wife husband
-
కలతలు లేని కాపురానికి సుధామూర్తి చెప్పిన సూపర్ టిప్స్
రాజ్యసభ ఎంపీ, ఇన్ఫోసిస్ కోఫౌండర్ నారాయణ మూర్తి సతీమణి సుధామూర్తి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ప్రముఖ విద్యావేత్త, దాత, రచయితగా పేరు తెచ్చుకున్న సుధామూర్తి తనదైన సూచనలు, సలహాలతో తన అభిమానులకు ప్రేరణగా నిలుస్తుంటారు. ఇటీవల వైవాహిక జీవితంలో భార్యాభార్తల సఖ్యతకు పాటించాల్సిన కొన్ని ముఖ్యమైన సూత్రాల గురించి తెలిపారు.సుధామూర్తి చాలా సాధారణమైన జీవితాన్ని గడుపుతారు. ఆమె మాటతీరు, కట్టూ బొట్టూ, ప్రసంగాలు యువతకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయి. ఆమె నవ దంపతులకు కూడా చాలా కీలకమైన సలహాలు ఇచ్చారు.కలహాలు లేని కాపురం ఎక్కడా ఉండదుభార్యభర్తలమధ్య తేడాలు, అభిప్రాయభేదాలు రాకుండా ఉండవు. వస్తాయి. కానీ వాటిని చిలికి చిలికి గాలి వానలా మారకుండా ఇరువురూ జాగ్రత్త పడాలి. అసలు కలహాలు,కలతలు లేని కాపురాలు ఎక్కడ ఉంటాయి. తగాదాలు పడని వాళ్లు భార్యభర్తలే కాదు అంటూ సుధామూర్తి తెలిపారు. కానీ ఒకరు గట్టిగా మాట్లాడినపుడు, ఆగ్రహంగా ఉన్నపుడు ఇంకొకరు తగ్గాలి. ఇద్దరూ అరుచుకుంటూ ఉంటే సమస్య పరిష్కారం కాదు. శాంతి, సహనం అనేది ఇద్దరి మధ్య ఉండాలి. ఒకర్నొకరు గౌరవించుకోవాలిఒకళ్లు చెప్పింది మరొకరు వినాలి. ఒకరి విజ్ఞానాన్ని మరొకరు పంచుకోవాలి. ఒకరి అభిప్రాయాల్ని ఒకరు గౌరవించుకోవాలి.థ్యాంక్స్ చెప్పుకోవడం, ప్రశంసించుకోవడం ద్వారా ఇద్దరి మధ్యా సాన్నిహిత్యం, ప్రేమ పెరుగుతుంది. భాగస్వామి చేసే చిన్న పనులను గుర్తించి మెచ్చుకోవాలని సుధా మూర్తి సూచించారు. కొన్ని విషయాల్లో ఎవరు ఒకరు రాజీ పడాలి. మార్పునకు సిద్ధంగా ఉండాలి. రిలేషన్ షిప్ కోసం కొన్ని విషయాల్లో రాజీ పడడం దీర్ఘకాలిక సంతోషాల్ని పంచుతుంది.బాధ్యలు బరువులు పంచుకోవాలిఇంట్లో, జీవితంలో బాధ్యతలను, బరువులను పంచుకోవడం చాలా ముఖ్యం. జీవితం అంటేనే కష్టనష్టాల పయనం. ఎవ్వరమూ పర్ఫెక్ట్ కాదు. లోటుపాట్లను గమనించుకొని అర్థం చేసుకొనిముందుకు సాగాలి. కష్టనష్టాలను, బరువు బాధ్యతలను సమానంగా పంచుకోవడంలోనే అసలైన భార్యభర్తల విలువ తెలుస్తుంది. అబ్బాయిలకో సలహాముఖ్యంగా ఈతరం అబ్బాయిలకు చెప్పేది ఒకటే. వంటగదిలో భార్యకు సహాయం చేయడం అనేది చాలా ముఖ్యం. జీవితభాగస్వామి కష్టాల్ని, బాధ్యతల్ని పంచుకోవడం ద్వారా టీం వర్క్,భాగస్వామ్య అనేభావాలను పెంపొదిస్తుంది. ఆధునిక ప్రేమ అనే అంశంపై ఏర్నాటు చేసిన ఒక కాంక్లేవ్లో సుధామూర్తి దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్బంగానే ఆమె యువ జంటలకు కొన్ని సూచనలు, సలహాలు ఇచ్చారు. దంపతులుగా తామూ ఈ విషయాలను పాటించామని, ఇవే తమ సక్సెస్ మంత్రా అని సుధామూర్తి వివరించారు. -
UK YouTuber Couple: ఆటోప్రయాణంలో అడుగడుగునా ఆనందమే వైరల్
ఇంగ్లాండ్కు చెందిన లియామ్, జావిన్ దంపతులకు మన దేశం అంటే చాలా ఇష్టం. ‘దోజ్ హ్యాపీ డేస్’ పేరుతో యూట్యూబ్ చానల్ నడుపుతున్న ఈ దంపతులు మన దేశానికి వచ్చారు. వారి స్థాయికి ఏ ఫైవ్స్టార్ హోటల్లోనో ఉండవచ్చు. ఖరీదైన కారులో ప్రయాణించవచ్చు. అలా కాకుండా ఈ డైనమిక్ ద్వయం ఒక ఆటోరిక్షాలో అమృత్సర్ నుంచి తమిళనాడు వరకు ఎన్నో ప్రాంతాలు పర్యటించింది. ఆటోకు ‘పీట్’ అని పేరు పెట్టి అందంగా అలంకరించారు. ఆటోడ్రైవింగ్ నేర్చుకున్నారు. చెన్నైలోని ట్రాఫిక్ ప్రాంతాల్లో డ్రైవింగ్ ప్రాక్టీస్ చేశారు. ‘ఫరవాలేదు. ఇక మనం ముందుకు వెళ్లవచ్చు’ అని నమ్మకం వచ్చిన తరువాతే ప్రయాణం ప్రారంభించారు. తమ ఆటో ప్రయాణంలో చెప్పలేనంత సందడి ఉన్న సంతలను, ధ్యానముద్రతో ఉన్న ప్రశాంత దేవాలయాలను, విభిన్న విశ్వాసాలు, ఆచారాల సామరస్య దృశ్యాలను, బాటసారులను, చెట్టుచేమను చూస్తూ ఎంజాయ్ చేశారు. నోరూరించే వంటకాలను ఆస్వాదించారు. -
భార్యాభర్తల మధ్య గొడవ! భర్త ఒక్కసారిగా..
పటాన్చెరు: భార్యాభర్తల మధ్య గొడవ జరగడంతో మనస్తాపం చెందిన భర్త ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన అమీన్పూర్ పోలీస్స్టేషన్ పరిధిలో ఆదివారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. అమీన్పూర్ పరిధిలోని పటేల్గూడ బీఎస్ఆర్ కాలనీకి చెందిన రాజుల ధర్మాంజనేయులు (38) పటాన్చెరు మండలం పాశంమైలారం పారిశ్రామిక వాడలోని ఓ ప్రైవేట్ కంపెనీలో కెమికల్ ఇంజనీర్గా పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ప్రస్తుతం వారు ఉంటున్న ఇంటి మొదటి అంతస్తు నిర్మాణ ఖర్చుల విషయంలో భార్యాభర్తలు గొడవపడ్డారు. ఆదివారం ఉదయం డ్యూటీ నుంచి వచ్చిన ధర్మాంజనేయులు పిల్లల బెడ్రూంలోకి వెళ్లి ఫ్యాన్కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. గది నుంచి ధర్మాంజనేయులు ఎంతసేపటికీ బయటకు రాకపోవడంతో స్థానికుల సహకారంతో కుటుంబ సభ్యులు తలుపులు తీసి చూడగా ఉరి వేసుకొని వేలాడుతూ కనిపించాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పటాన్చెరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుడి భార్య రాజుల నాగమణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com ఇవి చదవండి: వివాహానికై వచ్చి ఆర్మీ జవాన్ తీవ్ర నిర్ణయం! అసలు కారణాలేంటి? -
భర్త విడాకులు నోటీసు ఇచ్చారని..
తిరుపతి క్రైం: భర్త విడాకులు నోటీస్ ఇచ్చారని ఓ మహిళ మనస్తాపానికి గురై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడి, చికిత్స పొందుతూ మృతి చెందిన సంఘటన మంగళవారం చోటు చేసుకుంది. అలిపిరి సీఐ అబ్బన్న కథనం మేరకు.. శ్రీనివాసమంగాపురం గ్రామానికి చెందిన భారతి(45)కు నాగలాపురం గ్రామానికి చెందిన తులసీరామ్తో 26 సంవత్సరాల క్రితం వివాహమైంది. వీరికి నికిత(15) కుమార్తె ఉంది. తులసీరామ్ టీటీడీలో అసిస్టెంట్ షరాఫ్గా పని చేస్తున్నారు. తులసీరామ్కు మరో మహిళతో వివాహేతర సంబంధం ఉందని వీరిద్దరి మధ్య తరచూ గొడవలు జరిగేవి. గత ఐదేళ్లుగా వీరిద్దరూ దూరంగా ఉండేవారు. భారతి కూతురు నికితతో కలిసి అలిపిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని వినాయకనగర్ సీ టైప్ క్వార్టర్స్లో నివాసం ఉండేది. అయితే ఇటీవల తులసీరామ్ విడాకులు కావాలంటూ భారతికి నోటీసులు పంపించడంతో ఆమె తీవ్రంగా మనస్తాపానికి గురైంది. భర్త మేనమామ గోవిందరాజులు విడాకులు ఇవ్వాలని బలవంతం చేయడంతో ఏం చేయాలో తెలియకుండా గత నెల 31వ తేదీన ఇంట్లో ఎవరూ లేని సమయంలో కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. స్థానికులు గుర్తించి, ఆమెను రుయాస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుజామున మృతి చెందింది. మృతురాలు తల్లి లక్ష్మీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, భర్త తులసీరామ్తోపాటు వారి మేనమామను కూడా అరెస్టు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టమ్ నిమిత్తం ఎస్వీ మెడికల్ కళాశాలకు తరలించారు. ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
పెళ్లయిన నెల రోజులకే విభేదాలు.. కలిసి ఉండలేమంటూ కోర్టు మెట్లు
సాక్షి, పుట్టపర్తి: వందేళ్లు కలసి బతకాల్సిన వారు చిన్నపాటి కారణాలతో విడిపోతున్నారు. పెళ్లయిన ఆరు రోజుల నుంచి ఆర్నెల్లు గడవకముందే భాగస్వామి అర్ధం కావడం లేదనో, అర్ధం చేసుకోవడం లేదనో విడిపోవాలనుకుంటున్నారు. జీవితాంతం కలిసి ఉండే బలమైన బంధమే దాంపత్య జీవితం అని గుర్తించలేకపోతున్నారు. ఒకరి భావాలను ఒకరు అర్ధం చేసుకోకుండా తమ ఆలోచనల్ని గౌరవించడం లేదంటూ వేదనకు గురవుతున్నారు. ఇద్దరి మధ్య విభేదాల కారణంగా రెండు కుటుంబాల్లో మనస్పర్థలు వస్తున్నాయి. సర్దుకుపోతే ఎలాంటి సమస్య ఉండదని తెలిసినా.. విడాకుల వరకూ వెళ్తున్నారు. ● పుట్టపర్తి మున్సిపాలిటీ పరిధిలోని ప్రశాంతి గ్రామ్కు చెందిన 24 ఏళ్ల యువతికి పెనుకొండకు చెందిన ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్తో గతేడాది వివాహమైంది. నెల రోజుల వ్యవధిలోనే దంపతుల మధ్య విభేదాలు మొదలయ్యాయి. ఈ ఏడాది జనవరిలో పోలీస్ మెట్లు ఎక్కారు. ఇప్పటి వరకూ సమస్య తెగలేదు. పెద్ద మనుషుల సమక్షంలో సర్దిజెప్పినా వినలేదు. పోలీస్స్టేషన్లు, కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. ● జగరాజుపల్లికి చెందిన 36 ఏళ్ల వ్యక్తికి అదే గ్రామానికి చెందిన మహిళతో పదేళ్ల క్రితం వివాహమైంది. పెళ్లయిన మూడేళ్ల నుంచి గొడవలు ప్రారంభమయ్యాయి. ఆరేళ్లుగా పోలీస్స్టేషన్లు, కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. విడాకులు తీసుకోలేదు. పెద్ద మనుషుల సమక్షంలో కలిసి జీవిస్తామని వెళ్లినా తిరిగి వారం రోజులకే విడిపోయారు. వారి మధ్యలో ఇద్దరు కుమారులు తల్లిదండ్రుల ప్రేమకు దూరం అవుతున్నారు. ● గోరంట్లకు చెందిన డిప్లొమా విద్యార్థికి బాగేపల్లికి చెందిన మెకానిక్తో ఏడాది క్రితం వివాహమైంది. మూడు నెలలకే గొడవలు మొదలయ్యాయి. అమ్మాయి పుట్టింటికి చేరింది. సర్దిజెప్పినా వినలేదు. తర్వాత అమ్మాయి ఇంటికే అబ్బాయి వచ్చాడు. నెల రోజుల తర్వాత పంచాయితీ మొదటికొచ్చింది. దీంతో పోలీసులను ఆశ్రయించారు. దంపతుల మధ్య సమస్య కారణంగా ఇరు కుటుంబాల్లో గందరగోళం నెలకొంది. అహమే కారణమా? ఏడడుగులు నడిచి ఏడాది గడవక ముందే ఎన్నో జంటలు విడిపోతున్నాయి. ఎన్నో ఆశలు పెట్టుకున్న వారి తల్లిదండ్రులకు కన్నీరు మిగిలిస్తున్నారు. కొందరు తల్లిదండ్రులను పోషించకపోవడం.. మరికొందరు తాగుడుకు బానిసై కుటుంబాలకు దూరంగా ఉంటున్నారు. మనుషుల మధ్య అహంతోనే ప్రతి చిన్న సమస్యనూ భూతద్దంలో చూసి రచ్చకెక్కుతున్నట్లు స్పష్టం అవుతోంది. ప్రతి సోమవారం నిర్వహించే పోలీసు స్పందన కార్యక్రమంలో భార్యభర్తల కేసులు పెరిగిపోతున్నాయి. వచ్చే పిటిషన్లలో మూడింట రెండోవంతు ఉంటున్నాయి. ఆధిపత్య ధోరణితోనే సమస్యలు కుటుంబంలో భార్యాభర్తలు ఇద్దరూ సమానమే. బండికి రెండు చక్రాలు సమానంగా.. సరిగ్గా ఉంటేనే ముందుకు వెళ్తుంది. అలా కాకుండా ఒకరు ఎక్కువ.. మరొకరు తక్కువ అనే ధోరణి ప్రదర్శిస్తుండటంతో గొడవలు పెరుగుతున్నాయి. తాము చెప్పిందే భార్య వినాలని కొంతమంది భర్తలు, తాను చెప్పినట్లే చేయాలని భార్యలు ఆధిపత్యం ప్రదర్శిస్తుంటారు. ఆమె మాటను ఆయన గౌరవించకపోవడం, ఆయనకు ఆమె విలువ ఇవ్వకపోవడంతోనే కాపురంలో కలతలు పెరుగుతున్నాయి. మొండి వైఖరి.. క్షమాపణ కోరితే పోయేదేమీ లేదు దంపతులు మొండి వైఖరి వీడి సామరస్యంగా మాట్లాడుకుంటే నాలుగు గోడల మధ్యనే సమస్యకు పరిష్కారం లభిస్తుంది. ఎదుటి వారిపై ఆధిపత్యం ప్రదర్శించాలనే ధోరణి మానేయాలి. జీతాలు, హోదాలు ఎన్ని ఉన్నా కుటుంబం ముఖ్యమనే భావనతో మెలగాలి. దంపతుల మధ్య తగాదా వస్తే మూడో మనిషి దగ్గరకు వెళ్లకుండా ఉంటే మంచిది. తప్పెవరిదో తెలిస్తే క్షమాపణ కోరితే పోయేదేమీ లేదు. భార్యాభర్తల మధ్య విభేదాల కారణంగా పిల్లలు అనాథలుగా మారుతారు. ఇలాంటి పరిస్థితులు రాకుండా జాగ్రత్తగా అవగాహనతో ముందుకెళ్తే మంచిది. – ఎస్వీ మాధవ్రెడ్డి, ఎస్పీ -
అర్థం చేసుకుంటేనే బంధంలో ఆనందం
రాయచోటిటౌన్ : భార్యభర్తలు ఇద్దరు ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటేనే బంధం ఆనందమయమని, సంసారం సంతోషంగా సాగుతుందని అన్నమయ్యజిల్లా ఎస్పీ గంగాధర్ రావు అన్నారు. తన భర్త ప్రతి రోజు వేధిస్తున్నాడని ఒక మహిళ జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసింది. భర్త అమ్మ నాన్నలు, ఆడబిడ్డలు అందరూ వేధిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొంది. దీనిపై దిశ పోలీసులను ఆశ్రయించింది. దిశ సీఐ చంద్రశేఖర్ శనివారం జిల్లా ఎస్పీతో కలసి భార్య భర్తలను ఒకే వేదికపై కుర్చోపెట్టి మాట్లాడించారు. చివరికి వారి తప్పులను తెలుసుకొనేలా తెలియచెప్పారు. కుటుంబ వ్యవస్థ చాలా గొప్పదని దీనిని అర్థం చేసుకొంటేనే కాపురం సజావుగా సాగుతుందని విడమరిచి చెప్పారు. పూర్తిగా అర్థం చేసుకొన్న తరువాత ఇద్దరు సంతోషంగా ఇంటికి వెళ్లారు. వీరిని జిల్లా ఎస్పీ అభినందించారు. -
బ్లాక్ మెయిలింగ్: భర్త సంసారానికి పనికిరాడని తెలిసినా కూడా!
దిశ పోలీస్స్టేషన్లతో కొత్త దశ మొదలైంది. చిన్నారులు, మహిళల సంరక్షణే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం వీటిని ఏర్పాటు చేసింది. ఇవి ఎన్నో సమస్యలు పరిష్కరిస్తూ సత్ఫలితాలు సాధిస్తున్నాయి. ముఖ్యంగా ఆడపిల్లల కాపురాలను చక్కదిద్దుతున్నాయి. కడప అర్బన్ : సమాజంలో భార్యాభర్తల అన్యోన్యతతో కుటుంబ అభివృద్ధి, తద్వారా పిల్లల శ్రేయస్సు, వారి ద్వారా సమాజాభివృద్ధి సుసాధ్యమవుతుంది. వారి మధ్య కలతలు కాపురంలో చిచ్చు రేపుతున్నాయి. గ్రామీణ స్థాయి నుంచి పట్టణ, నగర స్థాయికి వచ్చిన వారు తాము చేస్తున్న వ్యాపారాలు, ఉద్యోగాల ‘బిజీ లైఫ్’తో తమ పిల్లల బాగోగులను పట్టించుకునే స్థితిలో వుండరు. దీంతో పిల్లలు శారీరక పెరుగుదల, ఉన్నత విద్యను అభ్యసించి ఉద్యోగాలు సాధిస్తున్నారు. కానీ తమ దైనందిన జీవితంలో తల్లిదండ్రులు, పెద్దలు, గురువులను ఎలా గౌరవించాలి. తాను జీవితాంతం తోడు నీడగా వుండాల్సిన భార్య, భర్త స్థానాలు ఎలా వుండాలి? అనే విధానాలపై ‘మానసిక పరిపక్వత’ చెందక అవగాహన రాహిత్యంతో ‘సంసార జీవితాల’ను దూరం చేసుకుంటున్నారు. పూర్వకాలంలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఎక్కువగా ఉమ్మడి కుటుంబాలు వుండేవి. అవ్వా,తాతలు తమ పిల్లలకు, మనువలు, మనువరాళ్లకు మంచి, చెడ్డా, కుటుంబ జీవన విధానం, సమాజంలో మెలిగే పద్ధతులను నేర్పించేవారు. రానురాను ఆ విధానంలో వచ్చిన మార్పులతో చిన్నచిన్న కుటుంబాలుగా విడిపోయి, జీవన విధానాలను నగరజీవితాలుగా మార్చుకుని భర్త,భార్య, పిల్లలుగా మారిపోయి ఆర్థికంగా మెరుగు పడాలనే తాపత్రయంలో పడిపోయారు. కాలక్రమేణ వారి పిల్లల కార్పొరేట్ చదువులపై వున్న శ్రద్ధ, వారి క్రమశిక్షణతో జీవితాన్ని సాగించేలా చూడాలనే విధానం సన్నగిల్లిపోయింది. అంతేగాక ఆడ,మగ పిల్లలను చిన్నతనం నుంచే వారికి ఇచ్చే స్వేచ్ఛా, స్వాతంత్య్రాలతో పెరిగి పెద్దవాళ్లయిన తరువాత కూడా అదే విధానం అవలంబించడం వల్ల జీవితగమనంలో విభేదాలు తలెత్తుతున్నాయి. సమస్యల చుట్టూ పరిభ్రమిస్తున్న జీవితాలు ► ఆధునిక సాంకేతికతతో ‘సెల్ఫోన్’ లేకుండా చిన్న పిల్లాడి నుంచి పెద్దల వరకు వుండలేకపోతున్నారు. ‘సెల్ఫోన్’ దైనందిన జీవితంలో భాగమవడంతోపాటు, వ్యసనంగా మారింది. ‘దిశ’ మహిళా అప్గ్రేడ్ పోలీస్స్టేషన్ వారు భార్యాభర్తల మధ్య ఏర్పడుతున్న కలతలకు కారణాలను తెలుసుకుని ‘కౌన్సెలింగ్’ అనే బ్రహ్మాస్త్రంతో తొలగించేందుకు తమ వంతుగా కృషి చేస్తున్నారు. ఈ విధానం ద్వారా చాలా కేసుల్లో విజయవంతంగా ముందుకు వెళుతున్నారు. ► 18 ఏళ్ల వయసు రాగానే, పూర్తవకముందే కొందరు ఆడపిల్లలు తల్లిదండ్రులను సైతం లెక్కచేయకుండా తాను ప్రేమించిన యువకుడే సర్వస్వం అంటూ ముందుకు వచ్చి పోలీసులను ఆశ్రయిస్తున్నారు. ఎంత త్వరగా జీవితాన్ని పంచుకోవాలనుకుంటున్నారో, వీరిలో కొందరు అంతే త్వరగా విడిపోవడానికి సిద్ధపడుతున్నారు. ► కొందరు తమ సెల్ఫోన్ల ద్వారా ఇంటిలో పడకగది నుంచి స్నానాల గదుల వరకు ఒకరిపై మరొకరు నమ్మకం లేక వీడియోలను తీసుకుంటూ వారి సంసారాన్ని వారే నాశనం చేసుకుంటున్నారు. ► విద్యావంతులైన వారే కొందరు ఆడపిల్లలు తమ వైవాహిక జీవితాన్ని ఆరు నెలలకు గానీ, ఏడాది పూర్తవక ముందే భర్త సంసారానికి పనికిరాడని నిర్ణయించుకుంటున్నారు. ‘కౌన్సెలింగ్ పీరియడ్’ రెండు నెలల కాలం పూర్తవక ముందే ‘కక్షసాధింపు’ ధోరణిలో ప్రవర్తిస్తూ విడిపోతున్నారు. కడప ‘దిశ’ పోలీస్ స్టేషన్ ద్వారా అందిస్తున్న సేవలు ► కడప దిశ పోలీస్స్టేషన్కు నేరుగాగానీ, జిల్లా ఎస్పీ నిర్వహించే ‘స్పందన’ ద్వారా వచ్చే భార్యాభర్తల, మహిళల, చిన్నపిల్లల సమస్యలు, నేరాలకు సంబంధించిన ఫిర్యాదులను డీఎస్పీ స్థాయి అధికారి దృష్టికి వస్తాయి. ఆయన ఆదేశాల మేరకు మొదట బాధితుల సమస్యలను తెలుసుకుంటారు. భార్యాభర్తల మధ్య ప్రాథమికంగా మనస్పర్థలను తొలగించేందుకు ఇక్కడి సిబ్బంది ప్రయత్నిస్తారు. లేదంటే మొదటి రెండు నెలలు ‘కూలింగ్ పీరియడ్’లో మూడు లేదా ఐదు కౌన్సెలింగ్లను నిర్వహించి వారి మధ్య విభేదాలను తొలగించి సజావుగా కాపురం చేసుకునేలా ప్రయత్నిస్తారు. కలువలేని పరిస్థితుల్లో వారి ఇష్ట ప్రకారం ఎఫ్.ఐ.ఆర్లను తమ పరిధిలో గానీ, ఆయా పోలీస్స్టేషన్ల ద్వారా నమోదు చేయిస్తారు. తరువాత న్యాయస్థానాలను ఆశ్రయించవచ్చు. ఈ కౌన్సెలింగ్లను ప్రతి మంగళవారం, శనివారం నిర్వహిస్తారు. ఈ కౌన్సెలింగ్కు భార్యాభర్తలను విడివిడిగా పోలీసు అధికారి, మనస్తత్వశాస్త్ర నిపుణులు, న్యాయవాదులు, ఎన్జీఓ సంఘానికి చెందిన సభ్యుల సమక్షంలో విచారణ చేస్తారు. తరువాత ఇద్దరిని కలిపి విచారణ చేసి విడిపోతే కష్ట,నష్టాలు, కలిసుంటే జీవితాంతం సంసారం సాఫీగా సాగుతుందని ‘పోస్ట్ మేరిటల్ కౌన్సెలింగ్’ విధానం ద్వారా వివరిస్తారు. గతంలో ప్రతి మంగళవారం, శనివారం కౌన్సెలింగ్ను ఐదు జంటలలోపు నిర్వహించేవారు. ప్రస్తుతం 10 నుంచి 15 జంటలకు నిర్వహించాల్సి వస్తోంది. ► కొందరు గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారు తమ ఆడపిల్లలకు తక్కువ వయసులోనే వివాహం చేస్తుంటారు. వారికి వైవాహిక జీవితంపై అవగాహన వుండదు. అలాంటి జంటలకు కౌన్సెలింగ్ ద్వారా వారి మధ్య మనస్పర్థలు తొలగించి, వారిని ఒక్కటిగా చేసి పంపిస్తున్నారు. ► ఉద్యోగం వుంటే ఆర్థిక స్వేచ్ఛ కలిగి వుంటుందని కొందరు మహిళలు గానీ, పురుషులుగానీ వివాహేతర సంబంధాలు, రెండో వివాహంపై మొగ్గు చూపుతూ సంసారాన్ని నాశనం చేసుకుంటున్నారు. అలాంటి వారిలో కొందరిని కౌన్సెలింగ్ నిర్వహించడం ద్వారా కలుపుతున్నారు. కొందరు ఎన్ని కౌన్సెలింగ్లు నిర్వహించినా అవగాహన రాహిత్యంతో దూరంగానే వుంటున్నారు. మచ్చుకుకొన్ని.. ► పెద్దల సమక్షంలో వివాహం చేసుకున్నాక తన భర్త సంసారానికి పనికిరాడని తెలుసుకుని తల్లిదండ్రులకు చెప్పలేక తనలోనే కుమిలిపోయి నరకం అనుభవించింది. డబ్బుల కోసం తన భర్త మరో వివాహానికి సిద్ధపడితే పోలీసులను ఆశ్రయించింది. దీంతో పోలీసులు వాస్తవాలను విచారణ చేసి వారు విడిపోతేనే మంచిదని భావించారు. ► తనను ప్రేమించిన సమయంలో ఫొటోలు తీసుకున్న యువతిని, వేరే వివాహం చేసుకున్న తరువాత ఆమె ఫొటోలను మార్ఫింగ్ చేసి న్యూడ్ ఫొటోలుగా మార్చి ‘బ్లాక్ మెయిలింగ్’కు పాల్పడిన ఓ యువకుడిని పిలిపించి, సదరు న్యూడ్ ఫొటోలను తొలగించి, చట్టపరమైన చర్యలు తీసుకుని బాధితురాలికి న్యాయం జరిగేలా కృషి చేశారు. ► ఓ తొమ్మిదినెలల పసిబాబును, భార్యను మనస్పర్థలతో దూరం చేసుకున్న భర్తను ఒకేఒక్క కౌన్సెలింగ్ ద్వారా వారిని కలిపి పంపించారు. ► కొందరు భర్తలు మద్యం, ఇతర చెడు వ్యసనాలకు బానిసలుగా మారి వారి జీవితాలను ఛిన్నాభిన్నం చేసుకుంటున్నారు. వారికి కౌన్సెలింగ్ నిర్వహించడం, అవసరమైతే ‘డీ ఆడిక్షన్’ సెంటర్లకు పంపించి వారిని కలిపేందుకు తమ వంతుగా కృషి చేస్తున్నారు. కౌన్సెలింగ్ ద్వారానే మనస్పర్థలకు చెక్ భార్యాభర్తల మధ్య ఏర్పడిన విభేదాలను తొలగించేందుకు పోలీసు అధికారులు, సిబ్బంది సహకారంతో కృషి చేస్తున్నాం. ప్రతి మంగళ, శనివారాలలో ‘కౌన్సెలింగ్’ను నిర్వహించి వారి మధ్య అభిప్రాయ భేదాలను తొలగించి న్యాయం జరిగేలా చూస్తున్నాం. మహిళలు, చిన్నారుల పట్ల జరిగే నేరాల నియంత్రణకు అహర్నిశలు పనిచేస్తున్నాం. ‘దిశ’ యాప్ను జిల్లా వ్యాప్తంగా మహిళల చేత డౌన్లోడ్ చేయించాం. ఆపద సమయాలలో ఆదుకుంటున్నాం. – ఎస్.రమాకాంత్, కడప ‘దిశ’ డీఎస్పీ -
Wife - Husband: క్షణికావేశంలో ఆలుమగల బలవన్మరణం
కర్నూలు/ఆలూరు/దేవనకొండ: జీవితాంతం తోడునీడగా ఉంటామని బాస చేసి ఒక్కటైన దంపతులు బలవంతంగా ఈ లోకాన్ని వీడి వెళ్లారు. ఏడు నెలల కుమారుడిని ఒంటరి వాడిని చేశారు. దేవనకొండ మండలం గుడిమిరాళ్ళ గ్రామానికి చెందిన రంగనాయకులు (28) ఆర్ఎంపీగా పనిచేస్తున్నాడు. ఈయనకు పత్తికొండ మండల చిన్నహుల్తి గ్రామానికి చెందిన లత (25)తో రెండేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఏడు నెలల కుమారుడు ఉన్నాడు. రెండు రోజుల క్రితం రంగనాయకులు ఆస్తి విషయంలో భార్యతో గొడవ పడడంతో ఆమె క్షణికావేశానికి గురై శనివారం ఇంట్లో పురుగు మందు తాగి అపస్మారక స్థితికి చేరుకుంది. కర్నూలు ప్రభుత్వాసుపత్రిలో చేర్పించి చికిత్స అందించినా ఫలితం లేక ఆమె అదే రోజు అర్ధరాత్రి మృతి చెందింది. భార్య మరణం తట్టుకోలేక భర్త రంగనాయకులు మనస్తాపానికి గురై ఆదివారం తెల్లవారుజామున కర్నూలులోని కోట్ల రైల్వే స్టేషన్కు వెళ్లి రైలు పట్టాలపై పడుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రమాదంలో తలమొండెం వేర్వేరయ్యాయి. అంతకుముందు తన దగ్గర ఉన్న రూ.50వేలు సోదరుడు బాలమురళికి అప్పజెప్పాడు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు రైల్వే ఎస్ఐ శ్రీనివాసరావు తన సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకుని పరిసరాలను పరిశీలించారు. మృతదేహం పక్కనే పడి ఉన్న సెల్ఫోన్ ఆధారంగా చిరునామా గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారాన్ని చేరవేశారు. మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రిలోని మార్చురీ కేంద్రానికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. రంగనాయకులకు సంబంధించి రైల్వే పోలీసులు, లతకు సంబంధించి దేవనకొండ పోలీసులు కేసు నమోదు చేశారు. -
భర్తపై కిరోసిన్ పోసి నిప్పు అంటించిన భార్య..
తిరువొత్తియూరు: దిండివనంలో మద్యం మత్తులో వేధింపులు ఇస్తున్న భర్తపై కిరోసిన్ పోసి నిప్పు అంటించి హత్య చేసిన భార్యకు దిండివనం కోర్టు యావజీవ కారాగార శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది. విల్లుపురం జిల్లా రెడ్డివనం టీవీ నగర్లో నివాసం ఉంటున్న దక్షిణామూర్తి కుమారుడు సేదు అలియాస్ సేదుపతి (23) పుదుచ్చేరిలో ఉన్న పంచర్ దుకాణంలో పనిచేస్తున్నాడు. అదే ప్రాంతానికి చెందిన మురుగవేణి (19)ని 2019లో ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరు గుడిసె ఇంటిలో నివాసం ఉంటున్నాడు. 2019 ఆగస్టు ఒకటో తేదీన ఇంట్లో నిద్రిస్తున్న సేతుపతి గుడిసెకు నిప్పు అంటుకోవడంతో మృతిచెందాడు. ఫిర్యాదు మేరకు దిండివనం పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఇంటికి నిప్పు అంటుకున్న సమయంలో ఇంటి బయట తలుపు వేసి ఉన్నట్లు తెలిసింది. దీంతో మురగవేని వద్ద పోలీసులు విచారణ చేయగా మద్యం మత్తులో తరచూ అతను వేధిస్తుండడంతో కిరోసిన్ పోసి ఇంటికి నిప్పు అంటించినట్లు ఒప్పుకుంది. దీంతో ఆమెను పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసు దిండివనం అదనపు జిల్లా సెసెన్స్ కోర్టులో విచారణ జరిగింది. నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి రహమాన్ మురుగవేనికి యావజ్జీవ శిక్ష, రూ. 5 వేల జరిమానా విధిస్తూ శుక్రవారం తీర్పు ఇచ్చారు. మురుగవేనిని కడలూరు సెంట్రల్ జైలుకు తరలించారు. -
నా మొగుడు ఏం చేసినా పర్లేదు.. అమ్మాయిలతో తిరిగినా నాకు కావాల్సింది అదే!
వాషింగ్టన్: భార్యాభర్తల బంధం అన్నింటికంటే దృఢమైంది అంటారు. పెళ్లయ్యాక పతియే తన సర్వస్వంగా భావిస్తుంటారు మహిళలు. ఒకరిపైఒకరు ప్రేమానురాగాలు చూపుతూ ఆనందంగా జీవిస్తారు. వైవాహిక బంధంలో నిజాయితీ, విధేయతతో ఉండాలనుకుంటారు. అలాంటిది తన భర్త మరో మహిళలో సన్నిహితంగా మెలిగితే? మరొకరితో శారీరక సంబంధం పెట్టుకుంటే? ఏ భార్య అయినా భరిస్తుందా? ఆమె కోపం ఎలా ఉంటుందో కూడా ఉహించుకోలేం.. కానీ అమెరికాకు చెందిన ఓ మహిళ మాత్రం ఇందుకు పూర్తి భిన్నం. తన భర్తను ఇతర మహిళలతో సన్నిహితంగా ఉండమని ఆమే ప్రోత్సహిస్తోంది. వాళ్లతో శారీరకంగా కలిసినా పర్వాలేదు అంటోంది. ఆయన ఎవరితో వెళ్లినా, ఏం చేసినా సరే.. సంతోషంగా ఉంటే చాలట. ఆయన హ్యాపీగా ఉంటే తనకు అదే చాలు అని ఆనందంగా చెబుతోంది. ఇది భార్యగా తన బాధ్యత అంటోంది. ఈ మాటలు విన్నాక ఎవరికైనా ఏమనిపిస్తుంది చెప్పండి. ఈరోజుల్లో ఇలాంటి భార్యలు కూడా ఉంటారా? అని అనుకుంటారు కదా.. భర్తకు ఇంత ఫ్రీడం ఇచ్చి ఈమె పేరు మోనికా హల్ట్. వయసు 37 ఏళ్లు. భర్త పేరు జాన్. పెళ్లయ్యాక ఇంటికే పరిమితమైంది. రోజంతా ఇంటిపనులే చేస్తూ తీరకలేకుండా ఉంటోంది. జాన్కు ఇష్టమైన వంటలు చేసిపెట్టడం, ఇల్లు శుభ్రం చేసుకోవడం, బట్టలు ఉతకడం, ఇతర పనులు చేసుకోవడమే ఈమె దినచర్య. అందుకే జాన్తో బయటకు వెళ్లే సమయం కూడా ఉండదు. ఈ కారణంగానే భర్తను ఇష్టమైన వారితో గడపమని ఆమే స్వయంగా చెబుతోంది. జాన్కు ఏదీ సంతోషం అయితే అది నిరభ్యంతరంగా చేసుకోవచ్చని ప్రోత్సహిస్తోంది. అతను ఇతర మహిళలతో శృంగారంలో పాల్గొన్నా తాను అసలు బాధపడనని అంటోంది. అలాగే తాను రోజు ఏ దుస్తులు ధరించాలో కూడా భర్తే డిసైడ్ చేస్తాడని, ఆయన చెప్పింది తూచ తప్పకుండా పాటిస్తాని మోనికా పేర్కొంది. సెక్సీ, స్పోర్టీ డ్రస్సులంటే తన భర్తకు ఇష్టమని తాను ఇంట్లో అవే ధరిస్తానని వివరించింది. తాను మేకప్ వేసుకుంటే జాన్కు అస్సలు నచ్చదని, అందుకే నేచురల్గానే ఉంటానంటోంది. భర్తలు వేరే వాళ్లతో మాట్లాడితేనే ఊరుకోని మహిళలు ఉన్న ఈరోజుల్లో ఇలాంటి భార్య దొరకడం నిజంగా జాన్ అదృష్టం అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. చదవండి: వామ్మో.. ప్రపంచంలోనే అతిపెద్ద పాము.. చూస్తే గుండె గుభేల్..! -
ఫిలిప్పీన్స్లో పంజాబీ దంపతుల దారుణ హత్య.. ఇంట్లోకి వెళ్లి కాల్పులు..
మనీలా: పంజాబ్కు చెందిన దంపతులు ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలో దారుణ హత్యకు గురయ్యారు. శనివారం రాత్రి ఈ ఘటన జరిగింది. దుండగుడు తుపాకీతో ఇంట్లోకి ప్రవేశించి కాల్పులు జరిపి ఇద్దరినీ హతమార్చాడు. హత్యకు గురైన భార్యాభర్తలను సుఖ్వీందర్ సింగ్(41), కిరణ్దీప్ కౌర్(33)గా గుర్తించారు. ఇద్దరూ పంజాబ్ జలంధర్ జిల్లా గొరాయాకు చెందినవారు. సుఖ్వీందర్ ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చిన కాసేపటికే ఓ దుండగుడు తుపాకీతో వెళ్లి విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు. మొదట భర్తపై కాల్పులు జరిపి, ఆ తర్వాత భార్యపై రెండు రౌండ్ల కాల్పులు జరిపాడు. దీంతో ఇద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సుఖ్వీందర్ 19 ఏళ్ల క్రితమే ఫిలిప్పీన్స్ వెళ్లి స్థిరపడ్డాడు. ఫైనాన్స్ వ్యాపారం చేస్తున్నాడు. మూడేళ్ల క్రితమే కిరణ్దీప్ కౌర్ను పెళ్లి చేసుకున్నాడు. ఆదివారం ఎన్నిసార్లు ఫోన్ చేసినా సుఖ్వీందర్ కాల్ లిఫ్ట్ చేయలేదని అతని తమ్ముడు లఖ్వీర్ సింగ్ చెప్పాడు. దీంతో దగ్గర్లోనే ఉన్న తమ అంకుల్ను వెళ్లి చూడమన్నానని, అప్పటికే ఇద్దరూ చనిపోయి రక్తపు మడుగులో ఉన్నారని పేర్కొన్నాడు. చదవండి: యూఎస్ టేనస్సీ: స్కూల్లో పూర్వ విద్యార్థి కాల్పులు.. చిన్నారులు, సిబ్బంది మృతి -
తిరుపతిలో దారుణం.. భర్తకి భార్య ప్రియుడి శిరోముండనం
సాక్షి, తిరుపతి: జిల్లాలోని చంద్రగిరి మండల పరిధిలో దారుణం చోటు చేసుకుంది. తన భార్య వివాహేతర సంబంధం గురించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు ఓ భర్త. తమ గుట్టును బయటపెట్టడం భరించలేని ఆమె ప్రియుడు.. ఆ భర్తపై పైశాచిక చేష్టలకు దిగాడు. ఆ భర్తకి శిరోముండనం చేసి.. మూత్రం పోశాడు. ఆలస్యంగా ఈ ఘటన వెలుగు చూసింది. చంద్రగిరి మండలం రంగంపేట గ్రామంలో ఈ షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. తన భార్యతో హర్షవర్థన్ అనే వ్యక్తి వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడని, ఆమెను ఎక్కడికో తీసుకెళ్లిపోయాడని, రిప్(RIP) అంటూ ఓ వ్యక్తి ఫేస్బుక్లో పోస్ట్ పెట్టాడు. అది చూసిన ఆ ప్రియుడు హర్షవర్ధన్ రగిలిపోయాడు. బాధిత భర్తను దొరకబుచ్చుకుని గుండు కొట్టించాడు. ఆపై అతనిపై మూత్రం పోశాడు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే చంపుతామంటూ అతన్ని బెదిరించారు కూడా. అయితే.. ఈ చేష్టలను అడ్డుకోకపోగా.. కొందరు వీడియోలు, ఫొటోలు తీసి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. దీంతో పోలీసులకు విషయం చేరింది. ఈ దారుణానికి వివాహేతర సంబంధమే కారణమని పోలీసులు ధృవీకరించుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి హర్షవర్దన్తో పాటు అతని అనుచరుడు అన్వర్ను, వీళ్లకు సహకరించిన మరొకరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు జరిగిన అవమానంతో బాధిత భర్త అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. -
గిరి పల్లెలో విషాదం.. భార్య మృతిని తట్టుకోలేక భర్త కూడా..
సాక్షి, అల్లూరి: చింతూరు మండలంలోని కలిగుండం అనే గిరిజన పల్లెలో విషాదం చోటు చేసుకుంది. భార్య, భర్తల మధ్య చెలరేగిన మనస్పర్థలు వారి బలన్మరణానికి కారణమయ్యాయి. భర్త కొట్టాడని భార్య ఆత్మహత్య చేసుకుంది. అయితే.. ఆమె మృతిని తట్టుకోలేక భర్త కూడా బలవన్మరణానికి పాల్పడ్డాడు. సోమవారం జరిగిన ఈ ఘటన మంగళవారం వెలుగులోకి వచ్చింది. వివరాలిలాఉన్నాయి. భార్యాభర్తలైన కుంజా భద్రయ్య(70), కుంజా సమ్మక్క(65)బంధువుల ఇంట్లో జరిగిన దినకార్యానికి వెళ్లి ఇంటికి తిరిగివచ్చారు. తనకు భోజనం పెట్టమని భార్య సమ్మక్కను భర్త భద్రయ్య కోరగా నువ్వే పెట్టుకుని తినమని భార్య చెప్పింది. దీంతో ఆగ్రహించిన భద్రయ్య భార్యను కర్రతో కొట్టడంతో ఆమె మనస్తాపానికి గురైంది. ఇంట్లోని పురుగు మందు సేవించి ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె మృతిని తట్టుకోలేని భర్త భద్రయ్య కూడా పురుగు మందు సేవించి అపస్మారక స్థితికి చేరాడు. దీంతో అతనిని సమీపంలోని ఏడుగురాళ్లపల్లి ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ యాదగిరి తెలిపారు. -
'నా భర్త గే.. ఎంత ట్రై చేసినా దగ్గరకు రానివ్వట్లేదు..' కోర్టు కీలక తీర్పు
ముంబై: ప్రభుత్వ ఉద్యోగి అయిన తన భర్త స్వలింగ సంపర్కుడని, ఈ విషయం దాచి తనను పెళ్లి చేసుకున్నాడని ఓ మహిళ కోర్టును ఆశ్రయించింది. పెళ్లయిన తర్వాత ఆయనకు దగ్గరయ్యేందుకు ఎంత ట్రై చేసినా ఫలితం లేకపోయిందని, ఆయనకు పురుషులతో శారీరక సంబంధాలు ఉన్నాయని చెప్పింది. అంతేగాక తనను శారీరకంగా వేధిస్తున్నాడని, దుర్భాషలాడుతూ తన ఆర్థిక పరిస్థితి, కుటుంబాన్ని కించ పరిచేలా మాట్లాడుతున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది. ఇందుకు సంబంధించిన ఆధారాలు కూడా కోర్టుకు సమర్పించింది. అయితే వాదనలు విన్న న్యాయస్థానం ఆమెకు అనుకూలంగా తీర్పునిచ్చింది. గే అని దాచినందుకు ఆమెకు రూ.లక్ష పరిహారంగా ఇవ్వాలని, అలాగే ప్రతి నెల రూ.15వేలు ఆర్థిక సాయం అందించాలని ఆదేశించింది. మెజిస్ట్రేట్ కోర్టు ఈమేరకు తీర్పునిచ్చింది. ఈ తీర్పును ముంబై సెషన్స్ కోర్టులో సవాల్ చేశాడు భర్త. ఆధారాలు పరిశీలించిన న్యాయస్థానం కింది కోర్టు ఇచ్చిన తీర్పునే సమర్థించింది. ఆమెకు రూ.లక్ష, ప్రతి నెల రూ.15 చెల్లించాల్సిందేనని స్పష్టం చేసింది. ఈ దంపతులకు 2016లో వివాహం జరిగింది. పెళ్లై రోజులు గడుసున్నా ఆమెను అతడు దగ్గరకు రానివ్వలేదు. హింసించడం మొదలుపెట్టాడు. అనుమానంతో అతడ్ని గమనించిన భార్య.. చివరకు గే అని కనిపెట్టింది. ఇతర పురుషులతో అతడు నగ్నంగా దిగిన ఫొటోలోను అతని ఫోన్లో చూసింది. వాటినే కోర్టుకు సాక్ష్యంగా సమర్పించింది. చదవండి: డబ్బు విషయంలో భర్తతో గొడవ.. 8 ఏళ్ల కుమారుడ్ని కాలువలోకి విసిరి.. -
భార్య హత్యకు స్కెచ్.. ఊహించని పరిణామంతో పరుగులు
ఆ తాగుబోతు భర్తతో రోజూ ఆమెకు గొడవే. ఇక భరించలేక పుట్టింటికి వెళ్లిపోయింది. అది అవమానంగా భావించి.. ఆమెను ఎలాగైనా చంపాలని ప్లాన్ వేశాడు. చివరికి ఆ భర్తకే పెద్ద షాకే తగిలింది. భార్యకు బదులుగా ఆమె తల్లి కన్నుమూసింది. దీంతో ఆ భర్త అక్కడి నుంచి పరుగులు అందుకున్నాడు. మధ్యప్రదేశ్ బేతుల్ జిల్లా కోట్వాలి స్టేషన్ పరిధిలోని సైఖేదా గ్రామంలో సోమవారం సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకుంది. నిత్యం తాగుతూ ఉండే ఆ భర్త.. రోజూ భార్యతో గొడవ పడుతూ ఉండేవాడు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి కూడా ఇద్దరూ గొడవ పడ్డారు. భర్తను భరించలేక.. నానా తిట్లు తిట్టి ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో కోపం పెంచుకున్న ఆ తాగుబోతు.. అత్తింటికి వెళ్లి మరీ భార్యను చంపాలని అనుకున్నాడు. సోమవారం సాయంత్రం అత్తింటికి వెళ్లి.. బయట ఉన్న ఇనుప గేటుకు కరెంట్ వైర్లను కనెక్ట్ చేశాడు. అయితే భార్య బదులు ఆమె తల్లి వచ్చి గేట్ను ముట్టుకుంది. దీంతో కరెంట్ షాక్తో విలవిలలాడి అక్కడికక్కడే ఆ మహిళ(55) మృతి చెందింది. అది చూసి స్థానికులు కేకలు వేయగా.. ఊహించని పరిణామంతో భయాందోళనకు గురై ఆ భర్త అక్కడి నుంచి పారిపోయాడు. దర్యాప్తులో అసలు విషయం వెలుగు చూడగా.. పరారీలో ఉన్న తాగుబోతు భర్త గురించి పోలీసులు వెతుకుతున్నారు. ఇదీ చదవండి: గంజాయికి బానిసైన కొడుకు.. నల్లగొండలో దారుణ హత్య -
తాజా తీర్పు: పోల్చి తిడితే ఇంతే సంగతులు
భర్తల నోటికి తాళం. భార్యల వేదనకు ఈ తీర్పు ఒక అవసరం. ఇరుగింటామెతోనూ పొరుగింటామెతోనూ సినిమా హీరోయిన్తోనూ పోల్చి భార్యను చులకన చేస్తే సూటిపోటి మాటలంటే అది ‘మానసిక క్రూరత్వం’ కిందకే వస్తుందని కేరళ హైకోర్టు తీర్పు ఇచ్చింది. అటువంటి భర్తతో కాపురం చేయనవసరం లేదని విడాకులు మంజూరు చేసింది. గతంలో ముంబై ఫ్యామిలీ కోర్టు కూడా ‘ఆ నువ్వు పెద్ద మగాడివని’ లాంటి గుచ్చే మాటలు మాట్లాడే భార్య నుంచి విడాకులు ఇప్పించింది. భార్యాభర్తలు ఇలాంటి మాటలు అనుకోవడం ఎందుకు? భార్యను చులకన చేయడం భర్తకు సమాజం నుంచి కుటుంబం నుంచి అంగీకారం పొందిన విషయంగా అనిపిస్తుంది. సినిమాల్లో పాత్రలు, టీవీల్లో స్కిట్లు భార్యను భర్త నానా విధాలుగా హేళన చేయడం చూపిస్తూనే ఉంటాయి. ‘మసిబొగ్గులా ఉన్నావు’, ‘బోండాంలా ఉన్నావు’, ‘నిన్ను చేసుకునే బదులు అడవిలో మొద్దును చేసుకుని ఉంటే నయం’, ‘ఏదో ఒక మాయలో పడినట్టుగా నిన్ను చేసుకున్నాను. కాని నీలో ఏ ఆకర్షణ లేదు’, ‘ఆ ఎదురింటామెను చూడు ఎంత అందంగా ఉందో’, ‘ఇదంతా నా ఖర్మ’... ఇలాంటి మాటలు భర్త మాట్లాడితే భార్య లోలోపల బాధ పడటమో తిరిగి తగాదా పడటమో చేస్తూ ఉంటుంది. కాని ‘ఇది అవసరమా నాకు’ అని భార్య అనుకుంటే విడాకులు మంజూరు చేయడానికి ఈ కారణం సరిపోతుందని తాజాగా కేరళ హైకోర్టు తీర్పు ఇచ్చింది. కేరళ హైకోర్టు బెంచిలో జస్టిస్ కె.నరేంద్రన్, సి.ఎస్.సుధ ఈమేరకు తీర్పు వెలువరించారు. ఏమిటి కేసు? కేరళలో ఒక జంట 2009లో పెళ్లి చేసుకున్నారు. అప్పుడు ఆమెకు 26. అతనికి 29. పెళ్లయిన తర్వాత భర్త కొత్త పెళ్లికూతురు అని కూడా చూడక వెంటనే ఇతర స్త్రీలతో పోల్చసాగాడు. ‘నీకన్నా ఆమె బాగుంది’, ‘ఆమెకున్న మంచి జుట్టు నీకు లేదు’ లాంటి కామెంట్లు చేసేవాడు. అతని తమ్ముడు పెళ్లి ప్రయత్నాలు చేస్తుంటే పెళ్లిచూపులకు అన్నగా హాజరయ్యి భార్యతో ‘నా తమ్ముడు అదృష్టవంతుడు. మంచి అమ్మాయిలను వెతుకుతున్నాడు’ లాంటి కామెంట్లు చేసేవాడు. దాంతో ఆమె కనీసం ఆరునెలలు కూడా అతనితో కాపురం చేయలేకపోయింది. జనవరిలో పెళ్లయితే నవంబర్లో విడాకులకు ఫ్యామిలీ కోర్టులో దరఖాస్తు చేసింది. ఫ్యామిలీ కోర్టు ‘లైంగిక దూరాన్ని’ కారణంగా చూపుతూ విడాకులు మంజూరు చేసింది. దాని మీద భర్త హైకోర్టుకు అప్లయి చేశాడు. కేరళ హైకోర్టు కూడా తాజాగా విడాకులే సబబైనవిగా తీర్పు ఇచ్చింది. మానసిక క్రూరత్వం ఈ కేసులో విడాకులకు కనిపించే సగటు కారణాల కన్నా భర్త తన భార్యను ఇతర స్త్రీలతో పోల్చుతూ చిన్నబుచ్చడాన్నే హైకోర్టు ప్రధాన కారణంగా తీసుకుంది. దానిని ‘మానసిక క్రూరత్వం’గా వ్యాఖ్యానించింది. అలాంటి క్రూరత్వంతో బంధం నిలవదు అని చెప్పింది. ‘వారు మంచి వయసులో ఉన్న జంటే అయినా ఈ కేసు కొనసాగిన ఇన్నేళ్లుగా తిరిగి కలవలేదు. భాగస్వాములలో ఒకరు విడాకులకు దరఖాస్తు చేసి, ఏళ్ల తరబడి ఇద్దరూ విడిగా ఉండగా ఆ పెళ్లి కుటుంబాలకు, సంఘానికి చెప్పుకోవడానికి ఉంటుందిగాని నిజంగా మనలేదు’ అని విడాకులు మంజూరు చేసింది. భర్తను చిన్నబుచ్చినా అంతే! అయితే 2013లో ముంబై ఫ్యామిలీ కోర్టులో భర్త తరఫు నుంచి ఇటువంటి తీర్పే ఇచ్చింది. భార్య భర్తను ‘నువ్వు పెద్ద మగాడివిలే’, ‘నేను సరిగా ఏడ్చి ఉంటే మావాళ్లు నీకంటే తెలివైన, మంచి కుటుంబం నుంచి కుర్రాణ్ణి వెతికి ఉండేవారు’, ‘నాకు నువ్వు ఏమాత్రం సరి తూగవు’ లాంటి మాటలతో బాధించేది. అప్పటికి వారికి పెళ్లయి పదేళ్లు. ఇద్దరు పిల్లలు. కాని భర్త అలసిపోయి ఆఫీసు నుంచి వస్తే ‘ఒక ముద్దు ముచ్చట లేదు. మగాడివైతేగా’ వంటి మాటలతో బాధించేది. ఏమైనా అంటే ‘ఉరేసుకుని చస్తా’ అని బెదిరించేది. ఈ మాటలన్నింటినీ కోర్టు ‘మానసిక క్రూరత్వం’గా పరిగణించి విడాకులు ఇచ్చింది. ముఖ్యంగా ‘ఆత్మహత్య బెదిరింపులు’ భర్తకు నరక ప్రాయం అవుతాయని వ్యాఖ్యానించింది. ఎందుకు ఈ మాటలు? భార్యాభర్తల మధ్య ప్రేమ, స్నేహం, గౌరవం, సర్దుబాటు ధోరణి, అవగాహన, అర్థం చేసుకోవడం, బలహీనతలను గుర్తించడం, ఎదుటివారికి ఏ పని నచ్చదో దానిని వదలిపెట్టడం... ఇవన్నీ ఉంటే తప్ప కాపురం సజావుగా సాగదు. పెళ్లయ్యాక ఒకరికొకరు సరిపడరు అని అనుకుంటే విడిపోవడం లేదా మౌనంగా కొనసాగడం మేలు. కాని మాటలు చాలా గాయం చేస్తాయి. నిజానికి అవి వంటి మీద పడే దెబ్బల కంటే తీవ్రమైనవి. మాటలతో హింసించి సంతృప్తి పడదామంటే కాలక్రమంలో ఆ బంధం మరింత పలుచనవుతుంది తప్ప గట్టి పడదు. కాబట్టి తిడితే ఏమవుతుందిలే అని భార్య/భర్త అనుకోవద్దు. విడాకులకు అవి చాలు. -
Crime News: ఎంత పని చేశావ్ రమావతి!
భార్యభర్తల మధ్య చిన్నచిన్న గొడవలు.. అప్పటికో, కాసేపటికో సర్దుకుపోవడం కూడా సహజమే. కానీ, ఒక్కోసారి అవి విపరీతాలకు కూడా దారి తీస్తుంటాయి. భార్యపై చెయ్యి చేసుకున్న ‘పాపాని’కి.. కలలో కూడా ఊహించని శిక్షపడింది ఆ భర్తకు. భార్యను ఎత్తుకెళ్లి.. హత్య చేసిన కేసులో ఓ భర్తకు పదేళ్లు జైలు శిక్ష విధించింది కోర్టు. ఈ కేసులో దాదాపు ఎనిమిదేళ్లపాటు పోలీసు విచారణ సాగడం గమనార్హం. ఆరు నెలలు జైలు శిక్ష అనుభవించిన తర్వాత బెయిల్ మీద వచ్చాడు అతను. మరో నాలుగేళ్ల తర్వాత.. ఈ మధ్యే మబ్బులు వీడిపోయే వార్త ఒకటి అతని చెవిన పడింది. అతని భార్య బతికే ఉందని! ఉత్తర ప్రదేశ్ బహ్రాయిచ్ ప్రాంతంలో జరిగింది ఈ ఘటన. అక్కడి ఏఎస్పీ అశోక్ కుమార్ వెల్లడించిన వివరాల ప్రకారం.. జాంపూర్ గ్రామానికి చెందిన కంధాయ్ అనే వ్యక్తి 2006లో అదే గ్రామానికి చెందిన రమావతి అనే యువతిని వివాహం చేసుకున్నాడు. అయితే.. మూడేళ్ల తర్వాత అంటే 2009లో ఓరోజు హఠాత్తుగా ఆమె కనిపించకుండా పోయింది. దీంతో రమావతి కుటుంబ సభ్యులు కంధాయ్ను కోర్టుకు ఇడ్చారు. తమ బిడ్డను ఎత్తుకెళ్లి హత్య చేశాడని కేసు నమోదు చేయడంతో విచారణ కొనసాగింది. ఎనిమిదేళ్లు అయినా రమావతి తిరిగి రాకపోవడంతో చనిపోయి ఉంటుందని పోలీసులు నిర్ధారించుకున్నారు. అదే సమయంలో కంధాయ్కు వ్యతిరేకంగా ఆమె కుటుంబ సభ్యులు సాక్ష్యం చెప్పడంతో.. 2017లో స్థానిక కోర్టు అతనికి పదేళ్ల జైలు శిక్ష విధించింది. ఆరు నెలల శిక్ష తర్వాత అలహాబాద్ హైకోర్టుకు వెళ్లి బెయిల్ తెచ్చుకున్నాడు అతను. అయితే కంధాయ్ కూడా ఊహించని ట్విస్ట్ ఒకటి బయటపడింది ఈమధ్యే. బంధువులతో పరుగున.. రమావతి, కంధాయ్ ఇరు కుటుంబాలకు దగ్గరి బంధువైన ఓ వ్యక్తి.. ఈమధ్యే రమావతి సోదరి ఇంటికి వెళ్లాడు. అక్కడ రమావతిని చూసి షాక్ తిన్నాడు అతను. వెంటనే విషయాన్ని కంధాయ్కు చేరవేశాడు. భార్య బతికే ఉందన్న విషయం తెలిసిన కంధాయ్.. ఆలస్యం చేయకుండా తన బంధువులతో రమావతి సోదరి ఇంటికి చేరుకున్నాడు. ఈలోపు పోలీసులకు సైతం సమాచారం ఇవ్వడంతో వాళ్లు అక్కడికి వచ్చారు. అంతా రమావతిని చూసి కంగుతిని.. అసలు విషయాన్ని ఆరా తీసేందుకు ఆమెను వన్ స్టెప్ సెంటర్(మహిళా సంక్షేమ కేంద్రం)కు తీసుకెళ్లి విచారించారు. చాయ్ విషయంలో జరిగిన గొడవతో భర్త తనపై చెయ్యి చేసుకున్నాడని, అది నచ్చకనే భర్తను జైలు పాలు చేయాలని ఇలా చేశానని అసలు విషయం చెప్పుకొచ్చిందామె. ఆమె చెప్పిన కారణం విని కంగుతిన్న భర్త, పోలీసులు, బంధువులు.. ఇన్నేళ్లపాటు ఆమె తన జాడను గోప్యంగా ఉంచడంపై ఆశ్చర్యపోతున్నారు. ఆమె అజ్ఞాతవాసం-కంధాయ్ కారాగారవాసం వెనుక రమావతి కుటుంబ ప్రమేయం ఉందని పోలీసులు భావిస్తున్నారు. ఇవాళ(సోమవారం) రమావతిని కోర్టులో హాజరుపర్చగా.. కేసు తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది కోర్టు. -
ఆ ఆపరేషన్ మాకోద్దు బాబోయ్ అంటోన్న పురుషులు.. ఎందుకంటే
సాక్షి, భీమవరం(పశ్చిమ గోదావరి): కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు అంటే పురుషులు మాకొద్దు అంటున్నారు. దీంతో నేటికీ 99 శాతానికిపైగా కు.ని. (కుటుంబ నియంత్రణ) ఆపరేషన్లు మహిళలకే జరుగుతున్నాయి. అప్పటికే ఒకటి నుంచి రెండు ప్రసవాల ఆపరేషన్లు చేయించుకున్న మహిళలు ట్యూబెక్టమీ కూడా చేయించుకోవాల్సి వస్తోంది. కుటుంబ నియంత్రణ ఆపరేషన్ మగవారికి ఎంతో సులభమైనా వారు ముందుకు రావడం లేదు. వైద్యుల కౌన్సెలింగ్తో మాత్రం కొందరు మగ వారు కు.ని. ఆపరేషన్ చేయించుకుంటున్నారు. మగవారికే సులభం ఈ ఆపరేషన్లు ఆడవారి కంటే మగవారికే సులభమని వైద్యులు చెబుతున్నారు. ఆడవారికి ట్యూబెక్టమీ చేయడానికి సమయం ఎక్కువ పట్టడంతో పాటు వారం నుంచి 10 రోజుల వరకు విశ్రాంతి అవసరం. మగవారికి వేసెక్టమీ చాలా సులభంగా చేయడంతో పాటు నాలుగు రోజుల విశ్రాంతి సరిపోతుంది. అనంతరం వారి పనులు చేసుకోవచ్చు. వేసెక్టమీ చేయించుకుంటే మగవారికి ప్రభుత్వం రూ.1,100 ప్రోత్సాహక నగదు అందజేస్తోంది. అదే ఆడవారికి కేవలం రూ.250 నగదు ఇస్తున్నారు. ఈ ఆపరేషన్ల కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలోనే చేస్తున్నారు. 55 ఆస్పత్రుల్లో కు.ని. ఆపరేషన్లు జిల్లాలోని 55 ప్రభుత్వ ఆస్పత్రుల్లో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేస్తున్నారు. గ్రామాల్లోని 32 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 18 అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 4 ఏరియా ప్రభుత్వ ఆస్పత్రులు, ఒక జిల్లా ఆస్పత్రిలో వేసెక్టమీ ఆపరేషన్లు చేస్తున్నారు. గతేడాది జిల్లావ్యాప్తంగా 6,236 కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలు జరగ్గా అందులో కేవలం 24 మంది, ఈ ఏడాదిలో ఇప్పటివరకూ 1,384 ఆపరేషన్లు జరగ్గా కేవలం 9 మంది పురుషులు మాత్రమే ముందుకు వచ్చారు. మగవారు ముందుకు రావాలి కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు ఆడవారి కంటే మగవారికే సులభం. భార్యకు మరో ఆపరేషన్ అవసరం లేకుండా భర్త ముందుకొస్తే చాలా మంచిది. వేసెక్టమీపై మగవారికి కౌన్సెలింగ్ ఇచ్చి వారి ఇష్టపూర్వకంగా ఆçపరేషన్ చేస్తాం. మగవారిలో మార్పు రావాలి. వారు జనాభా నియంత్రణలో భాగస్వాములు కావాలి. – కె.ఐశ్వర్య, సివిల్ అసిస్టెంట్ సర్జన్, కు.ని.విభాగం భీమవరం ప్రభుత్వాసుపత్రి -
బంధం తెగినా.. ఒక్కటిగానే మృత్యువు ఒడిలోకి..
Indian Family Died in Nepal Plane Crash: మనస్పర్థలు పెరిగాయి. భార్యాభర్తల బంధానికి బీటలు వారింది. చట్టం దృష్టిలో విడాకులతో వాళ్లిద్దరూ విడిపోయారు. కానీ, కన్నబిడ్డల రూపంలో దగ్గరగా గడిపే అవకాశం దొరికింది ఆ జంటకు. వారి మధ్య సంతోషాన్ని చూసి ఆ విధికి కన్ను కుట్టిందేమో.. విషాదాంతంగా ముగిసింది ఆ కుటుంబం కథ. నేపాల్ ఎయిర్క్రాఫ్ట్ దుర్ఘటనలో ఇప్పటిదాకా 22 మృతదేహాలను గుర్తించారు. ఘటనస్థలం నుంచి బ్లాక్బాక్స్ను సేకరించి.. ప్రమాదానికి గల కారణాలను కనిపెట్టే ప్రయత్నంలో ఉన్నారు. అయితే.. దుర్మరణం పాలైన వాళ్లలో భారత్కు చెందిన ఓ కుటుంబం కూడా ఉండడం.. విషాదాన్ని నింపుతోంది. ఒడిషాకు చెందిన అశోక్ కుమార్ త్రిపాఠి(54), ఆయన భార్య వైభవి బందేకర్ త్రిపాఠి(51)కి చాలాకాలం కిందటే వ్యక్తిగత కారణాలతో విడాకులు తీసుకున్నారు. అశోక్ కుమార్ మరో వివాహం చేసుకున్నాడు. కానీ, వైభవి మాత్రం తన తల్లితో ఉంటూ.. కన్నబిడ్డలిద్దరి బాధ్యతలు చూసుకుంటోంది. అయితే విడాకులతో విడిపోయినా ఆ జంటకు కలిసే అవకాశం కల్పించింది న్యాయస్థానం. ఏడాదిలో పది రోజుల పాటు కొడుకు, బిడ్డతో కలిసి సరదాగా గడపాలని ఈ మాజీ జంటకు ఆదేశించింది. విడాకుల తర్వాత అశోక్ ఒడిషాలోనే ఉంటూ ఓ కంపెనీని రన్ చేస్తున్నాడు. థానే(ముంబై)లో ఉంటూ ఓ ఫైనాన్షియల్ కంపెనీని నడిపిస్తోంది వైభవి. ఈ క్రమంలో.. కొడుకు ధనుష్ (22), కూతురు రితిక(15)తో కలిసి ఈ ఏడాదికిగానూ హిమాలయా పర్యటనకు వెళ్లారు. ఆదివారం నేపాల్ టూరిస్ట్ సిటీ అయిన పొఖారాకు వెళ్లారు. అదే రోజు జరిగిన ఘోర ప్రమాదంలో ఈ కుటుంబం దుర్మరణం పాలైంది. వీళ్ల మరణ వార్తతో థానేలోని బల్కమ్ ఏరియాలో విషాదం నెలకొంది. ఇక్కడే రుస్తోమ్జీ అథేనా హౌజింగ్ సొసైటీలో వైభవి నివాసం ఉంటోంది. ప్రమాదం వార్త విని స్థానికులంతా షాక్లో ఉన్నారు. -
అనుమానంతో భార్యపై హత్యాయత్నం
భూపాలపల్లి: భార్యపై అనుమానంతో గొడవపడిన భర్త మద్యం మత్తులో ఆమెపై హత్యాయత్నం చేశాడు. రక్తపు మడుగులో ఉన్న భార్యను చూసి భయపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో శనివారంరాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. కరీంనగర్ జిల్లా జమ్మికుంట సమీపంలోని బేతిగల్కు చెందిన అంబాల రమేశ్ (29) కొన్నేళ్ల క్రితం భూపాలపల్లికి వచ్చి రాంనగర్ లో నివసిస్తూ కూలిపని చేసుకుంటూ జీవిస్తున్నాడు. రమేశ్కు ఆరేళ్ల క్రితం హుజూరాబాద్కు చెందిన శైలజతో వివాహం జరిగింది. ఆమెకు పిల్లలు కలగకపోవడంతో ఏడాదిన్నర క్రితం మల్హర్ మండలంలోని రుద్రారం గ్రామానికి చెందిన రాజ్యలక్ష్మి(24)ని వివాహం చేసుకున్నాడు. రాజ్యలక్ష్మిపై అనుమానంతో రమేశ్ కొద్ది రోజులుగా ఆమెతో గొడవ పడుతున్నాడు. ఈ క్రమంలోనే శనివారం రాత్రి రమేశ్ బాగా మద్యం సేవించి వచ్చి గొడవపడ్డాడు. రాత్రి ఒంటిగంట సమయంలో రాజ్యలక్ష్మిపై హత్యాయత్నం చేశాడు. కడుపు, ఎడమ చేయిపై కత్తితో పొడవడంతో రాజ్యలక్ష్మి రక్తం మడుగులో కుప్ప కూలింది. తర్వాత రమేశ్ అదే కత్తి తో చేతి మణికట్టు వద్ద నరాన్ని కోసుకున్నాడు. అనంతరం బైక్పై కొద్దిదూరం వెళ్లి కిందపడిపోయాడు. అక్కడి నుంచి నడుచుకుంటూ వెళుతున్న క్రమంలో తీవ్ర రక్తస్రావం జరిగి కేటీకే 5వ ఇంక్లైన్ గని సమీపంలోని జామాయిల్ చెట్ల వద్ద మృతి చెందాడు. కాగా, రమేశ్ ఇంటి యజమాని ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని రాజ్యలక్ష్మిని ములుగు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉంది. -
మరుగు దొడ్డి విషయంలో మనస్తాపం.. ఉరితాడుకు రమ్య!
చదువుకున్న ఆ అమ్మాయి.. ప్రాణంగా ప్రేమించి అతన్ని పెళ్లి చేసుకుంది. కానీ, అతని ఇంట పరిస్థితిని తట్టుకోలేకపోయింది. మచ్చా(బావా) అని ప్రేమగా పిల్చుకునే భర్త దగ్గర బాధను వెల్లగక్కుకుంది. అది అతను అర్థం చేసుకోలేకపోయేసరికి.. పుట్టింటికి వెళ్లిపోయింది. భర్త మనసు మారిందేమో అని మళ్లీ ప్రయత్నిస్తే.. అతను అదే సమాధానం ఇవ్వడంతో పెళ్లై నెల కూడా గడవక ముందే ఆ కొత్త పెళ్లికూతురు ఏకంగా ప్రాణమే తీసుకుంది. చెన్నై: తమిళనాడులో ఈ ఘటన జరిగింది. 27 ఏళ్ల రమ్య భర్త తన ఇంట మరుగుదొడ్డి కట్టించడం లేదన్న ఆవేదనతో ప్రాణం తీసుకుంది. కడలూరు అరిసిపెరియాన్కుప్పంకు చెందిన రమ్య.. ఎమ్మెస్సీ చదివింది. ఒక ప్రైవేట్ మెడికల్ కంపెనీలో ఉద్యోగం కూడా చేస్తోంది. రెండేళ్లుగా కార్తికేయన్ అనే వ్యక్తితో ఆమె ప్రేమలో ఉంది. పెద్దలను ఒప్పించి కిందటి నెల(ఏప్రిల్ 6న) వీళ్లిద్దరూ వివాహం చేసుకున్నారు. అయితే కాపురానికి వెళ్లిన ఆమెకు అక్కడ మరుగు దొడ్డి లేకపోవడం ఇబ్బందిగా అనిపించింది. కడలూరులోనే మరో ఇంటికి మారుదామని అతన్ని కోరింది. కానీ, ఆ కోరిక వివాదానికి దారి తీసింది. అందరిలాగా బహిర్భూమికి వెళ్లమంటూ సలహా ఇచ్చాడు ఆ భర్త. ఈ పరిణామంతో కలత చెందిన రమ్య.. పుట్టింటికి వెళ్లిపోయింది. అయితే కొన్నిరోజులకు భర్త మనసు మారిందేమో అనే ఉద్దేశంతో.. ఆమె సోమవారం మళ్లీ అతనికి ఫోన్ చేసి మాట్లాడింది. మరుగుదొడ్డి ఉన్న ఇంటికి మారుదామని మరోమారు బతిమాలింది. కానీ, అతను మాత్రం కరగలేదు. ససేమిరా కుదరదని చెప్పేశాడు. దీంతో ఆవేదన చెందిన రమ్య.. తీవ్ర నిర్ణయం తీసుకుంది. ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఉరి కొయ్యకు వేలాడుతున్న రమ్యను.. గుర్తించిన ఆమె తల్లి ఆస్పత్రికి తరలించింది. అయితే అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. రమ్య తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు. టాయిలెట్ లేదన్న కారణంతో ఆత్మహత్యకు పాల్పడిన రమ్య ఉదంతం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. కష్టాలు ఎదురైనా.. మనోధైర్యంతో ముందుకు సాగే స్ఫూర్తిదాయకమైన కథలు ఎన్నో. అవి చూసి కూడా జీవితం విలువ గుర్తించరు కొందరు. పైగా చిన్నచిన్న కారణాలకే ప్రాణం తీసుకుంటారు. ఆత్మహత్య అన్ని సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్ను ఆశ్రయించి సాయం పొందండి. ధైర్యంగా జీవితంలో ముందుకు సాగండి.. రోషిణి కౌన్సెలింగ్ సెంటర్ ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
పరువు తీస్తానని భార్య బెదిరింపు.. భర్త ఆత్మహత్య
పెద్దపల్లి రూరల్: భార్య వివాహేతర సంబంధాన్ని రెడ్హ్యాండెడ్గా పట్టుకున్న భర్తను, ప్రియుడితో కలసి ఉన్న ఫొటోలను సోషల్ మీడియాలో పెట్టి పరువు తీస్తానంటూ బెదిరింపులకు గురిచేయడంతో మనస్తాపం చెందిన భర్త ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. పెద్దపల్లి జిల్లాకేంద్రంలో సోమవారం ఈ ఘటన చోటుచేసుకుంది. ఎస్సై రాజేశం కథనం ప్రకా రం.. అఫ్రోజ్ జిల్లాకేంద్రంలోని బస్టాండ్ ప్రాం తంలో బిర్యానీ సెంటర్ నడుపుతున్నారు. ఈ క్రమంలో తనకు బంధువైన ఖాజాను పనిలో పెట్టుకున్నారు. అయితే ఖాజాతో అఫ్రోజ్ భార్యకు ఏర్పడిన సాన్నిహిత్యం వివాహేతర సంబంధానికి దారితీసింది. అఫ్రోజ్ వారిని పలుమార్లు పద్ధతి మార్చుకోవాలని చెప్పినా ఫలితం లేకపోయింది. కొద్ది రోజుల క్రితం వారిద్దరూ ఏకాంతంగా ఉండగా.. రెడ్హ్యాండెడ్గా పట్టుకుని అఫ్రోజ్ భా ర్యను పుట్టింటికి పంపి, ఖాజాను పని నుంచి తొలగించారు. అప్పటి నుంచి వారిద్దరూ కలసి దిగిన ఫొటోలను అఫ్రోజ్కు పంపించి.. వాటిని సోషల్ మీడియాలో పెట్టి పరువు తీస్తామంటూ బెదిరింపులకు గురిచేశారు. ఆ వేధింపులు తాళలేక మనస్తాపానికి గురై అఫ్రోజ్ (43) ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు ఖాజా, అఫ్రోజ్ భార్యపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు. -
పెళ్లయిన 35 రోజులకే పక్కా ప్లాన్తో భర్తను చంపించింది
సిద్దిపేట కమాన్: ప్రేమించిన వ్యక్తితో కాకుండా మరో వ్యక్తితో పెళ్లి చేయడంతో భర్తను అడ్డు తొలగించి ప్రియుడితో సంతోషంగా ఉండాలనుకుంది. ఆహారంలో ఎలుకల మందు కలిపి భర్తకు పెట్టింది. దాన్ని తిని అనారోగ్య సమస్యలు వచ్చినా ఆస్పత్రిలో చికిత్స పొంది భర్త తిరిగిరావడంతో ఇంకో పథకం వేసింది. వేరే ఊరికి వెళ్దామని చెప్పి భర్తను బయటకు తీసుకెళ్లి ప్రియుడు, అతని స్నేహితులతో కలిసి చంపించింది. బయటి వాళ్లకు ఛాతీనొప్పితో చనిపోయాడని చెప్పి నమ్మించాలని చూసింది. చివరకు అసలు విషయం తెలియడంతో కటకటాలపాలైంది. పెళ్లయిన 35 రోజులకే జరిగిన ఘటన సిద్దిపేట టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఎలుకల మందుతో మొదటి యత్నం తొగుట మండలం గుడికందులకు చెందిన శ్యామలకు దుబ్బాక మండలం చిన్న నిజాంపేటకు చెందిన కోనాపురం చంద్రశేఖర్ (24)తో మార్చి 23న పెళ్లి జరిగింది. చంద్రశేఖర్ వ్యవసాయం చేస్తున్నాడు. అయితే చిన్నప్ప టి నుంచి స్నేహితులైన గుడికందులకు చెందిన శివకు మార్, శ్యామల మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఇష్టంలేని పెళ్లి చేశారని, తన భర్తతో సుఖంగా ఉండట్లేదని, భర్తను అడ్డు తొలగిస్తే శివతో సంతోషంగా ఉండొచ్చు అని శ్యామల భావించింది. చంద్రశేఖర్ను చంపడానికి శివ సాయం కోరింది. అతను చెప్పినట్టు చంద్రశేఖర్ తినే ఆహారంలో ఏప్రిల్ 19న ఎలుకల మందు కలిపి పెట్టింది. అది తిన్న చంద్రశేఖర్కు అనారోగ్య సమస్యలు రావడంతో హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొంది ఏప్రిల్ 22న ఇంటికి వచ్చాడు. రెండోసారి పథకం వేసి.. తొలి ప్రయత్నం విఫలం కావడంతో భర్తను ఎలాగైనా చంపాలని శ్యామల మరోసారి శివ సాయం కోరింది. గుడికందులకు చెందిన ఇద్దరు స్నేహితులు రాకేశ్, రంజిత్, శివకు చిన్నమ్మ కొడుకైన సిరిసిల్లకు చెందిన భార్గవ్, మరో బంధువు సాయికృష్ణతో కలిసి ప్రణాళిక వేసింది. చిన్నకోడూర్ మండలం అనంతసాగర్లోని సరస్వతీ ఆలయంలో మొక్కు ఉందని చెప్పిన శ్యామల.. భర్తతో కలిసి ద్విచక్ర వాహనంపై ఏప్రిల్ 28న అనంతసాగర్కు బయలుదేరింది. మాయ మాటలు చెప్పి అనంతసాగర్ శివారులోని ధన్వంతరి అగ్రహారానికి వెళ్లే మట్టి దారిలోకి తీసుకెళ్లింది. అప్పటికే అక్కడ కారులో మాటు వేసిన శివ, నలుగురు యవకులు చంద్రశేఖర్పై దాడి చేసి తువాలతో మెడ చుట్టూ చుట్టి ఊపిరాడకుండా చేసి హత్య చేశారు. భర్తకు ఛాతీలో నొప్పని.. చంద్రశేఖర్ మృతదేహాన్ని కారులో సిద్దిపేట శివారుకు తీసుకొచ్చారు. ఇదే సమయంలో శ్యామల భర్తకు ఛాతీలో నొప్పి వస్తోందని, శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నాడని చంద్రశేఖర్ కుటుంబీకులకు ఫోన్ చేసి చెప్పింది. 108కి సమాచారం అందించి వాహనంలో సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తున్నట్లు తెలిపింది. కుటుంబీకులు వచ్చేసరికి చంద్రశేఖర్ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. కొడుకు మృతిపై అనుమానం ఉందని తల్లి మనెవ్వ ఫిర్యాదు చేయడంతో పోలీసులు గత నెల 28న కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. శ్యామలపై అనుమానంతో ఆమె కాల్ డేటాను పరిశీలించగా శివతో ఎక్కువసార్లు మాట్లాడినట్లు గుర్తించారు. ఆమెను విచారించగా అసలు విషయం తెలిపింది. దీంతో పోలీసులు శ్యామల, శివ, మరో నలుగురిని శనివారం రాత్రి అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. -
భర్తను పరస్త్రీతో పంచుకోవడం కంటే.. చావే మేలు అనుకుంది!
భర్త విషయంలో భారతీయ స్త్రీలు విపరీతమైన ఆలోచనా ధోరణితో ఉంటారని, తన భర్త తనకు మాత్రమే సొంతం అనుకుంటారని, పరాయి స్త్రీతో బంధాన్ని పంచుకోవడానికి ఏమాత్రం సహించబోరని అలహాబాద్(ఉత్తర ప్రదేశ్) హైకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. భారతీయ వివాహిత మహిళలు భర్త తమకు మాత్రమే సొంతం అనుకుంటారు. వాళ్ల గురించి విపరీతంగా ఆలోచిస్తుంటారు. ఒకవేళ అతను గనుక వేరే మహిళతో సంబంధం పెట్టుకున్నా, వివాహం చేసుకోవాలనుకునే ప్రయత్నం.. చివరికి ఆలోచనా చేసినా అది ఆ భార్యను కుదిపేసే అంశమే. అలాంటి విపత్కర పరిస్థితుల్లో తీవ్ర నిర్ణయాలే తీసుకుంటారు. ఈ కేసులోనూ అదే జరిగింది అంటూ జస్టిస్ రాహుల్ చతేర్వేది నేతృత్వంలో ధర్మాసనం వ్యాఖ్యలు చేసింది. అంతేకాదు.. తన భర్త రహస్యంగా మరో మహిళను వివాహం చేసుకోబోతున్నాడని, లేదంటే వివాహం చేసుకున్నాడనే ఒక్క కారణం చాలూ.. ఆమె తన ప్రాణం తీసుకునేందుకు అంటూ కోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. కేసు వివరాలు.. వారణాసి మాండువాది చెందిన సుశీల్ కుమార్ అనే వ్యక్తి, అతని కుటుంబం మీద అతని భార్య చనిపోయే ముందు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎఫ్ఐఆర్ నమోదు అయిన వెంటనే ఆమె విషం తాగి ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో వాళ్ల మీద కేసు నమోదు అయ్యింది. అయితే భార్య ఆత్మహత్యకు తామేమీ కారణం కాదని, కేసుల నుంచి ఉపశమనం ఇప్పించాలని సుశీల్ కోర్టులను ఆశ్రయించాడు. అయితే సుశీల్ కుమార్కు ఇదివరకే రెండు వివాహాలు అయ్యాయని, మరో వివాహం చేసుకోవడంతోనే ఆమె ఆత్మహత్యకు పాల్పడింది ఇప్పుడు అలహాబాద్ హైకోర్టు ధృవీకరించినట్లయ్యింది. -
రెండేళ్ల తర్వాత సొంతూరికి.. కాటేసిన రోడ్డు ప్రమాదం!
సాక్షి, చివ్వెంల (సూర్యాపేట): కరోనా వల్ల స్వదేశానికి రాలేకపోయిన ఆ కుటుంబం రెండేళ్ల తర్వాత.. రెక్కలు కట్టుకుని వాలిపోయింది. కానీ, ఊహించని పరిణామం ఆ కుటుంబంలో విషాదం నింపింది. రెప్పపాటులో జరిగిన ప్రమాదం దంపతులను బలిగొనడంతో పాటు వాళ్ల ఇద్దరు పిల్లలకు కన్నవాళ్లను దూరం చేసింది. జాతీయ రహదారిపై సూర్యాపేట జిల్లా చివ్వెంల మండల పరిధిలో బుధవారం తెల్లవారుజామున డివైడర్ను కారు ఢీకొన్న ప్రమాదంలో దంపతులు దుర్మరణం చెందగా మరో ముగ్గురు గాయపడ్డారు. ఎన్టీఆర్ జిల్లా రెడ్డిగూడెం మండల కేంద్రానికి చెందిన పెద్దగమళ్ల హేమాంబరధర్, రజిత దంపతులు పదేళ్ల క్రితం ఆస్ట్రేలియాకు వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. వారికి కుమార్తె భవాగ్న, కుమారుడు పల్విత్ ఉన్నారు. రజిత ఐటీ కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తుండగా, హేమాంబరధర్ ప్రైవేట్ కంపెనీలో మేనేజర్గా పనిచేస్తున్నారు. రెండేళ్ల క్రితమే ఆడిలైడ్లో ఇల్లు కోనుగోలు చేశారు. కరోనాతో ఇంతకాలం ఆ కుటుంబం భారత్కు రాలేకపోయింది. తిరిగి ఆంక్షలు ఎత్తివేత, విమాన ప్రయాణాల పునరుద్ధరణతో తిరిగి వచ్చింది. స్వగ్రామానికి వెళ్తూ.. హేమాంబరధర్ కుటుంబ సభ్యులు ఈ నెల 25న హైదరాబాద్కు వచ్చారు. అక్కడ బంధువుల ఇంట్లో ఒకరోజు ఉండి, 26న రాత్రి పది గంటల సమయంలో తమ గ్రామానికి చెందిన తిరుపతిరావు కారు కిరాయికి మాట్లాడుకుని రెడ్డిగూడెం బయలుదేరారు. సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం జి.తిరుమల్గిరి గ్రామ శివారులో విజయవాడ–హైదరాబాద్ రహదారిపై కారు కల్వర్టును ఢీకొట్టడంతో హేమంబరధర్(47) అక్కడికక్కడే మతిచెందగా, రజిత సూర్యాపేట ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్ను మూశారు. వారి పిల్లలు భవాగ్న, పల్విత్, డ్రైవర్ తిరుమలరావు తీవ్రంగా గాయపడ్డారు. వారు విజయవాడలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఎస్ఐ విష్ణుమూర్తి ఘటన స్థలాన్ని పరిశీలించారు. కారు డ్రైవర్ నిద్రమత్తుతోనే ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. -
పెళ్లయిన నెల రోజులకే.. భర్త మెడ కోసింది
దామెర: వారికి నెల రోజుల కింద పెళ్లయింది. మొదట బాగానే ఉన్న అమ్మాయి.. కొద్దిరోజులకు అసలు విషయం బయటపెట్టింది.. తన కు ఇష్టంలేని పెళ్లి చేశారని భర్తతో చెప్పింది.. మెల్లగా సర్దుకుంటుందిలే అని భర్త అనుకున్నాడు.. కానీ ఓ అర్ధరాత్రి.. బాత్రూమ్కని లేచిన అమ్మాయి.. మెల్లగా బ్లేడ్ తీసుకుని వచ్చింది.. బెడ్పై పడుకుని ఉన్న భర్త మెడ కోసేందుకు యత్నించింది.. అది గమనించిన భర్త గట్టిగా అరవడంతో కుటుంబ సభ్యులు వచ్చి ఆస్పత్రికి తరలించారు. హనుమకొండ జిల్లా దామెర మండలం పసరగొండలో సోమవారం ఈ ఘటన జరిగింది. పరకాల పోలీ సులు,బాధితుడు ఈ వివరాలు వెల్లడించారు. ఇష్టం లేదని చెప్పి.. పసరగొండకు చెందిన మాడిశెట్టి రాజు గ్రామ సమీపంలోని ఒక క్రషర్లో డ్రైవర్గా పనిచేస్తున్నాడు. అతడికి ఆత్మకూర్ మండలం మల్లక్కపేట గ్రామానికి చెందిన హేమలత అలియాస్ అర్చనతో మార్చి 25న పెళ్లి జరిగింది. కొద్దిరోజుల క్రితం తనకు ఇష్టంలేని పెళ్లి చేశారని భర్త రాజుతో చెప్పింది. రాజు అంటే ఇష్టం లేదంది. అయినా రాజు ఏమీ అనలేదు. తనంటే ఇష్టం కలిగే ప్రయత్నాలు చేస్తూ వచ్చాడు. ఈ క్రమంలో ఆదివారం అర్ధరాత్రి సమయంలో అర్చన బాత్రూమ్కని లేచి అటుఇటు తిరిగి నిద్రపోయింది. తర్వాత 2 గంటల సమయంలో మళ్లీ లేచింది. వెళ్లి బ్లేడ్ తీసుకొని వచ్చి రాజు గొంతు కోసేందుకు ప్రయత్నించింది. అదే సమయంలో రాజు ఓ పక్కకు తిరిగి పడుకోవడంతో అతడి మెడపై గాయమైంది. ఆమె మరోసారి బ్లేడుతో కోసేందుకు సిద్ధమయ్యేసరికి రాజు తేరుకున్నాడు. అర్చనను నెట్టివేసి గట్టిగా అరిచాడు. కుటుం బ సభ్యులు పరుగెత్తుకువచ్చి రాజును రక్షిం చారు. మెడపై గాయంతో రక్తం కారుతున్న రాజును.. వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. వైద్యులు రాజుకు చికిత్స చేశారు. మెడ వెనుకవైపున గాయమవడం వల్ల ప్రాణాపాయం తప్పిందని చెప్పి ఇంటికి పంపించారు. నిందితురాలిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది. కేసు పూర్తి వివరాలను తర్వాత ప్రకటిస్తామని ఏసీపీ జూపల్లి శివరామయ్య తెలిపారు. సర్దుకుంటుందని అనుకున్నా.. ‘నెల క్రితం మా పెళ్లయింది. ఈ మధ్యే తనకు నేనంటే ఇష్టం లేదని చెప్పింది. పెళ్లయి కొన్నిరోజులే కదా అయింది. నెమ్మదిగా సర్దుకుంటుందని అనుకున్నా.. రాత్రి పడుకున్న తర్వాత లేచింది. బాత్రూమ్కు వెళ్తుందనుకున్నా.. కానీ బ్లేడు తెచ్చి గొంతుకోయాలని చూసింది. నేను గట్టిగా అరిచే సరికి పక్క గదిలోకి వెళ్లి దాక్కుంది’ అని రాజు తెలిపాడు. -
బెంగళూరులో దంపతుల హత్య... అనంతపురంలో నిందితుల అరెస్టు
బనశంకరి: వరలక్ష్మీ వ్రతం రోజున బెంగళూరు కుమారస్వామి లేఅవుట్లో దంపతుల హత్య కేసులో నిందితులను పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. ప్రధాన సూత్రధారి అనంతపురం జిల్లాకు చెందిన నారాయణస్వామి, తిరుమలదేవరపల్లి గంగాధర, దేవాంగం రాము, షేక్ ఆసిఫ్ అరెస్టయిన వారిలో ఉన్నారు. వివరాలిలా ఉన్నాయి. కాంతరాజు, ప్రేమలత దంపతుల ఇంట్లో నారాయణస్వామి అద్దెకు ఉన్నాడు. యజమాని ఇంట్లో డబ్బు, బంగారం దోపిడీకి పథకం వేశాడు. వరలక్ష్మీ వ్రతం రోజున మధ్యాహ్నం తన ముగ్గురు అనుచరులతో కలిసి వచ్చాడు. ప్రేమలత తలుపు తీసి ఇంట్లోకి పిలిచి తాగడానికి నీరు, టీ ఇచ్చింది. చదవండి: 2 సెంట్ల భూమి కోసం.. 20 ఏళ్లుగా పోరాటం..! దంపతులతో మాట్లాడిన కాసేపటి తరువాత దేవాంగం రాము బాత్రూమ్ ఎక్కడ ఉందని ప్రేమలతను అడిగాడు. అనంతరం ఆమెను బాత్రూమ్లోకి తోసి బైక్ క్లచ్ వైర్తో గొంతుకు బిగించి చంపాడు. ఇతడికి మరొకరు సహకరించారు. ఇంతలో హాల్లో నారాయణస్వామి మరో వ్యక్తితో కలిసి కాంతరాజును తలదిండుతో అదిమి, చాకుతో గొంతుకోసి హత్యచేశారు. అనంతరం బీరువాను తెరిచి అందులో ఉన్న 193 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ.2 వేల నగదు తీసుకుని పారిపోయారు. మెజిస్టిక్ బస్టాండు నుంచి అనంతపురానికి ఉడాయించారు. వందలాది సీసీ కెమెరా చిత్రాలు, ప్రత్యక్ష సాక్షులను విచారించి నిందితుల ఆచూకీ కనిపెట్టిన పోలీసులు వారిని అనంతపురం జిల్లాల్లో వేర్వేరు ప్రాంతాల్లో అరెస్టు చేశారు. వీరు బెంగళూరులో మరో రెండు హత్యలు చేసినట్లు వెల్లడైందని, వాటిపైనా దర్యాప్తు చేస్తున్నామని దక్షిణ విభాగ డీసీపీ హరీశ్పాండే, సుబ్రమణ్యపుర ఏసీపీ శివకుమార్ తెలిపారు. చదవండి: భూమి లాక్కున్నారని రైతు ఆత్మహత్య -
భర్తను హత్య చేసిన భార్య .. పోలీసుల రంగప్రవేశంతో..
తాడికొండ: భర్తను రోకలి బండతో హత్యచేసి, కళ్లుతిరిగి పడిపోయాడని నమ్మించే యత్నంలో తలపై ఉన్న గాయాలు చూసి మృతుడి అన్న ఫిర్యాదుతో బండారం బట్టబయలైన ఘటన తాడికొండలో చోటుచేసుకుంది. మంగళగిరి రూరల్ సీఐ భూషణం కథనం మేరకు.. తాడికొండకు చెందిన చిలకా రమేష్ కు అదే గ్రామానికి చెందిన నిర్మలతో పదేళ్ల క్రితం ప్రేమ వివాహం జరిగింది. తాడికొండ వ్యవసాయ మార్కెట్ యార్డులో గార్డుగా విధులు నిర్వహిస్తున్న రమేష్కు ఐదేళ్ల క్రితం పక్షవాతం వచ్చి కోలుకున్నాడు. అయితే అప్పటి నుంచి కుటుంబంలో కలహాలు రేగుతుండటం పరిపాటిగా మారి గతంలో రెండుసార్లు భార్య తనపై హత్యాయత్నం చేసిందని మృతుడు రమేష్ తన అన్నకు చెప్పాడు. చదవండి: ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు పోలీసులు మృతి ఈ క్రమంలో శుక్రవారం రాత్రి ఇంట్లో వివాదం జరిగిన క్రమంలో భార్య నిర్మల భర్తను రోకలితో తలపై గట్టిగా కొట్టడంతో స్పృహతప్పి పడిపోయాడు. దీనిని కప్పిపుచ్చుకునే క్రమంలో శనివారం ఉదయం కళ్లుతిరిగి పడిపోయాడంటూ నాటకం ఆడి 108 వాహనం ద్వారా గుంటూరు జీజీహెచ్కు తరలించగా చికిత్స పొందుతూ శనివారం రాత్రి 9:30 గంటలకు చనిపోయాడు. ఆదివారం అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తుండగా అనుమానం వచ్చిన అన్న శవాన్ని చూడగా తలపై గాయం కనిపించడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఘటనా స్థలానికి చేరుకున్న మంగళగిరి రూరల్ సీఐ భూషణం మృతుడి భార్య, అమె కుటుంబ సభ్యులను అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో విచారణ చేయగా నిజం ఒప్పుకుంది. మృతదేహాన్ని పంచనామా నిమిత్తం జీజీహెచ్కు తరలించగా మృతుడి సోదరుడు చిలకా దాసు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ భూషణం తెలిపారు. చదవండి: భారీగా ఎర్రచందనం పట్టివేత -
కూతురు లేని లోకం వద్దనుకుని..
బూర్గంపాడు / పాల్వంచ: కూతురు మరణాన్ని ఆ దంపతులు జీర్ణించుకోలేకపోయారు. బిడ్డ లేని జీవితం తమకొద్దు అనుకుని గోదావరిలో దూకి బలవన్మరణానికి పాల్పడ్డారు. హైదరాబాద్ ఈసీఐఎల్కు చెందిన పమ్మి లక్ష్మణచారి (55), హేమలత (48) దంపతులు అక్కడే టైలరింగ్ చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ఒక కుమార్తె ఉండగా, ఇటీవల ఆమె గుండె సంబంధిత వ్యాధితో మృతి చెందింది. అపురూపంగా పెంచుకుంటున్న కూతురు మరణాన్ని జీర్ణించుకోలేని ఆ దంపతులు మానసికంగా కృంగిపోయారు. దీంతో ఆందోళనలో ఉన్న వీరిని పాల్వంచకు చెందిన హేమలత సోదరుడు వేమనకుమార్ పది రోజుల క్రితం తమ ఇంటికి తీసుకువచ్చారు. ఈ క్రమంలో బుధవారం ఆయన విధుల నిమిత్తం మణుగూరు వెళ్లారు. ఆయన భార్య అంతకు ముందురోజే హైదరాబాద్ వెళ్లారు. వేమనకుమార్ సాయంత్రం విధులు ముగించుకుని వచ్చేసరికి ఇంట్లో సోదరి, బావ కనిపించలేదు. లక్ష్మణచారి ఫోన్ ఎత్తకపోవడంతో ఇంట్లోని వారి వస్తువులను పరిశీలించగా ఫోన్, సూసైడ్ నోట్ కనిపించాయి. వెంటనే పాల్వంచ పోలీస్స్టేషన్లో దంపతుల అదృశ్యంపై ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉండగా, గురువారం రాత్రి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు వద్ద గోదావరిలో దస్తీతో చేతులు ముడివేసిఉన్న రెండు మృతదేహాలు జాలర్లకు కనిపించాయి. వాటిని లక్ష్మణాచారి, హేమలత మృతదేహాలుగా గుర్తించి బూర్గంపాడు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు ఎస్ఐ జితేందర్ తెలిపారు. -
దంపతులను కలిపిన సుప్రీంకోర్టు సీజే
సాక్షి, న్యూఢిల్లీ : రెండు దశాబ్దాలుగా న్యాయ పోరాటం చేస్తున్న దంపతులు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సూచనలతో తిరిగి కలిసి కాపురం చేయనున్నారు. ఏపీ హైకోర్టు ఆదేశాలు సవాల్ చేస్తూ ఆంధ్రప్రదేశ్కు చెందిన మహిళ దాఖలు చేసిన పిటిషన్ను బుధవారం సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ సూర్యకాంత్లతో కూడిన ధర్మాసనం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించింది. ఈ సందర్భంగా దంపతులిద్దరితో ధర్మాసనం మాట్లాడే సమయంలో ఆంగ్లంలో మాట్లాడడానికి మహిళ ఇబ్బంది పడటం గమనించిన జస్టిస్ ఎన్వీ రమణ.. ఆమెను తెలుగులో మాట్లాడాలని సూచించారు. ‘మీ భర్త జైలుకు వెళ్లడం వల్ల ఉద్యోగం, వేతనం కోల్పోతారు. అదే సమయంలో నెలానెలా వచ్చే భరణం మీరు కోల్పోతారు’ అని జస్టిస్ ఎన్వీ రమణ పేర్కొన్నారు. సీజేఐ సూచన అనంతరం భర్తతో కలిసి ఉండడానికి ఆ మహిళ అంగీకరించారు. అనంతరం, భార్యభర్తలు ఇద్దరూ వేర్వేరుగా తామిద్దరూ కలిసి ఉంటామంటూ రెండు వారాల్లో అఫిడవిట్లు దాఖలు చేయాలని జస్టిస్ ఎన్వీ రమణ సూచించారు. ఈ దంపతులకు 1998లో వివాహం అయింది. 2001లో వేధింపులకు సంబంధించి భర్తపై క్రిమినల్ కేసు దాఖలు చేశారు. ట్రయల్ కోర్టు 2002లో మహిళ భర్తకు 498 (ఏ) వరకట్న వేధింపులు ప్రకారం జైలు, జరిమానా విధించింది. మహిళ అత్త, మరదలకు కూడా అదే శిక్ష విధించింది. భర్త రివిజన్కు వెళ్లగా కోర్టు ట్రయల్ కోర్టు తీర్పునే సమర్థించింది. అనంతరం హైకోర్టుకు వెళ్లగా జైలు శిక్షను మినహాయిస్తూ తీర్పు ఇచ్చింది. హైకోర్టు తీర్పు సవాల్ చేస్తూ ఆమె తన భర్తకు జైలు శిక్ష వేయాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. -
కరోనా సోకిన భార్య.. భర్త చేసిన పనికి నెటిజన్లు ఫిదా..
ఐజ్వాల్: కరోనా సోకిన తన భార్యను ఆమె భర్త ఐసోలేషన్ వార్డుకు తీసుకెళ్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. వివరాలు.. మిజోరాంకు చెందిన దంపతులలో , సదరు వ్యక్తి భార్యకు కరోనా సోకింది. సాధారణంగా కరోనా సోకిన వారికి దూరంగా ఉండాలి. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్న మహమ్మారి వెంటనే సోకుతుంది. అయితే, తన భార్యను ఐసోలేషన్ సెంటర్కు తీసుకెళ్లాటానికి ఆమె భర్త వినూత్నంగా ఆలోచించాడు. అతని జీప్కు, వెనుకల ఒక చిన్న ట్రాలీని ఏర్పాటు చేశాడు. అందులో ఆమె కూర్చివేసుకొని హాయిగా కూర్చుంది. ఇలా ఐసోలేషన్ వార్డుకు తరలించాడు. అయితే, ఈ వీడియోను ఐపీఎస్ అధికారి రిపున్ శర్మ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు. ఇప్పుడిది వైరల్గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు ‘వావ్.. మీ భార్య అదృష్ట వంతురాలు’, ‘ మీ తెలివికి హ్యాట్సాఫ్’, అంటూ కామెంట్లు పెడుతున్నారు. అయితే, తాజాగా మిజోరాంలో వైరస్ ఉధృతి కొనసాగుతుంది. గడచిన 24 గంటలలో 312 కొత్త కేసులు నమోదైయ్యాయి. 41 మంది చనిపోయారు. అదే విధంగా రాష్ట్రంలో 3,144 కేసులు ఆక్టివ్ గా ఉన్నాయని తెలుస్తుంది. ఇప్పటి వరకు 9,214 మంది ఈ మహమ్మారి బారినుంచి కోలుకున్నారు. చదవండి: నదిలో దూకి ఆత్మహత్యకు ప్రయత్నించిన మహిళ.. కారణం అదేనా.. చదవండి: బ్రిడ్జిపై వింత ఆకారం: పోలీసులు ఏమన్నారంటే.. -
USA: భార్యతో గొడవ.. భర్తకు షాకిచ్చిన అమెరికా కోర్టు
వాషింగ్టన్: టెక్సాస్కు చెందిన సునీల్ కే అకులా (32) అనే భారత సంతతి వ్యక్తికి 56 నెలల జైలు శిక్ష, మూడు సంవత్సరాల పర్యవేక్షణ విధించింది అక్కడి కోర్టు. ఫెడరల్ ప్రాసిక్యూటర్ల ప్రకారం.. "సునీల్ టెక్సాస్లోని తన ఇంటి నుంచి మసాచుసెట్స్ లోని అగావామ్కు తన భార్యతో 2019, ఆగష్టు 6న ప్రయాణించాడు. ఆ సమయంలో అతడు ఆమెతో గొడవ పడ్డాడు. అతడు తన భార్యను అపార్ట్మెంట్ నుంచి తరిమివేసి, తన కారులో ఎక్కమని బలవంతం చేశాడు. ఆమెను తిరిగి టెక్సాస్కు తీసుకువెళుతున్నానని చెప్పాడు. తన ఉద్యోగానికి రాజీనామా చేయమని బలవంతం చేశాడు. ఆమె ల్యాప్టాప్ను పగులగొట్టి హైవేపై విసిరాడు." అంటూ ప్రాసిక్యూటర్స్ ఆరోపించారు. ప్రయత్నాలు విఫలం సునీల్ దౌర్జన్యంపై అతని భార్య ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగంలోకి దిగారు. అతడిని అరెస్టు చేశారు. అయితే, కేసు నుంచి బయటపడేందుకు సునీల్ ఎన్నో ప్రయత్నాలు చేసిన ఫలితం లేకుండా పోయింది. అతను పోలీసుల అదుపులో ఉన్నప్పుడు, భారతదేశంలో ఉన్న తన కుటుంబ సభ్యులకు చాలాసార్లు ఫోన్ చేశాడు. భార్య తన కేసును ఉపసంహరించుకోవాలని ఆమె తండ్రిని ఒప్పించటానికి ప్రయత్నించాడు. ఆమెను కూడా బతిమాలుకున్నాడు. ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. అతని భార్య తరపు లాయర్ వాదనలతో ఏకీభవించిన కోర్టు సునీల్కు జైలు శిక్ష ఖరారు చేసింది. (చదవండి: వాకింగ్ చేస్తున్నట్లు నటిస్తూ.. మహిళల ఫోటోలు తీసిన వృద్ధుడు) -
నా భర్తకు ఇంజెక్షన్లు ఇవ్వండి.. లేకపోతే చస్తా!
ఇండోర్: బ్లాక్ ఫంగస్ (మ్యూకోర్మైకోసిస్) బారినపడి, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తన భర్తకు యాంఫోటెరిసిన్–బి ఇంజెక్షన్లు ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరిస్తూ ఓ మహిళ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మధ్యప్రదేశ్ రాష్ట్రం ఇండోర్లోని బాంబే హాస్పిటల్లో సదరు మహిళ భర్త (40) చికిత్స పొందుతున్నారు. బ్లాక్ ఫంగస్ చికిత్సలో భాగంగా ఇప్పటికే యాంఫోటెరిసిన్–బి ఇంజెక్షను ఇచ్చారు. మరికొన్ని ఇవ్వాల్సి ఉంది. కానీ, అందుబాటులో లేవు. ఆందోళనకు గురైన అతడి భార్య ఆత్మహత్య చేసుకుంటానని బెదిరిస్తూ మంగళవారం వీడియో పోస్టు చేసింది. ‘‘బాంబే హాస్పిటల్ నుంచి మాట్లాడుతున్నా.. బ్లాక్ ఫంగస్ సోకడంతో నా భర్తను ఈ ఆసుపత్రిలోనే చేర్పించాం. ఆయనకు కళ్లు, దవడల్లో విపరీతమైన నొప్పి వస్తోంది. ఇక్కడ యాంఫోటెరిసిన్–బి ఇంజెక్షన్లు లేవు. ఈ స్థితిలో నా భర్తను ఎక్కడికి తీసుకెళ్లగలను? ఈ రోజు ఇంజెక్షన్ ఇవ్వకపోతే ఆసుపత్రి పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటా. అంతకు మించి మరో మార్గం లేదు’’ అని వీడియోలో ఆమె స్పష్టం చేసింది. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి, ఆరోగ్య శాఖ మంత్రి, ఇండోర్ కలెక్టర్ను కూడా ఉద్దేశించి మాట్లాడింది. బాధిత మహిళకు కౌన్సిలింగ్ ఇచ్చామని, భర్తకు ఆరోగ్యం బాగా లేకపోవడంతో మానసికంగా కలత చెందిందని బాంబే ఆసుపత్రి జనరల్ మేనేజర్ చెప్పారు. ఆమె భర్తకు ఇప్పటివరకు 59 ఇంజెక్షన్లు ఇచ్చామని, మరికొన్ని ఇవ్వాల్సిన అవసరం ఉందని తెలిపారు. ప్రస్తుతానికి తమ వద్ద అవి అందుబాటులో లేవని ఆయన వివరించారు. (చదవండి: Delhi: చేతులపై మోసుకెళ్లి..బామ్మకు కరోనా టీకా) -
మద్యం సేవించి భార్యకు వేధింపులు..ఇటుకలతో కొట్టిన భార్య
గీసుకొండ: భర్త నిత్యం మద్యం తాగొచ్చి కొడుతుండడంతో తట్టుకోలేక ఓ మహిళ ఇటుకలతో కొట్టగా.. ఆ వ్యక్తి మృతి చెందాడు. వివరాలిలా ఉన్నాయి.. గూడూరు మండలం నాంపల్లికి చెందిన నాగమణిని శనిగరం కార్తీక్ (35) ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. కాగా, నాలుగేళ్ల నుంచి నాగమణి అక్కతో కార్తీక్ వివాహేతర సంబంధం కొనసాగిస్తుండడంతో ఆమెను భర్త వదిలేశాడు. దీంతో నాగమణి, ఆమె అక్కతో కలసి కార్తీక్ వరంగల్ అర్బన్ జిల్లా కమలాపూర్లో నివాసం ఉంటున్నాడు. కార్తీక్ తరచూ నాగమణిని కొడుతుండగా, ఇటీవల గాయపడిన ఆమె హన్మకొండలో చికిత్స చేయించుకుంది. అక్కడి నుంచి నాగమణి మరో సోదరి సుగుణ నివాసముండే కీర్తినగర్కు ఈనెల 11న వచ్చింది. అదేరోజు రాత్రి కార్తీక్ మద్యం తాగొచ్చి గొడవ పడగా, నాగమణి భర్తను నెట్టి వేయడంతో కింద పడ్డాడు. ఆమె ఇటుకలతో కార్తీక్ను తీవ్రంగా కొట్టింది. గాయపడిన అతడిని 108 అంబులెన్స్లో వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. మృతుడి తమ్ముడు కుమారస్వామి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు గీసుకొండ ఇన్స్పెక్టర్ రాయల వెంకటేశ్వర్లు తెలిపారు. (చదవండి: కిరోసిన్ పోసి.. నిప్పంటించి..) -
మీ వద్ద కరోనా మందులు ఉన్నాయా.. మేము తీసుకుంటాం!
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి నుంచి ప్రజలను కాపాడేందుకు వైద్యులు, వైద్య సిబ్బంది నిరంతరం శ్రమిస్తున్నారు. ఈ క్రమంలో ముంబైలోని డాక్టర్ దంపతులు మార్కస్ రాన్నీ, రైనా.. కొవిడ్-19 నుంచి కోలుకున్న వారి నుంచి మందులు సేకరిస్తున్నారు. ఆ సేకరించిన మందులను అవసరమైన రోగులకు అందిస్తున్నారు. ఈ డాక్టర్స్ జంట మే 1న మెడ్స్ ఫర్ మోర్ అనే సంస్థను ప్రాంరంభించింది. పది రోజుల క్రితం ప్రారంభమైన ఈ సంస్థ 10 రోజుల్లో 20 కిలోగ్రాముల కోవిడ్ మందులను కోలుకున్న వారి నుంచి సేకరించింది. ‘‘మా వద్ద పని చేసే వైద్య సిబ్బంది కుటుంబ సభ్యుల్లో ఒకరు కరోనా బారిన పడ్డారు. ఆ సమయంలో మందులు కావలసి వచ్చింది. అయితే కోలుకున్న వారి వద్ద కరోనా మందులు మిగిలి వృధా అయ్యే అవకాశం ఉంది. ఆ ఆలోచనతో ఇరుగుపొరుగు వారి సహాయంతో కోవిడ్ మందులు సేకరించడానికి ఈ మిషన్ను ప్రారంభించాం. కరోనా బారిన పడిన పేదలకు, గ్రామీణ ప్రాంతాల్లోని ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ కేంద్రాలకు ఈ ఔషధాలను విరాళంగా అందిస్తాం.’’ అని డాక్టర్ దంపతులు పేర్కొన్నారు. కోవిడ్ -19 రోగులకు చికిత్స చేయడానికి ఉపయోగిస్తున్న యాంటీ బయాటిక్స్, ఫాబిఫ్లు, పెయిన్ కిల్లర్, స్టెరాయిడ్లు, ఇన్హేలర్లు, విటమిన్లు, యాంటాసిడ్లు వంటి అన్ని రకాల ఔషధాలను మెడ్స్ ఫర్ మోర్ సేకరిస్తుంది. వాటితో పాటు పల్స్ ఆక్సిమీటర్లు, థర్మామీటర్లు వంటి ప్రాథమిక ఔషధ పరికరాలను కూడా సేకరిస్తుంది. (చదవండి: కేంద్రం టీకాలను దుర్వినియోగం చేస్తోంది: సిసోడియా) -
కిలాడీ కపుల్.. డబ్బులకు ఎక్కువ వడ్డీ ఇస్తామని..
సాక్షి, బంజారాహిల్స్: వ్యాపారంలో పెట్టుబడి కోసం డబ్బు కావాలంటూ నమ్మించి మోసం చేసిన దంపతులపై బంజారాహిల్స్ పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బంజారాహిల్స్ రోడ్ నెం.12లోని శ్రీరాంనగర్కు చెందిన అశ్వని ముకుందం, భాగ్యలక్ష్మి దంపతులు తెలిసిన వారి వద్ద నుంచి వ్యాపారం కోసం పెట్టుబడులు కావాలని భారీగా వడ్డీతో ఆరు నెలల్లో డబ్బులు తిరిగి ఇస్తామని నమ్మించి లక్షలాది రూపాయలు వసూలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఈసీఐఎల్, నాగారం సమీపంలోని శ్రీలక్ష్మీనగర్ కాలనీకి చెందిన ఎస్.పావని వద్ద నుంచి 2019లో రూ.15లక్షలు అప్పుగా తీసుకున్నారు. ఆరు నెలల్లో వడ్డీతో కలిపి డబ్బులు తిరిగి ఇస్తామంటూ నమ్మించిన దంపతులు ఆ తర్వాత డబ్బులు ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారు. ఈ మధ్య వారి గురించి ఆరా తీయగా చాలా మంది వద్ద నుంచి ఇదే విధంగా లక్షలాది రూపాయలు వసూలు చేసినట్లు తేలింది. దీంతో తాము మోసపోయామని గుర్తించి ఆదివారం బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా చీటింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
వామ్మో.. కిలేడీ చేసిన పనికి విసిగిపోయిన అతడు!
సాక్షి, సదాశివపేట రూరల్ (సంగారెడ్డి): భార్యాభర్తల మధ్య గొడవలకు కారణమవుతుందని ఓ మహిళను అతి కిరాతకంగా హత్య చేశాడు ఓ కిరాతకుడు. గత నెల 29న సదాశివపేట మండలంలోని ముబారక్ పూర్ గ్రామ శివారులో సన్నం వాగు సమీపంలో అనుమానాస్పద స్థితిలో జరిగిన మహిళ హత్య కేసును ‘పేట’ పోలీసులు ఛేదించారు. శనివారం పట్టణంలోని పోలీస్ స్టేషన్లో హత్యకు సంబంధించిన వివరాలను సంగారెడ్డి డీఎస్పీ బాలాజీ, సీఐ సంతోష్ కుమార్ విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. సంగారెడ్డి మండలంలోని గుడితాండకు చెందిన రమావత్ లక్ష్మీ అలియాస్ బులీబాయి(38) అడ్డమీద కూలీ పని చేస్తూ జీవనాన్ని కొనసాగిస్తుంది. ఈమెకు సంగారెడ్డి పట్టణంలోని మారుతీనగర్ కు చెందిన వడ్డే నర్సింలు(38)తో పరిచయం ఏర్పడింది. మూడేళ్లుగా రమావత్ లక్ష్మీతో నర్సింలు, అతడి భార్య ఎల్లమ్మకు పరిచయం ఉంది. అందరూ కలిసి కూలి పనులకు వెళ్లేవారు. భార్యాభర్తల మధ్య గొడవలు పెడుతుందని ఈ మధ్యకాలంలో భార్య ఎల్లమ్మ తరుచూ నర్సింలుతో గొడవలు పడుతుంది. తనపై లేనిపోని మాటలు తన భార్యకు చెప్పి గొడవలకు కారణమవుతున్న లక్ష్మీని ఎలాగైనా చంపాలని నర్సింలు నిర్ణయించుకున్నాడు. గత నెల 29న బైక్పై లక్ష్మీని ఇరిగిపల్లికి తీసుకెళ్లి ఇద్దరూ కలిసి కల్లు సేవించారు. అనంతరం రెండు బాటిల్లు తీసుకొని తర్వాత తాగుదామని చెప్పి ముబారక్ పూర్(బి) గ్రామ శివారులో గల సన్నం వాగు ప్రక్కన ఉన్న తుమ్మ చెట్ల పొదలకు తీసుకొని కట్టతో ఆమెను తీవ్రంగా కొట్టి చంపేశాడు. ఈ నెల 5న ఘటన వెలుగులోకి రావడంతో గుర్తుతెలియని మృతదేహాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. పోలీసులు చాకచక్యంగా వారం రోజుల్లో కేసును ఛేదించారు. నిందితుడు నర్సింలును అదుపులోకి తీసుకొని అతడి నుంచి లక్ష్మికి సంబంధించిన కడియాలు, నిందితుడి బైక్ స్వాధీనం చేసుకొని రిమాండ్కు తరలించారు. త్వరితగతిన కేసును ఛేదించిన సీఐ సంతోష్ కుమార్ ను ప్రత్యేకంగా అభినందించి.. పోలీస్ సిబ్బంది రమేశ్, వీరేశం, శ్రీనులకు డీఎస్పీ బాలాజీ రివార్డులు అందజేశారు. -
వానల్లో వరదల్లో స్కూటర్ ప్రయాణం
ఆమె టీచర్ కావడానికి డిప్లమా పరీక్ష రాయాలి. కాని ఆరునెలల గర్భిణి. సెంటర్ ఏమో 1200 కిలోమీటర్ల దూరం. ప్రయాణ సాధనాలు, డబ్బు రెండూ లేవు. ఆ భర్త సంకల్పించాడు. తన స్కూటర్పై ఆమెను తీసుకొని అంత సుదీర్ఘ దూరానికి బయల్దేరాడు. ఈ సంవత్సరం పరీక్షలు రాస్తే భార్య టీచర్ కావడానికి యోగ్యత సంపాదిస్తుంది. 2019లో ఆమె రెండేళ్ల డి.ఇడి (డిప్లమా ఇన్ ఎడ్యుకేషన్) కోర్సు మొదటి సంవత్సరం పరీక్షలు రాసేసింది. రెండో సంవత్సరం పరీక్షలు లెక్కప్రకారం జూలైలో జరగాలి. కాని కరోనా వల్ల ఎప్పుడు జరుపుతారో తెలియదు. ఆమె కరెస్పాండెన్స్ ద్వారా ఆ కోర్స్ చదువుతోంది. సొంత ప్రాంతం జార్ఖండ్. ఉండేది భర్తకు ఎక్కడ పని దొరికితే అక్కడ. ఇప్పుడు హటాత్తుగా సెప్టెంబర్ 1 నుంచి పరీక్షలు అని సమాచారం వచ్చింది. ఆ సమయానికి ఆమె జార్ఖండ్లో తన బంధువు ఇంట్లో భర్తతో పాటు ఉంటోంది. అక్కడి నుంచి ఎగ్జామినేషన్ సెంటర్కు సరిగ్గా 1200 కిలోమీటర్ల దూరం ఉంది. ఏం చేయాలి? ఇది సమస్య. ధనుంజయ్ (27) జార్ఖండ్ గిరిజనుడు. 2019 డిసెంబర్లో అతనికి సోని (22)తో పెళ్లయ్యింది. ప్రస్తుతం ఆమె ఆరునెలల గర్భవతి. ధునంజయ్ గుజరాత్లో కేటరింగ్ ఏజెన్సీకి వంటవాడిగా పని చేసేవాడు. అతనికి పది వేలు వచ్చేది. పెళ్లయ్యాక అక్కడే కాపురం పెట్టాడు. కాని లాక్డౌన్ తర్వాత పనిపోయింది. అక్కడ బతికే వీల్లేకపోయింది. భార్యను తీసుకుని జార్ఖండ్లోని గొడ్డా జిల్లాలో ఉన్న బంధువుల ఇంటికి వచ్చాడు. ధనుంజయ్కు ఎనిమిది వరకే చదివాడు. కాని టీచర్ కావాలనే కోరికతో డి.ఇడి చేస్తున్న భార్య కోరికను మన్నించాడు. ఆమె టీచరు కావడానికి సహకరిస్తానని చెప్పాడు. కాని రెండో సంవత్సరం పరీక్షల తేదీ హటాత్తుగా వచ్చింది. గ్వాలియర్లో పది రోజులు ఉండి పరీక్షలు రాస్తే. రాస్తే, సర్టిఫికెట్ వస్తే టీచర్ పోస్టులు పడినప్పుడు అప్లై చేయడానికి సోని యోగ్యురాలవుతుంది. పరీక్షల తేదీని చూసిన భార్యాభర్తలకు ఏం చేయాలో తోచలేదు. కరోనా వల్ల సరిగ్గా బస్సులు, రైళ్లు నడవడం లేదు. టాక్సీ మాట్లాడుకుని వెళ్లి వద్దామంటే వెళ్లడానికి 30 వేలు అడిగారు. ‘పరీక్షలు ముఖ్యం’ అని ఇద్దరూ అనుకున్నారు. వాళ్ల దగ్గర ఒక పాత స్కూటర్ ఉంది. దాని మీదే బయలుదేరడానికి సిద్ధమయ్యారు. నగ తాకట్టు పెడితే పది వేలు వచ్చాయి. వాటితో ఆగస్టు 28 తెల్లవారుజామున ప్రయాణం మొదలెట్టారు. బిహార్, ఉత్తరప్రదేశ్ల మీదుగా వీరు మధ్యప్రదేశ్లోని గ్వాలియర్కు చేరుకున్నారు. కాని ఈ ప్రయాణం సులువు కాదు. ఆమె గర్భిణి. చేతిలో ఉన్నది చిన్న స్కూటర్. రోడ్లు బాగా లేవు. పైగా వాన. చాలా చోట్ల వరద నీరు. ఒక్కటే రెయిన్ కోట్ ఉంది. దానిని భర్త ధరిస్తే వెనుక వైపు కూచున భార్య దాని కొసను తలపై కప్పుకుంది. ఒక రాత్రి వాళ్లు ముజఫర్ నగర్ (ఉత్తర ప్రదేశ్) ఆగారు. మరో రాత్రి ఒక పార్క్లో పడుకున్నారు. చివరకు గ్వాలియర్ చేరుకున్నారు. గ్వాలియర్లో పది రోజుల బస కోసం వెతుకులాడుకుంటున్నారు. ఈ విషయం మీడియా ద్వారా అందరికీ తెలిసింది. ఈ భార్యాభర్తల వీడియో వైరల్ అయ్యింది. వెంటనే గ్వాలియర్ కలెక్టర్ స్పందించాడు. తక్షణమే వారికి బస, ఆహారం అందించాడు. చేతి ఖర్చులకు డబ్బు కూడా ఇచ్చాడు. సోని గర్భవతి కనుక ఆల్ట్రాసౌండ్ పరీక్ష, ఇతర ఆరోగ్య పరీక్షలు కూడా నిర్వహించనున్నారు. ‘నీకు ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది?’ అని ధనుంజయ్ను అడిగితే ‘దశరథ్ మంజీ గురించి వినడం వల్ల వచ్చింది’ అన్నాడు. బిహార్కు చెందిన గిరిజనుడు దశరథ్ మంజీ తన భార్య చావుకు కారణమైన, ఊరికి దగ్గరి దారికి అడ్డంగా ఉన్న కొండను ఒక్కడే తొలిచి రోడ్డు వేయడం అందరికీ తెలిసిందే. అతన్నే ధనుంజయ్ ఆదర్శంగా తీసుకున్నాడు. ‘మరి నీకంత ధైర్యమో’ అని సోనిని అడిగితే ‘మా ఆయన్ను చూసే’ అని నవ్విందామె. ప్రస్తుతం వీరి సురక్షిత తిరుగు ప్రయాణానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. -
మొదటి రాత్రే భార్యను హత్య చేసి..
కలిసిన మనసులతో.. కలకాలం సుఖసంతోషాల్లో తోడు ఉంటానని ప్రమాణం చేశాడు. భార్య బానిస కాదని, ఆజన్మాంతం ప్రేమిస్తానని నమ్మించాడు. ఓ శుభముహూర్తంలో ఆమె మెడలో తాళి కట్టాడు. ఏడడుగులు వేయించాడు. ఇక జీవితం సుఖమయం అవుతుందని ఊహించిన యువతికి తొలిరేయే.. మృత్యు రాత్రిగా మారింది. మొగుడి రూపంలో మృత్యువు ఆమె నూరేళ్ల జీవితాన్ని చీకట్లో బలితీసుకుంది. తొలిరాత్రి రోజే భార్యను హతమార్చిన ఆ మానవ మృగం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తిరువళ్లూరు(తమిళనాడు): పెళ్లి చేసుకున్న గంటల్లోనే భార్యను దారుణంగా హత్య చేసి తానూ ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన తిరువళ్లూరు జిల్లా పొన్నేరి సమీపంలో కలకలం రేపింది. తిరువళ్లూరు జిల్లా పొన్నేరి సమీపంలో సోమంజేరి గ్రామానికి చెందిన క్రేన్ ఆపరేటర్ నిధివాసన్ (27). ఇతనికి సమీప బంధువు సడయన్కుప్పం గ్రామానికి చెందిన సంధ్య(22)తో జనవరిలో వివాహం నిశ్చమైంది. జూన్ 10న వివాహం వైభవంగా నిర్వహించాలని అనుకున్నా.. లాక్డౌన్ నేపథ్యంలో కొద్ది మంది బంధువుల సమక్షంలో అదే రోజు సమీపంలోని ఆలయంలో వివాహం జరిగింది. వివాహ సమయంలో బంగారు నగలు ద్విచక్ర వాహనం, ఇతర సామగ్రి అంటూ భారీగానే కట్నకానుకలు ఇచ్చారు. అర్ధరాత్రి కేకలు వేస్తూ.. బుధవారం వివాహం పూర్తయిన తరువాత తొలిరాత్రికి ఏర్పాట్లు చేశారు. అర్ధరాత్రి రాత్రి 12 గంటల సమయంలో యువతి గట్టిగా కేకలు వేసినట్టు తెలుస్తోంది. అయితే ఈ విషయాన్ని బంధువులు పట్టించుకోలేదు. గురువారం ఉదయం మూడు గంటలకు యువకుడు నీధివాసన్ తలుపులు తెరుచుకుని, గట్టిగా కేకలు వేస్తూ పరుగులు పెట్టడంతో బంధువులు దిగ్భ్రాంతి చెందారు. అనుమానంతో గదిలోకి వెళ్లి చూడగా యువతి రక్తపు మడుగులో పడి ఉంది. దీంతో కాట్టూరు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు యువతిని పరిశీలించగా, గడ్డపారతో పొడిచి దారుణంగా హత్య చేసినట్లు నిర్ధారించారు. మృతురాలి బంధువుల ఫిర్యాదు మేరకు మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న నిధివాసన్ కోసం గాలింపు చేపట్టారు. ఈ నేపథ్యంలో గ్రామ సమీపంలోని వేపచెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్టు సమాచారం అందుకున్న పోలీసులు యువకుడి మృతదేహాన్ని పోస్టుమారా్టనికి తరలించారు. వివాహమై 24 గంటలూ గడవక ముందే యువతి దారుణ హత్యకు గురి కావడం, యువకుడు సైతం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోవడం గ్రామంలో విషాదం నింపింది. చదవండి: అతడు.. ఆమె.. ఓ అన్న! గంజాయి మత్తే కారణమా? నిధివాసన్ గంజాయి, మద్యం అలవాట్లు ఉన్నట్టు పోలీసులు ప్రాథమిక విచారణలో నిర్ధారించారు. వివాహం నిశ్చయానికి ముందే మద్యానికి బానిసైన నీధివాసన్, మానసికరోగిగా మారిపోయాడని, సాధారణ స్థితికి రావడానికి మూడు నెలల పాటు మానసిక వైద్యశాలలో చిక్సిత కూడా తీసుకున్నట్టు పోలీసులు గుర్తించారు. నిధివాసన్ మానసిక పరిస్థితి సరిగ్గా లేకపోవడంతో పెళ్లి దాదాపు రద్దయ్యే పరిస్థితి ఏర్పడిందని, అయితే యువతిని బాగా చూసుకుంటామని, మద్యం వైపు వెళ్లడని యువకుడి తల్లిదండ్రులు ఇచ్చిన భరోసాతోనే వివాహం జరిగినట్టు పోలీసుల విచారణలో తేలింది. యువతిని హత్య చేసే సమయంలో మద్యం, గంజాయి మత్తులో ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
గృహమే కదా స్వర్గసీమ
ఏప్రిల్ 14 వరకూ ఇల్లు కదలకూడదు. లాక్డౌన్. ఆ తర్వాత ఆ తేదీ పొడిగింపు జరగవచ్చు. జరక్కపోనూ వచ్చు. ఇంట్లో ఉండటం బోర్ అని కొందరు అంటున్నారు. అరె ఇంట్లో ఉండటం ఇంత బాగుంటుందా అని కొందరు కనుగొంటున్నారు. ఇంటిని ఇష్టపడటమే ఇప్పుడు అందరూ చేయవలసింది. ఇంటిలో సమయాన్ని ఆనందమయం చేసుకోవడమే ఇప్పుడు అవసరమైనది. ఈ నేపథ్యంలో ఇంటి చుట్టూ ఉండే కొన్ని పాటలను, ఇంటిలోపలి పదనిసనలను గుర్తు చేసుకుందాం. ఇంటికి వాకిలి ఉంటుంది. వాకిలికి తోరణం ఉంటుంది. గుమ్మం దాటితే ఇల్లాలి చిర్నవ్వు స్వాగతం ఉంటుంది. పరుగు పరుగున పిల్లలు వచ్చి ఇచ్చే చల్లని కావలింత ఉంటుంది. వారి సమక్షాన ఇంటిలో విశ్రమిస్తే శాంతి ఉంటుంది. స్వర్గం వేరే ఎక్కడో ఎందుకు ఉంటుంది? ప్రయత్నించాలిగాని అది మన ముంగిట్లోనే ఉంటుంది. ఇంట్లోనే ఉంటుంది. అందుకే సినీ కవి– ‘గృహమే కదా స్వర్గ సీమ’ అన్నాడు. జపమేల తపమేల వ్రతపూజలేల సాధించితే ప్రేమ సామ్రాజ్యమౌ గృహమే కదా స్వర్గసీమ అని కూడా అన్నాడు. ‘వేరే ఏ పనీ లేనప్పుడు వెళ్లదగ్గ ఒకే ఒక్క చోటు– ఇల్లు’ అని గ్రాఫిటీలో ఎవరో రాశారు. ఇంటిని లోకువ చేసేవారున్నారు. చులకనగా చూసేవారున్నారు. ‘కొంప’ అని వ్యాఖ్యానించేవారున్నారు. కాని అది చల్లని ‘నివాసము’ అని గ్రహించినవారు, ‘లోగిలి’గా, ‘కుటీరం’గా, ‘నిలయం’గా భావించేవారు దాని విలువను కాపాడుకుంటూ వచ్చారు. దాన్ని పొదరిల్లుగా మలుచుకుని సుఖపడ్డవారున్నారు. మేడంటే మేడా కాదు గూడంటే గూడు కాదు పదిలంగా అల్లుకున్న పొదరిల్లు మాది పొదరిల్లు మాది... పిల్లలు మట్టిలో ఆడుకుంటూ మొదట చేసేపని ఇల్లు కట్టడమే. అది ఒక అసంకల్పిత చర్య. మనిషికి భద్రత ఇచ్చేది, బతుకుని ఇచ్చేది గూడే కనుక అది అలా వేలాది సంవత్సరాలుగా జన్యువులలో ఇమిడిపోయింది. ఈనాడు కట్టుకున్న బొమ్మరిల్లు కావాలి ముందు ముందు పొదరిల్లు పొదరిల్లు వయసుకొచ్చిన జంట పెళ్లి గురించి ఆలోచిస్తుంది సరే, ఆ వెంటనే ఆలోచించేది ఇంటి గురించే కదా. తాము కలిసి గడపబోయే తావు గురించే కదా. ‘సంసారం సంసారం ప్రేమసుధాపూరం నవజీవన సారం’ అని జీవితాన్ని మొదలెట్టాలన్నా, ‘హాయిగా ఆలుమగలు కాలం గడపాలి’ అని పాడుకోవాలన్నా, ‘ప్రేమయాత్రలకు బృందావనము నందనవనము ఏలనో’ అని ఒకచోట ఉండిపోవాలన్నా, ‘కాపురం కొత్త కాపురం... ఆలుమగలు కట్టుకున్న అనురాగ గోపురం’ అంటూ కాపురం పెట్టాలన్నా వారికి కావలసింది ఇల్లే. ఒంటరి మనిషి అసంపూర్ణుడు. అతడు తోడు తీసుకొని ‘ఒక ఇంటివాడైనప్పుడే’ పరిపూర్ణుడు. అందుకే కవి– పెళ్లి చేసుకుని ఇల్లు చూసుకొని చల్లగా కాలం గడపాలోయ్ ఎల్లరు సుఖమును చూడాలోయ్... అన్నాడు. మన దేశంలో అమ్మాయి భర్తతో పాటు భర్త ఇంటికి వచ్చి కోడలు అవుతుంది. ఇల్లు నిర్మించుకుంటుంది. అయితే ఈ ‘ఇంటి సౌఖ్యం’ తెలిసిన మగవారు కూడా ఉంటారు. వీరు ఇల్లరికం వెళతారు. అంతేనా? తామూ ఇక ఇంటివారమైనందుకు పాట కూడా పాడతారు... ఇల్లరికంలో ఉన్న మజా అది అనుభవిస్తేనే తెలియునులే భలే చాన్సులే ఇక ఇంట్లో జరిగే సరసాలు, విరసాలకు అంతు ఉండదు. ఆమె అలిగితే ‘రావోయి చందమామా మా వింతగాథ వినుమా’ అని చంద్రుడితో చెప్పుకోవాలి. అతను అలిగితే ‘అలిగిన వేళనే చూడాలి’ అని బుజ్జగించాలి. ఆమెను ‘ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి ఇల్లాలే ఈ జగతికి జీవనజ్యోతి’ అని పొగడాలి. అతణ్ణి ‘కోవెల ఎరగని దైవం కలడని’ అని ప్రశంసించాలి. అప్పుడే ఆ ఇల్లు పాజిటివ్ ఎనర్జీతో, శాంతితో, ఉత్సవంతో నిండుతుంది. పిల్లలు తోడవుతారు. పచ్చని చెట్టు ఒకటి వెచ్చని చిలుకలు రెండు పాటలు పాడి జోకొట్టాలి జో..జో.. జో అని ఆరిందాలా జోలపాడి నిద్రపుచ్చి మురిపెం పుట్టిస్తారు. ఇల్లు ఎంత అందమైనది. పట్టించుకోకపోతే అక్కడ ఏ అందమూ కనిపించదు. తరచి చూస్తూ ప్రతి చిన్న విషయమూ సుందరమైనదే. అలా పెరటిలోకి నడిస్తే, బాల్కనీలోకి తొంగి చూస్తే పూలతో నవ్వే మొక్క కనిపిస్తుంది. ‘ఎవరు నేర్పేరమ్మ ఈ కొమ్మకు పూలిమ్మని రెమ్మరెమ్మకు’ అని ఆశ్చర్యపరుస్తుంది. డాబా మీదకు వెళ్లి నిలిచినప్పుడు ఒంటికి తెమ్మెర తాకి ‘ఎచటి నుంచి వీచెనో ఈ చల్లనిగాలి’ అని పాడుకోబుద్ధవుతుంది. నేటి ఖాళీ రోడ్ల చివరన ఆకాశంలో ఉదయించే చంద్రుణ్ణి చూసి ‘మామా చందమామ వినరావా నా కథ’ అని నివేదించుకోవాలనిపిస్తుంది. ఇంటి విలువ తెలిసొచ్చిన ‘కరోనా’ రోజులివి. ఇల్లే ఆది, అంతం అని తెలియచేసిన రోజులు కూడా. మన కుటుంబ సభ్యులే శాశ్వత శ్రేయోభిలాషులు. సహ ప్రయాణికులు. వారితో కలిసి ఉండటమే భాగ్యము. వారి మనసెరిగి ప్రవర్తించడమే భోగం. ఇంటిని, కుటుంబాన్ని కాపాడుకోవాల్సిన సమయం ఇది. ఇల్లు క్షేమంగా ఉంటే సమాజం క్షేమం. సమాజం క్షేమంగా ఉంటే దేశం క్షేమంగా ఉంటుంది. కనుక ఇప్పుడు ఇంటిని తిట్టుకోకూడదు. ప్రేమించాలి. ఇంట్లో ఉండే భార్యాభర్తలు ఒకరినొకరు ప్రేమించుకోవాలి. పాలూ మీగడ పెరుగూ ఆవడ ఒకటికి ఒకటై రెండూ తోడై కలసిన జోడా నేనూ మా ఆవిడ – సాక్షి ఫ్యామిలీ -
మా ఊరుకి తీసుకెళ్లండి..
చిల్పూరు: అమెరికాలో ఉంటున్న కుమారుడి వద్ద సంతోషంగా గడిపి తిరిగొస్తున్న తమను ముంబైలో నిలిపివేయడంతో 15 రోజులుగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని జనగామ జిల్లా చిల్పూరు మండలం వెంకటాద్రిపేట గ్రామానికి చెందిన మ్యాదరబోయిన రవీందర్, ఝాన్నీ దంపతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వివరాలిలా ఉన్నాయి.. ఈ దంపతులు గతేడాది సెప్టెంబర్ 22న అమెరికాలోని ఫిలడెల్ఫియాలో ఉంటున్న కుమారుడు ఉదయ్కుమార్ వద్దకు వెళ్లి ఈ ఏడాది మార్చి 19న తిరుగు ప్రయాణమయ్యారు. ఆరు నెలల తరువాత స్వగ్రామానికి వెళ్తున్నామనే ఆనందం వారిలో ఎంతో సేపు నిలవలేదు. మార్చి 20 మధ్యాహ్నం ముంబైలో విమానం దిగగానే అక్కడి సిబ్బంది వారి పాస్ పోర్టులు తీసుకుని ప్రత్యేక బస్సులో ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించాక ఆస్పత్రిలో 22వ తేదీ వరకు ఉంచారు. మళ్లీ మార్చి 31న పరీక్షలు చేసి ఎలాంటి అనారోగ్యం లేదని నిర్ధారించాక ఓ గెస్ట్ హౌస్కు తరలించారు. అక్కడి నుంచి ఈనెల 2వ తేదీన ఓ ఫంక్షన్ హాల్కు మార్చారు. ఇక్కడ ఉండడంతో ఇబ్బందిగా రవీందర్, ఝాన్సీ దంపతులు ఫోన్ ద్వారా శనివారం ‘సాక్షి’దృష్టికి తీసుకొచ్చారు. అధికారులు స్పందించి తమను స్వగ్రామానికి చేర్చాలని వేడుకున్నారు. -
స్వాతికి తెలియదు
స్వాతికే కాదు.. సీతకు, శ్వేతకూ తెలియదు. పల్లవికి, ప్రవల్లికకూ తెలియదు. బాధ్యతగా ఆమె పప్పుల్నీ, ఉప్పుల్నీ లెక్కగట్టి మూడు పూటలా ఇంటిని నడిపిస్తున్నప్పుడు.. బాధ్యతగా అతడూ అప్పుల్నీ, తప్పుల్ని ఏరోజు కారోజు ఇంటికి రాగానే చీటీలో రాసి ఆమె చేతిలో పెట్టాలి. నెలకోసారి.. పే స్లిప్ చూపించడం కాదు. గైస్.. ఒక రూపాయి అప్పు చేసేముందు ఆమెకు ఫోన్ చేసి చెప్పండి.. ఫోన్కి పది రూపాయలు అవుతున్నా సరే! ఒక సంతకం పెట్టే ముందు ఆమె అనుమతి తీసుకోండి.. ఆమె కోసం మీరు కొనబోతున్న శ్వేత సౌధపు అగ్రిమెంట్ కాగితాలైనా సరే. ఉదయం ఆఫీస్కి వెళ్లిన నాన్న సాయంత్రం కొత్త కారుతో ఇంటికి వస్తే పిల్లలు వాకిట్లోకి ఒక్క గెంతు గెంతి ‘హే.. కొత్త కారు’ అని కారులోకి దూకి కూర్చుంటారు. మరీ చిన్నపిల్లలైతే వెళ్లి స్టీరింగ్ సీట్లో కూర్చొని స్టీరింగ్ని ‘జుయ్జుయ్’మని తిప్పుతారు. ‘మనదేనా నాన్నా’.. పిల్లలు అడిగే మొదటి ప్రశ్న. ‘ఎక్కడికెళ్దాం నాన్నా’.. రెండో ప్రశ్న. పిల్లల్ని ఎత్తుకుని బుగ్గలపై ముద్దుపెడుతూ భార్య వైపు చూస్తాడు అతడు. ‘మనదే కారు’ అంటూ ఒక ముద్దు. ‘నువ్వు చెప్పు ఎక్కడికెళదామో’ అంటూ ఇంకో ముద్దు. పిల్లలు అడిగినట్లే ఆమెకూ ఒక ప్రశ్న అడగాలని ఉంటుంది. ‘ఎక్కడిదండీ కారు?’ అని. కానీ అడగదు. అడిగితే, కారు ఎలా ఉందో చెప్పకుండా, కారు ఎలా వచ్చిందో చెప్పమని అడుగుతుందేమిటి’ అని భర్త నొచ్చుకుంటాడేమోనని ఆమె భయం. నొచ్చుకుంటాడన్న భయంతో ఆమె అతడిని చాలానే అడగలేదు. పెళ్లయి ఏడెనిమిదేళ్లు అవుతున్నా ఏ నెలలోనూ జీతమెంత అని భర్తను అడగలేదు. జీతంలో కటింగ్స్ ఎన్ని అని అడగలేదు. ఇంట్లోకి ఒకేసారి హైఎండ్ ఏసీ, ఫ్రిజ్, వాషింగ్మిషన్, టీవీ.. ఇంకా రెండుమూడు ‘చిన్న వస్తువుల్ని’ పిల్లల ఆటబొమ్మల్లా భుజాన మోసుకొచ్చిప్పుడు కూడా భుజం మీద నుంచి బరువును దింపిందే తప్ప, దింపాక పెరిగే వాటి బరువు గురించి అతడిని అడగలేదు. ‘ఈఎమ్ఐల్లో తెచ్చా. చిటికెలో అయిపోతాయి’ అని అన్నప్పుడు కూడా ఎవ్రీ మంత్ శాలరీ కన్నా, ఎవ్రీ మంత్ ఇన్స్టాల్మెంట్స్ ఎక్కువైపోవు కదా’ అని అడగలేదు. అడిగితే అతడు నొచ్చుకుంటాడు. ‘చిన్న వస్తువుల్ని’ ఇంటికి తెచ్చిన కొన్నాళ్లకే ఓరోజు అతడు ఆమె కళ్లకు గంతలు కట్టి కారులో ఓ పెద్ద ఇంటికి తీసుకెళ్లాడు. గంతలు విప్పాక, కళ్లు నులుముకుని చూసి, అప్పుడు మాత్రం అడిగింది, ‘ఎవరిల్లండీ, బాగుంది’ అని! ‘మనదే!’ అనలేదు అతను. ‘నీదే’ అన్నాడు. ‘నీ కోసమే’ అన్నాడు. అతడెప్పుడూ అలాగే మాట్లాడతాడు. మాట్లాడ్డం కాదు, నిజంగానే అతడు చేసేవన్నీ ఆమె కోసమే. చేయాలనుకునేవన్నీ ఆమె కోసమే. ‘ఇప్పుడున్న ఇంటికే అంత అద్దె కడుతున్నాం. ఈ ఇంటికి ఇంకా ఎక్కువ ఉండదా’ అంది.. కొత్త గోడల్ని, కొత్త తలుపుల్ని, కొత్త కిటికీల్ని తడిమి చూస్తూ. పెద్దగా నవ్వి, ఆమె చుట్టూ చేతులు వేసి గాల్లోకి లేపాడు అతడు. ‘ఇది మన సొంతిల్లు. నీ కోసం, పిల్లల కోసం కొన్న ఇల్లు’ అన్నాడు. ‘ఇకనుంచి మనం అద్దె కట్టనక్కర్లేదు’ అన్నాడు. ‘ఆ కట్టేదేదో మన సొంత ఇంటికి కట్టుకుంటే సరిపోతుంది’ అన్నాడు. కట్టుకున్నది సొంతిల్లు అవుతుంది కానీ, నెల నెలా కట్టేది సొంతిల్లు అవుతుందా! ఆ మాటే ఆమె అనబోయింది. అతడు అననివ్వలేదు. ప్రశ్నలు కట్టిపెట్టు అని ఆమెను దగ్గరకు లాక్కున్నాడు. అతడి చేతుల్లో ఆమె భద్రంగా ఉంది. ఇంత భద్రత కొత్తింట్లో ఉంటుందా.. పది వేల అద్దెకు బదులు నెలనెలా కట్టే ఇరవై వేల లోన్ కట్టవలసిన ఇంట్లో?! అతడు సంతోషంలో ఉన్నాడు. తనకొచ్చిన సందేహాలన్నీ భర్తకూ వచ్చి ఉంటాయి. అయినా సంతోషంగా ఉన్నాడూ అంటే.. తను వేరుగా సందేహపడాల్సిందేమీ లేదు. కుడికాలు లోపలికి పెట్టింది. పిల్లలు ‘ఓ.. ఓ..’ అంటూ కొత్తింట్లోని హాల్లోకి, బెడ్రూమ్లోకి, కిచెన్లోకి, బాత్రూమ్లోకి, బాల్కనీలోకి పరుగులు తీస్తున్నారు. ఎంత పిల్లల్తో పోటీపడి పరుగెత్తలేని కాలమైనా రోజుల్ని, వారాల్ని దాటి నెల దగ్గరికి వచ్చేస్తుంది. నెల తర్వాతి నెలకూ వచ్చేస్తుంది. ‘కాస్త టైట్గా ఉంది గురూ. వచ్చే నెల రెణ్ణెల్ల ఇంట్రెస్ట్ కలిపి ఇచ్చేస్తా..’ ఆమె వాకిట్లో ముగ్గేస్తోంది. అతడు ఆమెకు వినిపించనంత దూరం వెళ్లి ఫోన్లో మాట్లాడుతున్నాడు. ఆఫీస్లోనే కాదు, ఇంట్లో ఉన్నప్పుడైనా ఫోన్లో ఏ ఉద్యోగం చేస్తుంటే ఆ మాటలే రావాలి. టెకీ అయితే అదేదో జార్గాన్ ఉంటుంది. ఫ్లోచార్టు, డీబగ్, లైఫ్ సైకిల్, టెస్టబుల్ కోడ్.. ఇలాంటి మాటలు రావాలి. డాక్టర్ అయితే రిపోర్ట్స్ అనీ, ఇన్వెస్టిగేషన్ అనీ, మెడికల్ హిస్టరీ అనీ రావాలి. జర్నలిస్ట్ అయితే ప్రెస్మీట్ అని, స్కూప్ అనీ, లీడ్ అనీ ఏవో ఉంటాయి. అవి రావాలి. ఇవేమీ కాకుండా టైట్గా ఉందనీ, ఒకేసారి రెణ్ణెల్లదీ ఇచ్చేస్తాననీ అంటున్నాడంటే.. అదీ ముంగిట్లో ముగ్గు పడే వేళ నుంచే కొత్తగా ‘టైట్ టాక్’ మొదలవుతోందంటే.. ఏనాడూ భార్యాబిడ్డల్తో కలిసి కూర్చుని భోజనం చేసే స్థిమితం కూడా లేని అతడు.. త్వరలోనే త్వరగా ఇంటికి రాబోతున్నాడనే! త్వరగా ఇంటికి వచ్చిన ఆ రాత్రి.. తనని చూసి కేరింతలు కొడుతూ నిద్రమానుకున్న పిల్లలతో కలిసి.. తండ్రీ బిడ్డల్ని చూసి మురిసిపోతున్న భార్యతో కలిసి.. భోజనం చేయబోతున్నాడనే! బయటి నుంచి తను తెచ్చిన ‘ఫుడ్ ఐటమ్స్’ని అందరి భోజనంలో తలా ఇంత చేర్చి పిల్లలకు, భార్యకు తనే మొదటి ముద్ద తినిపించబోతున్నాడనే! హైదరాబాద్లో శనివారం రాత్రి ఇలాగే ఓ కుటుంబం ‘కలిసి భోజనం’ చేసింది! అతడు, ఆమె, ఇద్దరు పిల్లలు. ఆరేళ్లొకరికి. ఏడాదిన్నరొకరికి. టెకీ అతను. చిన్న వయసే. పెద్ద కంపెనీలో పని. పెద్ద జీతం. అప్పు చేసి ఇల్లు కట్టుకున్నాడు. బిజినెస్ చేసి అప్పు తీర్చాలనుకున్నాడు. బిజినెస్ కోసం మళ్లీ అప్పు చేశాడు. బాగా బతకడం కోసం కాదు ఇవన్నీ. ఇంకా బాగా బతకడం కోసం. చివరికి బతకలేక తనను, కుటుంబాన్ని చంపుకున్నాడు! జీతం అప్పును పుట్టిస్తుంది. అప్పును కట్టలేదు. ఒకట్రెండు వాయిదాలైతే జీతం తీర్చేస్తుంది. అప్పుల్ని, వడ్డీల్ని తీర్చే కెపాసిటీ ఎంత పెద్ద జీతానికైనా ఉండదు. ఆ సంగతి అతడికెవరూ చెప్పలేకపోయారా! ఇంత జరుగుతోందని అతడెవరికైనా చెబితేనే కదా! భార్యకు కూడా చెప్పలేదు. చనిపోతూ తండ్రికి రాసిన ఉత్తరంలో మాత్రం చెప్పాడు. ‘స్వాతికి ఇవేవీ తెలియదు నాన్నా..’ అని చెప్పాడు! స్వాతి అతడి భార్య. అతడు నొచ్చుకుంటాడని అతడిని ఏనాడూ ఎందుకు, ఎలా అని అడగని భార్య.. ‘బతకాలని ఉంది స్వాతీ’ అని ఒక్కమాట అని ఉంటే.. బతకలేనంత కష్టం ఏమొచ్చిందో అడిగి తెలుసుకుని ఉండేది. కష్టమో, నష్టమో కలిసే బతుకుదాం అని ధైర్యం చెప్పి ఉండేది. మాటైనా చెప్పకుండా భార్యనీ పిల్లల్నీ తనతో తీసుకుపోయాడు! l -
కొట్టే మొగుడు
కొందరు కొట్టే ‘చెడ్డ’ మొగుళ్లు ఉంటారు. అన్ని దుర్లక్షణాలుండి కొట్టే చెయ్యి కూడా ఉండేవాళ్లు వీరు. మరికొందరు కొట్టే ‘మంచి’ మొగుళ్లు ఉంటారు. అన్ని మంచి లక్షణాలు ఉండి కొట్టడం ఒక్కటే చెడు లక్షణంగా ఉండేవారు వీరు. వీరు కొడతారని మూడో కంటికి తెలియదు– ఒక్క భార్యకు తప్ప. ఈ కొట్టే మొగుళ్లను ఎలా మార్చడం? ఈ హింసకు వ్యతిరేకంగా ఎలా నిలబడటం? విజయశేఖర్ లెక్చరర్. కాలేజీలో అతని క్లాస్ మిస్సయ్యే స్టూడెంట్ ఉండడు. క్లాస్ కిటకిటలాడాల్సిందే. అంత బాగా నవ్విస్తూ పాఠాలు చెబుతాడు. స్టూడెంట్స్ని ‘నాన్నా’ అని పిలుస్తాడు. ‘అది కాదు నాన్నా’ అని చాలా వాత్సల్యంగా వివరిస్తాడు. స్టాఫ్రూమ్లో అతనంటే అందరికీ గౌరవం. చిన్నా పెద్దా అందరినీ ‘గురువు గారూ’ అని సంబోధిస్తాడు. ఎప్పుడూ నీట్గా క్లీన్ షేవ్తో హుషారుగా ఉంటాడు. చురుగ్గా కదులుతాడు. బయటి విషయాల పట్ల కూడా చాలా అవగాహన ఉంటుంది. ‘సిఏఏ’, ‘ఎన్ఆర్సి’ లాంటి విషయాల గురించి వివరంగా మాట్లాడతాడు. పుస్తకాలు చదవడం అతని పని. అందరి చేత ‘ఎంత మంచివాడండి’ అని అనిపించుకోవడం అతనికి అలవాటైపోయింది. కాని అతనికి ఇంకో కోణం ఉంది. అది తెలిసిన భార్య ఆ విషయం గుర్తొస్తే ఒణికిపోతూ ఉంటుంది.విజయశేఖర్ పద్మను చూడటానికి వచ్చినప్పుడు ‘నాకు కట్నం అంటే అసహ్యం’ అని అన్నాడు. నిజంగా కట్నం తీసుకోలేదు. పెళ్లిలో పద్మ తరుఫువారి నుంచి చిన్న చిన్న పొరపాట్లు జరిగాయి. తాను దగ్గరుండి సర్దుబాటు చేశాడు. హనీమూన్కు తనే ఢిల్లీ–ఆగ్రా ట్రిప్ ప్లాన్ చేసి సొంత ఖర్చులతో తీసుకెళ్లాడు. బంగారంలాగా చూసుకున్నాడు. హైదరాబాద్లో కాపురం పెట్టినప్పుడు ఫ్లాట్ బాగుండేలా జాగ్రత్త తీసుకున్నాడు. పని మనిషిని పెట్టాడు. పద్మ ఇవన్నీ చూసి చాలా సంతోషపడింది. ఎంత మంచి భర్త దొరికాడు అని అనుకుంది. రెండు మూడు నెలలు గడిచాయి. ఆ రోజు కాలేజీ నుంచి విజయ శేఖర్ వచ్చాడు. ఎప్పటి లాగే పద్మ కాఫీ తీసుకెళ్లి ఇచ్చింది. ‘ఏమిటిలా ఉంది?’ అన్నాడు విజయశేఖర్. అలా అంటున్నప్పుడు అతని ముఖం కొత్తగా అనిపించింది. ‘ఏం.. బాగలేదా?’ సౌమ్యంగా అడిగింది. విజయశేఖర్ రెప్పపాటు కాలంలో లేచి నిలబడ్డాడు. ఏం జరుగుతుందో ఊహించే లోపలే లాగిపెట్టి ఒక్కటి కొట్టాడు. పద్మ దిమ్మెరపోయింది. బిక్కచచ్చిపోయింది. చాలా అనూహ్యమైనదేదో జరిగినట్టుగా కొయ్యబారిపోయింది. ఆమె తేరుకునేలోపలే పిడికిలి బిగించాడు. బలం కొద్దీ కొట్టాడు. ప్రాణాలు లుంగచుట్టుకుపోయాయి. అసలు ఒక మనిషి ఇంకో మనిషిని అలా కొట్టొచ్చని నమ్మలేనంతగా కొట్టి బయటకు వెళ్లిపోయాడు. పద్మ ఏడ్చి ఏడ్చి సొమ్మసిల్లిపోయింది. జ్వరం వచ్చేసింది. ఆ రాత్రి అతడు తిరిగి ఇంటికొస్తే వొణికిపోయింది. కాని అతను చాలా మామూలుగా ఉన్నాడు. ‘సారీ’ చెప్పాడు. ‘జ్వరం వచ్చిందా?’ అని టాబ్లెట్ ఇచ్చాడు. ‘ఏం వండకులే’ అని బజారుకు వెళ్లి ఇడ్లీ తెచ్చిచ్చాడు. తినేదాకా ఊరుకోలేదు కూడా. ఇంతకు ముందు మనిషి ఈ మనిషి ఒకడే అంటే నమ్మడం కష్టం. ఆ రోజున పద్మకు అనిపించింది తన భర్తలో ఒక వేరే మనిషి ఉన్నాడని.. ఆ మనిషి తనకు శత్రువు అని. పద్మకు కొడుకు పుట్టాడు. వాడికి ఎనిమిదేళ్లు వచ్చాయి. ఈ ఎనిమిదేళ్లలో పద్మ చాలా సంతోషంగా ఉంది. చాలా భయభ్రాంతంగా కూడా ఉంది. విజయశేఖర్ ఆమెనూ కొడుకునూ చాలా బాగా చూసుకుంటాడు. వాళ్ల కోసం కానుకలు తెస్తాడు. షికార్లకు తిప్పుతాడు. కాని హటాత్తుగా ఒక రాత్రి ఆమె ‘అలా సిగరెట్లు తాగవద్దండి’ అన్నందుకు చావబాదుతాడు. ‘పూలు తెస్తే బాగుండేదండీ’ అంటే కొడతాడు. ‘పక్కింటి వాళ్లు పెళ్లికి పిలిచారు. వెళ్లాలా’ అని అడిగితే చెయ్యెత్తుతాడు. అలా ఎందుకు జరుగుతుందో ఊహకు కూడా అందని విషయం. ఆమె మెల్లమెల్లగా అతడి లోపలి మనిషిని అన్వేషించడం మొదలెట్టింది. కొన్ని కారణాలు తెలిశాయి. వాటిని రిపేర్ చేయాలి. కాని తాను చెప్తే వింటాడా? ఒకరోజు భర్తతో భయపడుతూనే అడిగింది ‘బాబును ఒకసారి సైకియాట్రిస్ట్ దగ్గరకు తీసుకెళదామండీ. వాడికి చదువు మీద ఫోకస్ ఉండటం లేదు. అటెన్షన్ డైవర్షన్ ఉందేమో సందేహంగా ఉంది. ఇప్పుడు తీసుకెళ్లకపోతే ప్రమాదమేమో‘ అని. బాబు బిహేవియర్ అతను కూడా గమనించాడు కాబట్టి ‘నువ్వు తీసుకెళ్లు’ అన్నాడు. అదే పదివేలు అనుకొని బాబును తీసుకొని సైకియాట్రిస్ట్ దగ్గరకు వచ్చింది. బాబుది పెద్ద సమస్య కాదని సరి చేయవచ్చని సైకియాట్రిస్ట్ చెప్పాక తన సమస్య చెప్పుకుంది. ‘డాక్టర్ నన్ను కాపాడండి. అన్నీ ఉన్నా ఇంటి మధ్య అశుద్ధం పడి ఉన్నట్టు నాకు అన్నీ ఉన్నా నా భర్తలో ఉన్న ఈ చెడుగుణం వల్ల నరకం చూస్తున్నాను. ఆయనకు సంఘం పెద్ద బలహీనత. సంఘం పట్ల చాలా మొహమాటం. సంఘం ఏమనుకుంటుందో అని భయం. అందరితో మంచిగా ఉండాలనుకుంటారు. వాళ్లను హర్ట్ చేయవద్దనుకుంటారుగానీ వాళ్లు హర్ట్ చేస్తే వారిని ఏమీ అనలేక నా మీద ప్రతాపం చూపుతున్నారని నాకు అనిపిస్తోంది. మంచితనం కోసం డాంబికానికి పోయి చాలామందికి అప్పులిస్తారు. వాళ్లు తిరిగివ్వరు. ఈయన అడగరు. ‘మీ డబ్బులు ఎక్కడికీ పోవండీ’ అని చాలామంది ఎగ్గొట్టారు. అయినా మారడు. ఇస్తూనే ఉంటాడు. అదంతా ఏదోరోజు పేరబడి నన్ను కొడతాడు. ఆయన అందరితో బాగుండటానికి నాతో చెడుగా ఉంటున్నాడని నాకర్థమవుతోంది. ఏం చేయమంటారు? సైకియాట్రిస్ట్కు చూపించుకోండి అన్నా కొడతాడని మీతో చెబుతున్నాను. అతనికి నేరుగా కాకుండా ఇన్డైరెక్టుగా వైద్యం చేయండి’ అంది పద్మ కళ్లనీళ్లతో. ‘సరే.. బాబు గురించి మాట్లాడాలని పిలిచానని తీసుకురండి’ అన్నాడు సైకియాట్రిస్ట్. వారం తర్వాత పద్మ, విజయశేఖర్ వచ్చారు. సైకియాట్రిస్ట్ బాబు గురించి చాలా సేపు మాట్లాడాక ‘పద్మగారూ మీరు బయటికెళ్లండి. ఒక నిమిషం మీ భర్తతో మాట్లాడాలి’ అని ఆమెను బయటకు పంపించాడు. విజయశేఖర్ డాక్టర్ వైపు ఎందుకూ అన్నట్టు చూశాడు. ‘విజయశేఖర్గారూ.. మీకు గాంధీజీ గారి గురించి తెలుసా?’ అన్నాడు డాక్టర్. విజయశేఖర్ తలూపాడు. ‘ఆయన మన దేశానికి జాతిపిత. కాని ఆయనకు కూడా వ్యతిరేకులు ఉన్నారు. ఆయనను కూడా చెడ్డవారనుకున్నవారున్నారు. అలా అనుకొని కాల్చి చంపారు. నెహ్రూకు వంకలు పెట్టేవారు, మదర్ థెరిసాలో లోపాలు వెతికేవారు, అందరూ సూపర్స్టార్ అనుకునే హీరో పోస్టర్ మీద పేడ కొట్టేవారు.. ఇలా ప్రతిఒక్కరినీ ఒప్పుకోని వారు ఒకరో ఇద్దరో ఉంటారు. అంతెందుకు దేవుడు లేడని తిట్టే నాస్తికులు ఉంటారు. అంటే మీరెంత మంచిగా ఉన్నా మీరు నచ్చని వాళ్లు కొందరు ఉంటారు. నచ్చడం నచ్చకపోవడం ప్రతిఒక్కరి గురించి సమానంగా ఉంటుంది. మీరెందుకు అందరినీ ఇంప్రెస్ చేయాలని చూస్తున్నారు? ఎదుటివారిలో మీకు నచ్చనివి మీరు నిశ్శబ్దంగా భరిస్తున్నారు. మంచితనంతో ఉండటం వేరు. చేతగాని తనంతో ఉండటం వేరు. మీ క్లాస్లో అల్లరి చేసే పిల్లాణ్ణి, మీ అప్పు ఎగ్గొట్టే కొలీగ్ని, మీ పై కామెంట్ చేసే దారినపోయేవాడిని వాడి భాషలో మీరు జవాబు చెప్పడం నేర్చుకోండి. లేదంటే మీరిప్పుడు మీ ఆవిడను బాక్సింగ్ బ్యాగ్లా ట్రీట్ చేయడం అలాగే కొనసాగుతుంది. చూడండి... మీ అబ్బాయి పెద్దవాడవుతున్నాడు. వాడి ముందు మీరు మీ భార్యను కొడుకుతుంటే వాడి చిన్న మనసులో ఎంతటి భయంకరమైన ముద్ర పడుతుందో ఊహించారా? అసలైన మంచితనం ఏమిటంటే మన కుటుంబ సభ్యుల పట్ల మనం ప్రకటించేది. వాళ్లతో మొదట మంచిగా ఉండండి. బయట మంచిగా ఉండేవాళ్లతో మాత్రమే మంచిగా ఉండండి. అదే మీరు తెలుసుకోవాల్సింది’ అన్నాడు. విజయశేఖర్కు అంతా అర్థమైంది. భార్య తన హింసను తట్టుకోలేకే పిల్లాడి మిషతో ఇక్కడకు తీసుకొచ్చినట్టు అర్థం చేసుకున్నాడు. ‘కొంచెం హెల్ప్ చేయండి డాక్టర్ మారుతాను’ అన్నాడు తల వొంచుకుని. విజయశేఖర్కు మరో రెండుమూడు సిట్టింగ్లు అయ్యాయి. విజయశేఖర్ ఇప్పుడు మంచి భర్త. మంచి తండ్రి. బయట మంచివాళ్లకు మంచివాడు. చెడ్డవాళ్లకు చెడ్డవాడు. కాలేజ్లో అతని ఇమేజ్ అలాగే కొనసాగుతోంది. కాకుంటే ‘సారుతో జాగ్రత్త’ అని కూడా అనుకుంటున్నారు. అది చాలు విజయశేఖర్కు. కథనం: సాక్షి ఫ్యామిలీ ఇన్పుట్స్: డాక్టర్ కల్యాణ చక్రవర్తి, సైకియాట్రిస్ట్ -
పబ్జీ ఆడొద్దన్నాడని విడాకులు!
ప్రస్తుతం పబ్జీ ట్రెండ్ నడుస్తోంది. జనాలు నిద్రాహారాలు మాని పబ్జీ గేమ్ను ఆడుతున్నారు. ఇదొక వెర్రిగా మారి.. చివరకు వారి ప్రాణాలనూ తీస్తోంది. ఇప్పటికే చాలా మంది ఈ గేమ్కు బలయ్యారు. పబ్జీ ఆడొద్దన్నారని ఆత్మహత్య చేసుకున్న ఘటనలు కోకొల్లలు. అయితే ఓ భర్త తన భార్యను పబ్జీ ఆడొద్దన్నాడని.. విడాకులకు దరఖాస్తు చేసింది భార్య. ఈ ఘటన యూఏఈలో జరిగింది. తన భార్య నిత్యం ఆన్లైన్లో పబ్జీ ఆడుతుండటంతో.. ఆ ఆటను ఆడొద్దని సూచించాడు. మాటామాటా పెరిగి ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో వారిద్దరు పోలీసులను ఆశ్రయించారు. చాట్ ఆప్షన్ యాక్టివేట్ చేయకుండా.. తన బంధువులు, స్నేహితులతో మాత్రమే ఆడుతున్నానని ఆమె పోలీసులకు తెలిపింది. అయితే తన భార్య ఇలా నిత్యం ఆటలో మునిగిపోవడంతో భార్యగా తన బాధ్యత, విధులను నిర్వహించకుండా ఉంటుందన్న భయంతోనే ఆడొద్దన్నాని తెలిపారు. అయినా గేమ్ ఆడొద్దు అని అంటే స్వేచ్ఛను హరించడం కాదంటూ.. ఈ చిన్న విషయానికే తన భార్య విడాకులు అడగటం తనను ఆశ్చర్యానికి గురి చేసిందని తెలిపారు. -
మారుతున్న మగతరం
పెళ్లితో ఒక అమ్మాయి భార్య అవుతుంది, ఒక అబ్బాయి భర్త అవుతాడు. అప్పటి వరకు వాళ్లిద్దరూ తల్లిదండ్రుల ముద్దుల సంతానమే. భర్త హోదా రాగానే బాస్ అనుకుంటాడా? పెళ్లితో అమ్మాయి తనను తాను తగ్గించుకుని ఒదిగి ఉండాలా? నిజానికి పెళ్లి పరమార్థంలో ఇలా ఏమీ చెప్పలేదు. భార్యభర్త స్నేహితుల్లా ఉండాలని, గృహస్థ జీవనంతో పిల్లలను కని, మంచి సమాజ నిర్మాణంలో భాగస్వామ్యం కావాలని మాత్రమే చెప్పింది పెళ్లి. మధ్యలో ఎప్పుడో లౌక్యమైన సవరణలతో భర్త అంటే ఆదేశించేవాడు, భార్య అంటే అనుసరించాల్సిన ప్రాణి అనే భావజాలం రాజ్యమేలింది. సమాజంలో స్త్రీ ప్రాధాన్యం తగ్గడం మొదలైంది కూడా అప్పుడే. ఆ వివక్షపూరితమైన మార్పును స్వాగతించిన తరాలు అంతరించాయి. ఆ పునాదుల మీద కరడు గట్టిన తరాలు ఇప్పుడిప్పుడే కళ్లు తెరుస్తున్నాయి. పేగుబంధం పాపాయి ఏడిస్తే లాలించడానికి తల్లి రావాలి. తల్లి ఆ క్షణంలో రాలేకపోతే నానమ్మ, మేనత్త, పెద్దమ్మ, చిన్నమ్మ ఎవరో ఒకరు వస్తారు. ఇది ఉమ్మడి కుటుంబాల్లో. ఇప్పుడన్నీ న్యూక్లియర్ ఫ్యామిలీలే. భార్య కూరగాయలు తరుగుతున్నప్పుడు పాపాయి ఏడిస్తే... చేతులు కడుక్కుని ఎత్తుకున్నా సరే... మిర్చి, ఉల్లిపాయల ఘాటు పాపాయి ఒళ్లు మండుతుంది. ఇదంతా చూస్తూ ఉన్న భర్త తాను మగాడినని ఊరుకోలేడు. భర్త అనే భేషజాన్ని భుజం మీద నుంచి తీసి పక్కన పెట్టి బిడ్డను భుజానికెత్తుకుంటాడు. ‘వీడు డయాపర్ వేయనివ్వకుండా కాళ్లు ఒకటే ఆడిస్తున్నాడు చూడు’ అంటూ భార్యకు కంప్లయింట్ చేస్తూ నాలుగు నెలల కొడుకు చేయిస్తున్న విన్యాసాలన్నీ చేస్తుంటాడా భర్త. మరో ఇంట్లో... భార్య బిడ్డకు పాలిస్తుంటే, భర్త వంట చేస్తున్నాడు. భార్య వంట చేసి ఆఫీస్కి రెడీ అవుతుంటే తాను బాక్సులు సర్దుతున్నాడు. ఇది ట్వంటీ ట్వంటీకి చేరువవుతున్న ఈ తరం విద్యావంతుల కుటుంబ ముఖచిత్రం. నలిగిన బంధం భార్య– భర్త బంధం కొన్ని తరాల పాటు ఆధిపత్యానికి– అణిగిమణిగి ఉండడానికి మధ్య నలిగిపోయింది. సున్నితత్వం మేళవించిన పెంపకం, న్యూక్లియర్ కుటుంబాలతో వర్క్షేరింగ్ అలవడింది. భర్తలో సున్నితత్వం బయటికొచ్చింది. భార్య పట్ల రెస్పెక్ట్ పెరుగుతోంది. భార్య హోదా తనకంటే పెద్దదైనప్పుడు ఇంటి నాలుగ్గోడల మధ్య ఆమెను మానసికంగా వేధించిన ఒకప్పటి కురచ మనసులు కనుమరుగవుతున్నాయి. మార్పు మొదలైంది. ఈ మార్పు ఉమెన్ ఫ్రెండ్లీగా కనిపిస్తుంది కానీ, నిజానికిది హ్యూమన్ ఫ్రెండ్లీ సమాజ నిర్మాణానికి దారి తీస్తున్న మార్పు. – వాకా మంజులారెడ్డి అలాంటి పెళ్లి వద్దన్నాను నరేన్ (సుప్రియ భర్త) నాకు ఇంటి పనుల్లో షేర్ చేసుకోవడం, పిల్లలను కేర్టేకింగ్తోపాటు అన్ని విషయాల్లోనూ హెల్ప్ చేస్తాడు. ప్రతిదీ ఓపెన్గా మాట్లాడుకుంటాం. ‘పెళ్లి అంటే... భర్త అంటే బాస్లా ఉంటాడు, భార్య తన అభిప్రాయాలను భర్త నిర్ణయాలకు అనుగుణంగా మార్చుకుంటూ జీవించాలనేదే అయితే... ఆ పెళ్లి నాకు వద్దు’ అని పెళ్లికి ముందే చెప్పాను. మా పెళ్లి 2007లో జరిగింది. మేమిద్దరం ఉద్యోగం చేస్తాం. మాకు ఇద్దరు పాపలు. నా జాబ్ టైమింగ్స్ని బట్టి తను, తన వర్క్ షెడ్యూల్స్ని బట్టి నేను అడ్జస్ట్ చేసుకుంటాం. భర్త ఎక్కడా అడ్జస్ట్ కాకూడదు, అడ్జస్ట్ కావాల్సింది భార్యే అనే ధోరణి మా ఇంట్లో ఉండదు. భార్యాభర్త అంటే మంచి ఫ్రెండ్స్. మా నుంచి మా పిల్లలూ అదే నేర్చుకుంటారు కదా! – సుప్రియ, ఫిజికల్ థెరపిస్ట్, వర్జీనియా, అమెరికా -
ఆత్మరక్షణ కోసం భర్తను చంపిన భార్య
మేడిపెల్లి(వేములవాడ): మేడిపెల్లి మండలం కా చారంలో భూమల్ల నడ్పిమల్లయ్య(45)ను ఆయన భార్య భూమల్ల లక్ష్మి అలియాస్ మల్లవ్వ(40) గురువారం రాత్రి గొడ్డలితో నరికి చంపింది. స్థాని కులు, పోలీసుల కథనం ప్రకారం. దేశాయిపేటకు చెందిన భూమల్ల నడ్పిమల్లయ్యకు భార్య లక్ష్మి, కూతురు మౌనిక, కొడుకు ఉన్నారు. కాగా కూతురుకు ఇదే మండలంలోని మోత్కురావుపేటకు చెందిన ఓ యువకుడికి ఇచ్చి వివాహం చేశారు. 2016 జూలై 3న ఆషాఢ మాసం సందర్భంగా తన కూతురును అత్తవారింటి నుంచి దేశాయిపేటకు తీసుకొస్తున్నాడు. ఈక్రమంలో మార్గమధ్యలో అత్యాచారయత్నానికి ప్రయత్నించగా ప్రతిఘటించిన కూతురును చీరతోనే ఉరివేసి చంపాడు. ఆ సంఘటనలో నడ్పిమల్లయ్య జైలుశిక్ష అనుభవించాడు. బెయిల్పై విడుదలై ఇంటికొచ్చిన నడ్పిమల్లయ్యకు భార్య లక్ష్మితో తరచూ గొడవలు జరుగు తుండేవి. దీంతో తనను కూడా ఎక్కడ చంపుతాడోనని భయపడ్డ మల్లవ్వ తల్లిగారి ఊరైన కాచారానికి వచ్చి ఉంటోంది. కూలీ పనులు చేసుకొం టూ కొడుకుతో బతుకుతున్న మల్లవ్వ వద్దకు భర్త తరచూ వస్తూ చంపుతానని బెదిరిస్తూ ఉండేవాడ ని స్థానికుల ద్వారా తెలిసింది. ఈక్రమంలో గురువారం రాత్రి మద్యం తాగి వచ్చిన నడ్పిమల్లయ్య తన భార్యను చంపేందుకు ప్రయత్నించగా.. రక్షించుకునే క్రమంలో మల్లవ్వ సమీపంలోనే ఉన్న గొ డ్డలితో మెడపై నరికింది. దీంతో మల్లయ్య అక్కడికక్కడే మృతిచెందాడు. విషయం తెలిసిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్సై శ్రీనివాస్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. -
వీడుతున్న వాహబంధం
వారిది పెద్దలు కుదిర్చిన సంబంధం. అందరి అంగీకారంతో అంగరంగ వైభవంగా వివాహం జరిగింది. ఏడాది తిరిగేసిరికి మగబిడ్డ జన్మించాడు. తొలుచూరు కాన్పులోనే తమ వంశానికి వారసుడు వచ్చాడని అందరూ వేడుకలు జరుపుకున్నారు. చూస్తుండగానే పిల్లాడికి మూడేళ్లు నిండాయి. బడికి పంపించే ముందు ఏ గుడిలోనో అక్షరాభ్యాసం చేయించడం ఆనవాయితీ కదా! ఇంటివద్దనే అక్షరాభ్యాసం చేయిద్దామని ఇంట్లో నిర్ణయించగా, అమ్మమ్మ తాతయ్యలు బాసర సరస్వతీ దేవాలయంలో అక్షర శ్రీకారం చేయించాలని పట్టుబట్టారు. భర్త అలా కాదన్నందుకు ‘మా పుట్టింటివారు చెప్పినట్లు చేయకుండా ఎదురు మాట్లాడతావా’ అంటూ ఒకరికొకరు గొడవపడ్డారు. మా వాళ్లను గౌరవించని ఇంట్లో క్షణం కూడా ఉండనంటూ పుట్టింటికి వెళ్లిన ఆమె ఏకంగా విడాకులు కావాలంటూ కోర్టులో కేసు వేసింది. ఇలా చిన్న చిన్న కారణాలకే వివాహ బంధాలు విచ్ఛిన్నమవుతున్న తీరు ఇటీవల కాలంలో పెరిగిపోతోంది. కరీంనగర్లీగల్: ‘మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్’ అంటారు పెద్దలు. అంటే పెళ్లిల్లు స్వర్గంలోనే నిర్ణయించబడుతాయని పెద్దల నమ్మకం. కలిసి మెలిసి ఉండి మాంగళ్య బంధాన్ని ఆనందమయం చేసుకోవాల్సిన దంపతులు తృణప్రాయంగా వివాహ బంధాలను తెంచేసుకుంటున్నారు. చిన్న చిన్న కారణాలు, అర్థంలేని పట్టుంపులు కుటుంబ తగాదాలతో పాటు వివిధ కారణాలతో విడాకులు కోరుతూ కోర్టులను ఆశ్రయిస్తున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. వీరిలో ఎక్కువగా విడాకులు, భరణం ఇప్పించాలని కోర్టుకు వస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 2013 నుంచి ఇప్పటివరకు 776 మంది విడాకులు, భరణం కావాలని కోర్టును ఆశ్రయించారు. ఇందులో ప్రస్తుతం 81 కేసులు పెండింగ్లో ఉన్నాయి. సర్దుబాటు ధోరణి లేకనే... భార్యాభర్తల మధ్య చిన్న చిన్న మనస్పర్థలు చినికి చినికి వానగాలిగా మారుతున్నాయి. నాలుగు గోడల మధ్య పరిష్కరించుకోవాల్సిన సమస్యలను పంతాలు, పట్టింపులకుపోయి పెద్దవి చేసుకొని విడాకుల కోసం కోర్టులను ఆశ్రయిస్తూ వీధులకు ఎక్కుతున్నారు. నువ్వెంత అంటే నువ్వెంత అనే స్థాయిలో వాదులాడుకుంటున్న జంటలు భావోద్వేగాల వలలో చిక్కి విడిపోయేందుకు సిద్ధమవుతూ పచ్చని కాపురాలను ముక్కలు చేసుకుంటున్నారు. జిల్లాలో ఏటేటా విడాకులు కోరుతూ కోర్టులను ఆశ్రయిస్తున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ప్రేమించుకొని ఇరువురి కుటంబ పెద్దలను ఎదిరించి ప్రేమవివాహం చేసుకున్న వారు, పెద్దలు కుదిర్చిన వివాహంతో ఒక్కటైన దంపతులైనా సర్దుబాటు ధోరణి లేక వివాహ బంధాన్ని వీడటానికి కోర్టు మెట్లు ఎక్కుతున్నారు. చిన్నపాటి గొడవలను పట్టింపులకు పోయి కాపురాలను కూల్చుకుంటున్నారు. దంపతులిద్దరు అవగాహన లోపంతో విడాకులు తీసుకొని జీవితాలను నాశనం చేసుకోవడంతో పాటు పిల్లలు ఏమైపోతారో అని వారికి జన్మించిన సంతానం గురించి ఏ కోశానా ఆలోచించడం లేదు. విడాకులు అనే మాట వింటేనే అదోలా చూసే సమాజంలో ఇపుడు ఆ పదం సాధారణమైపోయింది. 2013 నుంచి ఇప్పటివరకు భార్యాభర్తల మధ్య మనస్పర్థల కారణంగా విడాకులు, భరణం వంటివి కోరుతూ ఫ్యామిలీ కోర్టులో 776 మంది కేసులు వేశారు. ఈ కేసులను ఎప్పటికపుడు కేసులు పరిష్కరించగా.. ప్రస్తుతం కోర్టులో 181 కేసులు నడుస్తున్నాయి. విడాకులకు దారితీస్తున్న కారణాలు తను చెప్పిన మాటను గౌరవించాలని ఇద్దరు పట్టింపులకు పోవడం. అత్యసవర వేళల్లో తల్లి దండ్రులకు డబ్బులు పంపడాన్ని అదేదో పెద్దనేరం అన్నట్లుగా భర్త, అత్తింటివారి నుంచి సూటిపోటి మాటలు తాను సంపాదించిన డబ్బును తానే పొదుపు చేసుకుంటానని చెప్పడం. అత్తమామలు, ఉమ్మడి కుటుంబంతో కలిసి ఉండననే భావన ఈతరం గృహిణిల్లో ఉండటం, ఈ కారణంగా ఇతర పట్టింపులు పండగలు, వేడుకల్లో తమ వారిని పట్టించుకోలేదని భార్యాభర్తలు గొడవలు పడటం. పండగల సమయాల్లో పుట్టింటికి వెళ్లవద్దని భార్యను అడ్డుకుంటూ పట్టుబట్టడం పుట్టిన పుల్లలకు పెట్టే పేరు నుంచి వారిని చేర్పించే స్కూలు ఎంపిక విషయంలోనూ తగాదాలు ఉద్యోగం చేసే భార్య బ్యాంక్ పాస్బుక్, ఏటీఎం వంటివి తన వద్దనే ఉండాలని భర్త వేధించడం ఫలితమివ్వని కౌన్సెలింగ్ మనస్పర్థలతో విడాకులు కోరు తూ కేసులు వేస్తున్న వారికి ముందుగా కౌన్సెలింగ్ నిర్వహిస్తుంటారు. అయితే కౌన్సెలింగ్కు హాజరైన వారు కలిసి ఉంటా మని చెప్పి వారం తిరగకముందే గొడవలు పడుతున్నారు. దీంతో ఇరువర్గాలకు రెండు మూడుసార్లు కౌన్సెలింగ్ నిర్వహించినా ఫలితం ఉండటం లేదు. కౌన్సెలింగ్ కేంద్రాల్లో మహిళల పక్షాన మాత్రమే ఆలోచించి ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటారని ఆరోపణలు ఉంటున్నాయి. దీంతో కౌన్సెలింగ్ నిర్వహించినప్పటికీ కొంతకాలానికి కోర్టును ఆశ్రయిస్తున్నట్లు సమాచారం. -
భద్రకాళిలా మారిన భార్య విశ్వరూపం చూశారా