరా ఉత్సవాలకు పూర్ణాహుతిని నిర్వహిస్తారు. -
అంతా మనమే! అందరూ మనలోనే!! - కాజల్ అగర్వాల్
ఏ స్త్రీ అయితే తన లోలోపలి ధైర్యాన్ని మేలుకొలుపుతుందో... అలాంటి ప్రతి స్త్రీ తానే దుర్గా మాత! ఏ స్త్రీ అయితే తనలో మార్పును మేలుకొలుపుతుందో... అలాంటి ప్రతి స్త్రీ తానే కాళీ మాత! ఏ స్త్రీ అయితే తనలో అంకితభావాన్ని మేలుకొలుపుతుందో... అలాంటి ప్రతి స్త్రీ తానే పార్వతీ మాత! ఏ స్త్రీ అయితే, తనలోని పరిపోషణశక్తిని మేలుకొలుపుతుందో... అలాంటి ప్రతి స్త్రీ తానే అన్నపూర్ణా దేవి! ఏ స్త్రీ అయితే, తనలోని శివుణ్ణి మేలుకొలుపుతుందో... అలాంటి ప్రతి స్త్రీ తానే శక్తి! మనలోనే ఉన్న దేవతలను పూజిద్దాం. అందరికీ విజయదశమి శుభాకాంక్షలు. -
దసరా.. చలో రామ్లీలా! - రాశీ ఖన్నా
విజయదశమి వచ్చిందంటే ఢిల్లీ అంతా సందడి నెలకొంటుంది. ఢిల్లీలో దసరా పండగను బాగా జరుపుకుంటారు. చిన్నప్పుడు ఫ్యామిలీ అంతా కలిసి పూజ చేసేవాళ్లం. పూజలో చెప్పే కథలను శ్రద్ధగా వినేదాన్ని. ఆ తర్వాత రామ్లీలా మైదానంలో జరిగే రావణ దహన కార్యక్రమానికి వెళ్లేవాళ్లం. హీరోయిన్ అయిన తర్వాత ఢిల్లీ వెళ్లడానికి కుదరడంలేదు. దసరా సమయంలో ఇంట్లో అందర్నీ కలిసే అవకాశం తక్కువసార్లు లభించింది. ఇప్పుడు అమ్మానాన్నలు కూడా హైదరాబాద్ వచ్చేశారు. ఈరోజు నా కొత్త సినిమా షూటింగ్తో బిజీ. త్వరగా షూటింగ్ ముగించుకుని సాయంత్రం పూజకు హాజరయ్యేలా ప్లాన్ చేస్తున్నా. -
విజయాల స్ఫురణ
నవరాత్రులు పూర్తయిన తరువాతి రోజును విజయదశమిగా పిలుస్తారు. అమ్మవారు పది చేతులతో మహిషాసురుడిని సంహరించిన రోజిది. దశాయుధ పోరాటం కనుకనే విజయదశమి అన్నారు. దశ దుర్గుణాలను సంహరించినందుకు కూడా ఇది విజయదశమి. అమ్మవారు, రాములవారు వేర్వేరు కాలాల్లోనే అయినా ఈ ముహూర్తంలోనే దుష్టసంహారం చేశారు. అందుకే ఆ దేవతామూర్తులను స్మరించుకుంటూ... వారి సమరస్ఫూర్తిని స్ఫురణకు తెచ్చుకుందాం. ఇంతకూ ఈ విజయం ఎలా సిద్ధిస్తుందీ అంటే జ్ఞానం చేత. అంటే శారదాదేవి అనుగ్రహం వల్ల. అంటే శరన్నవరాత్రులను ఉపాసించటం వలన. మహిషాసురుడు అంటే పశుప్రవృత్తి కలిగినవాడు. మనలోని అజ్ఞానానికి మహిషాసురుడికీ ఏమాత్రం భేదం లేదు. రావణాసురుడి పదితలలూ ఈ దుర్గుణాలకే సంకేతం. దైవబలం, ఉపాసనాశక్తి చేత ఈ పదింటినీ నిర్మూలించటమే మహిషాసుర, రావణాసుర సంహారం. ఈ రెండూ విజయ దశమిరోజే జరిగాయి కాబట్టి విజయ దశమి మహా పర్వదినంగా మనం చెప్పుకుంటున్నాం. అజ్ఞాతవాస సమయంలో పాండవులు తమ ఆయుధాల్ని శమీ (జమ్మి)వృక్షంపై దాచిపెట్టినట్లు తదుపరి విరాటరాజు వద్ద కొలువు పొందినట్లు మనకు మహాభారతం వివరిస్తుంది. అజ్ఞాతవాస వత్సరకాలం పాండవుల ఆయుధాల్ని సంరక్షించిన శమీవృక్షాన్ని పరమ పవిత్ర వృక్షంగా దసరా రోజు పూజించడం మనం చూస్తున్నాం. శమీ శమయతే పాపం శమీ శత్రు వినాశినీ అర్జునస్య ధనుర్ధారీ రామస్య ప్రియదర్శినీ అనే శ్లోకాన్ని జపిస్తూ జమ్మిచెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయడం, కాగితం మీద పై శ్లోకాన్ని రాసి విజయ దశమిరోజు జమ్మిచెట్టుపై దాచడం వల్ల ఆ సంవత్సరం అంతా విజయ పరంపర కలుగుతుందనీ శత్రుపీడా నివారణం జరుగుతుందనీ నమ్మకం. అలాగే శమీపత్రాన్ని బంగారంగా భావించి పంచుకోవడాన్ని కూడా మనం చూడవచ్చు. విజయదశమిరోజు జమ్మిచెట్టుతోపాటు పాలపిట్టనూ దర్శనం చేసుకోవడం మనకు కనిపిస్తుంది. పాలపిట్ట మనశ్శాంతికీ ప్రశాంతతకూ కార్యసిద్ధికీ సంకేతం. పాండవులు జమ్మిచెట్టు మీద దాచిన తమ ఆయుధాలకు సంవత్సరం పాటు ఇంద్రుడు పాలపిట్ట రపంలో కాపుకాశాడని జానపదులు చెబుతుంటారు. ఎవరైనా ఆ చెట్టు మీద దాచిన ఆయుధాలను చూస్తే వారికవి శవంలాగా లేదా విషసర్పాలుగా కనిపిస్తాయనీ, అయినా ఎవరైనా వాటిని స్పృశించటానికి ప్రయత్నిస్తే అప్పుడు ఇంద్రుడు పాలపిట్ట రూపంలో వారిని తరిమికొడతాడనీ జనపదం. అందుకే దసరారోజు పాలపిట్టను చూడాలని తపిస్తారు. అపరాజితాదేవి ఆమె చేపట్టిన ప్రతికార్యం జయాన్ని చేకూర్చేదే. అందుకే దసరా సందర్భంగా ఆమెను అపరాజితాదేవిగా రాజరాజేశ్వరీ దేవిగా అలంకరిస్తారు. కొలిచిన వారికి కొంగుబంగారంగా భాసిల్లే ఆ చల్లనితల్లి... ప్రతిఒక్కరూ తమతమ కార్యాలను సక్రమంగా, విజయవంతంగా నిర్వర్తించుకునే ధైర్య, శౌర్య, సాహసాలను ప్రసాదించి, తన ఆశీస్సులను అందిస్తుంది. సృష్టిస్థితిలయలకు ఆధారభూతమైన ఆ జగజ్జననిని పూజించినవారికి, ఆరాధించిన వారికి... సకల విఘ్నాలనూ తొలగి, అన్నింటా విజయాలు, సుఖాలు, శుభాలు చేకూరతాయి. అక్షరానికి ఆధారమైన గాయత్రీదేవిని, శ్రీచక్రానికి మూలమైన శ్రీలలితాపరమేశ్వరీదేవిని, శ్రీచక్రంలోని సమస్త మంత్రాక్షరాలకూ కేంద్రమైన శ్రీరాజరాజేశ్వరీదేవిని, అన్నపానీయాలకు ఆధారభూతమైన అన్నపూర్ణమ్మను... అనేకానేక దివ్యశక్తులను తననుండి సృజించిన మహోన్నత దివ్యశక్తి ఆ త్రిభువనైక సుందరి.ఆమె లేనిదే ఈ చరాచర విశ్వమే లేదు. అంతటి దివ్యతేజోమూర్తిని సంవత్సరమంతా స్మరించాలి, పూజించాలి. అందుకు కుదరనివారు నవరాత్రులు తొమ్మిదిరోజులూ, అదీ కుదరని వారు అయిదు రోజులు, కుదరకపోతే మూడు రోజులూ, ఓపిక లేనివారు కనీసం విజయదశమి రోజున అయినా పూజిస్తే... తన బిడ్డల కోర్కెలను ఆమె తీరుస్తుంది. - చిర్రావూరి కృష్ణకిశోర్ శర్మ ఆధ్యాత్మికవేత్త -
ఈ విజయదశమి చాలా ప్రత్యేకం..
• సర్జికల్ స్ట్రైక్స్ను పరోక్షంగా ప్రస్తావిస్తూ మోదీ వ్యాఖ్య • ఢిల్లీలో దీన్ దయాళ్ ఉపాధ్యాయ శత జయంతి వేడుక న్యూఢిల్లీ: ఈ ఏడాది విజయదశమి చాలా ప్రత్యేకమైనదని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. భారత సైన్యం ఇటీవల వాస్తవాధీన రేఖ వెంబడి ఉగ్రవాదుల లాంచ్ ప్యాడ్లపై జరిపిన సర్జికల్ స్ట్రైక్స్కు సంబంధించి వివాదాలు ముసిరిన నేపథ్యంలో మోదీ వాటిని ఇలా పరోక్షంగా ప్రస్తావించారు. జనసంఘ్ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరైన పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఆదివారం ఢిల్లీలోని విజ్ఞాన భవన్లో నిర్వహించిన కార్యక్రమంలో ప్రధాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా దీన్ దయాళ్ జీవితం, ఆయన బోధనలకు సంబంధించిన 15 పుస్తకాలను మోదీ విడుదల చేశారు. అనంతరం ఆయన ప్రసంగిస్తూ.. ‘‘ఈ ఏడాది మన దేశానికి విజయదశమి చాలా ప్రత్యేకమైనది’’ అని అన్నారు. దసరా పండుగ సందర్భంగా దేశ ప్రజలకు మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో సైనిక శక్తి సమర్థవంతంగా ఉంటేనే.. దేశం బలంగా ఉంటుందని నమ్మిన వ్యక్తి దీన్ దయాళ్ ఉపాధ్యాయ అని చెప్పారు. మనం బలంగా ఉండటం అంటే ఎదుటి వారికి వ్యతిరేకంగా ఉన్నట్టు కాదని పరోక్షంగా పాకిస్తాన్ను ఉద్దేశించి మోదీ వ్యాఖ్యానించారు. మన సామర్థ్యం కోసం ఎక్సర్సైజ్లు చేస్తుంటే.. అది పొరుగు వారిని లక్ష్యంగా చేసుకుని చేస్తున్నట్టుగా ఆందోళన చెందాల్సిన పని లేదని ఎద్దేవా చేశారు. మానవతా వాదం గురించి కృషి చేసిన గొప్ప వ్యక్తి ఉపాధ్యాయ అన్నారు. -
విజయం ఎవరిని వరిస్తుందో?
విజయదశమికి నాలుగు రోజుల ముందుగానే కోలీవుడ్కు పండగ వచ్చేసింది. సాధారణంగా దసరా, దీపావళి, క్రిస్మ్స్, సంక్రాంతి పర్వదినాల్లో ప్రజల్లో ఎంత పండగ వాతావరణం నిండుకుంటుందో, అంతే సందడి చిత్ర పరిశ్రమలోనూ ఏర్పడుతుంది. ఆయా రోజులు సెలవు దినాలు కావడంతో జనం ముఖ్యంగా యువత సినిమాలు చూడడానికి అధిక ఆసక్తి చూపుతుంటారు. అందుకు తగ్గట్టుగానే సినీ దర్శక నిర్మాతలు తమ చిత్రాలు ఆ సమయాల్లో విడుదల చేయాలని కోరుకుంటారు.ప్రత్యేకించి దసరాకు పాఠశాలలు అధిక సెలవులు రావడంతో చదువుకునే పిల్లలు కూడా సినిమాలపై దృష్టి పెడతారు. ఇక సినిమా ప్రియులు ఉండనే ఉంటారు. దీంతో థియేటర్లు పిన్నపెద్దలతో కళకళలాడుతుంటాయి. నిర్మాతలు, బయ్యర్ల గల్లాపెట్టెలు గలగలలాడుతుండడానికి ఇన్ని కారణాలున్నాయి. అలా కలెక్షన్లను దోచుకోవడానికి ఈ దసరా పండగను పురస్కరించుకుని రెమో, రెక్క, దేవి మూడు తమిళ చిత్రాలతో పాటు ప్రేమమ్ అనే తెలుగు చిత్రం కూడా సిద్ధం అయ్యింది. ఇక వీటి వివరాలు చూస్తే.. రెమో... నటుడు శివకార్తికేయన్ నటించిన తాజా చిత్రం ఇది.పలు ప్రత్యేకతలతో శుక్రవారం తెరపైకి రానుంది. శివకార్తికేయన్ అందమైన నర్సుగా కనిపించడం రెమోలోని ప్రధాన ప్రత్యేకత. ఇక రజనీమురుగన్ చిత్రం తరువాత మరో సారి చిరునవ్వుల చిన్నది కీర్తీసురేశ్ శివకార్తికేయన్తో జత కట్టిన చిత్రం ఇది. ఈ చిత్రానికి నవ దర్శకుడు భాగ్యరాజ్ కన్నన్ దర్శకుడు.అనిరుద్ సంగీతాన్ని, పీసీ.శ్రీరామ్ వంటి ప్రముఖ చాయాగ్రహకుడు ఈ చిత్రానికి పని చేయడం మరో విశేషం. రెమో చిత్రంపై ఇటు పరిశ్రమలోనూ,అటు ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. రెండో చిత్రం రెక్క. నటుడు విజయ్సేతుపతి కథానాయకుడిగా నటించిన చిత్రం రెక్క. ఇందులో ఆయనకు జంటగా నటి లక్ష్మీమీనన్ తొలి సారిగా జత కట్టారు. రతన్శివ దర్శకుడు.డి.ఇమాన్ సంగీతాన్ని అందించారు. విజయ్సేతుపతి నటించిన పక్కా మాస్ కథా చిత్రం కనుక సహజంగానే రెక్కపై అంశనాలు భారీగానే ఉంటాయి. ఇక మూడో చిత్రం దేవి. డాన్సింగ్ కింగ్ ప్రభుదేవా సుధీర్ఘ విరామం తరువాత కథానాయకుడిగా నటించి, ఐ.గణేశ్తో కలిసి సొంతంగా నిర్మించిన చిత్రం దేవి. ఇందులో మిల్కీబ్యూటీ నాయకిగా నటించారు. విజయ్ దర్శకత్వం వహించిన తొలి హారర్తో కూడిన విభిన్న ప్రేమ కథా చిత్రం దేవి. దీంతో దేవి చిత్రం కూడా రెమో, రెక్క చిత్రాలతో పోటీ పడుతోంది. ఈ ముక్కోణపు పోటీలో ఏ చిత్రానికి ప్రేక్షక దేవుళ్లు బ్రహ్మరథం పడతారో అన్నది మరి కొద్ది గంటల్లోనే తెలిపోనుందన్నమాట. ఇక నాలుగో చిత్రంగా తెలుగు చిత్రం ప్రేమమ్ తమిళనాట ఇదే రోజు విడుదల కానున్నదన్నది గమనార్హం. టాలీవుడ్ యువ నటుడు నాగచైతన్య హీరోగా నటించిన ఈ చిత్రంలో శ్రుతిహాసన్,అనుపమ పరమేశ్వరన్, మడోనా సెబాస్టియన్ నాయికలుగా నటించారు. ఈ చిత్రం ప్రత్యేకత గురించి చెప్పనక్కర్లేదు. ఇది మలయాళంలో ఇదే పేరుతో విడుదలై అనూహ్య విజయాన్ని సాధించింది. ఇది చెన్నైలోనూ అధిక థియేటర్లలో విడుదల కానండడం విశేషం. -
నేడు ఆంధ్రబ్యాంకులో చిల్లర నాణేల పంపిణీ
కర్నూలు(అగ్రికల్చర్): విజయ దశమి, మొహర్రం, దీపావళి పర్వదినాలను పురష్కరించుకుని బుధవారం నాణేల పంపిణీ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టనున్నట్లు ఆంధ్రబ్యాంకు డీజీఎం గోపాకృష్ణ తెలిపారు. మార్కెట్లో చిల్లర కొరత ఎక్కువగా ఉన్నందున దీనిని అధిగమించేందకు ఆంధ్రబ్యాంకు కర్నూలు ప్రజల అవసరార్థం చిల్లర పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. పార్క్ రోడ్ శాఖలో రూ.1, 2, 5 నాణేల పంపిణీ ఉదయం 11 గంటలకు చేపడుతున్నామని ఈ అవకాశాన్ని ఖాతాదారులు తదితరులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. -
విజయదశమి నాటికి కొత్త జిల్లాలు!
వివిధ శాఖల హెచ్ఓడీలతో డీఆర్వో సమావేశం సంగారెడ్డి జోన్: విజయదశమి నాటికి కొత్త జిల్లాలు ఏర్పాటు కానున్నాయి. జిల్లాల పునర్విభజనకు ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలను విడుదల చేయడంతో అధికారులు కసరత్తు ముమ్మరం చేశారు. శుక్రవారం కలెక్టరేట్లో డీఆర్వో దయానంద్ తన ఛాంబర్లో జిల్లాలోని ఇంజనీరింగ్ విభాగాలు, ఇరిగేషన్, వ్యవసాయం, సహకార శాఖ, విద్య, డీఆర్డీఏ, డ్వామా, సర్వశిక్షా అభియాన్, ట్రాన్స్కో తదితర శాఖల అధికారులతో సమావేశమయ్యారు. శాఖల వారీగా ఉద్యోగులు ఎంత మంది? ఎలా సర్దుబాటు చేయగలం..? కొత్త పోస్టులు ఎన్నింటిని సృష్టించవచ్చు? ఎన్ని కావాల్సి ఉంటాయన్న వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ వివరాల ఆధారంగా కొత్తగా ఎన్ని పోస్టులు మంజూరు చేయాలన్న దానిపై కసరత్తు చేయడానికి అవకాశం ఉంది. కొన్ని శాఖల్లో అదనంగా ఉన్న సిబ్బందిని ఎలా తరలించాలన్న అంశాలపై ప్రధానంగా చర్చించారు. అర్హత కలిగిన సీనియర్ అధికారులకు పదోన్నతులు కల్పిస్తూ భర్తిచేసే అవకాశం వుంది. -
ప్రజలకు వైఎస్ జగన్ విజయదశమి శుభాకాంక్షలు
హైదరాబాద్ : తెలుగు ప్రజలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. చెడు మీద మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే ఈ పండుగ ప్రజలందరి జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని ఆయన ఆకాంక్షించారు. లోకంలోని ప్రజలందర్నీ రక్షించే దుర్గామాత తెలుగు రాష్ట్రాల ప్రజలకు సుఖ శాంతులు ఇవ్వాలని వైఎస్ జగన్ అభిలాషించారు. ప్రజలంతా సుఖ, సంతోషాలతో తులతూగాలని ఆయన ఆకాంక్షించారు. -
ఆచరణ రూపంలో ‘హిందుత్వ’
ధనశక్తితో ప్రపంచాన్ని శాసించగలమని నమ్మే దేశాలు లోక కల్యాణానికి భంగం కలిగిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో అంతర్జాతీయస్థాయిలో మన వాణిని వినిపించగల నాయకత్వం నేడు అవసరం. అటువంటి నాయకత్వం హిందూ సమాజం నుండి రావాలని ప్రపంచం ఎదురు చూస్తోంది. ఈ విజయదశమి నాడు ‘రాష్ట్రీయ స్వయం సేవక సంఘం’ (ఆర్ఎస్ఎస్) ఎనభై తొమ్మిదేళ్లను పూర్తి చేసుకొని తొంభైయ్యవ పడిలో ప్రవేశించనుంది. 1925లో నాగపూర్లో చిన్న సంస్థగా ప్రారంభమైన ‘సంఘం’ నేడు దేశ వ్యాప్త నిర్మాణంగా విస్తరించింది, దేశ హితం కోరే వారందరికి విశ్వాస కేంద్రమై నిలిచింది. ఒకప్పుడు సంఘం అంటే శాఖ. శాఖ అంటే కార్యక్రమం. నేడు అది దానికే పరిమితం కాలేదు. మన సమాజ ధర్మం, సంస్కృతుల పట్ల శ్రద్ధ వహిస్తూ, హిందూ సమాజం తన సమస్యలను తానే పరిష్కరించుకోగలదనే విశ్వాసాన్ని పాదుకొల్పుతున్నది. హిందూ సమాజం తన సమస్యలకు ఎవరినో కార ణంగా చూపటం, దానిపై వాదోపవాదాలు చేయటం వల్ల ఉపయోగం లేదు. హిందువులంతా ఒకే విధంగా స్పందించి, పని చేయటం నేర్చుకోవాలి. ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులు దేశమంతటా ఇలా ఒకే విధంగా స్పందించడం కనిపి స్తోంది. ఆ స్పందనే విశ్వాసాన్ని నిర్మిస్తున్నది. అందుకే ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడల్లా అశేష ప్రజానీకం బాధితు లకు చేసే ధన, వస్తు రూప సహాయాన్ని స్వయం సేవకుల చేతుల్లో ఉంచుతోంది. స్వాతంత్య్రం సిద్ధించి 67 ఏళ్లు పూర్తయినా దేశంలో రాజకీ య స్థిరత్వం నెలకొన లేదు. ప్రాంతీయ పార్టీల, భావనల ప్రభావం ప్రబలంగా ఉంటోంది. ఈ పరిస్థితిలో జాతీయ భావా లను బలోపేతం చేయాల్సి ఉంది. ‘‘జాతీయవాదులు కూడా దేశ హితానికి, సామ్రాజ్యవాదుల హితానికి మధ్య తేడాను సరిగా గుర్తించకపోవడం శోచనీయం... నేటి మన రాజకీయా లలో ఎన్నో లోపాలున్నాయి. వాటిని తొలగించుకోవడానికి సామూహిక ప్రయత్నం అవసరం’’ అని 1919 లోనే ఆర్ఎస్ ఎస్ వ్యవస్థాపకులు డాక్టర్ కేశవ రావ్ బలిరామ్ హెగ్డేవర్ అన్నా రు. నాటికి, నేటికి మన జాతీయవాదుల తీరు పెద్దగా మారింది లేదు. వ్యక్తిగతమైన, మతపరమైన, పార్టీ పరమైన ప్రయోజనా లకు ప్రాధాన్యం ఇస్తూ జాతీయ ప్రయోజనాలను పట్టించుకోక పోయే ధోరణి బలంగా ఉంది. నేటి రాజకీయాలలోని దిగజారు డుతనాన్ని అధిగమించగలగాలంటే రాజకీయ నేతలు ఆచి తూచి వ్యవహరించేలా చేయగల బలీయమైన ఒక సామాజిక శక్తి నిర్మాణం కావాలి. సామ్రాజ్యవాదులు నేడు ఏ దేశాన్ని పూర్తి వలసగా మార్చుకునే పరిస్థితి లేదు. కాబట్టి 1. వాణిజ్య సంబం ధాలను పెంపొందింపజేసుకోవడం, 2. ఆయా దేశాలలో తమ వంధిమాగధులను తయారు చేసుకోవడం, 3). ప్రభుత్వాలపై రాజకీయ వత్తిడి పెంచటం వంటి పద్ధతులను అవలంబిస్తు న్నాయి. ఈ విషయంలో మనం జాగరూకత వహించడం అవ సరం. మతతత్వ శక్తుల ఎత్తుగడల ప్రభావంతో సెక్యులర్ మేధావులు, ఉదారవాదులు ఆర్ఎస్ఎస్ను మతతత్వ సంస్థగా చిత్రీకరిస్తుంటారు. రాజకీయ నాయకులు రాజకీయ లక్ష్యం గలి గిన సంస్థగా భావిస్తుంటారు. ఇలా ఏర్పడిన గుడ్డి వ్యతిరేకతను ఎదుర్కొంటూనే సంఘం తనపనిని తాను చేసుకుంటూ ముం దుకుపోతోంది. సంఘం వ్యక్తులలో జాతీయ భావనను పెం పొందింపజేయడం మాత్రమే కాదు క్రమశిక్షణను పెంపొందిం పజేస్తోంది. వివేచన, కార్యదీక్షాదక్షతలను కలిగిన వేలాది మం ది కార్యకర్తలను దేశానికి అందిస్తోంది. అందుకే పలు సామా జిక, ధార్మిక, ఆధ్యాత్మికసంస్థలు సంఘంతో కలసిపనిచేయడా నికి ముందుకు వస్తున్నాయి. ఇది ఒక మంచి పరిణామం. నేటి ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో భారత దేశమే కాదు.. యావత్ ప్రపంచం సామ్యవాద, పెట్టుబడిదారీ విధానాలకు ప్రత్యామ్నాయం కోసం ఎదురు చూస్తోంది. అందుకే నేడు దీనదయాళ్జీ ‘ఏకాత్మతా మానవతావాదం’ విశేష ప్రాధాన్యం సంతరించుకుంది. క్రీడాభారతి, విద్యాభారతి, ఆరోగ్య భారతి వంటి పలు సంస్థల ద్వారా చేస్తున్న కృషితో ఆర్ఎస్ఎస్ మన సమాజ మౌలిక వ్యవస్థలను, దేశాభివృద్ధిని, దేశ రక్షణను పటిష్టం చేయడానికి తన వంతు బాధ్యతలను నిర్వహిస్తోంది. దేశం బాధ్యత ప్రభుత్వాలది మాత్రమే కాదు, మనందరిది. ధన శక్తితో ప్రపంచాన్ని శాసించగలమని విశ్వసించే కొన్ని దేశాలు ప్రపంచ శాంతికి, లోక కల్యాణానికి భంగం కలిగిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో అంతరాత్జీయ స్థాయిలో మన వాణిని వినిపిం చగల నిర్ణయాత్మకమైన జాతీయ, అంతర్జాతీయ రాజకీయ నాయకత్వం నేడు మనకు అవసరం. అటువంటి నాయకత్వం హిందూ సమాజం నుండి రావాలని కూడా ప్రపంచం ఎదురు చూస్తోంది. ఈ పరిస్థితుల్లో సంఘం తన చారిత్రక కర్తవ్యాల పరిపూర్తికి మరింత దృఢదీక్షతో ముందుకు సాగాలనేదే ప్రజా హితం కోరే వారందరి కామన. నేడు రాష్ట్రీయ స్వయం సేవక సంఘం 89వ వ్యవస్థాపక దినం. (వ్యాసకర్త ‘సమాచార భారతి’ నిర్వాహకులు) రాంపల్లి మల్లికార్జునరావు -
సర్వం శక్తిమయం జగత్
సందర్భంనేడు విజయదశమి ఏ రాక్షసుణ్ణి ఎలా వధించాలో అలా ఆలోచన చేయగలిగిన తల్లి ఆమె. ఒక్క బొట్టు రక్తం తన నుండి నేల పడినా తనలాంటి లక్షణాలున్న దుర్మార్గులు వేల సంఖ్యలో పుట్టాలనే వరాన్ని పొందిన రక్తబీజుణ్ణి వధించడానికి తన నాలుకని పృథివితో సమానంగా పెంచి దాని మీద వాణ్ని వధించింది. అఖిలానికి ‘అయ్య’ అయిన శంకరుని గురించి అలవోకగా శ్లోకాన్ని చెప్పబోతూ ఆది శంకరులవారు అలా గలగలా నవ్వేశారు. దానిక్కారణం ఎక్కడెక్కడ అయ్య గురించి అలోచించినా అక్కడక్కడ అమ్మ మాత్రమే కనిపించడం! అందుకే ఆయన అమ్మ గురించి చెప్పదలచిన సౌందర్యలహరి ప్రారంభ శ్లోకంలో ‘శివ శ్శక్త్యా యుక్తో యది భవతి శక్తః ప్రభవితుం న చే దేవం దేవో న ఖలుః కుశలః స్పందితు మపి అనేశాడు. (అమ్మతో కూడి ఉంటేనే అయ్య దేన్నైనా చేయ సమర్థుడౌతాడు. ఆమె లేకుంటే అసలాయన దేన్నీ చేయలేడు అని అర్థం). పోనీ ఆది శంకరులవారు అలా రాసారు అనుకున్నా, ‘నేను నేనే’ అని అయ్య ఏమైనా అన్నాడేమోనని వెతికి వెతికి చూస్తే ఆయనంతట ఆయన అననే అనేశాడు. అంతా నిన్ను పెళ్లాడాకే సుమా! లేకపోతే నా మహిమేముంది? (భవాని! త్వత్పాణి గ్రహణ పరిపాటీ ఫలమిదమ్) అని. సరే బ్రహ్మగారేమైనా తన భార్య లేకుండా శక్తిమంతుడా అని అలోచిస్తే, ఆయన తన నాలుగు ముఖాల నుండీ నిరంతరం వేద గానాన్ని చేస్తూండడాన్ని బట్టి ఆయనంటూ ఒకరున్నారని లోకానికి తెలుస్తోంది కానీ, అసలు బ్రహ్మ ఉనికికి కూడా కారణం ఆయనకున్న శక్తి (భార్య అయిన సరస్వతి) అనే అర్థమౌతోంది. ఇక శ్రీహరి మాట చెప్పేదేముంది? విష్ణుశక్తి మొత్తం లక్ష్మిదే కదా! ఆ శక్తి లేని పక్షంలో విష్ణుదర్శనానికి ఎవరొస్తారు? నిత్య కల్యాణమెక్కడ? పచ్చతోరణమెక్కడ? కాబట్టి ఏ బ్రహ్మకి శక్తి సరస్వతి ఔతోందో, ఏ విష్ణువుకి శక్తి లక్ష్మిగా కనిపిస్తోందో, ఏ శంకరునికి శక్తి పార్వతి మాత్రమే అని రుజువయిందో ఆ కారణంగా ‘శక్తి’ అంటే పురుషునికి సహకరించే భార్య అనీ, శక్తిపూజ (అమ్మవారి పూజ) చేయడం అంటే దంపతుల అన్యోన్యత కోసం చేయబడే పూజ అనీ, ఈ త్రిశక్తుల పూజ ఆశ్వయుజ మాసంలో నెలరోజుల పొడుగునా జరుగుతోందనీ గ్రహించాలి. అయితే ఈ త్రిశక్తుల్లో కూడా ఎవరు అత్యంత ముఖ్యం? అని ఆలోచించారు రుషులు. నెల మొదట్లో పది రోజులు పార్వతీదేవికి ఉత్సవాలు జరుగుతాయి. మూలా నక్షత్రం రోజున సరస్వతీ పూజ జరుగుతుంది. తర్వాత దీపావళి అమావాస్యనాడు లక్ష్మీపూజ. పౌరుషంలో శక్తి శక్తి అంటే అమ్మవారే అనుకున్నాం కదా. అమ్మ భండుడనే రాక్షసుణ్ణి వధించడానికి గజసైన్యం, అశ్వసైన్యం, రథబలం, పదాతి బలంతో బయల్దేరడమే కాకుండా తనకు సహాయకునిగా వచ్చిన వినాయకునితోపాటు, విఘ్నయంత్రాన్ని కూడా తీసుకెళ్లింది. ఇతర దేవతాయుధాలన్నింటినీ తనే ఒక్కొక్క చేతిలోనూ (మొత్తం ఇరవై చేతులు) ఉంచుకుని యుద్ధానికి తలపడింది. ఆమె రాక, ఆమె యుద్ధ ప్రణాళిక చూసి అందరూ కూడా దుర్గ (ఆమెను సమీపించలేం సుమా! గంతుం దుర్గమా) అన్నారు. గమనించవలసిన విషయం ఏమిటంటే అమ్మ తానింత పౌరుషంతో (పురుష లక్షణంతో) ఉన్నా కూడా తన భర్తని తక్కువ చేయకుండా భర్త అయిన కామేశ్వరుని పేరిట ఉన్న అస్త్రాన్ని ప్రయోగించి భండాసురుని రాజధానిని నాశనం చేసింది. తన విజయంలో ఆయన్ని కూడా భాగస్వామిగా ప్రకటించి లోకంలో స్త్రీలందరికీ మార్గదర్శకురాలయింది. ఆలోచనలో శక్తి ఏ రాక్షసుణ్ణి ఎలా వధించాలో అలా ఆలోచన చేయగలిగిన తల్లి ఆమె. ఒక్క బొట్టు రక్తం తన నుండి నేల పడినా తనలాంటి లక్షణాలున్న దుర్మార్గులు వేల సంఖ్యలో పుట్టాలనే వరాన్ని పొందిన రక్తబీజుణ్ణి వధించడానికి తన నాలుకని పృథివితో సమానంగా పెంచి దాని మీద వాణ్ని వధించింది. అలాగే సుందోపసుందుల్ని వధించేందుకు- మీలో ఎవరు బలిష్టులు? అని ప్రశ్నించి పరస్పరం చంపుకునేలా పథకం రచించింది. అలాగే హయగ్రీవుడనే రాక్షసుడు కోరిన వరానికి అనుగుణంగా శ్రీహరికి హయముఖం వచ్చేందుకై శ్రీహరి శిరస్సును ఖండింపజేసింది పరమ సాహసంతో. ఇలా సాహసోపేత విధానంతో రాక్షసవధని చేపట్టి మళ్లీ ఆ రాక్షస జాతితోనే శక్తి పూజలు చేయించుకున్న నేర్పరి అమ్మ. చక్రాల్లో శక్తి ప్రతి వ్యక్తికీ ఉండే సప్త చక్రాల్లోనూ, సప్త రూపాల్లోనే అమ్మ ఉంటుంది. లోకమంతా ఆమెని నాలుగు చేతులున్న రూపంతో ఊహిస్తుంది కానీ, ఆమె ప్రతి వ్యక్తి శరీరంలోని భాగంలోనూ ఉంటుంది. విశుద్ధి చక్రంలో ఎర్రని రంగులో, డాకినీ నామంతో; అనాహత చక్రంలో శ్యామవర్ణంతో, రాకినీ నామధేయంతో; మణిపూరక చక్రంలో రక్తం రంగులో, లాకినీ అనే పేరుతో; స్వాధిష్ఠాన చక్రంలో పచ్చని రంగులో కాకినీ దేవి పేరుతో; మూలాధార చక్రంలో రెండు రంగుల జమిలి వర్ణంతో, సాకినీ నామంతో; ఆజ్ఞా చక్రంలో తెల్లని వర్ణంతో, హాకినీ రూపంతో ఉంటూ సహస్రారంలో అన్ని రంగుల కలయికతో యాకినీ నామంతో శక్తిగా ఆమె విరాజిల్లుతోంది. విశుద్ధి చక్రంలో చర్మంలో, అనాహతంలో రక్తంలో, మణిపూరంలో మాంసంలో, స్వాధిష్ఠానంలో మేధస్సులో, మూలాధారంలో ఎముకల్లో, ఆజ్ఞాచక్రంలో మజ్జలో, సహస్రారంలో శుక్లంలో... ఇలా శరీరంలోని సప్తధాతువుల్లోనూ ఉండి మనని నడిపిస్తోంది అమ్మ. లోకంలో ప్రజలకు 1000 విధాల కష్టాలుంటాయని గ్రహించి, ఏ కష్టానికి ఏ నామం పఠిస్తే కష్ట నివారకమో చెప్తూ, అలాంటి వెయ్యి కష్టాలకీ వెయ్యి నామాలని కూర్పించి, ఆ నామాలకి శక్తి పెరిగేందుకై వాటన్నిటినీ ఒకేచోట ‘లలితా సహస్ర నామాలు’ అంటూ చేర్చి మననం చేసుకుంటూ ఉండవలసిందని చెప్తోంది అమ్మ. - డా ॥మైలవరపు శ్రీనివాసరావు -
కల్పవల్లి... పైడితల్లి!
విజయనగరంలో కొలువైన ఉత్తరాంధ్రుల ఇలవేల్పు పైడితల్లమ్మను ప్రజలు ఆడబిడ్డగా ఆడపడుచుగా భావించి ఆత్మీయంగా అక్కున చేర్చుకుంటారు. ఆమెను ఏటా మూడునాలుగు సార్లయినా తలచుకుని చీరా, సారె పెట్టి మొక్కుతీర్చుకుంటారు. కల్పవల్లి... పైడితల్లి! అమ్మవార్లను, గ్రామదేవతలను పూజించడం మన రాష్ట్రంలో చిరకాలంగా ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగా చాలా చోట్ల అమ్మవారిని, గ్రామ దేవతను తల్లిగా, ఇంటి ఇలవేల్పుగా భావించి కొలవడం సాధారణం. అలాగే విజయనగరంలో కొలువైన ఉత్తరాంధ్రుల ఇలవేల్పు పైడితల్లమ్మను ప్రజలు ఆడపడుచుగా భావించి ఆత్మీయంగా అక్కున చేర్చుకుంటారు. ఆమెను ఏటా మూడునాలుగు సార్లయినా తలచుకుని చీరా, సారె పెట్టి మొక్కుతీర్చుకుంటారు. వాస్తవానికి విజయనగరం సంస్థానాధీశుల తోబుట్టువు అయిన పైడితల్లమ్మను ఆ సంస్థానం పరిధిలోని ప్రజానీకమంతా ఆడపడుచుగానే ఆదరించి నిత్యపూజలు చేస్తున్నారు. స్థలపురాణం: 1757లో బొబ్బిలి రాజులకు, విజయనగరాన్ని పాలిస్తున్న విజయరామరాజుకు యుద్ధం ప్రారంభమైంది. ఈ సందర్భంగా విజయనగర ప్రభువులు ఫ్రెంచి సేనాని బుస్సీ దొర మద్దతుతో బొబ్బిలి సంస్థానం పాలకుడైన రంగారావుపై దండెత్తారు. విజయరామరాజు సోదరి అయిన చిన్నారి పైడిమాంబ యుద్ధం వల్ల వినాశనం తప్ప ఒరిగేదేమీ లేదని భావించి, యుద్ధాన్ని ఆపడానికని స్వయంగా గుర్రపుబగ్గీపై బయల్దేరుతుంది. మార్గమధ్యంలో ఉండగానే తన సోదరుడు విజయరామరాజు బొబ్బిలి వీరుడైన తాండ్రపాపారాయుడి చేతిలో హతమైనట్లు తెలుసుకుని హతాశురాలవుతుంది. ఆమె సృ్పహ తప్పి పడిపోగా వెంటనున్న అనుచరుడు పతివాడ అప్పలనాయుడు ఆమెను సేదదీర్చారు. తానిక జీవించజాలనని, దేవిలో ఐక్యమవుతున్నానని, అయితే తన ప్రతిమ మాత్రం విజయనగరంలోని పెద్ద చెరువులో లభ్యమవుతుందని, దాన్ని తీసుకొచ్చి నిత్యపూజలు చేయాలని చెప్పి ఆమె తనువు చాలిస్తుంది. ఆమె చెప్పినట్లుగానే పెద్ద చెరువులో వెతకగా అమ్మవారి ప్రతిమ లభిస్తుంది. ఈ ప్రతిమనే రైల్వే స్టేషన్ సమీపంలో ప్రతిష్టించి, దీన్ని వనం గుడిగా పేర్కొంటూ పూజలు చేస్తుంటారు. అనంతరం అమ్మవారి కోసం మూడు లాంతర్ల సమీపంలో చదురు గుడిని నిర్మించారు. ఈ నేపథ్యంలో అమ్మవారిని వైశాఖ మాసం శుద్ధ నవమి వరకూ వనం గుడిలో ఉంచుతారు. దశమినాడు భారీ ఊరేగింపుతో చదురు గుడికి తీసుకొస్తారు. విజయదశమి తరువాత వచ్చే సోమ, మంగళవారాల్లో విజయనగరం భక్తులతో పోటెత్తుతుంది. ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి లక్షలాదిగా భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని చీర, సారె, పసుపు కుంకాలు అర్పిస్తారు. అమ్మవారిని తమ ఇంటి ఆడపడుచుగా భావించే విజయనగరం ప్రజానీకం ఈ ఉత్సవాల సందర్భంగా తమ అక్కచెల్లెళ్లను ఇళ్లకు ఆహ్వానించి విందు ఏర్పాటు చేసి చీర, పసుపు కుంకుమలతో సత్కరించి పంపుతారు. పండగంటే ఇలా ఉండాలి... పైడితల్లమ్మ పండగను రెండ్రోజులపాటు నిర్వహిస్తారు. ఇందులో భాగంగా మొదటి రోజు జరిగేది తొలేళ్ల ఉత్సవం. ఇది ప్రత్యేకంగా రైతుల కోసం నిర్వహించేది. అమ్మవారి ఆశీస్సులతో సాగు ప్రారంభిస్తే పంటలు బాగా పండుతాయని రైతుల విశ్వాసం. ఈ సందర్భంగా ఘటాలను ఊరేగిస్తారు. మేళతాళాలతో ఊరేగింపు ఉంటుంది. సిరిమాను చూడాల్సిందే.. అమ్మవారి పండగలో ప్రధానమైనది సిరిమాను ఉత్సవం. ఈ ఉత్సవానికి నెల రోజుల ముందుగా ప్రధానార్చకుడి కలలోకి అమ్మవారు వచ్చి ‘ఫలానాచోట సిరిమానుకు సంబంధించిన చెట్టుంది. దాన్ని తీసుకురండి...’ అని ఉపదేశిస్తారని భక్తుల విశ్వాసం. ఈ నేపథ్యంలోనే అమ్మవారు సూచించిన పొడుగాటి చింత మానుతో ఎత్తై సిరిమానును ఏర్పాటు చేస్తారు. దీని చివర్న అమ్మవారి ఆలయ ప్రధానార్చకుడు కూర్చుంటారు. ఈ సందర్భంగా సిరిమాను ఊరేగిస్తారు. అనంతరం చదురు గుడి నుంచి కోట వరకు మూడుసార్లు సిరిమానును అటు-ఇటు నడుపుతారు. ఈ సందర్భంగా పులివేషాలు, సాముగరిడీల వంటి పోటీలుంటాయి. ఈ మేరకు ఇప్పటికే ఏర్పాట్లు మొదలయ్యాయి. ఈ ఏడాది అక్టోబర్ 21, 22 తేదీల్లో ఉత్సవాలు జరిపేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. - కొప్పర గాంధీ, సాక్షి ప్రతినిధి, విజయనగరం -
దిగ్విజయంగా విజయదశమి
సాక్షి, కాకినాడ : జిల్లా అంతా విజయదశమి సందర్భం గా ఘనంగా సంబరాలు జరిగాయి. ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు శ్రవణ నక్షత్రయుక్తంగా దశమి ప్రవేశించడంతో ఆదివారమే దసరా అని పలువురు పండితులు చెప్పడతో ఈరోజే దసరా పండుగ చేసుకున్నారు. సూర్యోదయంతో కూడిన తిథినే పండుగలకు ప్రమాణంగా తీసుకోవడం ఆచారం. కావడంతో సోమవారం విజయదశమి చేసుకునేందుకు కూడా చాలామంది ఏర్పాట్లు చేసుకున్నారు. ఆ రకంగా రెండురోజుల పాటు దసరా సందడి నెలకొననుంది. ఆదివారం తెల్లవారు జాము నుంచి అమ్మవారి ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి.అపరాజిత పూజలు, శమీపూజలు, ఆయుధ పూజలు, కుంకుమార్చనలు, ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. గత తొమ్మిదిరోజులూ నవావతారాలలో దర్శనమిచ్చిన అమ్మ ఆదివారం సౌందర్య రూపిణిగా, శాంతమూర్తిగా కనిపించింది. పలు ఆలయాల్లో శ్రీచక్ర నవావరణార్చన, ఆదికుంభేశ్వరస్వామికి ఏకాదశ రుద్రాభిషేకం, చండీహోమం, మూలమంత్ర లలిత హోమాలను అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. నవరాత్రిపందిళ్లు కూడా ఆదివారం భక్తులతో కిటకిట లాడాయి. పలు పందిళ్లలో కొలువుదీరిన అమ్మవార్లను మేళతాళాలు, బాణాసంచా మెరుపుల మధ్య ఊరేగించారు. పలువురు కొత్త వాహనాలకు పూజలు చేయించారు. కాకినాడలో పోటెత్తిన భక్తజనం కాకినాడలోని శ్రీ బాలాత్రిపురసుందరి సమేత శ్రీరామ లింగేశ్వరస్వామి వారి ఆలయంలో నవరాత్రి సంబరాలు అంబరాన్ని తాకాయి. వేలాది మందితో ఆలయం కిక్కిరిసింది. బాలాత్రిపురసుందరి అమ్మవారు బంగారు చీరలో దర్శనమివ్వగా భక్తులు పరవశించారు. రామలింగేశ్వరునికి ఏకాదశ రుద్రాభిషేకం, అమ్మవారికి సహస్ర కుంకుమార్చన, చండీహోమం, నవవరణార్చనలు నిర్వహించారు. రాజమండ్రిలో అమ్మవారికి నిర్వహించిన తెప్పోత్సవం కన్నులపండువగా జరిగింది. వేలాది మంది ఈ నయానందకర దృశ్యాన్ని వీక్షించారు. అమలాపురంలో శ్రీదేవి అమ్మవారి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. చెడీ తాలింఖానా విన్యాసాలు, శక్తి వేషాలతో వాహనాల ఊరేగింపు అంగరంగ వైభవంగా సాగింది. ఆ ఇళ్లల్లో కానిరాని సందడి సమైక్యాంధ్ర ఉద్యమ ప్రభావం దసరా సంబరాలపై స్పష్టంగా కన్పించింది. 65 రోజులుగా సమ్మె చేస్తున్న ఏపీ ఎన్జీఓలు దసరా సంబరాలకు దూరంగా ఉన్నారు. తాజాగా సమ్మె విరమించిన ఆర్టీసీ కార్మికులు, ఉపాధ్యాయుల ఇళ్లల్లో కూడా దసరా సందడి కానరాలేదు. దరల పెరుగుదల కూడా దసరా పండుగపై ప్రభావం చూపింది. -
విజయం చేకూర్చే దశమి
లోకంలో ఉన్న మనందరం లోహాల్లో బంగారం, సువాసన గల పుష్పాల్లో కదంబం, వనాల్లో నందనం, కట్టడాల్లో దేవేంద్రభవనం... ఇలా గొప్పవని లెక్కిస్తూ ఉంటాం. నిజానికి భారతీయ సంప్రదాయం లెక్కించమని చెప్పిందీ, ప్రాముఖ్యాన్ని గుర్తించవలసిందని చెప్పిందీ, ఇలాంటి వస్తువుల గొప్పదనాన్ని గురించి కాదు... మనందరినీ నడిపిస్తున్న కాలం గొప్పదనాన్ని గుర్తుంచుకోవలసిందని తెలియజేసింది. కాలంలో ఉండే సంవత్సరానికీ, సంవత్సరంలో కనిపించే అయనానికీ, ఋతువుకీ మాసానికీ పక్షానికీ తిథికీ వారానికీ ... అన్నింటికీ ప్రత్యేకతలుంటాయని నిరూపించినవాడు బ్రహ్మదేవుడు. అందుకే ఆయన ప్రభవలో ఉత్తరాయణంలో వసంత ఋతువులో చైత్రంలో శుద్ధపక్షంలో పాడ్యమీ తిథిలో సృష్టిని ప్రారంభించాడు. అదే తీరుగా ఏ రాక్షసుణ్ణి వధించాలన్నా ఏ యజ్ఞాన్ని ప్రారంభించాలన్నా ఏకాంలో ఏది సరైన సమయమో గమనించి ఆ నాడే ఆ పనిని చేస్తూ వచ్చారు దేవతలంతటి వారు కూడ. మనకి పండుగగా కనిపిస్తున్న విజయదశమిలో దాగిన తిథుల గొప్పదనం ఇంత అంత కాదు. ఏ పురోహితుణ్ణి అడిగినా శుద్ధ పాడ్యమినాడు పనిని ప్రారంభించవద్దనే చెప్తారు. అదే పూర్ణిమ వెళ్లిన మరునాడు అంటే కృష్ణపాడ్యమి అయితే మంచిదనే చెప్తారు. దానిక్కారణం శాస్త్రం అలాగే చెప్పింది. అయితే ఆశ్చర్యమేమంటే అమ్మ తాను విజయాన్ని సాధించడానికి శుద్ధ పాడ్యమినే మంచిరోజుగా ఎన్నుకోవడం. అందుకే దసరా నవరాత్రాలు ఆశ్వయుజ శుద్ధ పాడ్యమినాడే ప్రారంభమయ్యాయి. దశమినాటికి విజయాన్ని తెచ్చిపెట్టి అమ్మని విజయ రూపిణిగా నిలబెట్టాయి. ఈ నేపథ్యంలో ఏ తిథిలో ఏ రహస్యం దాగి ఉందో గమనిద్దాం! పాడ్యమి: అమావాస్య వెళ్లిన పాడ్యమిని శుద్ధ పాడ్యమి అంటారు. అదే పూర్ణిమ వెళ్లిన పాడ్యమి అయితే శుభకరమని పైన అనుకున్నాం. అయితే అమ్మ శుద్ధ పాడ్యమినాడే ప్రారంభించి విజయాన్ని ఎలా సాధించగలిగింది? దైవానికి ఈ నిషేధాలు లేవా? లేక అసలు ఈ తీరు ఆలోచనే సరికాదా అనిపిస్తుందా మనకి. చిత్రమేమిటంటే శుద్ధ పాడ్యమి చెడ్డ తిథి కాదు. అయితే ఆ ప్రారంభించబడిన పని- అమావాస్య వరకూ చక్కగా కొనసాగాలంటే దానిని కనీసం పూర్ణిమ వరకైనా చేస్తూనే ఉండాలి. కాబట్టి విజయసిద్ధి కావాలంటే శుద్ధ పాడ్యమి నుండి అమావాస్య (నెలరోజులు) వరకు ఆపకుండా పనిని చేయాలి. అది అమావాస్య వరకూ కొనసాగని పక్షంలో కనీసం పూర్ణిమవరకైనా నిర్విఘ్నంగా చేస్తూ ఉండాలి. ఈ విషయాన్ని ‘బాలాత్రిపుర సుందరీ దేవి’ అలంకారం మనకి చెప్తుంది. (బాలా రూపానికి పదిరోజులూ త్రిపుర రూపానికి పదిరోజులూ సుందరీ రూపానికి పదిరోజులూ కలిపి మొత్తం నెలరోజుల ఆరాధన) విదియ: పాడ్యమినాడు ప్రారంభించిన పక్షంలో వ్యక్తికి విదియనాడు- అంటే రెండవ రోజున (ద్వితీయ) మానసిక ఆందోళన తొలగుతుంది. చంద్రుడు ఆకాశంలో సన్నని గీత ఆకారంలో ఈ రోజున అర్ధచంద్రాకారంగా కనిపిస్తాడు. దీన్నే లోకంలో నెలపొడుపు, నెలబాలుడు అని పిలుస్తారు. స్త్రీలు ఈ తిథినాడు చంద్రుణ్ణి దర్శించాలని చెప్తారు పెద్దలు. దానిక్కారణం స్త్రీలకి మానసిక బలం తక్కువ ( అ- బల)కాబట్టి. అలాంటి మనోబలం స్త్రీకి కలిగిన రోజున ఇల్లంతా సిరితో నిండినట్లే. అందుకే ఈ రోజున కనిపించే అలంకారం శ్రీ మహాలక్ష్మి. తదియ: ఈ రోజు ప్రారంభించబడిన పని అక్షయంగా సాగుతుంది. అందుకే తదియ తిథినాడు అక్షయ తదియ- అక్ష తదియ- అక్ష తృతీయ లేదా అక్షయ తృతీయ అనే పండుగ వైశాఖమాసంలో వస్తుంది. వ్యక్తికి అక్షయంగా ఉండాల్సింది ధనం కాదు ఆహారం. అందుకే ఈ రోజున అన్నపూర్ణాలంకారాన్ని వేయాలన్నారు పెద్దలు. చవితి: శుద ్ధచవితి అలాగే కృష్ణ చవితి లేదా బహుళ చవితి అనేవి వినాయకునికి ఇష్టమైన తిథులు. శుద్ధ చతుర్థి విఘ్నాలని నివారించి ఐశ్వర్యాన్ని కలిగించేందుకు బహుళ చతుర్థి కష్టాలని తొలగించేందుకూ ఏర్పడ్డాయి. అందుకే ప్రతిమాసంలోని బహుళ చతుర్థినీ సంకష్ట హర చతుర్థి అని పిలుస్తారు. ఈ రోజున అమ్మకి వేసే అలంకారం గాయత్రి. ఏ మంత్రాన్ని ఉసాసించాలన్నా ముందుగా ఉపాసించి తీరాల్సింది గాయత్రినే అనే విషయాన్ని చెప్తుంది ఈ తిథి. అలా చేసిన రోజున అమ్మ ఏ మంత్రాన్నైనా పట్టిచ్చేలా చేస్తుంది సాధకునికి. పంచమి: పంచమీ పంచభూతేశీ పంచ సంఖ్యోపచారిణీ... అనే ఈ నామాలు. పంచభూతాలకీ అధిపత్ని అమ్మ అనీ, మర్రి, మామిడి, మేడి, రావి, జువ్వి అనే పంచ పల్లవాలూ అమ్మకి ప్రీతికరాలనీ పంచాగ్నుల మధ్య (నాల్గుదిక్కులా నాలుగు నిప్పుమంటలు పైన సూర్యుడు ఉండగా) తపస్సు చేసి శంకరుణ్ణి మెప్పించిన తల్లి అనీ చెప్తుంది ఈ తిథి. పంచమినాడు ప్రారంభిస్తే పని మీద పట్టుదల పెరుగుతుంది వ్యక్తికి. అందుకే ఈనాడు వేసే అలంకారం లలితాదేవి. భండాసురాది రాక్షసుల్ని వధించేవరకూ విశ్రమించలేదు ఆమె. షష్ఠి: అన్నింటికీ మూలం విద్యయే అనే విషయాన్ని తెలియజేస్తూ మూలా నక్షత్రం నాడు కనిపించే ఈ తిథి షష్ఠి. ఈరోజున సరస్వతీ అల ంకారం వేస్తారు. వ్యక్తికి అక్షయంగా ఉండాల్సింది ఆహారమైతే మూలాధారంగా ఉండాల్సింది విద్య. ఇక్కడ విద్య అంటే మనం చదువుకునే చదువు కాదు. జీవితాన్ని నడుపుకోవడానికి ఏ వృత్తి అవసరమో ఆ వృత్తికి సంబంధించిన జ్ఞానమని అర్థం. సప్తమి: సంపూర్ణ భోగాలనిచ్చే తిథి సప్తమి. అందుకే ఏడుకొండలు కలిగి ఐశ్వర్యవంతుడు, ఏడువర్ణాలు ఒకచోట కూడి (సరిగమ పదని) ప్రపంచాన్ని ఆనందమయం చేసే సంగీతం, ఏడు చక్రాలు కలిగి శరీరానికి సంపూర్ణతని కలుగజేసే కుండలినీ విధానం ఏడడుగులతో ఏడు మాటలతో జీవితాల్ని దగ్గరకి చేర్చే సప్తపది... ఇవన్నీ ఏడుతో ముడిపడినవే. ఇలాంటి ఏడుతో ముడిపడిన పక్షంలో అది నిజమైన భోగానికి ప్రతీక అని గుర్తు చేస్తూ అమ్మకి ఈ రోజున భోగరూపమైన భవానీ అలంకారాన్ని వేస్తారు. అష్టమి: ఈ తిథి కష్టాలని ఎదుర్కొనేందుకు సంకేతం. అష్టకష్టాలు, అష్ట దారిద్య్రాలు... అని వింటూంటాం. అదే సందర్భంలో అష్టైశ్యర్యాలనే మాట కూడ వింటుంటాం. ధైర్యంగా కష్టాన్ని ఎదుర్కొన్న పక్షంలో ఐశ్వర్యం మనదే అనే విషయాన్ని చెప్తుంది ఈ తిథి. దుర్గాదేవి రాక్షసునితో యుద్ధానికి సిద్ధపడుతూ కష్టాలను ఎదుర్కోదలిచింది కాబట్టే ఈ తిథి దుర్గాష్టమి అయింది. అసలు అష్టమి ఎప్పుడూ సవాళ్లని ఎదుర్కోవలసిన తిథే. నవమి: మహ త్- గొప్పదైన, నవమి- తొమ్మిదవ రోజు అనే అర్థంలో ఇది మహానవమి అవుతుంది నిజానికి. అయితే ‘మహర్నవమి’ అని ఎందుకో ప్రచారంలోకి వచ్చింది. అష్టమినాటి అర్ధరాత్రి కాలంలోనే ప్రారంభిస్తారు అర్చనని. (క్రోధం బాగా ఆవహించే ఈ రూపాన్ని ’కాళి’ అని పిలుస్తారు. కాళి అనే మాటకి కాలాన్ని అంటే ఎదుటివ్యక్తి మృత్యువుని తన అధీనంలో ఉంచుకునేది అని అర్థం. ధర్మబద్ధమైన విజయాన్ని సాధించాలంటే అది నవమీ తిథికి సొంతం. రాముడు పుట్టింది చైత్ర శుద్ధ నవమి కావడానిక్కారణం ఇదే. దశమి: ఇది పూర్ణ తిథి. శ్రీహరి ప్రధానావతరాలనెత్తింది పది సంఖ్యతోనే. లోకాన్ని రక్షిస్తూన్న దిక్కులు కూడ పది. (నాలుగు దిక్కులూ నాలుగు విదిక్కులూ పైన, కింద కలిపి పది). శరీరం నిండుగా వ్యాపించి ఉన్న వాయువులు కూడ దశ విధ వాయువులే. దశేంద్రియాలు కూడా ఈ తీరుగా కనిపించేవే. ఇది విజయ సంఖ్య. అందుకే అమ్మ తన ప్రస్థానాన్ని ప్రారంభించి పదవ తిథియైన దశమినాడు రాక్షస సంహారాన్ని చేసి లోకానికి జయాన్ని కల్గించి, ఆ జయమనేది దైవమైన తాను సాధించి లోకక్షేమం కోసం వినియోగిస్తోంది కాబట్టి దాన్ని ‘విజయ దశమి’అని వ్యవహరించింది. ఈ రోజున ఉదయం చేసే అలంకారం మహిషాసుర మర్దిని. సాయంవేళ రాజరాజేశ్వరీ అలంకారం. అమ్మకి తన సంతానపు రక్షణ అతి ముఖ్యం కాబట్టి, లోకంలో వ్యాధులు బాగా ప్రబలే వసంత శరత్కాలాల్లోనే తన ఉత్సవాలు పదిరోజులపాటూ ఆహార నియమాలని తానే నైవేద్యాల రూపంగా (ఔషధాలుగా) మన చేత చేయిస్తూ మన ఆరోగ్యాన్ని పరిరక్షిస్తుంది ఆ జగన్మాత. ‘శరద్వసంత నామానౌ లోకానం యమదంష్ట్రికే’ ఈ శరత్ వసంత ఋతువుల్లోకే యమునికి పని ఎక్కువ అని తెలియజేస్తూ ఈ కాలాన్ని యమదంష్ట్రికా కాలం (యముని కోరలు తెరిచి ఉంచే కాలం) అంది శాస్త్రం. ఆ కారణంగా ఏయే తిథుల్లో ఏ యే రూపాలతో అమ్మని ఆరాధించాలో తెలుసుకుని నిత్యం ఆ రూపంతో ఉన్న అమ్మని ధ్యానిస్తూ ఉంటే (నివేదనలు ప్రధానం కాదు నామ పారాయణ ప్రీత కాబట్టి నామ పారాయణని చేస్తూ) ఆ తల్లి మనకి మానసిక శారీరక ఆరోగ్యంతోపాటు ఐశ్వర్య సుఖ సంతోషాలనిస్తుంది. తన్నో దుర్గిః ప్రచోదయాత్! - డాక్టర్ మైలవరపు శ్రీనివాసరావు మీకు తెలుసా! వాల్మీకి రామాయణం ప్రకారం రాముడు రావణుని మీద దండు వెడలిన దినం విజయ దశమే. దుర్గ మహిషాసురుని అంతమొందించిన రోజని, అజ్ఞాతవాస పరిసమాప్తి కాగానే విజయుడు ఉత్తర గోగ్రహణం చేసి విజయం పొందిన రోజని... ఇలా విజయ దశమి జరుపుకోవడం వెనుక రకరకాల గాథలు ప్రచారంలో ఉన్నాయి. శమీ వృక్షం అగ్ని అంటే తేజస్సుకు సంకేతం. అందుకే విజయ దశమినాడు శమీ వృక్షాన్ని అంటే జమ్మి చెట్టును దర్శిస్తే పాపాలను పోగొడుతుంది. మన లోపల, బయట ఉన్న శత్రువులను నశింప చేస్తుందని ప్రతీతి. కొన్ని ప్రాంతాలలో దసరాను వీరత్వానికి సంకేతంగా భావిస్తారు. శ్రీ రాజ రాజేశ్వరీ దేవికి పెరుగన్నం నివేదిస్తే సంసారం చ ల్లగా ఉంటుందంటారు. -
విజయదశమి సందర్భంగా భద్రత కట్టుదిట్టం