wife murder
-
బాచుపల్లిలో భార్యను పాశవికంగా హత్య చేసిన భర్త
నిజాంపేట్: కుటుంబ కలహాలు ఓ మహిళ ప్రాణాలు తీశాయి. కర్కోటకుడైన ఓ భర్త..భార్యను అతిదారుణంగా హత్య చేసి..మృతదేహాన్ని ముక్కలుగా నరికేందుకు యత్నంచాడు. బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. దీనిపై శుక్రవారం మృతురాలి కుటుంబ సభ్యులు, పోలీసులు తెలి్పన వివరాలు ఇలా ఉన్నాయి. ప్రకాశం జిల్లా కొనకనమెట్ల మండలం గోట్లగట్టు గ్రామానికి చెందిన మధులత(29)కు ప్రకాశం జిల్లా దర్శికి చెందిన నాగేంద్ర భరద్వాజ్కు 2020లో వివాహం జరిగింది. వీరిద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగులు కావడంతో బాచుపల్లి పరిధిలోని సాయి అనురాగ్ కాలనీలోని ఎంఎస్ఆర్ ప్లాజా బి బ్లాక్లో నివాసం ఉంటున్నారు. పెళ్లయిన కొద్దిరోజుల తర్వాత దంపతుల మధ్య విభేదాలు ఏర్పడి తరచు గొడవ పడేవారు. డబ్బుల విషయంలో గొడవలు జరిగాయని, భరద్వాజ్ తరుచుగా మధులతను అనుమానించేవాడని బంధువులు ఆరోపించారు. ఈ నేపథ్యంలో మధులత పుట్టింటికి వెళ్లిపోయింది. ఆ సమయంలో గర్భవతిగా ఉన్న మధులత మగ బిడ్డకు జన్మనిచి్చంది. ఇక నాటి నుంచి భరద్వాజ్ భార్య వద్దకు వెళ్లలేదు. ఈదశలో బంధువులు జోక్యం చేసుకుని ఈ ఏడాది ఫిబ్రవరి 22న ఇద్దరికి రాజీ కుదుర్చి మధులతను భరద్వాజ్తో కాపురానికి పంపించారు. విచక్షణ కోల్పోయి..రాజీ కుదుర్చినా వారిద్దరి మధ్య గొడవలు సద్దుమణగలేదు. ఈ నేపథ్యంలో ఏపీలో ఈ నెల 13న ఎన్నికలు ఉండటంతో తాను పుట్టింటికి వెళ్తానని మధులత చెప్పగా..ఈ నెల 4న ఇద్దరి మధ్య గొడవ ప్రారంభం అయ్యింది. విచక్షణ కోల్పోయిన భరద్వాజ్ భార్య మధులత తలను నేలకేసి కొట్టి కత్తితో విచక్షణా రహితంగా పొడిచి హత్య చేశాడు. అనంతరం ముక్కలుగా నరికి మాయం చేయాలనుకుని మోకాలి కింద భాగాలను కోసే ప్రయత్నం చేశాడు. వీలుకాక ఈ ప్రయత్నాన్ని విరమించుకుని ప్రమాదంగా చిత్రీకరించే యత్నం చేశాడు. ఇందులో భాగంగా ఇంట్లోని వంట గ్యాస్ను లీక్ చేసి భార్య మృతదేహాన్ని ఇంట్లోనే పెట్టి తాళం వేసి కుమారుడితో పరారయ్యాడు. గ్యాస్ వాసన రావడంతో అపార్ట్మెంట్ వాసు లు పోలీసులకు సమాచారం ఇవ్వగా..పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి తలుపులు బద్ధలు కొట్టి గ్యాస్ను నిలిపివేశారు. అనంతరం మధుల త మృతదేహాన్ని చూసి ఖంగుతిన్నారు. హత్య చేసి స్నేహితుడి ఇంటికి.... భార్యను హత్య చేసిన భరద్వాజ్ చందానగర్లోని స్నేహితుడు శ్రీనివాస్ ఇంటికి వెళ్లాడు. తాను భార్యను హత్య చేశానని, తన కుమారుడిని జాగ్రత్తగా చూసుకో వాలని చెప్పి భార్యను పొడిచిన కత్తితోనే తాను సైతం పొడుచుకున్నాడు. దీంతో భయాందోళనకు గురైన శ్రీనివాస్ 100కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వగా పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. భరద్వాజ్కు పైవేటు ఆసుపత్రిలో చికిత్స చేయించి అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. పసికందు ముందే.. కుమారుడు శ్రీజై (17 నెలలు) ఇంట్లో ఆడుకుంటుండగా..బాలుని ముందే భరద్వాజ్ భార్యతో గొడవ పడి హత్య చేశాడు. మే 4న రాత్రి సుమారు 9 గంటల సమయంలో ఈ హత్య చేసినట్లు పోలీసులు పేర్కొంటున్నారు. పోలీసుల వివరణ మధులత హత్య కేసు విషయమై బాచుపల్లి ఎస్హెచ్ఓ ఉపేందర్ను వివరణ కోరగా ఈ నెల 4న తమకు సుమారు రాత్రి 12 గంటల సమయంలో సమాచారం వచ్చిందని తెలిపారు. వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని భరద్వాజ్ను అదుపులోకి తీసుకొని అరెస్టు చేసి రిమాండ్కు తరలించామన్నారు. అదే రాత్రి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాం«దీకి తరలించడం జరిగిందన్నారు. ఎన్నికల విధుల్లో ఉన్న కారణంగా మీడియాకు కేసు వివరాలు వెల్లడించలేదన్నారు.అన్నీ అనుమానాలే.. మధులత హత్యపై పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ నెల 4న హత్య జరగగా పోలీసులు ఈ విషయాన్ని గోప్యంగా ఉంచారు. మీడియాకు తెలుపలేదు. అలాగే అపార్ట్మెంట్ వద్ద ఇంత గొడవ జరిగినా విషయం బయటకు పొక్కలేదు. హత్యకు గురైన మధులత కుటుంబ సభ్యులు సైతం హత్య జరిగిన 20 రోజుల తర్వాత ఈ విషయాన్ని శుక్రవారం మీడియాకు వెల్లడించడం కూడా ఆశ్చర్యానికి గురిచేస్తోంది. -
భర్తను హత్య చేసిన భార్యకు రిమాండ్
చింతపల్లి రూరల్: భర్తను హత్య చేసిన భార్యను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్టు చింతపల్లి అదనపు ఎస్పీ ప్రతాప్ శివకిశోర్ తెలిపారు. ఆదివారం ఆయన విలేకరులకు తెలిపిన వివరాలివి. జి.కె వీధి మండలం సపర్లకు చెందిన కొర్ర కృష్ణారావు, గెమ్మిల వీరమ్మ దంపతులు గత బుధవారం గొడవ పడ్డారు. గొడవ ముదిరి వీరమ్మ భర్త కృష్ణారావును గొడ్డలితో తలపై కొట్టింది. దీంతో తీవ్రంగా గాయపడిన కృషారావును ఆస్పత్రికి తరలించగా మృతి చెందాడు. ఈ ఘటనపై కృష్ణారావు తల్లి కోర్రా లక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేసింది. జి.కె వీధి సీఐ అశోక్కుమార్, సీలేరు ఎస్ఐ రామకృష్ణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా కృష్ణారావుకు గతంలో పైళ్లె ముగ్గురు పిల్లలు ఉన్నారు. అతని భార్య రెండేళ్ల క్రితం మృతి చెందడంతో అదే గ్రామంలో భర్త చనిపోయి ఉంటున్న వీరమ్మను వివాహమాడాడు. తన మొదట భార్య పిల్లలను వీరమ్మ సరిగ్గా చూడటం లేదనే భావనతో పాటు ఒకరిపై ఒకరు అనుమానంతో ఇద్దరూ నిత్యం గొడవ పడేవారు. పిల్లలను హాస్టల్లో చేర్పించి, వీరమ్మ పిన్ని ఇంట్లో చట్రపల్లిలో నివాసముంటుంది. ఇద్దరూ తరుచూ గొడవలు పడడంతో విసుగు చెందిన వీరమ్మ అతని అడ్డు తొలగించుకోవాలని కృషారావు తలపై గొడ్డలితో మూడుసార్లు కొట్టింది. దీంతో తీవ్ర రక్తస్రావంతో పడిపోయిన కృష్ణారావును ఆస్పత్రికి తరలించగా గురువారం మృతి చెందాడు. ఘటనపై దర్యాప్తు జరిపిన పోలీసులు ఆధారాలు సేకరించి వీరమ్మను అరెస్టు చేసి రిమాండ్కు తరలించామన్నారు. -
‘‘రేణుకను చంపేశాను.. వెంటనే వచ్చి శవం తీసుకెళ్లండి’
మెదక్: ‘‘రేణుకను చంపేశాను.. వెంటనే వచ్చి శవం తీసుకెళ్లండి’అని ఓ వ్యక్తి తన భార్య బంధువుకు ఫోన్ చేశాడు. ఈ సంఘటన నారాయణఖేడ్ మండలం సిర్గాపూర్ మండలంలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మండల పరిధిలోని వాసర్కు చెందిన రేణుక (22)కు, నారాయణఖేడ్ మండలం జూకల్కు చెందిన కుందేలు శర్ణప్ప (25)తో నాలుగేళ్ల క్రితం వివాహం జరిగింది. కొంత కాలంగా భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు చోటుచేసుకున్నాయి. శర్ణప్ప తరచూ ఆమెను మానసికంగా వేధించేవాడు. పలుమార్లు పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టించినా అతనిలో మార్పురాలేదు. ఇటీవల వేధింపులు మరీ ఎక్కువయ్యాయి. ఈ క్రమంలో సోమవారం రాత్రి రేణుక బంధువైన జగదేవికి శర్ణప్ప చేశాడు. రేణుకను చంపేశాను, వచ్చి శవం తీసుకెళ్లండని చెప్పడంతో ఆమె కంగుతిన్నది. మంగళవారం ఉదయం బంధువులు వచ్చి వెతకగా గ్రామ శివారులోని బావిలో రేణుక మృతదేహం లభించింది. రేణుకను భర్త, అతని కుటుంబ సభ్యులే హత్య చేసి బావిలక్ష పడేశారని మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ విద్యాచరణ్రెడ్డి తెలిపారు. -
భార్యను హత్య చేశాడు.. కానీ కోర్టు నిర్దోషని తెలిపింది
లండన్: సిప్రస్ లో తన భార్యను చంపిన కేసులో ఓ హంతకుడిని కోర్టు నిర్దోషిగా ప్రకటించింది. బ్లడ్ క్యాన్సరుతో బాధపడుతున్న భార్య జానీస్ హంటర్ బాధను తట్టుకోలేక తానే చంపమని కోరిందని, తప్పని పరిస్థితుల్లో నిందితుడు డేవిడ్ హంటర్ ఆమె ఆత్మహత్యకు సాయం చేశాడని హంతకుడి తరపు న్యాయవాది కోర్టుకి వాదనలు వినిపించగా కోర్టు ఆ వాదనలతో ఏకీభవించింది. డేవిడ్ హంటర్ నరహంతకుడిగా అనిపించడం లేదని తెలిపింది. డేవిడ్ హంటర్(76) భార్య జానీస్ హంటర్ బ్లడ్ క్యాన్సర్ వ్యాధి బారిన పడింది. చూస్తుండగానే వ్యాధి ముదిరిపోవడంతో చివరి రోజుల్లో ఆమె నొప్పిని భరించలేకపోయింది. బ్రతికి ఉండటం కంటే చనిపోవడమే మేలని తరచూ భర్తకు గోడు వినిపించేది. చివరికి ఒకరోజు బాధ తీవ్రం కావడంతో తనను చంపి నొప్పి నుండి విముక్తి కలిగించమని భర్తను వేడుకుంది. తాను ఎంతగానో ప్రేమించిన భార్య అంత వేదన భరించడాన్ని చూడలేకపోయిన హంటర్ మరో ప్రత్యామ్నాయం లేక 2021 డిసెంబర్లో భార్యను కడతేర్చాడు. దీంతో హంటర్ పై హత్యా నేరం మోపబడింది. భార్య ఆవేదన తట్టుకోలేకే ఆమెను చంపినట్టు హంటర్ పదేపదే కోర్టుకు విన్నవించాడు. అతని తరపు వకీలు కూడా ఇదే విషయాన్ని కోర్టుకు చెప్పుకొచ్చారు. తన భార్య చివరి రోజుల్లో చూడ విహీనంగా తయారైన తన ఆకృతిని ఎవరికీ చూపించలేక మానసికంగా బాగా కుంగిపోయిందని, తనకు డైపర్లు కూడా మార్చేవాడినని, తనకోసం నేను అంతగా శ్రమ పడటం చూడలేకపోయింది. దాన్ని తలచుకుని ఇంకా ఎక్కువ బాధపడేది. ఒకానొక దశలో బాధని తట్టుకోలేక ఎలాగైనా తనను చంపేయమని ఆరేడు వారాలు ప్రాధేయపడిందని, తప్పని పరిస్థితులలోనే అలా చేశానని కోర్టుకు తెలిపారు హంటర్. వాదోపవాదాలు విన్న తర్వాత కోర్టు హంటర్ నరహంతకుడేమీ కాదని వ్యాఖ్యానించింది. కోర్టు తన అభిప్రాయం వెల్లడించిన తర్వాత హంటర్ కళ్ళు చెమ్మగిల్లాయి. మూడేళ్ళుగా జైలులో మగ్గిపోతున్న తన తండ్రి ఎట్టకేలకు బయటకు రానున్నారని సంతోషాన్ని వ్యక్తం చేసింది హంటర్ కుమార్తె. జులై 27న హంటర్ నిర్దోషని తీర్పు వెలువడటమే తరువాయి అమ్మ సమాధి దగ్గరకు వెళ్ళిపోతారని చెప్పుకొచ్చింది. ఇది కూడా చదవండి: ఆ రెస్టారెంట్లో తిన్న తర్వాత హాయిగా పడుకోవచ్చు.. -
భర్త వీడియో కాల్ చేయలేదని.. మొదటి భార్య ఆత్మహత్య
అన్నానగర్: తన భర్త మొదటి భార్యతో కలిసి వేరే రాష్ట్రానికి వెళ్లడంతో రెండున్నర ఏళ్ల బిడ్డను విడిచిపెట్టి మహిళ ఆత్మహత్య చేసుకుంది. కోయంబత్తూరు సమీపంలోని గణపతి వీధికి చెందిన రఘుపతి (38) వ్యాపారి. ఇతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కోయంబత్తూరుకు చెందిన దివ్యభారతి(31)ని రఘుపతి 2వ వివాహం చేసుకున్నాడు. వీరికి రెండున్నర ఏళ్ల కుమార్తె ఉంది. ఆ ప్రాంతంలోని లక్ష్మీపురంలో దివ్యభారతి తన బిడ్డతో కలిసి నివసిస్తోంది. రఘుపతి కొద్ది రోజులు భార్య ఇంట్లోనూ, కొన్ని రోజులు దివ్యభారతి ఇంట్లోనూ ఉండేవాడు. రఘుపతికి అప్పటికే పెళ్లయిందని, భార్య, పిల్లలు ఉన్నారని దివ్యభారతికి తెలిసినా.. మొదటి భార్య ఇంటికి వెళ్లవద్దని చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో వీరి మధ్య తరచూ కుటుంబ కలహాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో రఘుపతి తన మొదటి భార్య, పిల్లలతో కలిసి ఆంధ్రప్రదేశ్కు వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న దివ్యభారతి తన మొదటి భార్య పిల్లలతో కలిసి ఆంధ్రాకు వెళ్లొద్దని చెప్పి గొడవకు దిగినట్లు సమాచారం. అయితే అతను తన మొదటి భార్య, పిల్లలతో కలిసి ఆంధ్రప్రదేశ్కి వెళ్లాడు. ఈ విషయం తెలుసుకున్న దివ్యభారతి భర్తను ఎక్కడున్నావని ప్రశ్నించింది. తనతో వీడియో కాల్ మాట్లాడాలని.. లేకుంటే ఆత్మహత్య చేసుకుంటానని చెప్పింది. అయితే రఘుపతి వీడియో కాల్ చేయలేదని తెలుస్తోంది. దీంతో మనస్తాపం చెందిన దివ్యభారతి సోమవారం ఉదయం ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. -
పెళ్లై ఏడు నెలలు.. భార్యాభర్తల మధ్య గొడవ.. చివరకు
దొడ్డబళ్లాపురం: కుటుంబ కలహాల నేపథ్యంలో భార్యను కత్తితో పొడిచి హత్య చేసిన భర్త ఉదంతం దొడ్డ పట్టణ పరిధిలోని శ్రీనగర్లో చోటుచేసుకుంది. తమిళనాడులోని కన్యాకుమారికి చెందిన జనిలా జోబియా(23)కు శ్యామ్(26)తో ఏడు నెలల క్రితం వివాహమైంది. శ్యామ్ స్థానిక ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నాడు. శ్రీనగర్లో ఇల్లు అద్దెకు తీసుకుని నివసిస్తున్నారు. మంగళవారం రాత్రి ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఓ దశలో శ్యామ్ కత్తితో జనిలాను శరీరమంతా విచక్షణారహితంగా పొడిచాడు. అడ్డు వచ్చిన శ్యామ్ తల్లిదండ్రులకు కూడా గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడ్డ జనిలాను శ్యామ్ స్వయంగా ఆస్పత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ మృతిచెందినట్లు పట్టణ పోలీసులు తెలిపారు.శ్యామ్ను అరెస్టు చేశారు. -
భార్య హత్య కేసులో జైలుకెళ్లిన భర్త.. ఆరేళ్ల తర్వాత షాక్..
లక్నో: ఉత్తర్ప్రదేశ్ మథురలో షాకింగ్ ఘటన జరిగింది. భర్త చేతిలో హత్యకు గురైన భార్య ఆరేళ్ల తర్వాత తిరిగి ప్రత్యక్షమైంది. మరొకరితో కలిసి హాయిగా జీవిస్తున్న ఆమెను చూసి భర్త షాక్ అయ్యాడు. ఆమె హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇతడు ఇప్పటికే 18 నెలల జైలు శిక్ష అనుభవించాడు. ఏం జరిగిందంటే? ఆర్తి దేవి, సోను సైని 2015లో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. బృందావన్లో ఓ అద్దె ఇంట్లో నివాసముండే వారు. అయితే ఆర్తి కొద్ది రోజుల తర్వాత అదృశ్యమైంది. ఆ తర్వాత గుర్తు తెలియని మహిళ మృతదేహం లభించింది. అది తన కూతురిదే అని ఆర్తి తండ్రి పోలీసులకు చెప్పాడు. దీంతో పోలీసులు ఆర్తి భర్త సోను, అతని స్నేహితుడు గోపాల్పై హత్యానేరం కింద అభియోగాలు మోపారు. 2016లో ఇద్దరిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి అరెస్టు చేశారు. ఈ కేసులో సోను 18 నెలలు, గోపాల్ 9 నెలలు జైలు శిక్ష అనుభవించారు. హత్యను త్వరగా ఛేదించినందుకు పోలీసులకు రూ.15వేల నజరానా కూడా ఇచ్చింది ప్రభుత్వం. అయితే సోను, గోపాల్కు అలహాబాద్ హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో ఇద్దరూ జైలు నుంచి విడుదల అయ్యారు. తన భార్య చనిపోలేదని భావించిన సోను ఆమె కోసం వెతకడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలోనే ఆరేళ్ల తర్వాత ఆమెను మరొకరితో చూశాడు. వెంటనే మథుర పోలీసులకు సమాచారం అందించాడు. రంగంలోకి దిగిన వారు.. ఆ మహిళను ఆదివారం అరెస్టు చేశారు. చదవండి: త్వరలో రూ.2,000 నోట్లు రద్దు! బీజేపీ ఎంపీ కీలక వ్యాఖ్యలు.. -
భార్య సివిల్స్ పోరాటం..భర్తలో అనుమానం
సాక్షి, బెంగళూరు: భార్యను సినిమాశైలిలో హత్య చేసిన భర్త బండారం బయటపడడంతో కటకటాల పాలయ్యాడు. మడివాళ పోలీస్స్టేషన్లో మిస్సింగ్ అని ఫిర్యాదు చేసిన భర్త పృధ్వీరాజ్ (48) పై అనుమానంతో పోలీసులు అదుపులోకి ప్రశ్నించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. డీసీపీ సీకే.బాబా కేసు వివరాలను వెల్లడించారు. మడివాళలో గత 13 ఏళ్లుగా ఎలక్ట్రానిక్ప్ అప్లయన్స్ దుకాణం నిర్వహిస్తున్న బిహార్కు చెందిన పృధ్వీరాజ్, 8 నెలల కిందట జ్యోతికుమారి (38) అనే మహిళను వివాహం చేసుకున్నాడు. ఆమెది కూడా బిహారే. గత కొద్దిరోజులనుంచి దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. భార్య విద్యావంతురాలు కాగా ఆమె సివిల్స్కు ప్రిపేరవుతోంది. ఒక యువకునితో తరచూ ఫోన్లో మాట్లాడేది. దీంతో భర్త ప్రశ్నించడంతో గొడవలు జరిగేవి. చివరకు ఆమెను హత్యచేయాలని పృధ్వీరాజ్ పథకం రూపొందించాడు. భర్త పృధ్విరాజ్ భార్య జ్యోతి (ఫైల్) ఉడుపిలో తొలి యత్నం విఫలం ఇద్దరి సెల్ఫోన్లు ఇంట్లో పెట్టి ఈ నెల 2న భార్యను ఉడుపి మల్పె బీచ్కు తీసుకెళ్లడానికి జూమ్ కారును బాడుగకు తీసుకున్నాడు. స్నేహితుడు సమీర్కుమార్ను కూడా తీసుకెళ్లాడు. బీచ్లో భార్యను ముంచేసి సహజ మరణంగా నమ్మించాలన్నది భర్త కుట్ర. కానీ సముద్రం లోతులోకి దిగలేక ప్లాన్ ఫలించలేదు. తరువాత సకలేశపురకు తీసుకెళ్లి కారులోనే ఆమెను చున్నీతో గొంతుబిగించి ప్రాణాలు తీసి అక్కడే పొదల్లో పడేసి ఇంటికి చేరుకున్నాడు పృధ్వీరాజ్, అతని మిత్రుడు. చదవండి: (మహిళపై అత్యాచారం.. బీజేపీ నేతపై కేసు నమోదు చేయాలని కోర్టు సీరియస్) మిస్సింగ్ అని ఫిర్యాదు 5వ తేదీన మడివాళ పోలీస్స్టేషన్లో భార్య కనిపించడం లేదని ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమె సెల్ఫోన్ ఇంట్లోనే ఉండటాన్ని తెలుసుకుని అనుమానంతో సీసీ కెమెరాల దృశ్యాలను పరిశీలించారు. పోలీసులు చివరకు అనుమానం వచ్చి భర్తను తమదైన శైలిలో విచారించగా ఒప్పుకున్నాడు. భార్య తనను తీవ్ర వేధింపులకు గురిచేసిందని చెప్పాడు. రెండుసార్లు సివిల్స్ పరీక్షలు రాయడానికి, శిక్షణ సమయంలో ఢిల్లీకి వెళ్లిన సమయంలో అక్కడ ఒక యువకునితో సంబంధం పెట్టుకుందని, దీంతో విరక్తి చెంది హత్యచేశానని అంగీకరించాడని పోలీసులు తెలిపారు. పరారీలో ఉన్న అతని మిత్రుని కోసం గాలింపు జరుగుతోంది. -
రూ.28 లక్షలకు సొంతిల్లు అమ్మేసి.. భార్యను ప్లాస్టిక్ కవర్లో సీల్ చేసి..
సాక్షి, చెన్నై : కష్టపడి కట్టుకున్న సొంతింటిని రూ.28 లక్షలకు అమ్మేసి ఆన్లైన్ రమ్మీలో తగలపెట్టాడో భర్త. ప్రశ్నించిన భార్యను హతమార్చి ప్లాస్టిక్ బ్యాగ్లో పార్శిల్ చేసి ఇంట్లో పెట్టాడు. ఇరుగు పొరుగు వారికి అనుమానం రాకుండా కరోనా నాటకాన్ని రచించి ఉడాయించాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ సంఘటన వివరాల్లోకి వెళితే... ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం విజయవాడకు చెందిన నర్సింహరాజు(38) తిరుచ్చికి వచ్చి స్థిర పడ్డాడు. 11 ఏళ్ల క్రతం తిరుచ్చి తిరువానై కావల్కు చెందిన గోపినాథ్ కుమార్తె శివరంజనిని వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ దంపతులకు సమయపురం శక్తి నగర్లో ఓ ఇల్లు ఉంది. కొన్ని నెలల క్రితం నర్సింహ రాజు ఈ ఇంటిని అమ్మేశాడు. తాలకుడి సాయినగర్లో అద్దె ఇంట్లో కుటుంబాన్ని ఉంచాడు. వీరితో నర్సింహ రాజు తల్లి వసంతకుమారి(52) కూడా ఉన్నారు. ఆన్లైన్ రమ్మీకి బానిసై.. గత ఏడాది నుంచి నర్సింహ రాజు ఆన్లైన్ రమ్మీకి బానిస అయ్యాడు. భార్య శివరంజని వారించినా పట్టించుకోలేదు. ఈ పరిస్థితుల్లో సమయపురంలోని ఇంటిని రూ. 28 లక్షలకు అమ్మి ఆటలో పోగొట్టాడు. విషయం తెలుసుకున్న శివరంజని ఈ నెల 4వ తేదీ రాత్రి భర్తను నిలదీసింది. ఆగ్రహించిన నర్సింహరాజు భార్యను కత్తితో పొడిచి హతమార్చాడు. ఇంట్లో ఉన్న ప్లాస్టిక్ కవర్లో చుట్టి బెడ్రూంలో ఉంచాడు. మరుసటి రోజు తల్లి, పిల్లలను విజయవాడకు పంపించేశాడు. ఇరుగు పొరుగు వారికి అనుమానం రాకుండా తన భార్యకు కరోనా సోకిందని క్వారంటైన్లో ఉన్నట్లు నాటకం ఆడాడు. ఆ తర్వాత అక్కడి నుంచి తానూ ఉడాయించాడు. వెలుగులోకి.. రెండు రోజులుగా శివరంజని తన ఫోన్ తీయక పోవడంతో తండ్రి గోపినాథ్ ఆందోళన చెందాడు. నర్సింహరాజు ఫోన్ పనిచేయక పోవడంతో ఆందోళనకు లోనయ్యాడు. విజయవాడలోని అల్లుడి సోదరిని సంప్రదించాడు. శివరంజనికి కరోనా వచ్చినట్టు, ఇద్దరు పిల్లలు మాత్రం తన వద్ద ఉన్నట్టు ఆమె ఇచ్చిన సమాచారంతో ఆందోళన చెందిన గోపినాథ్ గురువారం రాత్రి బంధువులతో కలిసి తాలకుడి సాయినగర్కు వెళ్లారు. ఇంటి తలుపులు పగుల కొట్టి చూడగా దుర్వాసన రావడంతో కొల్లిడం పోలీసులకు సమాచారం అందించారు. వారు వచ్చి చూడగా గదిలో బెడ్ కింద ప్లాస్టిక్ కవర్లో కప్పి ఉన్న శివరంజని మృత దేహం బయట పడింది. మృత దేహాన్ని పోస్టుమార్టానికి తరలించిన పోలీసులు కేసు విచారణ వేగవంతం చేశారు. నిందితుడు నర్సింహరాజు కోసం గాలిస్తున్నారు. -
రహస్యంగా ఫోన్కాల్స్.. ఎన్నిసార్లు చెప్పినా మారని కోడలు.. చివరకు
సాక్షి, భువనగిరి(నల్లగొండ): వివాహేతర సంబంధం కొనసాగిస్తుందన్న అనుమానంతో మహిళను భర్త, ఆమె అత్త కలిసి హత్య చేసినట్లు భువనగిరి డీసీపీ నారాయణరెడ్డి చెప్పారు. హత్య సంఘటనకు సంబందించి వివరాలను గురువారం భువనగిరిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. హైదరాబాద్లోని మల్లాపూర్ సూర్యనగర్ కాలనీకి చెందిన కోట ధశరథకు ఇద్దరు భార్యలు ఉన్నారు. పెద్ద భార్య వెంకటమ్మకు కుమార్తె హేమలత(28)ను దశరథ బావమర్ది అయిన భువనగిరిలోని తాతానగర్కు చెందిన దేశగాని చంద్రశేఖర్కు ఇచ్చి పది సంవత్సరాల క్రితం వివాహం చేశారు. ప్రస్తుతం వీరికి ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. హేమలత వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకున్నదనే అనుమానంతో చంద్రశేఖర్ తరచూ గొడవపడుతుండేవాడు. ఇదే విషయాన్ని చంద్రశేఖర్ తన కుటుంబ సభ్యులకు చెప్పాడు. హేమలత రహస్యంగా ఫోన్ వాడుతున్నదని ఆమె అత్తింటివారు నిలదీశారు. ఆమె ప్రవర్తనలో మార్పు రావడం లేదని, తమ పరువు తీస్తుందని భావించి హేమలతను చంపివేయాలని నిర్ణయించుకున్నారు. ముగ్గురు కలిసి.. ఈ నెల 13న ప్లాన్ ప్రకారం చంద్రశేఖర్ భువనగిరి గంజ్లోని ఓ దుకాణంలో క్రిమిసంహారక మందు డబ్బాను కొని ఇంటికి వచ్చాడు. అతని బావ రవి హేమలత కాళ్లు చేతులను గట్టిగా పటుకోగా చంద్రశేఖర్ తల్లి వెంకటమ్మ క్రిమిసంహారక మందును హేమలత నోట్లో బలవంతంగా పోసింది. చనిపోయిందోలేదో అనే అనుమానంతో చంద్రశేఖర్ హేమలత మేడకు తాడు బిగించి హత్య చేశాడు. తర్వాత పోలీస్ కేసు అవుతుందనే భయంతో ముగ్గురు అక్కడి నుంచి పారిపోయి యాదగిరిగుట్ట పరిసర ప్రాంతంలో తలదాచుకొన్నారు. ఇదే సమయంలో మృతిరాలి తండ్రికి ఫోన్ చేసి సమాచారం అందించారు. వెంటనే భువనగిరి చేరుకున్న హేమలత తండ్రి కూతురిని పరిశీలింగా మేడపై గాయలు ఉన్నట్లు అనుమానం రావడంతో చంద్రశేఖర్ కుటుంబ సభ్యులను నిలదీశాడు. హేమలతను తామే హత్యచేసినట్లు చెప్పడంతో దశరథ స్థానిక పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సీఐ సుధాకర్ కేసు నమోదు చేసుకుని ధర్యాపు ప్రారంభించారు. ఈ నెల 15న నిందితులను ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారించారు. వారిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు తెలిపారు. నిందితుల నుంచి మూడు సెల్ ఫోన్లు, తాడు, క్రిమిసంహారక మందు డబ్బాలు స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ చెప్పారు. విలేకరుల సమావేశంలో ఇంచార్జి ఏసీపీ నర్సింహ్మరెడ్డి పాల్గొన్నారు. చదవండి: నా భార్యను అలా చూసి తట్టుకోలేకపోయా.. అందుకే ఆ పనిచేశా! -
కూకట్పల్లి పోలీస్స్టేషన్ పరిధిలో దారుణం
సాక్షి, హైదరాబాద్: అనుమానంతో కట్టుకున్న భార్యను కడతేర్చాడు ఓ కసాయి భర్త. వివాహం అయిన ఏడు నెలలకే ఆ అభాగ్యురాలు భర్త కర్కశత్వానికి బలైంది. ఈ ఘటన కూకట్పల్లి పోలీస్స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటు చేసుకుంది. సిఐ నర్సింగ్రావు తెలిపిన వివరాల ప్రకారం... శ్రీకాకుళం జిల్లా హిర మండలం, గొట్ట గ్రామానికి చెందిన సంతోష్, ఉమ అలియాస్ శిరీష దంపతులు మూసాపేట గూడ్స్షెడ్ రోడ్డులో లచ్చయ్య నగర్లో నివాసముంటున్నారు. సంతోష్ స్థానికంగా ఇదే కాలనీలో వెల్డింగ్ షాపు నిర్వహిస్తున్నాడు. వీరికి ఈ ఏడాది మే 30వ తేదీన వివాహమైంది. సంతోష్, ఉమ కుటుంబ సభ్యులు సైతం మూసాపేటలో స్ధిరపడ్డారు. అయితే సంతోష్ పెళ్లి చేసుకున్న దగ్గర నుంచి ఉమను అనుమానిస్తూ మానసిక వేదనకు గురి చేసేవాడు. ఉమ కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడనిచ్చేవాడు కాదు. ఇంటికి ఎవరినీ రానిచ్చే వాడు కాదు. ఈ క్రమంలోనే గత కొంతకాలంగా ఇరువురి మధ్య గొడవలు చోటు చేసుకున్నాయి. గురువారం ఉదయం కూడా వీరిద్దరు ఘర్షణ పడగా..పెద్ద మనుషులు జోక్యం చేసుకొని సర్ధిచెప్పారు. అనంతరం కొద్దిసేపటికి ఉమని గొంతు నులిమి హత్య చేసి..శవాన్ని ఇంట్లోనే ఉంచి తాళం వేసి పరారయ్యాడు. రెండు రోజులుగా ఇంటికి తాళం వేసి ఉండటంతో పక్కింటి వారు ఉమ కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. వారు సంతోష్కు ఫోన్ చేయగా ఫోన్ ఎత్తకపోవటంతో అనుమానం వచ్చి తాళం పగలగొట్టి చూడగా ఉమ హత్యకు గురైన విషయం తెలిసింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించగా గొంతునులిమి హత్యచేసినట్లుగా గుర్తించారు. చదవండి: (భర్త లింగమార్పిడి.. మరొకరితో సహజీవనం.. అంతలోనే..) -
కూతురి సాక్ష్యం, తండ్రికి జీవిత ఖైదు
సాక్షి, మైసూరు(కర్ణాటక): తల్లిని తండ్రే హత్య చేయడం తాను చూశానని చిన్నారి కూతురు చెప్పిన సాక్ష్యంతో తండ్రికి శిక్ష పడింది. వివరాలు.. చామరాజనగర జిల్లా కోళిపాళ్య గ్రామానికి చెందిన తొళచనాయక్కు, పుష్పబాయికి పెళ్లి సమయంలో 20 గ్రాముల బంగారు నెక్లెస్ను ఇచ్చారు. వీరికి 8 ఏళ్ల కూతురు ఉంది. తొళచనాయక్ తమ్మునికి సమస్య వస్తే డబ్బుల కోసం బంగారు నెక్లెస్ను కుదువ పెట్టాడు. నెక్లెస్ను విడిపించుకురావాలని భార్య ఒత్తిడి చేసేది. 2017 మార్చి 27న ఇదే విషయమై గొడవ జరగ్గా తొళచనాయక్ వేటకొడవలితో భార్యను నరికి చంపాడు. ఈ కేసులో తుది విచారణ చామరాజనగర అదనపు జిల్లా సెషన్స్ కోర్టులో జరిగింది. తండ్రి దాష్టీకంపై కూతురు సాక్ష్యం చెప్పడంతో నేర నిరూపణ అయ్యింది. దోషికి జీవితఖైదును విధించారు. -
ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.. అంతలోనే భార్యను..
సాక్షి, శివమొగ్గ (కర్ణాటక): ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. అంతలోనే అనుమానమో, ఆవేశమో చివరకు భార్యను దారుణంగా హతమార్చాడు. వివరాలు... శివమొగ్గ జిల్లా ఆయనూరుకు చెందిన కౌసర్ ఫిజా (19), టిప్పు నగర్లో ఉండే గుజరీ వ్యాపారి షోయబ్లు ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే ఇద్దరి మధ్య ఏమి జరిగిందో తెలియదు, శనివారం రాత్రి షోయబ్ భార్య కౌసర్ను తీసుకుని నగరానికి సమీపంలోని హాలూరు గ్రామం వద్ద దారుణంగా చంపేశాడు. నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు చేపట్టారు. చదవండి: (బుల్లితెర నటి ఉమామహేశ్వరి కన్నుమూత) -
భార్యను కత్తితో నరికి.. భర్త ఆత్మహత్య
సాక్షి, ఖమ్మం: తల్లాడ మండలం రంగంబంజర్ గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. ఓ వ్యక్తి తన భార్యను కత్తితో నరికి చంపి అనంతరం తాను పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రంగంబంజర్ గ్రామానికి చెందిన సుబ్రహ్మణ్యేశ్వర రావు (65) తన భార్య సంక్రాంతి విజయలక్ష్మిని కత్తితో నరికి చంపాడు. తర్వాత తాను పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంట్లో రక్తపు మడుగులో పడి ఉన్న విజయ లక్ష్మీ మృతదేహం, భర్త సుబ్రహ్మణ్యేశ్వర రావు మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్ట్మర్టంకు తరలించారు. ఈ మృతులకు దంపతులకు ఇద్దరు కూతుళ్లు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఒక కూతురు విదేశంలో ఉంటుండగా మరో కూతురు రామగుండంలో జాబ్ చేస్తోందని పేర్కొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసకున్న పోలీసలు దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. చదవండి: గొంతు నులిమి చంపాలనుకున్నాడు.. కానీ -
ప్రియురాలి మోజులో.. భార్యకు విషపు ఇంజెక్షన్
దొడ్డబళ్లాపురం : ప్రియురాలిపై వ్యామోహంతో కట్టుకున్న భార్యను కడతేర్చిన కిరాతక భర్తను రామనగర పోలీసులు అరెస్టు చేశారు. రామనగర ప్రభుత్వ ఆస్పత్రిలో రోజు కూలీ ఉద్యోగిగా పనిచేస్తున్న డాటా ఎంట్రీ ఆపరేటర్ వెంకటేశ్ (28) నిందితుడు. ఇతడు భార్య దీప (22)కు విషపూరిత ఇంజక్షన్ ఇచ్చి హత్య చేశాడని పోలీసులు తెలిపారు. పోలీసులు ఇచ్చిన సమాచారం మేరకు... ఏడాది క్రితం రామనగర తాలూకా కొళమారనకుప్పె గ్రామానికి చెందిన దీపకు సమీప వడ్డరదొడ్డివాసి వెంకటేశ్తో పెళ్లయింది. ఇతనికి అంతకుముందే ఆస్పత్రిలో పనిచేసే ఒక యువతితో వివాహేతర సంబంధం ఉంది. పెళ్లి తరువాత ఈ సంగతి తెలిసిన భార్య.. తన తల్లిదండ్రులకు చెబుతానని గొడవ చేసింది. ఈ విషయమై ఇద్దరికీ నిత్యం గలాటాల జరిగేవి. వెంకటేశ్ భార్యను మానసికంగా, శారీరకంగా వేధించేవాడు. ప్రియురాలితో కలిసి కుట్ర తనకు, ప్రియురాలికి మధ్య అడ్డుగా ఉన్న దీపను అంతమొందించాలని అతడు పథకం వేశాడు. దాని ప్రకారం వెంకటేశ్ ప్రియురాలి సాయంతో కొన్ని మాత్రలు తీసికెళ్లి దీప చేత బలవంతంగా మింగించి ఆమె స్పహ తప్పాక ఆస్పత్రికి తీసుకువచ్చి చికిత్స ఇప్పించాడు. ఆమె కోలుకున్నాక ఇంటికి తీసుకువచ్చి ఫర్టిలైజర్ దుకాణం నుంచి పురుగుల మందు తీసుకువచ్చి భార్యకు ఇంజెక్షన్ వేశాడు. విష ప్రభావంతో దీప మృతి చెందింది. అతడు ఏమీ ఎరగనట్టు ఆస్పత్రికి వచ్చి ఆరోగ్యం బాలేదని గ్లూకోజ్ పెట్టించుకుని అడ్మిట్ అయ్యాడు. ఆరోగ్యంగా ఉన్న దీప ఆకస్మాత్తుగా మరణించడంతో బంధుమిత్రుల్లో అనుమానాలు వచ్చాయి. పోలీసుల విచారణలో వెంకటేశ్ దురాగతం బయటపడింది. ప్రియుడు, ప్రియురాలిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. -
చిక్కడు.. దొరకడు.. ఎఫ్బీఐకి కూడా..
న్యూయార్క్/న్యూఢిల్లీ: ఆ హంతకుడిపై ఏకంగా రూ. 70లక్షల రివార్డు. దర్యాప్తులోనే మేటి అయిన అమెరికా అతని కోసం తెగ అన్వేషిస్తోంది. భారత్సహా నాలుగేళ్లుగా ప్రపంచాన్ని జల్లెడ పట్టినా అతడు దొరకలేదు. అమెరికా దర్యాప్తు సంస్థ (ఎఫ్బీఐ) టాప్ 10 వాంటెడ్ లిస్టులో స్థానం దక్కించుకున్నాడు. అతడే అహ్మదాబాద్కు చెందిన భద్రేశ్ కుమార్ పటేల్ (24). అమెరికాలోని డంకిన్ డోనట్స్ స్టోర్లో పనిచేస్తున్న అతడు తన భార్యను కిరాతకంగా చంపాడు. అనంతరం తప్పించుకొని పోలీసులను ముప్పుతిప్పలు పెడుతున్నాడు. 2015 ఏప్రిల్ 12న రాత్రి పనిచేస్తున్న అతడు తన భార్య ఫలక్ (21)తో కలసి స్టోర్లోని కిచెన్కు వెళ్లాడు. కాసేపటికి ఒక్కడే బయటకు వచ్చాడు. కొద్ది గంటల తర్వాత పోలీసులు అమె మృత దేహాన్ని కనుక్కున్నారు. చాలా సార్లు కత్తితో పొడిచి మరీ హత్యచేశాడు. సీసీటీవీ ఫుటేజీల ప్రకారం అతడు ఓ టాక్సీలో హోటల్కు వెళ్లి రాత్రంతా పడుకొని తెల్లవారాక మాయమయ్యాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకూ అతడు కనిపించలేదు. ఎఫ్బీఐ అతడి కోసం అమెరికాలోనేగాక భారత్లోని గుజరాత్, మహారాష్ట్ర, ఢిల్లీలలో కూడా వెదికారు. ఇరుదేశాలు కలసి చేసిన పెద్ద కేసు విచారణ ఇదే కావడం గమనార్హం. -
భార్యను చంపి, కిటికీకి ఉరివేసి..
క్రిష్ణగిరి: అగ్నిసాక్షిగా పెళ్లాడిన భార్యను మానవత్వం మరచి హత్య చేశాడో మృగాడు. భార్యను దారుణంగా హత్య చేసి ఉరికి వేలాడదీసి పరారైన భర్త కోసం సూళగిరి పోలీసులు గాలిస్తున్నారు. విళుపురం జిల్లా శంకరాపురం సమీపంలోని మరిది గ్రామానికి చెందిన ఇళయరాజ భార్య శాంతి (33) హతురాలు. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. ఉద్యోగ నిమిత్తం భార్యాభర్తలిరువురూ గత 15 రోజుల క్రితం సూళగిరికి వచ్చారు. సూళగిరి దిగువపేటలో బాడుగ ఇంట్లో నివాసముంటూ వచ్చారు. శుక్రవారం రాత్రి ఇళయరాజ భార్య శాంతిని హత్య చేసి కిటికీ ఆమెను ఉరిలో వేలాడదీసి పరారయ్యాడు. శనివారం ఉదయం ఈ విషయాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటనా స్థలానికెళ్లి శాంతి మృతదేహాన్ని స్వాధీనపరుచుకొని పరారైన భర్తపై హత్య కేసు నమోదు చేసి గాలిస్తున్నారు. ఈ సంఘటన సూళగిరి ప్రాంతంలో సంచలనం సృష్టించింది. -
కట్టుకున్నవాడే కాల యముడయ్యాడు
ఇందల్వాయి(నిజామాబాద్ రూరల్): జీవితంలో సగభాగం పంచి భార్యను సుఖపెట్టాల్సిన భర్త ఆమె పాలిట కాలయముడై కడతేర్చిన బాధాకర ఘటన మండలంలోని ఎల్లారెడ్డిపల్లె గ్రామంలో చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. ఎల్లారెడ్డిపల్లెకి చెందిన కుంట విజయ(45)కు ధర్పల్లి మండలం వాడి గ్రామానికి చెందిన గంగబాపుతో 25 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వారికి ప్రశాంత్, శ్రీకాంత్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. పని చేయకుండా మద్యానికి బానిసై గ్రామంలో అందరితో గొడవలు పెట్టుకొని అప్పుల పాలై కుటుంబ ప్రతిష్టను దిగజార్చిన గంగబాపును విడిచి కుంట విజయ తన తల్లిగారి గ్రామమైన ఎల్లారెడ్డిపల్లెలో తన కుమారులను పోషిస్తూ జీవిస్తుంది. ఈ క్రమంలో తన కుమారులను గల్ఫ్ దేశాలకు పంపి గ్రామంలో ఇల్లు కూడా కొనుగోలు చేసింది. భార్య దూరమైన క్రమంలో గంగబాపు కూడా బయటి దేశాలకు వెళ్లి మూడు నెలల క్రితం స్వదేశానికి తిరిగి వచ్చాడు. కొడుకులు లేని అదును చూసి భార్యకు మాయ మాటలు చెప్పి తనకు దగ్గరై కొంత కాలం మంచి వాడిగా నటించి పాడి పశువులు పెంచుతూ, సమీపంలో ఉన్న విశ్వ ఆగ్రోటెక్ గొర్రెల ఫామ్లో కూలి పనులు చేస్తూ వస్తున్నాడు. ఈ మధ్య కాలంలో మద్యానికి మరల బానిసై భార్యను వేదిస్తూ తరుచూ గొడవలు పడేవాడని గ్రామస్తులు తెలి పారు. అదే క్రమంలో శుక్రవారం రాత్రి మద్యం తాగి భార్యతో గొడవ పడి మద్యం మత్తులో సహనం కోల్పోయి రోకలి దుడ్డుతో భార్య తలపై బాది హత్య చేసి ఇంటికి తాళం వేసి పరారయ్యాడు. పొద్దున ఇంటి ముందు పశువులను ఎంతకీ విడిచిపెట్టక పోవడంతో అనుమానం వచ్చిన మృతురాలి అక్క కొడుకు ఇంటి తాళం పగులగొట్టి చూడగా కుంట విజయ రక్తపు మడుగులో శవమై కనిపించింది. ఈ విషయం పోలీసులకు సమాచారం అందించగా అక్కడకు చేరుకున్న సీఐ రామాంజనేయులు, ఎస్ఐ రాజశేఖర్ ఘటనపై గ్రామస్తుల నుంచి వివరాలు సే కరించి మృత దేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం జి ల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలిం చారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించి నిందితుడి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కుంట విజయ హత్య వార్త తెలుసుకున్న బంధువులు ఘటనా స్థలానికి చేరుకొని విజయ మృతదేహాన్ని చూసి బోరున విలపించారు. -
అనుమానిస్తోందని అంతం చేశాడు..!
హైదరాబాద్: క్షణికావేశం ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. అనుమానించిన భార్యను అంతమొందించాడు ఓ రిటైర్డ్ పోలీసు అధికారి. ఈ ఘటన సైబరాబాద్ కమిషనరేట్లోని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులోని భాస్కర్రావు పేటకు చెందిన కె.ఎస్.ఆర్. ఆంజనేయరెడ్డి(61), లక్ష్మీ వినీల(51) దంపతులు. ఆంజనేయరెడ్డి ఏలూర్ రేంజ్లో వీఆర్ విభాగంలో సబ్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తూ రెండు నెలల క్రితం ఉద్యోగ విరమణ చేశా రు. రెండు నెలల క్రితం దంపతులు కొండాపూర్ గౌతమీ ఎన్క్లేవ్లో నివాసముండే కొడుకు శివమనోహర్రెడ్డి వద్దకు వచ్చారు. కొడుకు అత్తవారింటికి వెళ్లడంతో ఫ్లాట్లో ఆ దంపతులిద్దరే ఉన్నారు. సోమవారం తెల్లవారు జామున వినీలను ఆంజనేయరెడ్డి విచక్షణారహితంగా కత్తితో పొడిచాడు. రక్తం కనిపించకుండా బెడ్రూమ్ శుభ్రం చేసి ఉదయం 5.30 గంటల సమయం లో మాదాపూర్ పోలీస్స్టేషన్కు వెళ్లి లొంగిపోయాడు. నిందితుడిని గచ్చిబౌలి పోలీసులకు అప్పగించారు. అక్రమ సంబంధం.. డబ్బు వివాదమే కారణం ఆంజనేయరెడ్డి కొంతకాలం రైల్వేపోలీస్ విభాగంలో పనిచేశారు. ఆ సమయంలో మరో మహిళతో చనువుగా ఉంటున్నావని లక్ష్మీవినీల తరచూ భర్తతో గొడవపడేది. రిటైర్మెంట్ అనంతరం వచ్చిన డబ్బులను బ్యాంక్లో డిపాజిట్ చేశారు. రూ.లక్షా ముప్పై వేల విషయంలో ఆంజనేయరెడ్డి చెప్పిన లెక్కలకు లక్ష్మీవినీల సంతృప్తి చెందలేదు. అక్రమ సంబంధం పెట్టుకున్న మహిళకు ఆ డబ్బు ఇచ్చావని కొద్దిరోజులుగా గొడవ పడుతోంది. సోమవారం రాత్రి ఈ విషయమై మళ్లీ గొడవ పడ్డారు. మాటామాటా పెరగడంతో భార్యను కత్తితో పొడిచి హత్య చేశాడు. ఛాతీ కింద భాగంలో 16 కత్తిపోట్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. భర్త దాడి చేసే సమయంలో వినీల పెనుగులాడిన ఆనవాళ్లు ఉన్నాయి. ఏపీకి అప్పుడప్పుడు విమానంలో వెళ్లేవాడినని, ఈ క్రమంలో డబ్బు ఖర్చు అయిం దని చెప్పినా నమ్మకుండా మరో మహిళతో సం బంధముందని వేధించడంతోనే హత్య చేసినట్లు ఆంజనేయరెడ్డి పోలీసులకు తెలిపాడు. కొండాపూర్లో ఉండే కూతురు రామప్రవళిక, అల్లుడు హుటాహుటిన వచ్చి కన్నీళ్ల పర్యంతమయ్యారు. -
ప్రియాంక హత్య కేసు.. ఊహించని మలుపు
సాక్షి, నల్లగొండ : పద్నాలుగేళ్ల క్రితం జరిగిన మర్రిగుడ మహిళ హత్యకేసు చివరికి ఊహించని మలుపు తిరిగింది. ప్రేమ వివాహం చేసుకుని ఇంటి నుంచి పారిపోయిన తన అక్క కోసం ఓ తమ్ముడు చేసిన ప్రయత్నం చివరికి ఫలించింది. మర్రిగుడకి చెందిన హనుమంతు అనే వ్యక్తి నార్కట్పల్లికి చెందిన ప్రియాంకను 2004లో ప్రేమించి వివాహం చేసుకున్నాడు. వీరిద్దరు వివాహం చేసుకున్నట్లు ప్రియాంక ఇంట్లోవారికి తెలియదు. ఇద్దరు పిల్లలు పుట్టిన తరువాత కుటుంబంలో కలహాలు రావడంతో హనుమంతు భార్యా, పిల్లలను హత్య చేసి, మరో మహిళతో వివాహ సంబంధం పెట్టుకున్నట్లు గతంలో వెల్లడైంది. గత నాలుగేళ్లుగా తన అక్క కోసం గాలిస్తున్న ప్రియాంక సోదరుడు ఉపేందర్కి ఎట్టకేలకు హనుమంతు అచూకి లభించింది. దీనితో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతన్ని అరెస్ట్ చేశారు. శుక్రవారం పోలీసుల విచారణలో భార్య, పిల్లల్ని హత్య చేశానని తెలిపాడు. అతని వ్యవహార శైలిపై అనుమానం వచ్చిన పోలీసులు కేసును మరింత లోతుగా విచారించారు. తాజా విచారణలో పిల్లలు క్షేమంగా ఉన్నట్లు తెలిసింది. బాబు రాంచరణ్ను బంధువుల వద్ద ఉంచినట్లు పోలీసులు గుర్తించారు. చిన్నారి హాలియాలోని ఓ ప్రైవేటు పాఠశాలలో చదువుతున్నట్లు గుర్తించారు. -
కుమార్తెను చూసి వద్దామన్నందుకు..
మల్కాజిగిరి : కన్నపేగుపై మమకారం ఓ హత్యకు దారితీసింది. మల్కాజిగిరి పోలీస్స్టేషన్ ఇన్స్పెక్టర్ కొమరయ్య కథనం మేరకు వివరాలా ఉన్నాయి.. తూర్పుగోదావరి జిల్లా, చెల్లూరుకు చెందిన వెంకటరమణ, లక్ష్మి అలియాస్ చంటమ్మ(55) దంపతులు. వీరికి ముగ్గురు కుమారులు, కుమార్తె ఉన్నారు. బతువుదెరువు నిమిత్తం రెండు నెలల క్రితం భార్యతో నగరానికి వలస వచ్చిన వెంకటరమణ గౌతంనగర్లోని మేఘన కుటీర్ అపార్ట్మెంట్లో వాచ్మెన్గా పనిచేస్తున్నాడు. దివ్యాంగురాలైన కుమార్తె శ్రీదేవికి ఆరోగ్యం బాగాలేకపోవడంతో గత కొన్ని రోజులుగా ఆమెను చూసివద్దామని భర్తను కోరుతోంది. ఈ విషయమై గత కొన్ని రోజులుగా ఇద్దరి మధ్య ఘర్షణ జరుగుతున్నట్లు సమాచారం. గురువారం రాత్రి ఇద్దరి మధ్య గొడవ జరగడంతో వెంకటరమణ గదిలో ఉన్న మోటర్తో లక్ష్మి తలపై బలంగా కొట్టడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. స్థానికుల ఫిర్యాదు మేరకు సంఘటనా స్ధలానికి చేరుకున్న పోలీ సులు దర్యాప్తు చేపట్టారు. మృతురాలి సోదరి బుజ్జమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వెంకటరమణను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. -
భార్య, అత్తను చంపిన అల్లుడు
చుండూరు(అమృతలూరు): తల్లి, కూతురు, అల్లుడు మధ్య జరిగిన తగాదాల నేపథ్యంలో రెండు నిండు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. భార్య, అత్త ప్రవర్తనపై పేట్రేగిన అల్లుడు చివరకు అత్తారింట్లోనే పచ్చడి బండతో హత్య చేశాడు. గుంటూరు జిల్లా చుండూరు మండలం మోదుకూరులో మంగళవారం అర్ధరాత్రి జరిగిన ఈ ఘటన అందరినీ కలచివేసింది. మోదుకూరు దళితవాడకు చెందిన వణుకూరి వందనం, కరుణమ్మ దంపతుల కుమార్తె మరియమ్మ (35)కు వట్టిచెరుకూరు మండలం కోవెలమూడికి చెందిన బుర్రి దావీదు (50)తో దాదాపు 20 ఏళ్ల క్రితం వివాహమైంది. పదేళ్ల నుంచి భార్యాభర్తల మధ్య తరచూ విభేదాలు రావడంతో మరియమ్మ కొంతకాలంగా తన ఇద్దరు పిల్లలతో సహా పుట్టింట్లోనే తల్లిదండ్రుల వద్ద ఉంటోంది. మధ్యలో పలుమార్లు భర్త దావీదు కుల పెద్దలను పంపించి కాపురానికి రావాలని అడిగినా, తాను రానని ససేమిరా చెప్పింది. దీంతో విసుగు చెందిన భర్త నాలుగు రోజుల కిందట అత్తారింటికి వచ్చాడు. భార్యా, పిల్లలతో మూడు రోజులపాటు బాగానే ఉన్నాడు. మంగళవారం రాత్రి భోజనం చేసి అందరూ నిద్రపోతుండగా, పథకం ప్రకారం దావీదు రాత్రి 12.30 గంటల సమయంలో పచ్చడి బండతో అత్త కరుణమ్మ తలపై మోదాడు. కేకలకు నిద్ర లేచిన భార్య మరియమ్మ తల్లి వద్దకు రాగా, మరియమ్మను కూడా బండతో మోదాడు. దీంతో వారు కుప్పకూలిపోయారు. చుట్టుపక్కల జనం వచ్చి చూసి 108కు సమాచారం అందజేశారు. గుంటూరు జీజీహెచ్కు తరలిస్తుండగా మార్గమధ్యలో మరియమ్మ, చికిత్స పొందుతూ కరుణమ్మ మృతి చెందారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
పెళ్లికి నిరాకరించిందని ఆర్మీ మేజర్ కిరాతకం
న్యూఢిల్లీ : ఆర్మీ మేజర్ అమిత్ ద్వివేది భార్య శైలజ హత్య కేసులో ప్రధాన నిందుతుడు మేజర్ నిఖిల్ హండాను ఆదివారం ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. శైలజ, నిఖిల్ హండాను వివాహం చేసుకోవడానికి నిరాకరించడంతోనే నిఖిల్ ఈ దారుణానికి పాల్పడ్డాడని పోలీసులు వెల్లడించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...ఆర్మీ మేజర్గా పనిచేస్తున్న నిఖిల్ హండాకు 2015లో నాగలాండ్లో పోస్టింగ్ ఇచ్చారు. అదే సమయంలో శైలజ భర్త మేజర్ ద్వివేదికి కూడా నాగలాండ్లోనే పోస్టింగ్ ఇచ్చారు. ఆ విధంగా నిఖిల్, శైలజల మధ్య పరిచయం ఏర్పడింది. అప్పటి నుంచి వీరిద్దరు స్నేహితులుగా మారారు. కొంత కాలం తర్వాత నిఖిల్, శైలజను వివాహం చేసుకోవాల్సిందిగా కోరాడు. కానీ శైలజ అందుకు అంగీకరించలేదు. అయితే వీరిద్దరి స్నేహం గురించి శైలజ భర్త మేజర్ ద్వివేదికి తెలిసింది. దాంతో అతడు శైలజ, నిఖిల్ల మధ్య ఎటువంటి కాంటక్ట్ ఉండకూడదని వారించాడు. ఇదిలా ఉండగా కొద్ది రోజుల క్రితం నిఖిల్ కొడుకు ఆరోగ్యం పాడవడంతో అతన్ని ఢిల్లీలోని కంటోన్మెంట్ ఆస్పత్రిలో చేర్చాడు. ఇదే సమయంలో శైలజ కూడా ఢిల్లీలోనే ఉంది. కొడుకు వైద్యం కోసం ఢిల్లీకి వచ్చిన నిఖిల్ శైలజకు ఫోన్ చేసి తనను కలవాల్సిందిగా కోరాడు. దాంతో గత శనివారం శైలజ ఇంట్లో ఫిజియోథెరపికి వెళ్తున్నాని చెప్పి బయటకు వచ్చింది. అయితే శైలజను ఫిజియోథెరపికి తీసుకెళ్లడానికి ద్వివేది ప్రభుత్వ వాహనాన్ని ఏర్పాటు చేశాడు. ఫిజియోథెరపి కోసం వెళ్లిన శైలజ తిరిగిరాలేదని తెలిపాడు డ్రైవర్. ఫిజియోథెరపీ కోసం వెళ్లిన శైలజ నిఖిల్ హండాను కలిసింది. ఆ సమయంలో నిఖిల్ తనను పెళ్లి చేసుకోవాల్సిందిగా శైలజను కోరాడు. ఈ విషయం గురించి వారిద్దరి మధ్య గొడవ ప్రారంభమయ్యింది. శైలజ వివాహనికి నిరాకరించడంతో విచక్షణ కోల్పోయిన నిఖిల్ వెంట తెచ్చుకున్న కత్తితో శైలజ గొంతు కోసి చంపాడు. శైలజ మరణాన్ని ఆక్సిడెంట్గా చిత్రికరించడానికి ఆమె మృత దేహాన్ని కారులో తీసుకెళ్లి రోడ్డుపై పడేశాడు.అనంతరం అక్కడ నుంచి ఆస్పత్రికి వెళ్లి తన కుమారున్ని కలిసి యథాప్రకారం ప్రస్తుతం పనిచేస్తున్న మీరట్(ఉత్తరప్రదేశ్)కు వెళ్లి పోయాడు. ఫోన్ కూడా స్విచ్ఛాఫ్ చేసుకున్నాడు. శనివారం మధ్యాహ్నం రోడ్డు మీద శైలజ మృత దేహాన్ని చూసిన కొందరు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలికి చేరుకున్న పోలీసులు మరణించిన వ్యక్తిని శైలజగా గుర్తించి, కేసు నమోదు చేశారు. శైలజ భర్త మేజర్ ద్వివేది, నిఖిల్ హండా మీద అనుమానం ఉందని చెప్పడంతో పోలీసులు ఆ కోణంలో దర్యాప్తు చేశారు. ఇలోపు శైలజ ఫోన్లో నిఖిల్ హండాకు, శైలజకు మధ్య జరిగిన సంభాషణను పరిశీలించిన పోలీసులు నిఖిల్ హండాను నేరస్తుడిగా నిర్ధారించారు. దాంతో ఒక పోలీసులు బృందం ఆదివారం మీరట్ వెళ్లి నిఖిల్ను అరెస్టు చేసి ఢిల్లీకి తీసుకొచ్చారు. -
భార్యను దారుణంగా హత్యచేసి రైల్వేట్రాక్పై పడేసిన భర్త
-
వీడిన వివాహిత హత్య మిస్టరీ
పుత్తూరు : నారాయణవనంలో వివాహిత హత్య మిస్టరీ ఒక రోజు వ్యవధిలోనే వీడింది. వివాహేతేర సంబంధాలకు అడ్డుగా ఉందని సాక్షాత్తు భర్తే కిరాయి వ్యక్తులతో హత్య చేయించాడు. తన అక్క కొడుకుతో కలిసి దీనికి స్కెచ్ వేశాడు. పుత్తూరు ఇన్చార్జి డీఎస్పీ సూర్యనారాయణ మంగళవారం విలేకరుల సమావేశంలో వెల్లడించిన కథనం..వైఎస్సార్ కడప జిల్లా, రైల్వే కోడూరుకు చెందిన సాధు శివకుమార్కు 15 ఏళ్ల క్రితం అదే ఊరికి చెందిన సుజాతతో వివాహమైంది. వీరికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. శివకుమార్ నారాయణవనంలో ఆర్ఎంపీగా ప్రాక్టీస్ చేస్తున్నాడు. కొంతకాలంగా సుజాత మధుమేహం, గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతోంది. దీం తో శివకుమార్ ఇతర స్త్రీలతో సన్నిహిత సంబంధాలు నెరపేవాడు. విడాకులు ఇవ్వాలని కోరినా సుజాత ససేమిరా అనడంతో ఆమె అడ్డు తొలగించుకోవాలని శివకుమార్ వ్యూహరచన చేశాడు. అక్క కొడుకు సహకారంతో... విషప్రయోగంతో సుజాతను కడతేర్చేందుకు దారులు అన్వేషించి , చివరకు హత్యనే మార్గంగా ఎంచుకున్నాడు. ఆపై, తిరుపతిలోని కాటన్ మిల్లు వద్ద కాపురముంటున్న తన అక్క కొడుకు రవికుమార్తో కలిసి ఆటోనగర్లో ఉంటున్న ఉపేంద్ర, నాగరాజును సంప్రదించి స్కెచ్ వేశాడు. నెత్తురు చిందించకుండా సుజాతను అంతమొందించాలంటూ రూ. 50 వేలతో డీల్ కుదుర్చుకున్నాడు. సుజాతను గుర్తు పట్టేందుకు వీలుగా పది రోజుల క్రితం వీరిద్దరినీ నారాయణవనానికి పిలిపించి తన స్నేహితులుగా ఆమెకు పరిచయం చేశాడు. గొంతు నులిమి చంపేశారు ముందుగా వేసుకున్న ప్లాన్ ప్రకారం ఊరికి వెళుతున్నట్లు చెప్పి సోమవారం ఉదయం శివకుమార్ ఇంట్లో నుంచి వచ్చేశాడు. అప్పటికే బైపాస్ సమీపంలో సిద్ధంగా ఉన్న ఉపేంద్ర, నాగరాజును కలిశాడు. ఆ తర్వాత మద్యం సేవించిన ఉపేంద్ర, నాగరాజు మధ్యాహ్నం 12.15 సమయంలో శివకుమార్ ఇంటికి వెళ్లారు. తన భర్త వారిని స్నేహితులుగా పరిచ యం చేసి ఉండడంతో వారిని ఇంట్లోకి రమ్మంది. ఇదే అవకాశంగా ఆమెను హత్య చేసేందుకు వారు యత్నించారు. ఉపేంద్ర సుజాత కాళ్లూచేతులను పట్టుకోగా, నాగరాజు లెగ్గిన్తో ఆమె గొంతు బిగించాడు. సుజాత కేకలు పెట్టడడంతో మిద్దెపై కాపురముంటున్న వాళ్లు వచ్చి తలుపులు తట్టడంతో నిందితులు పారిపోయేందుకు ప్రయత్నించారు. స్థానికుల సమాచారంతో ఇరువురినీ అదుపులోకి తీసుకున్నట్లు డీఎస్పీ సూర్యనారాయణ తెలిపారు. సుజాతను పుత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అక్కడ ఆమె మృతి చెందిందిందని చెప్పారు. మరో నిందితుడు రవికుమార్ పరారీలో ఉన్నాడని, త్వరలోనే అరెస్ట్ చేస్తామని ఆయన చెప్పారు. 24 గంటల్లో కేసును ఛేదించిన సీఐ కొండయ్య, ఎస్ఐ హనుమంతప్ప, పురుషోత్తం, ఏఎస్ఐ సురేష్, కానిస్టేబుళ్లు రాకేష్లను ప్రత్యేకంగా అభినందిస్తూ వీరికి ఎస్పీ రాజశేఖర్బాబు రివార్డులు ప్రకటించినట్లు ఆయన చెప్పారు. -
పెళ్లి ఫొటో ఫేస్బుక్లో పెట్టి భార్యను చంపి..
వెస్ట్మిడ్ల్యాండ్ : అన్యోయంగా, అప్యాయంగా ఉంటున్న ఓ జంట జీవితం అనూహ్య మలుపు తిరిగి తీరని విషాదమైంది. ఎప్పుడూ ప్రేమగా తన భార్యతో మాట్లాడే భర్త కాస్త కాలయముడయ్యాడు. భార్యను చంపడమే కాకుండా తాను ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వెస్ట్మిడ్ల్యాండ్లో చోటు చేసుకుంది. 2014లో జేమ్స్(30), బేర్న్స్ (32) అనే ఇద్దరికి వివాహం అయింది. ఎంతో ప్రేమగా ఉంటున్న వారి మధ్య ఇలాంటి సంఘటన చోటు చేసుకుంటుందని ఎవరూ ఊహించలేదు. తొలుత తమ వివాహం నాటి ఫొటోను ఫేస్బుక్లో పంచుకున్న జేమ్స్ అత్తగారింటికి వెళ్లాడు. అక్కడి వెళ్లి వెళ్లగానే ఇంట్లో ఎవరూ లేనిది చూసి భార్యను హత్య చేశాడు. ఆ తర్వాత అక్కడి నుంచి బయలుదేరి 20 మైళ్ల దూరంలో ఉంటున్న తన తల్లిదండ్రుల ఇంటికి వెళ్లి అక్కడ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తెల్లవారు జామున పోలీసులు వారి మృతదేహాలు గుర్తించారు. 'మేం ఇలా జరిగిందంటే నమ్మలేకపోతున్నాం. వారు ఎంతో ప్రెండ్లీ కపుల్స్.. ఈ వార్త విన్నాక మేం షాక్ తిన్నాం. వారిద్దరి మధ్య చంపుకునేంత గొడవ ఉందంటే మేం నమ్మలేకపోతున్నాం' అని అక్కడి చుట్టుపక్కల వారు తెలిపారు. -
వేములవాడలో దారుణం..
-
వేములవాడలో దారుణం..
సాక్షి, వేములవాడ : రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో దారుణం చోటుచేసుకుంది. ఓ వ్యక్తి తన భార్యను నడిరోడ్డు మీద గొంతు కోసి హతమార్చాడు. అనంతరం తాను కూడా గొంతుకోసుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు. స్థానికంగా ఈ ఘటన సంచలనం రేపింది. జగిత్యాల జిల్లా నర్సింగాపూర్ గ్రామానికి చెందిన బాలరాజు(30), వసంత(25) భార్యాభర్తలు. వసంత పుట్టినిల్లు వేములవాడ. వీరికి ఐదేళ్ల క్రితం వివాహం జరిగింది. ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు. వేములవాడలో మంగళవారం బాలరాజు హఠాత్తుగా భార్యపై దాడి చేశాడు. ఆమె గొంతుకోసి దారుణంగా హతమార్చాడు. అనంతరం బాలరాజు సైతం గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. పరిస్థితి విషమంగా ఉండటంతో అతన్ని పోలీసులు జీపులో సిరిసిల్ల ఆసుపత్రికి తరలించారు. కుటుంబ కలహాలే ఈ దారుణానికి కారణమై ఉంటాయని స్థానికులు చెప్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
భార్యను 35సార్లు పొడిచి.. అడ్డొచ్చిన కొడుకునూ..
35 ఏళ్ల మహిళను ఆమె భర్త దారుణంగా పొడిచి చంపాడు. దేశ రాజధాని న్యూఢిల్లీలోని దిల్షాద్ గార్డెన్లో బుధవారం ఉదయం ఈ ఘటన జరిగింది. వివాహేతర సంబంధం అనుమానాలతో మహిళను ఆమె భర్త 35సార్లు పొడిచి చంపాడని, ఆమె సంఘటనాస్థలంలోనే ప్రాణాలు విడిచిందని పోలీసులు తెలిపారు. దాడి చేస్తున్న తండ్రిని అడ్డుకోవడానికి ఆమె 15 ఏళ్ల కొడుకు ప్రయత్నించడంతో.. అతడిపై కూడా ఆ వ్యక్తి దాడి చేశాడు. బాలుడి చేతికి గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలుడి పరిస్థితి బాగానే ఉందని వైద్యులు తెలిపారు. ఓ క్యాటరింగ్ సంస్థలో మేనేజర్గా పనిచేస్తున్న బినోద్ బిష్త్ ఈ దారుణానికి ఒడిగట్టాడు. భార్య రేఖ వివాహేతర సంబంధం పెట్టుకుందనే అనుమానంతో రోజూ ఆమెతో గొడవపడేవాడు. బుధవారం తెల్లవారుజామున ఇంటికి వచ్చిన అతను ఇదేరీతిలో భార్యతో గొడవపడ్డాడు. ఆ సమయంలో పక్క గదిలో ఇద్దరు కొడుకులు నిద్రిస్తున్నారు. ఆగ్రహావేషాలకు లోనైన బినోద్ ఒక్కసారిగా భార్యపై కత్తితో దాడి చేశాడు. నిద్రలోంచి మెలుకువ వచ్చిన చిన్న కొడుకు తండ్రిని అడ్డుకోవడానికి ప్రయత్నించాడు. దీంతో అతన్ని కూడా గాయపర్చి.. భార్యను దారుణంగా పొడిచి చంపాడని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నట్టు చెప్పారు. -
తాగిన మైకంలో భార్యను చంపిన భర్త
నర్సంపేట రూరల్: తాగిన మైకంలో భార్యను కర్రతో మోది హత్య చేసిన భర్త ఉదంతమిది. ఈ సంఘటన వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేట మండలం ధర్మరావుపేటలో జరిగింది. రాజేందర్, మంగమ్మ(35)లు భార్యాభర్తలు. వీరికి బాబు, రెండేళ్ల కుమార్తె ఉన్నారు. భార్యాభర్తలకు తాగుడు అలవాటు ఉందని, రోజూ ఇద్దరూ తాగి గొడవ పడుతుంటారని తెలుస్తోంది. ఈ క్రమంలో ఆదివారం గ్రామంలో దుర్గమ్మ పూజ ఉండడంతో ఎవరూ తాగవద్దని తోటి కులస్తులు చెప్పడంతో మంగమ్మ తాగలేదు. అయితే రాజేందర్ తాగి వచ్చి అర్ధరాత్రివేళ భార్యతో గొడవపడ్డాడు. ఈ క్రమంలో కర్రతో ఆమె తలపై కొట్టాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. తండ్రి కర్రతో తల్లిని కొట్టి చంపాడని బాలిక చుట్టుపక్కలవారికి చెప్పడంతో విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు వచ్చి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. -
'మా ఆవిడను చంపాలి.. సాయం చేయండి'
తన భార్యను చంపడానికి కిరాయి హంతకులను మాట్లాడుకుందాం అనుకుని టెక్స్ట్ మెసేజ్ పంపాలనుకున్న ఓ వ్యక్తి.. పొరపాటున దాన్ని కిరాయి హంతకుడికి బదులు తన మాజీ బాస్కు పంపేశాడు. తన భార్యతో పాటు నాలుగేళ్ల కూతురిని కూడా చంపాలనుకోవడంతో జెఫ్రీ స్కాట్ లైటిల్ (42)ను పోలీసులు అరెస్టు చేశారు. ఎవరో షేన్ అనే వ్యక్తికి అతడు ఈ మెసేజ్ పంపాలని అనుకున్నాడు. అయితే అనుకోకుండా అది అతడి మాజీ బాస్కు వెళ్లడంతో కుట్ర మొత్తం ముందే తెలిసిపోయింది. ''హే షేన్, పని ఎలా నడుస్తోంది? మా భార్యను చంపడానికి నువ్వు సాయం చేస్తానని చెప్పావు గుర్తుందా, ఆ ఆఫర్ గురించి నీకు చెబుదామనుకున్నా'' అని మెసేజ్ పెట్టాడు. తన భార్య మరణిస్తే బీమా సొమ్ము వస్తుందని, అది దాదాపు 6.68 కోట్ల రూపాయలు ఉంటుందని, అలాగే తన నాలుగేళ్ల కూతురిని కూడా చంపితే మరో 3.34 కోట్ల రూపాయలు వస్తుందని అతడు తన మెసేజ్లో తెలిపాడు. ఆ మొత్తాన్ని పంచుకోవచ్చని అన్నాడు. తాను తెల్లవారుజామున 5 గంటలకే ఉద్యోగానికి వెళ్లిపోతానని, తన భార్య మధ్యాహ్నం 2 గంటలకు వెళ్తుందని, అందువల్ల దోపిడీ ప్రయత్నంలా చేయొచ్చు లేదా ప్రమాదంలా చిత్రీకరించవచ్చని కూడా సూచించాడు. మొత్తం బీమా సొమ్మును సగం సగం పంచుకుందామని ఆఫర్ ఇచ్చాడు. దాంతో హత్యాయత్నం కేసు కింద లైటిల్ను పోలీసులు అరెస్టు చేశారు. అయితే తాను తన భార్య, కూతుళ్లను చంపాలనుకోలేదని, తాను వేరే మహిళతో మాట్లాడానని ఆమె గొడవ పెట్టుకోవడంతో చిన్నపాటి వివాదం మాత్రమే చెలరేగిందని అన్నాడు. బహుశా తన కూతురు ఆ మెసేజ్ పంపి ఉంటుందని తెలిపాడు. కానీ పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో చివరకు నేరాన్ని అంగీకరించాడు. -
భార్యను చావబాది.. తలను రంపంతో కోసి..
న్యూఢిల్లీ: ప్రేమికుల రోజు ఢిల్లీ నగరమంతా కాస్తంత సంబరాల మధ్య ఉండగా నగర పోలీసులు మాత్రం ఓ అవాక్కయ్యే కేసును పట్టుకున్నారు. కట్టుకున్న భార్యను కడతేర్చి కసాయిగా ఆమె తలను మొండేన్ని వేరు చేసిన భర్తను అరెస్టు చేశారు. అత్యంత భయంకరమైన ఈ ఘటన మూడు రోజుల కిందే జరిగింది. తన భార్యను చంపేసిన ఆ వ్యక్తి మూడు రోజులపాటు ఆమె మృతదేహంతోనే కలిసి ఉన్నాడు. వివరాల్లోకి వెళితే ఢిల్లీలోని మధు విహార్ అనే ప్రాంతంలో సుబోధ్ కుమార్ (40) అనే వ్యక్తి మనీషా భార్య భర్తలు. వారికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఇటీవలె భార్యకు తెలియకుండా అతడు రెండో వివాహం చేసుకున్నాడు. ఆమె పేరు మునియా. రెండు ఫ్యామిలీలు నడపాలన్న కుట్ర చేసినా చివరికి అది బయటపడటంతో సుబోధ్ను భార్య మనీషా నిలదీసింది. ఈ విషయంపై ఇటీవల తరుచు వారిమధ్య గొడవలు జరిగాయి. దీంతో తనకు విడాకులు ఇవ్వాలంటూ భార్య సుబోధను అడిగింది. అయితే, తాను చెప్పినట్లు పడుండాలంటూ అతడు గొడవపడ్డాడు. పిల్లలను ముందుగానే తన అత్తమామ వద్దకు పంపించి తన భార్యను చంపే కుట్ర రచించాడు. శనివారం రాత్రి ఆమెపై పైపు దాడి చేసి పదేపదే తలపై కొట్టాడు. దీంతో ఆమె చనిపోయింది. మృతదేహాన్ని బయటకు తీసుకెళ్లే వీలుకాక రంపాన్ని తెచ్చి ఆమె తలను శరీరం నుంచి వేరు చేశాడు. ఆయా సంచుల్లో ఆమె దేహాన్ని ముక్కలు చేసేందుకు సిద్దమయ్యాడు. అయితే, అప్పటికే మూడు రోజులు కావడంతో దుర్గంధం వచ్చి చుట్టుపక్కల వారు అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా అసలు విషయం తెలిసింది. తాను నేరం చేసినట్లు అతడు అంగీకరించాడు. అయితే, అతడి రెండో భార్య మునియా హస్తం ఏమైనా ఉందా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. -
బంధాన్ని కాదని.. డబ్బుకు బందీయై!
♦ కట్టుకున్న భర్తనే కడతేర్చిన ఇల్లాలు ♦ ఇన్సూరెన్స్ నగదు కోసం మేనల్లుడితో కలసి ఘాతుకం ♦ వీడిన కొత్తగంగుబూడి హత్యకేసు మిస్టరీ విజయనగరం: బంధం కన్నా.. ఆమెకు డబ్బే ఎక్కువైంది. రూ.లక్షలు వస్తాయన్న ఆశతో కట్టుకున్న భర్తనే కడతేర్చింది. ఎల్.కోట మండలం కొత్త గంగుబూడి సమీపంలో గత నెల 26న జరిగిన హత్యకేసు మిస్టరీ వీడింది. ఇన్సూరెన్స్ డబ్బుల కోసం సొంత భార్య, మేనల్లుడు, ఇతర కుటుంబ సభ్యులే ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. శుక్రవారం విజయనగరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ ఎల్.కాళిదాసు రంగారావు ఈ కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. విశాఖపట్నం జిల్లా అనకాపల్లి మండలం కొత్తూరు గ్రామానికి చెందిన గండబోయిన శ్రీనివాస్ కాకినాడలో ఉన్న తన మేనమామ వై.నూకరాజు పేరున రూ.38 లక్షలకు ఇన్సూరెన్స్ పాలసీ చేయించాడు. మేనమామను హతమారిస్తే ఆ నగదును కాజేయవచ్చని పథకం పన్నాడు. కొంత సొమ్మును మేనత్తకిచ్చి మిగిలిన సొమ్మును తన సొంతం చేసుకోవచ్చని భావించాడు. ఇందుకు మేనత్త(నూకరాజు భార్య) వరలక్ష్మి కూడా సహకరించింది. గత నెల 26న మేనమామను తీసుకురమ్మని అత్తకు చెప్పాడు. ఆమె తన భర్తను విశాఖ తీసుకొచ్చింది. అక్కడి నుంచి కారు అద్దెకు తీసుకుని మేనమామ, అతని భార్య వరలక్ష్మి, సమీప బంధువులైన కట్టా రాము, గద్దాడ వెంకటరావు, వంక బంగార్రాజులతో కలిసి విశాఖ నుంచి ఎస్.కోట బయలుదేరారు. ఎల్.కోట మండలం గంగుబూడి సమీపంలో నూకరాజును రాయితో కొట్టి హతమార్చి పరారయ్యారు. గుర్తు తెలియని వ్యక్తి హత్యగా.. ఎల్.కోట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో ఇన్సూరెన్స్ డబ్బుల కోసమే మేనమామను శ్రీనివాస్, మేనమామ భార్య వరలక్ష్మి, కట్టా రాము, వెంకటరావు, బంగార్రాజులు కుట్రపన్ని హతమార్చినట్లు వెల్లడైందని ఎస్పీ రంగారావు తెలిపారు. శ్రీనివాస్తోపాటు, వరలక్ష్మి, రాములను శుక్రవారం అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చినట్లు చెప్పారు. వెంకటరావు, వంక బంగర్రాజులు పరారీలో ఉన్నట్లు ఎస్పీ తెలిపారు. ఈ సమావేశంలో డీఎస్పీలు ఎ.వి.రమణ, ఎల్.రాజేశ్వరరావు, ఎస్.కోట సీఐ బి.రమణమూర్తి, ఎల్.కోట ఎస్సై ఎం.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
భార్య హత్య కేసులో భర్తకు జీవిత ఖైదు
మచిలీపట్నం : భార్యను నరికి చంపిన కేసులో భర్తపై నేరం రుజువు కావటంతో జీవిత ఖైదు విధిస్తూ పదో అదనపు జిల్లా స్పెషన్స్ కోర్టు న్యాయమూర్తి జి.స్వర్ణలత గురువారం తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం.. బంటుమిల్లి మండలం రామవరపుమోడి గ్రామానికి చెందిన బొల్లా నాగమల్లేశ్వరరావుకు, బందరు మండలం చినకరగ్రహారానికి చెందిన భూలక్ష్మికి 14 ఏళ్ల క్రితం వివాహమైంది. వారికి పాప, బాబు ఉన్నారు. నాగమల్లేశ్వరరావు కొబ్బరిబొండాల వ్యాపారం చేసేవాడు. కొంత కాలం పాటు వీరి కాపురం సజావుగానే సాగింది. భార్యపై అనుమానం పెంచుకున్న నాగమల్లేశ్వరరావు తరచూ ఆమెతో గొడవ పడేవాడు. భర్త వేధింపులు భరించలేని భూలక్ష్మి పుట్టింటికి వచ్చి ఉంటోంది. నాగమల్లేశ్వరరావు పెద్దల సమక్షంలో భూలక్ష్మిని జాగ్రత్తగా చూసుకుంటానని హామీ ఇచ్చి కరగ్రహారంలో ఆమెతో కలిసి ఉంటున్న నేపథ్యంలో 2014 సెప్టెంబర్ 14వ తేదీన భార్యతో గొడవ పడ్డాడు. ఆమెను జుట్టు పట్టుకుని బయటకు ఈడ్చుకువచ్చి కొబ్బరిబొండాలు నరికే కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో భూలక్ష్మి మరణించింది. మృతురాలి సోదరుడు పరిసే శ్రీనివాసరావు ఫిర్యాదు మేరకు మచిలీపట్నం తాలుకా పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడిపై నేరం రుజువు కావటంతో న్యాయమూర్తి పై విధంగా తీర్పు చెప్పారు. -
టీవీ పగిలిపోయిందని భార్య హత్య
పెద్దాపురం: టీవీ పగిలిందన్న కోపంతో ఓ భర్త భార్యను చితకబాది ఆమె మృతికి కారణమయ్యాడు. వివరాల్లోకి వెళితే.. తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం మండలంలోని పాత పెద్దాపురానికి చెందిన ముక్కు సూర్యప్రకాశ్ కూలీ పనులు చేస్తుంటాడు. మూడేళ్ల క్రితం నిజామాబాద్కు పని కోసం వలస వచ్చి సంధ్య(20)ను ప్రేమించి వివాహం చేసుకున్నాడు. అనంతరం పాత పెద్దాపురానికి కాపురం మార్చారు. ప్రస్తుతం వీరికి రెండేళ్లు, ఏడాది వయసు కలిగిన కుమారులు ఉన్నారు. ఇలా ఉండగా కొంతకాలం నుంచి వీరి మధ్య మనస్ఫర్థలు చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలో మంగళవారం ఇంట్లో టీవీ పగిలిపోవడంతో వీరి మధ్య ఘర్షణ జరిగింది. భార్యను భర్త చితకబాదడంతో ఆమె గాయాల పాలైంది. ఆమెను కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించగా చికిత్సపొందుతూ పరిస్థితి విషమించడంతో బుధవారం మృతిచెందింది. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై సతీశ్ తెలిపారు. -
భార్యను చంపిన భర్తకు జీవిత ఖైదు
రంగారెడ్డి: భార్యను హత్యచేసిన భర్తకు జీవితఖైదుతోపాటు నాలుగువేల రూపాలయల జరిమానా విధిస్తూ 3వ అదనపు డిస్ట్రిక్అండ్ సేషన్స్ జడ్జీ బుధవారం తీర్పు చెప్పారు. అదనపు పబ్లిక్ప్రాసిక్యూటర్ నక్క రవీందర్ కథనం ప్రకారం మహేశ్వరం మండలం తుక్కగూడ గ్రామంలో నివాసముండే సత్తయ్య, జ్యోతిలు భార్యభర్తలు. వీరి వివాహం 7సంవత్సరాల క్రితం జరిగింది. వివాహనంతరం వీరి కాపురం సజావుగా సాగింది. వీరికి ఒక బాబు. కొంత కాలంగా భార్యజ్యోతిని శారీరకంగా మానసికంగా వేధిస్తున్నాడు. ఆ క్రమంలో 2015 ఫిబ్రవరి 26న సత్తయ్య తన సొంత గ్రామమైన రాపోలుకు వెళ్లి మూడు రోజుల తర్వాత ఇంటికి రావడంతో భార్య జ్యోతి మూడు రోజులు ఎక్కడకి వెళ్లావంటూ భర్త సత్తయ్యను ప్రశ్నించింది. మద్యం మత్తు లో ఉన్న సత్తయ్య భార్య జ్యోతితో గొడవ పడి భార్యను చంపేస్తానంటూ అమెపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు. కాలిన గాయాలతో జ్యోతి ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. ఆమె మరణ వాంగూల్మం మేరకు పహాడిషరీప్ పోలీసులు భర్త సత్తయ్యపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించి కోర్డులో అభియోగ పత్రాలు నమోదు చేశారు. కేసు సాక్ష్యాధారాలు పరిశీలించిన 3వ అదనపు డిస్ట్రిక్అండ్ సెషన్స్ జడ్జీ పై విధంగా తీర్పు చెప్పారు. -
అనుమానంతోనే కడతేర్చాడు
►భార్య హత్య కేసులో భర్త అరెస్ట్ నెల్లూరు (క్రైమ్) : మరొకరితో సన్నిహితంగా ఉందన్న అనుమానంతో భార్యను హత్య చేసిన ఘటనలో భర్తను ఐదో నగర పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. పోలీసుల సమాచారం మేరకు... ప్రకాశం జిల్లా కనిగిరి మండలం పాతపాడుకు చెందిన మార్తాల సుమలత (28)కు అదే ప్రాంతానికి చెందిన రవీంద్రబాబుతో వివాహమైంది. వివాహానంతరం వారు పడారుపల్లి చలపతినగర్లో నివసిస్తున్నారు. వీరికి పవన్, మదన్ కుమారులు. రవీంద్రబాబు పలురకాల వ్యాపారం చేసి ఆర్థికంగా స్థిరపడ్డాడు. 2012లో ఆయన అనారోగ్యంతో మతి చెందాడు. ఇది జరిగిన కొద్దిరోజులకే రవీంద్రబాబు సోదరుడు శ్రీకాంత్తో ఆమె వివాహమైంది. కొద్దిరోజులు వారి కాపురం సజావుగా సాగింది. శ్రీకాంత్ హైదరాబాద్లోని కెమికల్ ఫ్యాక్టరీలో పనిచేస్తూ అప్పుడప్పుడు భార్య వద్దకు వచ్చి వెళ్తుండేవాడు. వ్యసనాలకు బానిసైన అతను సంపాదించిన మొత్తాన్ని ఖర్చు చేయసాగాడు. అప్పుల పాలయ్యాడు. ఈ నేపథ్యంలో చలపతినగర్లోని ఇంటిని అమ్మేందుకు భార్యపై ఒత్తిడి తెచ్చాడు. భార్య ససేమిరా అంది. అప్పటి నుంచి ఆమెపై ద్వేషం పెంచుకున్నాడు. ఈ క్రమంలో సుమలత తన ఇంటి పక్కనే ఉంటున్న ఆటో డ్రైవర్తో సన్నిహితంగా ఉండటాన్ని గమనించి అనుమానం పెంచుకున్నాడు. ఈ విషయమై జూలై 25న దంపతుల నడుమ తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో కోపోద్రిక్తుడైన శ్రీకాంత్ ఆమెను తీవ్రంగా కొట్టడంతో మతి చెందింది. ఆమెపై కిరోసిన్ పోసి నిప్పటించి ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు యత్నించాడు. అప్పట్లో బాధిత కుటుంబ సభ్యుల ఐదోనగర ఇన్స్పెక్టర్ జి. మంగారావుకు ఫిర్యాదు చేశారు. హత్య కేసు నమోదు చేసిన ఇన్స్పెక్టర్ గురువారం నిందితుడు శ్రీకాంత్ను అరెస్ట్ చేశారు. -
కట్టుకున్నోళ్లే కడతేర్చారు
కట్టుకున్న భర్తలే ఆ మహిళలపాలిట కాలయములయ్యారు. అదనపు కట్నం కోసం ఒకడు, కుటుంబ తగాదాలతో మరొకడు తమ భార్యలను పొట్టనబెట్టుకున్నారు. జిల్లాలోని పాతఇస్సిపేట, ఉప్పరపల్లిలో జరిగిన ఈ ఘటనలు బాధిత కుటుంబాల్లో విషాదాన్ని నింపాయి. పురుగుల మందు తాగించి.. మొగుళ్లపల్లి : అదనపు కట్నం కోసం కొన్నాళ్లుగా భార్యను హింసిస్తున్న ఓ వ్యక్తి చివరికి ఆమెను హింసించి, పురుగుల మందు తాగించి హత్య చేసిన సంఘటన మండలంలోని చింతలపల్లి శివారు పాతఇస్సిపేటలో శుక్రవారం జరిగింది. కుటుం బ సభ్యులు, పోలీసుల కథనం ప్రకారం... పాతఇస్సిపేట గ్రామానికి చెందిన నేర్పటి మొగిలి, స్వరూ ప దంపతుల కుమార్తె స్వప్నను అదే గ్రామానికి చెందిన జన్నె పరమేశ్వర్ తొమ్మిదేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఈ క్రమంలో వారికి ఇద్దరు కుమారులు కలిగారు. గత రెండేళ్లుగా భర్త పరమేశ్వర్ అదనపు కట్నం కోసం స్వప్నను హింసిస్తున్నాడు. ఈ క్రమంలో పలుమార్లు పెద్దమనుషుల మధ్య పంచాయితీ లు కూడా జరిగాయి. గురువారం రాత్రి ఇంటికి వచ్చిన పరమేశ్వర్ అదనపు కట్నం కోసం భార్యను తీవ్రంగా కొట్టాడు. అనంతరం పురు గుల మందు తాగించాడు. తర్వాత ఆమెను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందింది. తల్లి స్వరూప ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై సురేందర్ తెలిపారు. కిరోసిన్ పోసి నిప్పంటించి.. చెన్నారావుపేట : కుటుంబ కలహాలతో ఓ వ్యక్తి తన భార్యపై కిరోసిన్ పోసి నిప్పటించడంతో తీవ్ర గాయాలపాలై ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందు తూ శుక్రవారం మృతి చెందింది. పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని ఉప్పరపల్లి గ్రామానికి చెందిన కుక్కల రాజుకు, నర్సంపేట మండలంలోని నాగుర్లపల్లి గ్రామానికి చెందిన కడబోయిన సదయ్య కూతురు సరిత(28)తో పదేళ్ల క్రితం వివాహమైంది. వీరి దాంపత్య జీవితంలో ఇద్దరు కుమార్తెలు జన్మించారు. కుటుంబ తగాదాలతో సోమవారం రాత్రి భార్య సరితపై రాజు కిరోసిన్ పోసి నిప్పంటించాడు. ఆమె అరుపులను గమనించిన చుట్టుపక్కల వారు మంటలార్పి ఎంజీఎం ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ శుక్రవారం సాయంత్రం మృతిచెందింది. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పులి వెంకట్గౌడ్ తెలిపారు. ∙ -
కట్టుకున్నోళ్లే కడతేర్చారు..
కట్టుకున్న భర్తలే ఆ మహిళలపాలిట కాలయములయ్యారు. అదనపు కట్నం కోసం ఒకడు, కుటుంబ తగాదాలతో మరొకడు తమ భార్యలను పొట్టనబెట్టుకున్నారు. జిల్లాలోని పాతఇస్సిపేట, ఉప్పరపల్లిలో జరిగిన ఈ ఘటనలు బాధిత కుటుంబాల్లో విషాదాన్ని నింపాయి. పురుగుల మందు తాగించి.. మొగుళ్లపల్లి : అదనపు కట్నం కోసం కొన్నాళ్లుగా భార్యను హింసిస్తున్న ఓ వ్యక్తి చివరికి ఆమెను హింసించి, పురుగుల మందు తాగించి హత్య చేసిన సంఘటన మండలంలోని చింతలపల్లి శివారు పాతఇస్సిపేటలో శుక్రవారం జరిగింది. కుటుం బ సభ్యులు, పోలీసుల కథనం ప్రకారం... పాతఇస్సిపేట గ్రామానికి చెందిన నేర్పటి మొగిలి, స్వరూ ప దంపతుల కుమార్తె స్వప్నను అదే గ్రామానికి చెందిన జన్నె పరమేశ్వర్ తొమ్మిదేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఈ క్రమంలో వారికి ఇద్దరు కుమారులు కలిగారు. గత రెండేళ్లుగా భర్త పరమేశ్వర్ అదనపు కట్నం కోసం స్వప్నను హింసిస్తున్నాడు. ఈ క్రమంలో పలుమార్లు పెద్దమనుషుల మధ్య పంచాయితీ లు కూడా జరిగాయి. గురువారం రాత్రి ఇంటికి వచ్చిన పరమేశ్వర్ అదనపు కట్నం కోసం భార్యను తీవ్రంగా కొట్టాడు. అనంతరం పురు గుల మందు తాగించాడు. తర్వాత ఆమెను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందింది. తల్లి స్వరూప ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై సురేందర్ తెలిపారు. కిరోసిన్ పోసి నిప్పంటించి.. చెన్నారావుపేట : కుటుంబ కలహాలతో ఓ వ్యక్తి తన భార్యపై కిరోసిన్ పోసి నిప్పటించడంతో తీవ్ర గాయాలపాలై ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందు తూ శుక్రవారం మృతి చెందింది. పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని ఉప్పరపల్లి గ్రామానికి చెందిన కుక్కల రాజుకు, నర్సంపేట మండలంలోని నాగుర్లపల్లి గ్రామానికి చెందిన కడబోయిన సదయ్య కూతురు సరిత(28)తో పదేళ్ల క్రితం వివాహమైంది. వీరి దాంపత్య జీవితంలో ఇద్దరు కుమార్తెలు జన్మించారు. కుటుంబ తగాదాలతో సోమవారం రాత్రి భార్య సరితపై రాజు కిరోసిన్ పోసి నిప్పంటించాడు. ఆమె అరుపులను గమనించిన చుట్టుపక్కల వారు మంటలార్పి ఎంజీఎం ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ శుక్రవారం సాయంత్రం మృతిచెందింది. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పులి వెంకట్గౌడ్ తెలిపారు. ∙ -
మద్యం మత్తులో భార్య శవంతో శృంగారం!
న్యూఢిల్లీ: మద్యం మత్తులో ఓ 25 ఏళ్ల యువకుడు మృగాడిగా మారాడు. భార్యను ఇటుకతో కొట్టిచంపి.. ఆ తర్వాత ఆమె మృతదేహంతో లైంగిక కలాపాలకు పాల్పడ్డాడు. అనంతరం మద్యం మత్తులో శవం పక్కనే నిద్రపోయాడు. గత నెల 30న పశ్చిమ ఢిల్లీలోని నిహాల్ విహార్లో ఈ ఘటన జరిగింది. నిందితుడైన ప్రదీప్ శర్మను పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. ఈ-రిక్షా డ్రైవర్ అయిన అతడు మద్యం మత్తులో భార్య మోనికాతో గొడవ పడ్డాడు. డబ్బు విషయమై భార్యాభర్తలు తరచూ గొడవపడేవారని, భార్యకు అక్రమ సంబంధాలు ఉన్నాయని ప్రదీప్ శర్మ అనుమానించేవాడని పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో గత నెల 30న రాత్రి సమయంలో ఇంటిఅద్దె చెల్లించకపోవడంపై భార్యాభర్తల మధ్య గొడవ జరిగిందని, అప్పుడు మద్యం మత్తులో ఉన్న ప్రదీప్ శర్మ ఒళ్లుతెలియని ఆవేశంలో ఇటుకతో భార్యను కొట్టిచంపి.. ఆ తర్వాత మృతదేహంతో లైంగిక కలాపాలకు పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. ఉదయాన్ని జరిగిన దారుణాన్ని గుర్తించిన ప్రదీప్ తన ఫోన్ స్విచ్ఛాప్ చేసి పరారయ్యాడని, యూపీలోని నంగ్లోయి రైల్వేస్టేషన్లో తచ్చాడుతున్న అతడిని పక్కా సమాచారం ప్రకారం అరెస్టు చేశామని వెల్లడించారు. -
పండగకు పుట్టింటికి తీసుకెళ్తానని..
కణెకల్(అనంతపురం): పండగకు పుట్టింటికి తీసుకెళ్తానని భార్యను బైక్ మీద తీసుకెళ్లిన భర్త.. మార్గం మధ్యలో బైక్ ఆపి ఆమెను వేట కొడవలితో నరికి చంపిన సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాలు.. అనంతపురం జిల్లా కణెకల్ మండలం గెనిగెర గ్రామానికి చెందిన శోభ (19)కు బ్రహ్మసముద్రం మండలం పిల్లలపల్లి గ్రామానికి చెందిన వడ్డె అనిల్(24)తో ఏడాది కిందట వివాహమైంది. ఈ క్రమంలో దసరా పండగకు పుట్టింటికి వెళ్దామని భార్య చెప్పడంతో ఆమెను తీసుకొని బుధవారం మధ్యాహ్నం బైక్ పై బయలు దేరారు. దగ్గర దారి అనిచెప్పి బైక్ను కెనాల్ పక్కనుంచి తీసుకెళ్తూ మార్గమధ్యలో వాహనం ఆపి వెంట తెచ్చుకున్న వేట కొడవలితో ఆమెను నరికి చంపి, మృతదేహాన్ని కాలువలో పడేశాడు. ఆ తర్వాత ఏమి తెలియనట్లు ఇంటికి వెళ్లాడు. పండగకు ఇంటికి వస్తానన్న కూతురు ఎంతకీ రాకపోవడంతో కంగారుపడ్డ శోభ తండ్రి వెంకటేశ్వర్లు.. బ్రహ్మసముద్రం వెళ్లి ఆరా తీశాడు. 'నాకు తెలియదు' అని అల్లుడు సమాధానమిచ్చాడు. దీంతో అనుమానం వచ్చిన హతురాలి తండ్రి అల్లుడు అనిల్ పై అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు అనిల్ను అదుపులోకి తీసుకొని తమ శైలిలో విచారించడంతో అసలు విషయం బయటపడింది. -
భార్యను చంపి.. బ్యాగులో కుక్కి!
-
భార్యను నరికి చంపిన భర్త
అనుమానంతో అమానుషం... అత్తాపూర్: అనుమానం పెనుభూతమైంది. భార్యపై అనుమానంతో ఓ కిరాతకుడు కత్తితో నరికి చంపాడు. రాజేంద్రనగర్ పోలీస్స్టేషన్ పరిధిలో సోమవారం ఈ ఘటన జరిగింది. ఇన్స్పెక్టర్ ఉమేందర్ కథనం ప్రకారం... సిక్చౌహాని ప్రాంతానికి చెందిన షఫియాబేగం(25), గౌస్ భార్యాభర్తలు. తొమ్మిదేళ్ల క్రితం వీరికి పెళ్లైంది. నలుగురు పిల్లలు ఉన్నారు. కొద్ది రోజులుగా భార్యపై అనుమానం పెంచుకున్నాడు. ఇదే విషయమై భార్యతో ఐదురోజులుగా గొడవపడుతున్న గౌస్ ఎలాగైన ఆమెను చంపాలని నిర్ణయించుకున్నాడు. సోమవారం సాయంత్రం ఇంట్లో ఒంటరిగా ఉన్న షఫియాతో గొడపడి, కత్తితో మెడపై నరికి చంపి పారిపోయాడు. సమాచారం అందుకున్న రాజేంద్రనగర్ పోలీ సులు ఘటనా స్థలాన్ని పరిశీలించి, మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. కేసు నమోదు చేసి, గౌస్ కోసం గాలిస్తున్నారు. -
కట్టుకున్నవాడే నులిమేశాడు..
- రెండో భార్య మోజులో పడి... - మొదటి భార్యను హత్య చేసిన వైనం - చంద్లాపూర్లో ఉద్రిక్తత.. - గ్రామస్తుల ఆందోళన - పోలీసులకు లొంగిపోయిన నిందితుడు చిన్నకోడూరు: కడదాకా తోడుంటానని నమ్మబలికి పెళ్లాడిన వ్యక్తి రెండోభార్య మోజులో పడి మొదటి భార్యను గొంతు నులిమి హత్యచేశాడు. ఆ తర్వాత పోలీసులకు లొంగిపోయాడు. ఈ సంఘటన మండల పరిధిలోని చంద్లాపూర్లో ఆదివారం కలకలం సృష్టించింది. వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కందుకూరి శ్రీనివాసచారి ఎనిమిదేళ్ల క్రితం వినోద(28)ను వివాహం చేసుకున్నాడు. వీరికి కుమారుడు సాయిచరణ్ (06)ఉన్నాడు. కుల వృత్తిని నమ్ముకుని కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కొంత కాలంగా భార్యా భర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. రెండేళ్ల క్రితం శ్రీనివాసచారి మరో మహిళను వివాహమాడాడు. వీరికి మూడు నెలల పాప. సిద్దిపేట పట్టణంలో ఈ కుటుంబాన్ని ఉంచాడు. ఈ విషయం మొదటి భార్యకు తెలవడంతో నిత్యం ఇంట్లో గొడవలవుతున్నాయి. దీంతో విసుగు చెందిన చారి ఆదివారం ఉదయం ఇంట్లో మద్యం తాగి భార్య వినోదను బెల్టుతో గొంతునులిమి హత్య చేశాడు. కుమారుడ్ని తీసుకొని బయటకు వెళ్లిపోయాడు. ఇది గమనించిన చుట్టు పక్కల వాళ్లు పోలీసులకు సమాచారం అందిం చారు. విషయం తెలుసుకున్న సిద్దిపేట రూరల్ సీఐ ప్రసన్నకుమార్, ఎస్ఐ సత్యనారాయణలు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలను సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సిద్దిపేట ఏరియా ఆస్పత్రికి తరలించేందుకు సిద్ధం కావడంతో గ్రామస్తులు అడ్డుకున్నారు. దీంతో గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వెంటనే సిద్దిపేట డీఎస్పీ శ్రీధర్కు సమాచారం ఇవ్వడంతో ఆయన గ్రామానికి చేరుకుని వారిని శాంతింపజేశారు. శ్రీనివాస్చారి తమ అదుపులోనే ఉన్నట్లు ఎస్ఐ సత్యనారాయణ వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. -
మీ అమ్మను చంపేశా.. వెళ్లి చూసుకో..
భార్యను కిరాతకంగా హత్య చేసిన భర్త హత్య విషయం ఫోన్లో కూతురుకు వెల్లడి అనంతపురం క్రైం : ‘మీ అమ్మను చంపేశా...వెళ్లి చూసుకో’ అంటూ భార్యను కిరాతకంగా హత్య చేసిన విషయం కూతురుకు ఫోన్ చేసి మరీ చెప్పాడు. అనంతపురం నగర శివారులోని హమాలికాలనీలో శుక్రవారం ఉదయం చోటు చేసుకున్న ఈ ఘటన కలకలం రేపింది. పోలీసులు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. గంగాధర్, ఆత్మకూరు రాజమ్మ (43) అనే దంపతులు హమాలీ కాలనీలో నివాసముంటున్నారు. గంగాధర్ గుత్తి ప్రభుత్వాస్పత్రిలో అటెండర్గా పనిచేస్తున్నాడు. రాజమ్మ ఇళ్లలో పని చేస్తుండేది. వీరికి ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు. కూతుళ్లకు వివాహం చేశారు. వారు ఇదే కాలనీలో నివాసముంటున్నారు. తాగుడుకు బాని సై విధులను నిర్లక్ష్యం చేయడంతో అత ని స్థానంలో కుమారుడు పనిచేస్తున్నా డు. మద్యం కోసం డబ్బు ఇవ్వాలని భార్యను వేధించేవాడు. గురువారం రాత్రి కూడా డబ్బు కోసం భార్యతో గొడవపడ్డాడు. తెల్లవారుజామున రోకలిబండతో భార్య తలపై బలంగా మోది హత్యచేశాడు. అనంతరం పెద్ద కూతురు అరుణజ్యోతికి ఫోన్ చేసి విషయం చెప్పాడు. ఆమె వెళ్లి చూడగాతల్లి విగతజీవిగా పడివుంది. పోలీసులకు తెలపడంతో వన్టౌన్ సీఐ రాఘవన్, ఎస్ఐ విశ్వనాథచౌదరి ఘటనాస్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కూతురు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. నిందితుడు పరారీలో ఉన్నాడు. -
అనుమానంతో భార్యను చంపిన భర్త
కరీంనగర్(గొల్లపల్లి): గొల్లపల్లి మండలం గోవిందునిపల్లెలో దారుణం చోటుచేసుకుంది. అనుమానంతో ఓ భర్త, భార్యను పాశవికంగా హతమార్చాడు. వివరాలు.. మమత(26), మల్లేశం భార్యాభర్తలు. వీరికి నాలుగేళ్ల క్రితం పెళ్లయింది. కొన్ని రోజులుగా మల్లేశం తన భార్యపై అనుమానం పెంచుకున్నాడు. ఈ క్రమంలోనే బుధవారం కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశాడు. అనంతరం పరారయ్యాడు. అనుమానం పెంచుకుని, అదనపు కట్నం కోసం తరచూ వేధింపులకు గురిచేసేవాడని కుటుంబసభ్యులు తెలిపారు. పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
గర్భిణిని హతమార్చిన భర్త
-
గర్భిణిని హతమార్చిన భర్త
జీడిమెట్ల (హైదరాబాద్): ఆరు నెలల గర్భంతో ఉన్న భార్యను భర్తే హతమార్చిన ఘటన నగరంలోని జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... గాజుల రామారం పరిధిలోని ప్రకాశం పంతులు నగర్కు చెందిన హుస్సేన్, గౌసియా బేగం దంపతుల మధ్య కొన్నాళ్లుగా మనస్పర్థలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో శనివారం కూడా వీరిద్దరు గొడవపడ్డారు. అదే రోజు రాత్రి హుస్సేన్ తన భార్య గౌసియా బేగంను హత్య చేశాడు. అనంతరం తలాబ్కట్టలో ఉండే అత్తా, మామలకు ఫోన్ చేసి జరిగిన విషయాన్ని చెప్పాడు. వారు ఆదివారం ఉదయం కూతురు ఇంటికి వచ్చి చూడగా ఆమె శవమై కనిపించింది. దీంతో వారు జీడిమెట్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
ప్రియురాలి కోసం భార్యను చంపాడు
హైదరాబాద్: ప్రియురాలి కోసం భార్యను హత్యచేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నగరంలోని నార్సింగ్ లో రెండు నెలలు క్రితం భార్యను చంపిన భర్త శవాన్ని పూడ్చిపెట్టాడు. ఈ ఉదంతంపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దీనికి సంబంధించి నిందితుడిని విచారించిన అనంతరం శవాన్ని వెలికితీయనున్నట్లు పోలీసులు తెలిపారు. -
భార్యను చంపి.. పూడ్చేశాడు!
భార్యను హతమార్చి, గుట్టుచప్పుడు కాకుండా అతడి మృతదేహాన్ని పూడ్చి పెట్టేశాడో భర్త. ఈ సంఘటన హైదరాబాద్ శివార్లలోని తిరుమలగిరి ప్రాంతంలో జరిగింది. తన భార్యది సహజ మరణమని అతడు ముందుగా అందరినీ నమ్మించాడు. అయితే కుటుంబ సభ్యులు అతడిమీద అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో పోలీసుల విచారణలో భర్తే తన భార్యను హతమార్చినట్లు తేలింది. ఎమ్మార్వో ఆధ్వర్యంలో పోలీసులు ఆమె మృతదేహాన్ని వెలికితీసి.. పంచనామా నిర్వహిస్తున్నారు. -
విజయవాడలో తుపాకుల కలకలం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కాబోయే రాజధాని నగరం అయిన విజయవాడలో అక్రమ ఆయుధాలు కలకలం రేపాయి. గతంలో సైన్యంలో పనిచేసిన రెహముద్దీన్ అనే వ్యక్తి ఆయుధాలతో సంచరిస్తుండగా పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని రెండు నాటు తుపాకులు, పది తూటాలను స్వాధీనం చేసుకున్నారు. గతంలో ఒకసారి ఇతడిని భార్య మీద హత్యాయత్నం చేసిన కేసులో అరెస్టు చేశారు. ఇప్పుడు కూడా తన భార్యను చంపేందుకే ఇలా ఆయుధాలు తీసుకుని తిరుగుతున్నాడా.. లేక మరేదైనా కారణం ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్ నుంచి ఈ ఆయుధాలను అతడు కొనుగోలు చేసి తీసుకొచ్చినట్లు ప్రాథమిక దర్యాప్తులో తెలిసింది. -
భార్య, అత్తపై పెట్రోలు పోసి నిప్పంటించిన అల్లుడు
ఏలూరు(ఫైర్స్టేషన్ సెంటర్) : కట్టుకున్న భార్య, అత్తపై పెట్రోలు పోసి నిప్పం టించిన వ్యక్తి ఘటనలో తాను గాయపడి ప్రాణభయంతో ఆస్పత్రిలో చేరినా చివరికి నేరాన్ని అంగీకరించక తప్పలేదు. ఏలూరు వన్టౌన్ సీఐ సీహెచ్ మురళీకృష్ణ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఏలూరు వంగాయగూడెం మహేశ్వర కాలనీకి చెందిన ఆరెట్ల సత్తమ్మ(65), ఆమె కుమార్తె తిరువీధుల లక్ష్మి(45)లు అగ్నిప్రమాదంలో తీవ్ర గాయాలపాలై ఆది వారం తెల్లవారు జామున ఆస్పత్రిలో మృతిచెందారు. వీరు కుటుంబ కలహాల నేపథ్యంలో ఆత్మహత్యకు యత్నించినట్లు కుటుంబ సభ్యులు, స్థానికులు భావి ంచారు. అయితే లక్ష్మి భర్త కైకలూరుకు చెందిన తిరువీధుల శివన్నారాయణ(48) కూడా కాలిన గాయాలతో ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో శనివారం అర్ధరాత్రి చేరా డు. అతను ఇచ్చిన సమాచారంతో అసలు విషయం బయటపడింది. ఆరెట్ల సత్తమ్మ, కృష్ణ దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నా రు. కృష్ణ సోడాలు అమ్ముతుంటాడు. పెద్ద కుమార్తె లక్ష్మికి 12 సంవత్సరాల క్రితం శివన్నారాయణతో వివాహం అయ్యింది. మొదట్లో ఇద్దరు సంతోషంగానే ఉన్నా కాలక్రమంలో శివన్నారాయణ మద్యానికి బానిస కావడంతో లక్ష్మి ఇటీవల పుట్టింటికి వచ్చింది. అయితే లక్ష్మి కి పుట్టింటి వద్ద వేరొక వ్యక్తితో వివాహేతర సంబంధం ఉందని శివన్నారాయణ అనుమానించాడు. లక్ష్మి భర్త వద్దకు వెళ్లటం లేదని ఆమె తల్లి సత్తెమ్మ ఎన్నిసార్లు అడిగినా తల్లితో గొడవ పడేదే కానీ భర్త వద్దకు వెళ్లలేదు. ఈ నేపథ్యంలోనే శుక్రవారం రాత్రి తల్లీకూతుళ్లు ఘర్షణ పడి ఆత్మహత్యకు యత్నించి ఉంటారని భావించారు. అనుమానం పెనుభూతమై.. భార్య వివాహేతర సంబంధం పెట్టుకుందనే అనుమానంతో శివన్నారాయణ పథకం ప్రకారం తెచ్చుకున్న పెట్రోల్ త ల్లీకూతుళ్లపై పోసి నిప్పంటించాడు. ప్రమాద ఘటనగా చూపించే క్రమంలో భార్య, అత్తతో పాటు ఇంటిపైనా పెట్రోల్ పోసి ఆధారాలు లేకుండా చేసేం దుకు ప్రయత్నించాడు. శనివారం రాత్రి 10.30 గంటల సమయంలో రెండు టిన్నులతో 16 లీటర్ల పెట్రోల్ను తెచ్చిన అతను ఒక టిన్నులోని పెట్రోల్ను భార్య, అత్త, ఇంటిపై పోసి నిప్పుపెట్టాడు. రెండో టిన్నును కాళ్ల వద్దే ఉంచుకోవటంతో అదికాస్తా పేలి తాను కూడా అగ్నికీలల్లో చిక్కుకుని గాయపడ్డాడు. ప్రయత్నం విఫలం కావడంతో గత్యంతరం లేక ఆసుపత్రిలో చేరి చేసిన నేరాన్ని ఒప్పుకున్నాడు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను బంధువులకు అప్పగించారు. -
నడిరోడ్డుపై భార్యను చంపిన భర్త
-
నడిరోడ్డుపై భార్యను చంపిన భర్త
హైదరాబాద్: కట్టుకున్న భార్యను నడిరోడ్డుపై కిరాతకంగా హత్య చేశాడో భర్త. కాచిగూడ రైల్వేస్టేషన్ వద్ద ఆదివారం మధ్యాహ్నం ఈ దారుణోదంతం జరిగింది. కాచిగూడ ఆర్టీసీ డిపోలో కండక్టర్గా పనిచేస్తున్న జమునారాణిని ఆమె భర్త దారుణంగా హత్య చేశాడు. అందరూ చూస్తుండగానే నడిరోడ్డుపై భార్యను కత్తితో పొడిచి చంపాడు. కుటుంబ కలహాల కారణంగానే అతడీ ఘాతుకానికి పాల్పడినట్టు భావిస్తున్నారు. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. -
భార్య, బిడ్డను దారుణంగా హతమార్చాడు
అనంతపురం: అనంతపురం జిల్లా ధర్మవరంలో దారుణం జరిగింది. కట్టుకున్న భార్య, రక్తం పంచుకు చిన్నారిని దారుణంగా హతమార్చాడో భర్త. కుటుంబ కలహాల కారణంగానే ఈ దుర్ఘటన జరిగినట్లు తెలుస్తోంది. అనంతరం నిందితుడు పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాలను పోస్ట్మార్టంకు తరలిస్తున్నారు. -
వేధిస్తున్నారని భార్య, అత్తలను హత్య చేసిన భర్త
సికింద్రాబాద్: వేధిస్తున్నారంటూ ఓ భర్త తన భార్యను, అత్తను నరికి హత్య చేశాడు. ఆ తరువాత పోలీసులకు లొంగిపోయాడు. పోలీసుల కథనం ప్రకారం సికింద్రాబాద్ మోండా మార్కెట్ పోలీస్ స్టేషన్ పరిదిలో దారుణం జరిగింది. బెంగళూరుకు చెందిన పద్మప్రియకు శర్వానంద్కు రెండేళ్ల క్రితం వివాహం జరిగింది. భార్యా- భర్తల మధ్య నిత్యం గొడవలు జరుగుతుండేవి. పద్మప్రియకు అంతకు ముందే వివాహం జరిగింది. అయితే ఆ విషయం శర్వానంద్కు చెప్పలేదు. ఆ విషయం తెలిసి అతను వేరుగా ఉంటున్నాడు. పద్మప్రియ, ఆమె తల్లి పరమేశ్వరి శర్వానంద్తో తరచూ గొడవపడుతుండటంతో వారు పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. అయినా వారు వేదిస్తుండటంతో విసిగివేసారిన శర్వానంద్ భార్యను, అత్తను నరికి చంపి పోలీసులకు లొంగిపోయాడు. -
కట్టుకున్న భార్యనే కడతేర్చాడు
కీసర,న్యూస్లైన్: మద్యానికి బానిసైన అతడు కట్టుకున్న భార్యను కడతేర్చాడు. వాటర్ హీటర్ తీగతో ఉరివేసి ఉసురుతీశాడు. అనంతరం ఆత్మహత్యగా చిత్రీకరించే యత్నం చేశాడు. నిందితుడు పారిపోయే యత్నం చేయగా స్థానికులు పట్టుకొని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఈ సంఘటన ఆదివారం అర్ధరాత్రి తర్వాత మండల పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని కవాడీగూడ ప్రాంతానికి చెందిన నర్సింగ్రావు(42), హేమలత(38) దంపతులకు 18 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి సంతానం కలగలేదు. దంపతులు ఏడాదిన్నరగా కీసర మండలం అహ్మద్గూడ పంచాయతీ పరిధిలోని రాజీవ్ గృహకల్ప కాలనీలో ఉంటున్నారు. నర్సింగ్రావు నగరంలోని ఓ బ్యాంకులో ప్రైవేట్ సెక్యూరిటీగార్డుగా పనిచేస్తున్నాడు. హేమలత నగరంలో హౌస్ కీపింగ్ విభాగంలో పనిచేస్తోంది. తాగుడుకు బానిసైన నర్సింగ్రావు భార్యను వేధించసాగాడు. ఈక్రమంలో పలుమార్లు హేమలత పుట్టింటికి వెళ్లగా నర్సింగ్రావు తిరిగి తీసుకొచ్చాడు. ఆదివారం రాత్రి అతిగా మద్యం తాగిన నర్సింగ్రావు ఇంటికి వచ్చి భార్యతో గొడవ పడ్డాడు. ఒంటిగంట సమయంలో వాటర్ హీటర్ వైరుతో ఆమెకు ఉరివేసి చంపేశాడు. ఉరి వేసిన ఆనవాళ్లు కనిపించకుండా హేమలత మెడకు జండూబామ్ రుద్దాడు. తన భార్య ఆత్మహత్యకు పాల్పడిందని ఇరుగుపొరుగును పిలిచాడు. ఇంట్లో వస్తువులు చిందరవందరగా పడి ఉండటంతో స్థానికులు అనుమానించి నర్సింగ్రావును నిలదీశారు. అతడు పారిపోయే యత్నం చేయగా పట్టుకొని దేహశుద్ధి చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. హేమలత మృతి విషయం తెలుసుకున్న ఆమె బంధువులు రాజీవ్ గృహకల్పకు చేరుకొని కన్నీటిపర్యంతమయ్యారు. నర్సింగ్రావు మద్యం తాగుతూ, పిల్లలు కలగడం లేదని హేమలతను వేధించేవాడని ఆరోపించారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నగరంలోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. నర్సింగ్రావు పోలీసుల అదుపులో ఉన్నాడు. ఈమేరకు కేసు దర్యాప్తులో ఉంది. -
అదనపు కట్నం కోసం వేధించి.. భార్య హత్య
చెంచుపల్లి : జీవితాంతం కష్టసుఖాల్లో తోడుగా ఉంటానని ఏడడుగులు నడిచి బాస చేసిన భర్తే ఆమె పాలిట కాలయముడు అయ్యాడు. మద్యం కోరల్లో చిక్కుకొని అదనపు కట్నం తీసుకురావాలని వేధిస్తూ చివరకు ఉసురుతీసుకున్నాడు. ఈ సంఘటన పూడూరు మండలం ఎన్కెపల్లి అనుబంధ గ్రామం చెంచుపల్లిలో ఆదివారం చోటుచేసుకుంది. చన్గొముల్ ఎస్ఐ శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన తీగలపల్లి శ్రీనివాస్ వికారాబాద్ పట్టణానికి సమీపంలోని కొత్తగడికి చెందిన లక్ష్మి(28)ని పన్నెండేళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు. దంపతులకు ముగ్గురు కుమారులు. అనారోగ్యంతో ఓ కొడుకు మృతిచెందాడు. శ్రీనివాస్ స్థానికంగా కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. కొంతకాలంగా మద్యానికి బానిసైన శ్రీనివాస్ పుట్టింటి నుంచి అదనపు కట్నం తీసుకురావాలని భార్యను వేధించసాగాడు. శనివారం రాత్రి 10 గంటలకు మద్యం తాగి ఇంటికి వచ్చిన ఆయన భార్య లక్ష్మితో గొడవపెట్టుకున్నాడు. తీవ్ర ఆగ్రహానికి గురైన ఆయన ఓ తాడుతో భార్య గొంతునులిమి చంపేశాడు. హత్య విషయం తెలిస్తే లక్ష్మి బంధువులు దాడి చేస్తారేమోనని భయంతో దూలానికి ఉరి వేశాడు. అనంతరం తన భార్య ఉరివేసుకుందని శ్రీనివాస్ స్థానికులకు చెప్పాడు. సర్పంచ్ దయాకర్ సమాచారంతో చన్గొముల్ ఎస్ఐ శ్రీనివాస్ ఆదివారం గ్రామానికి చేరుకొని వివరాలు సేకరించారు. అనంతరం చేవెళ్ల డీఎస్పీ శిల్పవల్లి చెంచుపల్లికి చేరుకొని లక్ష్మి మృతదేహాన్ని పరిశీలించారు. కుటుంబీకులతో మాట్లాడి వివరాలు సేకరించారు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో విచారించగా తానే లక్ష్మిని హత్య చేసినట్లు శ్రీనివాస్ అంగీకరించాడు. కాగా తమ కుమార్తెను భర్త, బావ నారాయణ, తోడి కోడలు పెద్ద లక్ష్మి, ఆడపడుచు సరోజ కలిసి చంపేశారని మృతురాలి తల్లిదండ్రులు ఆరోపించారు. వికారాబాద్ ఆస్పత్రిలో లక్ష్మి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబీకులకు అప్పగించారు. మృతురాలి అన్న అశోక్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ శ్రీనివాస్ తెలిపారు. -
యూపీ ఎమ్మెల్యే భార్య హత్య
ఉత్తరప్రదేశ్ ఎమ్మెల్యే హజీ అలీం భార్య రెహానా (40) హత్యకు గురయ్యారు. తూర్పు ఢిల్లీలోని ఆమె ఇంట్లో ఈ సంఘటన జరిగింది. మంగళవారం రాత్రి లేదా బుధవారం ఉదయం హత్య చేసి ఉంటారని భావిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. తెలిసిన వారే ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటారని అనుమానిస్తున్నట్టు ఓ పోలీసు అధికారి చెప్పారు. రెహానా హత్యకు గురైన సమయంలో హజీ అలీం ఇంట్లో లేరు. హజీ అలీం ప్రస్తుతం హజ్ యాత్రలో ఉన్నారు. ఉత్తరప్రదేశ్లోని బులంద్షాహ్ర్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. -
అనుమానం పెనుభూతమై..
ఏ.పోలవరం (జంగారెడ్డిగూడెం రూరల్), న్యూస్లైన్ : భార్యపై అనుమానం పెంచుకున్న ఆ భర్త చివరకు ఆమెను హత్య చేసేందుకు తెగబడ్డాడు. గొడ్డలితో కిరాతకంగా నరకడంతో ఆమె అక్కడికక్కడే మరణించింది. ఈ ఘటన జంగారెడ్డిగూడెం మండలం ఎ.పోలవరంలో చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.. ఎ.పోలవరం గ్రామానికి చెందిన వనపర్తి గంగాజలాన్ని(27) ఆమె భర్త ధర్మయ్య అనుమానిస్తున్నా డు. కొంతకాలంగా వారిద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మంగళవారం ఇంట్లో వంట చేస్తున్న గంగాజలంపై అతను గొడ్డలితో దాడిచేశాడు. తలకు బలమైన గాయం కావడంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. ధర్మయ్య పరారయ్యాడు. కొన్నాళ్లుగా ధర్మయ్య భార్యను అనుమానిస్తూ హింసిస్తున్నాడని గంగాజలం సోదరుడు సర్వేశ్వరరావు తెలిపాడు. నెల క్రితం భర్తతో గొడవపడి ఆమె పుట్టింటికి వచ్చేసిందని, తాము నచ్చజెప్పి కాపురానికి పంపామని చెప్పాడు. గతంలో చాలాసార్లు ఇలానే జరిగిందని, సమస్యను పెద్దల దృష్టికి తీసుకువెళ్లినా ధర్మయ్య ప్రవర్తనలో మార్పురాలేదన్నాడు. గంగాజలంకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.