wife murdered
-
Britain: భార్యను 224 ముక్కలుగా నరికేశాడు
లండన్: భార్యను భర్త హత్యచేసి ఏకంగా 224 ముక్కలుగా నరికి మృతదేహాన్ని మాయంచేసిన దారుణ ఘటన బ్రిటన్లో చోటుచేసుకుంది. నికొలస్ మెట్సన్ (28), హోలీ బ్రామ్లీ (26) లింకన్ సిటీలోని బస్సింగ్హామ్లో ఉంటున్నారు. గత నెల 17 నుంచి బ్రామ్లీ కనిపించట్లేదని పోలీసులకు ఫిర్యాదు అందింది. ఆమె తనను చితకబాది వెళ్లిపోయిందని పోలీసులకు నికొలస్ చెప్పాడు. ఫ్లాట్ను తనిఖీ చేయగా పెద్ద మొత్తంలో రక్తపు మరకలు, అతిగా శుభ్రం చేసినట్లు అమ్మోనియా, బ్లీచింగ్ ఆనవాళ్లు కనిపించాయి. దాంతో అతన్ని అరెస్ట్చేసి విచారణ మొదలెట్టారు. తనకేం తెలీదని మెట్సన్ తొలుత వాదించాడు. ఈలోపు సమీపంలోని విథమ్ నదిలో నరికిన చేయి సహా చిన్నిచిన్న శరీరభాగాలున్న ప్లాస్టిక్ బ్యాగులు కొట్టుకుపోవడం చూసి స్థానికుడు పోలీసులకు సమాచారమిచ్చాడు. పోలీసు గజ ఈతగాళ్లు వాటిని సేకరించి ల్యాబ్కు పంపించారు. అసలేమాత్రం గుర్తుపట్టలేనంతగా హోలీ బ్రామ్లీ శరీరాన్ని పలుమార్లు పొడిచి 224 ముక్కలుగా నరికి భర్త నదిలో పడేశాడు. శరీరభాగాలను పడేయటంతో సాయపడినట్లు భర్త స్నేహితుడు జాషువా హ్యాన్కాక్ తన నేరాన్ని అంగీకరించాడు. పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో ఎట్టకేలకు భర్త తన నేరాన్ని ఒప్పుకున్నాడు. ఆమె చంపడానికి ముందు పెంపుడు కుక్క పిల్ల, పెంపుడు ఎలుకలనూ చంపేశాడు. తన మాజీ జీవితభాగస్వాములనూ మెట్సన్ హింసించినట్లు 2013, 2016, 2017 పోలీసు రికార్డుల్లో ఉంది. జంతువుల పట్ల అతను అమానుషంగా ప్రవర్తించేవాడని పోలీసు విచారణలో వెల్లడైంది. హత్యచేసి దాదాపు వారంపాటు శరీరం ముక్కలున్న బ్యాగులను దాచి తర్వాత వాటిని పడేశాడు. హత్య తర్వాత భార్య బ్యాంక్ ఖాతా నుంచి 50 పౌండ్లు విత్డ్రా చేసి వాడుకున్నాడు. ‘భార్యను హత్య చేస్తే భర్తకు కలిగే లాభాలేంటి?. ఆ తర్వాత నన్ను ఎవరైనా వెంబడిస్తారా?. కూపీ లాగుతారా?’ అంటూ హత్యకు ముందు కొన్ని అంశాలపై ఆన్లైన్లో సెర్చ్చేశాడు. ఈ ఆన్లైన్ సెర్చ్ హిస్టరీని సైతం పోలీసులు వెలికితీశారు. -
షాకింగ్ ఘటన: ఊహకే అందని ఫోన్ కాల్...కంగుతిన్న పోలీసులు
ఇంత వరకు మనం క్షణికావేశంలో హతమార్చడం లేదా తప్పుడూ నిర్ణయాలు తీసుకుని చనిపోవడం విని ఉంటాం. ఒక వేళ హత్య చేసిన ఆ తర్వాత భయంతో పోలీసులకు లొంగిపోవడం వంటివి కూడా చూశాం. కానీ నేనే చంపేశా రండి అరెస్టు చేయండి అంటూ పోలీసులకే ఫోన్ కాల్ చేయడం గురించి ఇంత వరకు విని ఉండ లేదు కదా. ఇక్కడొక వ్యక్తి డైరెక్టగా పోలీసులకే అసలు విషయం చెప్పి ఇంటికి రమ్మని పిలవడంతో.. ఒక్కసారిగా ఇది నిజమా? కాదా! అన్నంతగా షాక్ అయ్యారు పోలీసులు. వివరాల్లోకెళ్తే...ఒక వ్యక్తి పోలీసులకు ఉదయం ఎనిమిది గంటలకు ఫోన్ చేసి నా భార్యను చంపేశానంటూ పోలీసులకు కాల్ చేశాడు. ఈ ఘటన ఢిల్లీలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం..యోగేశ్ కుమార్ అనే వ్యక్తి సుశీల్ గార్డెన్లో ఉన్న తన ఇంట్లోనే తన భార్యను హత్య చేశానని పోలీసులకు కాల్ చేశాడు. దీంతో ఒక్కసారిగా పోలీసులు షాక్ అయ్యారు. సదరు నిందితుడు చెప్పిన సంఘటనా స్థలానికి హుటాహుటినా చేరుకున్నారు. అక్కడ నిందితుడి భార్య అర్చన నేలపై విగత జీవిగా పడి ఉంది. దీంతో వారు ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించారు. కానీ వైద్యులు ఆమె అప్పటికే చనిపోయిందని ధృవీకరించారు. దీంతో పోలీసులు నిందితుడు యోగేశ్ కుమార్ని అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. ప్రాథమిక విచారణలో ఆ కుటుంబం ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నట్లు తేలిందని పోలీసులు అన్నారు. దీంతో అతడి భార్య అర్చన తనకు తెలిసిన వారి నుంచి కొంత మొత్తాన్ని అప్పుగా తీసుకుంది. ఈ విషయమై ఆదివారం ఆ జంట గొడపడ్డారని, ఆ తర్వాత యోగేశ్ కోపంతో తన భార్య అర్చనను గొంతు నులిమి చంపేశాడని తెలిపారు. (చదవండి: శ్రద్ధా వాకర్ హత్య కేసు: సీబీఐ అవసరం ఏంటి?.. పేరెంట్స్కి లేని అభ్యంతరాలు మీకెందుకు?) -
కూర మాడిందని భార్యను చంపేసి.. గుట్టుచప్పుడు కాకుండా..!
భువనేశ్వర్: కూర మాడిపోయిందనే కోపంతో ఓ వ్యక్తి భార్యను దారుణంగా కొట్టి చంపేశాడు. గుట్టుచప్పుడు కాకుండా ఇంటి వెనకాల పూడ్చిపెట్టాడు. ఆపై తన భార్య నెల రోజులుగా కనిపించటం లేదని బుకాయించే ప్రయత్నం చేశాడు. పోలీసులు తమదైన శైలీలో విచారించగా.. అసలు విషయం బయటపెట్టాడు. ఒడిశాలోని సంబల్పూర్ జిల్లాలో జరిగిన ఈ దారుణ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. 35 ఏళ్ల బాధితురాలి మృతదేహాన్ని బయటకు తీసి పోస్ట్మార్టం నిర్వహించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నెల రోజుల క్రితం బద్మాల్ పంచాయతీలోని రౌత్పారా గ్రామానికి చెందిన రంజన్ బడింగ్(36) అనే వ్యక్తి అక్రమంగా వేటాడి తాబేలును ఇంటికి తీసుకొచ్చాడు. తన భార్య సావిత్రిని కూర చేయమని చెప్పాడు. అయితే, వంట చేస్తుండగా అది కాస్త మాడిపోయింది. దీంతో తాగిన మత్తులో ఉన్న నిందితుడు భార్యతో గొడవకు దిగాడు. తీవ్రంగా కొట్టటంతో ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. ఆమెను అలాగే వదిలేసి ఇంట్లోంచి వెళ్లిపోయాడు. రాత్రి తిరిగి వచ్చే సరికి ఆమె ప్రాణాలు కోల్పోయింది. దీంతో గుట్టుచప్పుడు కాకుండా మృతదేహాన్ని ఇంటి వెనకాల ఖాళీ స్థలంలో పూడ్చిపెట్టాడు. తనపై కోపంతో ఇంట్లోంచి వెళ్లిపోయిందని అందరి నమ్మించే ప్రయత్నం చేశాడు. బాధితురాలి తల్లి పోలీసులను ఆశ్రయించగా విషయం వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు గ్రామానికి వెళ్లారు. వారిని చూసిన నిందితుడు పరారయ్యేందుకు ప్రయత్నించాడు. పోలీసులు, గ్రామస్థులు కలిసి పట్టుకోవటంతో చేసిన నేరాన్ని అంగీకరించాడు. నిందితుడిని అరెస్ట్ చేసి మృతదేహాన్ని పోస్ట్మార్టానికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఇదీ చదవండి: స్నేహితుడిని బెదిరించి.. సాఫ్ట్వేర్ ఇంజినీర్పై 10 మంది గ్యాంగ్ రేప్ -
డబ్బు ఇవ్వలేదనే అక్కసుతో.. కట్టుకున్న భార్యనే..
శెట్టూరు( అనంతపురం): వ్యసనం.. ఓ కుటుంబంలో కార్చిచ్చు రేపింది. మద్యానికి బానిసైన భర్తలో మార్పు తీసుకువచ్చేందుకు ఆ ఇల్లాలు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. చివరకు మద్యం మహమ్మారి కబంధ హస్తాల్లో చిక్కుకున్న భర్త చేతిలోనే దారుణ హత్యకు గురైంది. పోలీసులు తెలిపిన మేరకు... చింతలేని కుటుంబం.. శెట్టూరు మండలం పెరుగుపాళ్యం గ్రామానికి చెందిన చిన్న నరసింహప్ప... చిన్నకారు రైతు. కొన్నేళ్ల క్రితం కర్ణాటక ప్రాంతానికి చెందిన గొల్ల లక్ష్మీదేవితో ఆయనకు వివాహమైంది. వ్యవసాయంతో కుటుంబాన్ని పోషించుకుంటున్న వీరికి ముగ్గురు కుమారులు. వీరిలో ఇద్దరికి వివాహమైంది. కుమారులు ముగ్గురూ బెంగళూరులోని గార్మెంట్స్ పరిశ్రమలో చిన్నపాటి ఉద్యోగాలు చేసుకుంటూ అక్కడే స్థిరపడ్డారు. వ్యవసాయంతో పాటు పాడి పోషణ చేపట్టి కుటుంబ బాధ్యతలను లక్ష్మీదేవి చూసుకుంటూ వస్తున్నారు. ఈ క్రమంలో నరసింహప్ప మద్యానికి బానిసయ్యాడు. తరచూ గొడవ.. మద్యానికి బానిసైన నరసింహప్ప ఎలాంటి పనులు చేయకుండా ఇంటి వద్దనే ఉంటూ వచ్చేవాడు. మద్యం తాగేందుకు డబ్బు ఇవ్వాలంటూ తరచూ భార్యతో గొడవపడేవాడు. అతని వేధింపులు తాళలేక తాను కష్టపడి సంపాదించుకుని దాచుకున్న డబ్బులో కొంత మేర ఇస్తూ వచ్చింది. దీంతో నరసింహప్ప మద్యం మహమ్మారికి పూర్తిగా లొంగిపోయాడు. ఒక్కపూట మద్యం తాగకపోతే విచిత్రంగా ప్రవర్తిస్తూ వచ్చేవాడు. డబ్బు ఇవ్వలేదనే అక్కసుతో.. మద్యం వ్యసనం నుంచి భర్తను బయట పడేసేందుకు లక్ష్మీదేవి విశ్వప్రయత్నాలు చేస్తూ వచ్చింది. అయినా అతనిలో మార్పు రాలేదు. ఈ క్రమంలోనే శనివారం మధ్యాహ్నం మద్యం తాగేందుకు అవసరమైన డబ్బు కోసం లక్ష్మీదేవిని నరసింహప్ప ప్రాధేయపడ్డాడు. ఆమె ఇవ్వలేదు. అలవాటు మానుకోవాలని హితవు చెప్పింది. సాయంత్రం మరోసారి ఆమెతో గొడవపడ్డాడు. బెదిరించాడు. భర్తలో మార్పు తీసుకురావాలనే కృతనిశ్చయంతో ఉన్న ఆమె డబ్బు ఇచ్చేందుకు నిరాకరించింది. మొత్తం సంసారాన్ని తానే నెట్టుకొస్తున్నానని, రోజూ మద్యం తాగేందుకు డబ్బు కావాలంటే ఎక్కడి నుంచి తీసుకురావాలంటూ అసహనం వ్యక్తం చేసింది. రాత్రి కూడా ఇదే పరిస్థితి నెలకొంది. చివరకు విచక్షణ కోల్పోయిన నరసింహప్ప శనివారం అర్ధరాత్రి నిద్రిస్తున్న భార్య లక్ష్మీదేవి (45)పై గొడ్డలితో దాడి చేశాడు. మెడపై బలమైన వేటు పడడంతో ఆమె ప్రాణాలు కోల్పోయింది. తెల్లవారుజామున నరసింహప్ప సోదరుడు కుమారుడు ఈరన్న పాల కోసం వచ్చినప్పడు ఈ విషయం వెలుగు చూసింది. ‘పిన్నమ్మ ఎక్కడకు పోయింది కనిపించడం లేదు’ అంటూ ఇంటి బయట కూర్చొన్న చిన్నాన్నను ఈరన్న అడిగినప్పుడు అతని మౌనమే సమాధానమైంది. దీంతో వెనుదిరుగుతున్న సమయంలో రక్తపుమడుగులో పడి ఉన్న పిన్నమ్మ కనిపిచండంతో ఒక్కసారిగా అతను నిశ్చేష్టుడయ్యాడు. ఏమి జరిగిందంటూ చిన్నాన్నను నిలదీశాడు. అతను సమాధానమివ్వకపోవడంతో కుటుంబసభ్యులకు, పోలీసులకు విషయాన్ని చేరవేశాడు. ఘటనాస్థలాన్ని సీఐ శ్రీనివాసులు, ఎస్ఐ యువరాజ్ పరిశీలించారు. హతురాలి సోదరుడు ఈరన్న ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, అక్కడే ఉన్న నిందితుడు చిన్న నరసింహప్పను అదుపులోకి తీసుకున్నారు. -
భర్తతో గొడవల కారణంగా పుట్టింటికి.. మద్యం మత్తులో
చెన్నై(పళ్ళిపట్టు): మద్యం మత్తులో భార్యను కిరాతకంగా హత్య చేసిన భర్తను సోమవారం పోలీసులు అరెస్టు చేశారు. ఆర్.కే పేట సమీపం బాలాపురానికి చెందిన తమిళ్మణి (42) తాపీమేస్త్రి. అతని భార్య మంగళ. ఈ దంపతులకు శరవణన్ (14), ప్రతీప్ (12) అనే కుమారులున్నారు. భర్తతో గొడవల కారణంగా.. అయ్యనేరిలోని పుట్టింటికి వెళ్లి అక్కడే టైలర్ షాపు నిర్వహిస్తోంది. భార్యను కాపురానికి రావాలని అయ్యనేరికి వెళ్లి తమిళ్మణి గొడవ పడినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో సోమవారం మద్యం మత్తులో టైలర్ దుకాణం వద్దకు వెళ్లిన తమిళ్మణి భార్య మంగళపై కత్తితో దాడి చేసి హత్య చేశాడు. చదవండి: (ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య) -
జీవితంపై విరక్తి: భార్యను చంపి భర్త ఆత్మహత్య
కామారెడ్డి క్రైం: ఆరోగ్య సమస్యల కారణంగా భార్యను చంపి తానూ ఆత్మహత్య చేసుకున్నాడో భర్త. ఈ ఘటన కామారెడ్డి జిల్లా చిన్నమల్లారెడ్డిలో మంగళవారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన శంకర్గారి సిద్ధయ్య (60), బాలమణి (58) దంపతులు కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. బాలమణికి ఐదేళ్ల క్రితం పక్షవాతం వచ్చింది. అప్పటి నుంచి ఎన్ని ఆస్పత్రులు తిరిగినా తగ్గలేదు. ఉన్నచోటే ఆమెకు సపర్యలు చేస్తున్నారు. సిద్ధయ్య కూడా గతంలో ఓ రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. అప్పటి నుంచి అతడికి కూడా ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. జీవితంపై విరక్తితో భార్యను చంపి తాను కూడా చనిపోతానని సిద్దయ్య పలుమార్లు కుటుంబ సభ్యులతో అనేవాడు. సోమవారం రాత్రి కొడుకు రాజు, కోడలు, మనవళ్లు అందరితో కలసి భోజనం చేసి పడుకున్నారు. కొడుకు రాజు ఉదయం లేచి చూసే సరికి తండ్రి ఫ్యాన్కు ఉరివేసుకుని కనిపించాడు. గదిలోకి వెళ్లి చూడగా తల్లి కూడా చనిపోయి ఉంది. బాలమణి పడుకున్న చోటే గొంతుకు చీరతో ఉరివేసి చంపినట్లుగా తెలుస్తోంది. భర్తే ఆమెను చంపేసి తర్వాత ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు నిర్ధారించారు. కేసు దర్యాప్తులో ఉంది. చదవండి: డేటింగ్ యాప్లో ఫొటోతో నటికి వేధింపులు -
విడాకుల నోటీసు పంపింన భార్యను కిరాతకంగా..
సాక్షి, చెన్నై: విడాకుల నోటీసు పంపించిన భార్యను కిరాయి ముఠా ద్వారా హతమార్చి ప్రమాదంగా చిత్రీకరించేందుకు ప్రయత్నించిన ఓ భర్త కిరాతకం తిరువారూర్లో వెలుగు చూసింది. కిడారి కొండం గ్రామానికి చెందిన చిదంబరం కుమార్తె జయభారతికి ఆరేళ్ల క్రితం తంజావూరు జిల్లా కుంభకోణంకు చెందిన విష్ణుప్రకాష్తో వివాహం అయింది. వీరికి ఓ పాప కూడా ఉంది. భర్త వేధింపులు తాళలేక ఏడాది క్రితం అతి కష్టమ్మీద అమెరికా నుంచి స్వగ్రామానికి చేరుకుంది. ఉద్యోగం చేసుకుంటూ తల్లిదండ్రులు, పాపను జయభారతి చూసుకుంటోంది. రెండు రోజుల క్రితం పని ముగించుకుని ఇంటికి స్కూటర్పై వస్తుండగా రోడ్డు ప్రమాదంలో మృతిచెందింది. బంధువుల ఫిర్యాదుతో పోలీసులు ఘటన జరిగిన ప్రాంతంలోని సీసీ కెమెరాలను పరిశీలించారు. ప్రమాదానికి కారణమైన వాహనం గంటల పాటు రోడ్డుపై ఆగి ఉండడం, జయభారతి వాహనాన్ని అతివేగంగా ఢీకొనడం దృశ్యాలను గుర్తించారు. విచారణలో తిరువారూర్లోని ఓ సంస్థ నుంచి కుంభకోణానికి చెందిన ఓ వ్యక్తి వాహనాన్ని అద్దెకు తీసుకెళ్లినట్టు తేలింది. అతడిని విచారించగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. నెలన్నర క్రితం జయభారతి విడాకుల నోటీసు పంపడంతో విష్ణుప్రకాష్ ఉద్యోగానికి ఎసరు తప్పలేదు. దీంతో కుంభకోణంలోని సమీప బంధువు ద్వారా కిరాయి ముఠాను సంప్రదించి జయభారతిని హతమార్చేందుకు పథకం రచించాడు. హత్య కేసుగా మార్చిన పోలీసులు విష్ణు ప్రసాద్ను ఇండియాకు పంపించాలని అమెరికాలోని భారత రాయభార కార్యాలయానికి సమాచారం పంపించారు. చదవండి: Tamil Nadu: కరోనాతో నర్సు మృతి -
బిడ్డతో తప్పుడు పనులంటూ అనుమానం, భార్య, మామ హత్య
టీ.నగర్: కుటుంబ తగాదాలో భార్య, మామను హతమార్చిన ఆటో డ్రైవర్ను శనివారం పోలీసులు అరెస్టు చేశారు. చెన్నై రాయపేట మహ్మద్ హుస్సేన్ వీధికి చెందిన ముసాఫర్ (80) కుమార్తె కౌవుసి నిషా (50)మొదటి భర్తను విడిచి రాయపేట యానైకుళానికి చెందిన ఆటో డ్రైవర్ అబ్దుల్ ఖాదర్ (42)ను పెళ్లి చేసుకుంది. మొదటి భర్త ద్వారా జన్మించిన కుమార్తె(21)తో ఒకే ఇంటిలో ఉంటోంది. కౌవుసి నిషా తన కుమార్తెను తప్పుడు మార్గంలో నడుపుతున్నట్లు అబ్దుల్ ఖాదర్ అనుమానించాడు. దంపతుల మధ్య తరచుగా గొడవలు ఏర్పడ్డాయి. కౌవుసి నిషా కుమార్తెతో రాయపేటలో ఉంటున్న తండ్రి ముసాఫర్ ఇంటికి చేరుకుంది. అబ్దుల్ ఖాదర్ అక్కడికి వెళ్లి గొడవకు దిగాడు. బీర్ బాటిల్తో ముసాఫర్పై దాడి చేశాడు. కత్తితో భార్య గొంతుకోశాడు. ఇద్దరూ మృతి చెందారు. జామ్ బజార్ పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాలను ఓమందూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అబ్దుల్ ఖాదర్ను అరెస్టు చేశారు. భార్య మృతిని తట్టుకోలేక.. టీ.నగర్: భార్య మృతిని తట్టుకోలేక భర్త మృతిచెందాడు. ఈ సంఘటన శివగంగై జిల్లాలో చోటుచేసుకుంది. దేవకోట్టై దండాయుధపాణి ఆలయం వీధిలో స్వామినాథన్ (90), సుందరాంబాళ్ (88) దంపతులు ఉంటున్నారు. వీరికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. ఇద్దరు కుమారులకు వివాహం కావడంతో వేర్వేరు ప్రాంతాల్లో నివసిస్తున్నారు. సుందరాంబాళ్ అనారోగ్యంతో శనివారం మధ్యాహ్నం మృతిచెందారు. ఈ విషాదాన్ని తట్టుకోలేక భర్త స్వామినాథన్ ఆదివారం తెల్లవారుజామున మృతిచెందారు. భార్యాభర్తలు ఒకేరోజున మృతిచెందడం విషాదాన్ని నింపింది. చదవండి: నా కుటుంబాన్ని కూడా చంపేందుకు చూస్తున్నారు -
అనుమానం: ఫోన్ మాట్లాడుతుందని భార్యను కొట్టి చంపాడు
సాక్షి, సంగారెడ్డి: జిల్లాలోని పటాన్చెరు మండలం రుద్రారం గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. ఓ వ్యక్తి అనుమానంతో తన భార్యను కొట్టి చంపాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పటాన్చెరు మండలంలోని రుద్రారం గ్రామంలో రమేష్, స్వప్న దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే గత కొంతకాలంగా తన భార్య స్వప్న తరచూ అర్ధరాత్రి వేరేవాళ్లతో ఫోన్లో మాట్లాడుతుందని భర్త రమేష్ అనుమానం పెంచుకున్నాడు. సోమవారం రాత్రి కూడా అదే అనుమానంతో రమేష్ తన భార్య స్వప్నను త్రీవంగా కొట్టాడు. అనంతరం అదే గ్రామంలో ఉన్న స్వప్న తల్లిదండ్రులకు ఆమె ఆనారోగ్యంగా ఉందని తమ ఇంటికి రావాలని తెలిపాడు. స్వప్న తల్లిదండ్రులు అక్కడికి వచ్చి చూడగా ఆమె అపస్మరక స్థితిలో కనిపించింది. వెంటనే స్వప్నను ఆస్పత్రికి తరలించారు. కానీ ఆమె అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. స్వప్నను తీవ్రంగా కొట్టాడని, ఆ దెబ్బలు తట్టుకోలేకనే మరణించిందని ఆమె బంధువులు రమేష్పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. భర్త రమేష్ను పోలీసుల అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేసున్నారు. స్వప్న మృతితో రుద్రారం గ్రామంలో విషాద చాయలు అలుముకున్నాయి. చదవండి: రా‘బంధువులు’: వివాహితను నగ్నంగా వీడియో తీసి.. -
పెళ్లయిన 43వ రోజు భార్య గొంతు కోసి దారుణ హత్య
సాక్షి, చెన్నై: నిండు నూరేళ్లు సాగాల్సిన ఓ కొత్త జంట జీవితంలో అనుమానం పెనుభూతం అయింది. పెళ్లైయి 43వ రోజే ఆ భర్త కిరాతకుడయ్యాడు. భార్య గొంతు కోసి హతమార్చి, తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. సేలం జిల్లా వీరాణం ఒరత్తరు పట్టికి చెందిన తంగరాజ్(33) రైతు, కేబుల్ ఆపరేటర్. కన్నంకురిచ్చి గ్రామానికి చెందిన మోనీషా(19)తో 43 రోజుల క్రితం తంగరాజ్కు వివాహమైంది. తన ఎకరం పొలంలో వద్దే ఇంటిని నిర్మించుకుని ఉన్నాడు. ఈ పరిస్థితుల్లో బుధవారం ఉదయం వీరి ఇంటి తలుపు ఎంతకు తెరుచుకోలేదు. దీంతో బంధువులు తలుపు పగులకొట్టి లోనికి వెళ్లారు. అక్కడ గొంతు కోసి హతమార్చిన స్థితిలో మోనీసా, కేబుల్ వైర్కు ఉరిపోసుకుని తంగరాజ్ వేళాడుతుండడంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలిసి సంఘటన స్థలానికి చేరుకున్న వీరానం పోలీసులు మృతదేహాల్ని పోస్టుమార్టానికి తరలించారు. పోలీసుల విచారణలో గత నెల 24వ తేదీన మోనీషా అత్త మోహన కుమారుడు ఇంటికి వచ్చి వెళ్లినట్టు తేలింది. ఆ రోజున తన బర్త్డే సందర్భంగా కేక్ ఇవ్వడానికి అత్త కుమారుడు వచ్చినా, తంగరాజ్ మాత్రం అనుమానంతో వేధించడం మొదలెట్టాడు. అలాగే, మోనీషా సోదరి, అత్త మోహన మరో కుమారుడితో చెట్టా పట్టాలు వేసుకుని తిరుగుతుండడాన్ని చూసిన తంగరాజ్లో అనుమానం పెనుభూతమై కూర్చుంది. ఈ అనుమానంతోనే భ్యార మోనీషాను గొంతు కోసి హతమార్చి ఉంటాడని పోలీసులు పేర్కొన్నారు. ముందుగా తంగరాజ్ విషం తాగి, ఆ తర్వాత ఉరి వేసుకున్నట్టు విచారణలో వెలుగు చూసిందని వీరాణం పోలీసులు పేర్కొన్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: రాసలీలల వీడియో.. ఆమెను సస్పెండ్ చేశారు! -
సంతానం కలగడం లేదని.. భార్యను!
సాక్షి, నల్గొండ : సంతాన భాగ్యం కలగడం లేదని ఓ భర్త కిరాతకానికి తెగబడ్డాడు. ఆదమరచి నిద్దరోతున్న భార్యపై పెట్రోల్ పోసి, నిప్పంటించి మట్టుబెట్టాడు. ఈ దారుణ ఘటన జిల్లా కేంద్రం శివారులో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణ శివారు అక్కలాయిగూడేనికి చెందిన పరశురామ్ మున్సిపాలిటీలో జవాన్గా ఉద్యోగం చేస్తున్నాడు. ఇతడికి చిట్యాల మండలం తాళ్లవెల్లెంలకు చెందిన జ్యోతితో 14ఏళ్ల క్రితం వివా హం జరిగింది. వీరికి పిల్లలు పుట్టకపోవడంతో దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఆదివారం రాత్రి కూడా ఇదే విషయమై భార్యభర్తల మధ్య గొడవ జరిగింది. రాత్రి పూటుగా మద్యం తాగిన పరశురామ్ తెల్లవారుజామున నిద్దరోతున్న భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించి పరారయ్యాడు. పరశురామ్ ఇంటినుంచి పొగ వస్తుండడంతో చుట్టు పక్కల వారు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వన్టౌన్ సీఐ సురేష్ ఆధ్వర్యంలో పోలీసులు ఘటన స్థలాన్ని చేరుకునేలోపే జ్యోతి మృతిచెందింది. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. నిందితుడు పరారీలో ఉన్నాడని, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. చదవండి: నోయిడాలో ఉద్యోగం.. స్వగ్రామానికి వచ్చి లాడ్జిలో.. వివాహేతర సంబంధం: మెడ నొక్కి.. పెట్రోల్ పోసి! -
నవ్యరెడ్డి హత్య: కీలక విషయాలు వెల్లడి
సాక్షి, ఖమ్మం: వివాహిత నవ్యరెడ్డి హత్య కేసులో ఎర్రుపాలెం ఎస్ఐ కీలక విషయాలను వెల్లడించారు. ప్రియురాలిపై మోజుతోనే భార్య నవ్యరెడ్డి ఆమె భర్త నాగశేషురెడ్డి హత్య చేశాడని తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నిందితుడిని కోర్టులో హజరుపరిచి రిమాండ్కు తరలించినట్లు పేర్కొన్నారు. నిందితుడు నాగ శేషురెడ్డి పెగళ్లపాడు గ్రామానికి చెందిన ఓ యువతితో ఏడాదిగా వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడని పేర్కొన్నారు. చదవండి: ఖమ్మం జిల్లాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఘాతుకం వివాహేతర సంబంధంపై భర్తను భార్య నవ్యరెడ్డి నిలదీయటంతో నిందితుడు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు వెల్లడించారు. ఎలాగైనా భార్యను చంపి, ప్రియురాలితో వెళ్లిపోవాలని నిర్ణయించుకున్న నాగ శేషురెడ్డి ఈనెల 2న భార్య నవ్యను సత్తుపల్లి సమీపంలోని ఇంజినీరింగ్ కళాశాల వద్ద దింపి వస్తానని ద్విచక్ర వాహనంపై తీసుకెళ్లాడు. ముందే వేసుకున్న ప్లాన్ ప్రకారం కూల్ డ్రింక్లో నిద్ర మాత్రలు వేసి తాగించాడు. అనంతరం పెనుబల్లి మండలం కొత్తలంకపల్లి గ్రామ సమీపంలోని కుక్కలగుట్ట వద్దకు తీసుకెళ్లి చున్నీతో ఉరేసి హత్య చేశాడని ఎర్రుపాలెం ఎస్ఐ వివరించారు. నిందితుడిని మధిర కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించామని తెలిపారు. హత్య కేసులో ఇంకా లోతుగా దర్యాప్తు కొనసాగుతుందని పేర్కొన్నారు. -
కాపురానికి తీసుకెళ్లిన రాత్రే దారుణం..
సాక్షి, కొడవలూరు: ఒకరినొకరు ఇష్టపడ్డారు. ప్రేమించుకున్నామని చెప్పి పెద్దలను ఒప్పించారు. కులాలు వేరైనా తల్లిదండ్రులు అంగీకరించి వారిద్దరికీ వివాహం చేశారు. రెండు నెలలు భార్యతో కాపురం చేసిన భర్త ఆ తరువాత నుంచి ఆమెపై అనుమానం పెంచుకుని దూరంగా ఉంటున్నాడు. తాను మారానని భార్యను బాగా చూసుకుంటానని పెద్దలను ఒప్పించి కాపురానికి తీసుకెళ్లిన రాత్రే ఆమె గొంతు కోసి అతి కిరాతకంగా హత్య చేసి పరారయ్యాడు. ఈ ఘటన కొడవలూరు మండలం ఎన్టీఆర్ నగర్లో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసుల వివరాల మేరకు..బుచ్చిరెడ్డిపాళెం మండలం పల్లాప్రోలు వడ్డిపాళేనికి చెందిన కోడి హరికృష్ణ కోవూరులోని ఓ స్వీట్ దుకాణంలో పని చేస్తున్నాడు. కొడవలూరు మండలం గండవరం శివపురం గిరిజన కాలనీకి చెందిన గడ్డం స్రవంతి(19) నార్తురాజుపాళెంలోని ఓ స్వీట్ దుకాణంలో పని చేస్తోంది. ఇరువురు ఇష్టపడి ప్రేమించుకున్నారు. ఈ విషయం స్రవంతి తన తల్లిదండ్రులు పద్మ, రమణయ్యకు తెలుపగా, కులాలు వేరైనా వారు అంగీకరించారు. గతేడాది జూన్ 10న పల్లాప్రోలు రామాలయంలో ఇద్దరికీ వివాహం చేశారు. వివాహం జరిగిన తరువాత రెండ్రోజులు మాత్రం స్రవంతిని పల్లాప్రోలులో ఉంచిన హరికృష్ణ ఆషాడ మాసం పేరుతో మరుసటి రోజు పుట్టింట్లో వదిలేశాడు. రెండు నెలలు వస్తూపోతూ, ఆ తరువాత ఆమెపై అనుమానం పెంచుకుని రావడం మానేశాడు. పెద్దలను ఒప్పించి తీసుకెళ్లి హతం నాలుగు నెలలుగా పుట్టింట్లో ఉంటున్న స్రవంతికి ఫోన్ కూడా చేయని హరికృష్ణ భార్యను ఎలాగైనా అంతమొందించాలని పన్నాగం పన్నాడు. స్రవంతి పెద్దమ్మ తలపల కృష్ణమ్మ బుచ్చిరెడ్డిపాళెం మండలం కొట్టాలులో ఉంటోంది. అక్కడికి ఈ నెల 27న స్రవంతి తల్లిదండ్రులతో కలిసి వెళ్లింది. ఈ విషయం తెలుసుకున్న హరికృష్ణ శుక్రవారం రాత్రి అక్కడికి వెళ్లాడు. తన భార్యను కాపురానికి పంపిస్తే బాగా చూసుకుంటానని పెద్దల సమక్షంలో చెప్పి నమ్మించాడు. అందుకు అంగీకరించిన తల్లిదండ్రులు అప్పటికే బాగా పొద్దుపోవడంతో ఆ సమయంలో పల్లాప్రోలుకు వద్దని చెప్పారు. కొడవలూరు మండలం ఎన్టీఆర్నగర్లోని స్రవంతి అక్క దాసరి ఇందిర ఇంటి తాళాలు ఇచ్చి రాత్రి అక్కడ ఉండి శనివారం ఉదయం వెళ్లాలని సూచించారు. ఇదే అదనుగా భావించిన హరికృష్ణ ఎన్టీఆర్ నగర్లోని ఇందిర ఇంటికి భార్యతో వచ్చి అర్ధరాత్రి సమయంలో ఆమె గొంతు కోసి హతమార్చి పరారయ్యాడు. కొట్టాలులోనే స్రవంతి తల్లిదండ్రులతో కలిసి ఉన్న ఇందిర శనివారం ఉదయం ఎన్టీఆర్ నగర్లోని ఇంటికి వచ్చి చూడగా బయట గడి పెట్టి ఉంది. అనుమానంతో గడి తీసి లోపల చూడగా స్రవంతి అతి కిరాతకంగా హత్యకు గురై ఉంది. దిగ్భ్రాంతికిలోనైన ఆమె పోలీసులకు సమాచారం అందించారు. కోవూరు సీఐ కే రామకృష్ణారెడ్డి, కొడవలూరు ఎస్సైలు పీ శ్రీనివాసులురెడ్డి, జీ.సుబ్బారావు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
భార్య దారుణ హత్య.. భర్త ఏమయ్యాడు..!
సాక్షి, మార్టూరు : మండలంలోని లక్కవరం గ్రామానికి చెందిన వివాహిత దారుణహత్యకు గురైంది. పోలీసులు, సమీప బంధువుల తెలిపిన వివరాల ప్రకారం..లక్కవరం ఎస్సీ కాలనీకి చెందిన మద్దుమాల పద్మ(38), భాస్కర్రావు భార్యభర్తలు. ఉన్నత విద్యావంతులైన వీరు కనిగిరిలో ప్రైవేట్ స్కూల్లో గత కొన్నేళ్లుగా ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. లాక్డౌన్ కారణంగా స్వగ్రామంలో ఉంటూ విద్యార్థులకు ఆన్లైన్ తరగతులు చెబుతున్నారు. ఈ క్రమంలో వీరిద్దరూ శుక్రవారం సాయంత్రం యద్దనపూడి మండలంలోని పూనూరులో బంధువుల ఇంటికి వెళ్లి తిరిగి స్వగ్రామం బయలుదేరి రాత్రికి ఇంటికి చేరుకోలేదు. కంగారు పడిన బంధువులు అదే రోజు రాత్రి మార్టూరు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సెల్ఫోన్ సిగ్నల్ ద్వారా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో కోనంకి, లక్కవరం గ్రామాల మధ్య పంట కాలువలో గుర్తు తెలియని మహిళ మృతదేహం పడి ఉన్నట్లు శనివారం ఉదయం స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సిబ్బందితో ఘటనా స్థలికి వెళ్లి పరిశీలించిన ఎస్సై శివకుమార్ మహిళ మృతదేహం శుక్రవారం రాత్రి కన్పించకుండా పోయిన పద్మదిగా గుర్తించి బంధువులకు సమాచారం అందించారు. అనంతరం శనివారం రాత్రి మార్టూరు ప్రభుత్వాసుపత్రికి తరలించిన పద్మ మృతదేహానికి ఆదివారం పోస్టుమార్టం చేశారు. ఆచూకీ లేని భర్త ఇదిలా ఉండగా భార్య పద్మతో కలిసి ప్రయాణించిన భర్త భాస్కరరావు ఆచూకీ ఇంత వరకు తెలియకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. భాస్కరరావు అనుమానంతో భార్య పద్మను తరచూ వేధిస్తూ ఉండేవాడని, అతడే చంపి ఉంటాడని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. మృతురాలికి కుమారుడు ఉన్నారు. పోస్టుమార్టం నివేదిక, భాస్కరరావు ఆచూకీ తెలిస్తే గానీ హత్యకు గల కారణాలు చెప్పలేమని పోలీసులు అంటున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. చీరాల డీఎస్పీ వేణుగోపాల్ సోమవారం సాయంత్రాన్ని సంఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సెల్ఫీ వీడియో పెద్దదోర్నాల: ఆత్మహత్య చేసుకుంటున్నామంటూ సెల్ఫీ వీడియో తీసుకున్న తండ్రీ కొడుకులను ఎట్టకేలకు పోలీసులు అదుపులోనికి తీసుకోవటంతో ఇరు రాష్ట్రాల పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ సంఘటన ఆదివారం జరిగింది. వివరాల్లోకి వెళితే.. తెలంగాణ రాష్ట్రంలోని అచ్చంపేటకు మండలం అంకురోనిపల్లెకు చెందిన హరిశంకర్ నాయక్ తన ఇద్దరు కుమారులతో కలిసి ఆత్మహత్య చేసుకుంటున్నాంటూ హైదరాబాద్ రోడ్డులోని మన్ననూర్ వద్ద అటవీ ప్రాంతంలో ఆత్మహత్య చేసుకుంటున్నట్లు శనివారం సెల్ఫీ వీడియోను ఫేస్బుక్, వాట్సప్లలో అప్లోడ్ చేశాడు. దీంతో తెలంగాణ పోలీసులు శనివారం నుంచి వీరి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. పోలీసులు అదుపులోనికి తీసుకున్న తండ్రీ కొడుకులు తెలంగాణలోని దోమలపెంట, ఈగలపెంట తదితర ప్రాంతాలతో పాటు శ్రీశైలం, సుండిపెంట పరిసరాల ప్రాంతాల్లో నిఘా ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో తెలంగాణలోని ఈగలపెంటకు చెందిన ఎస్సై సమాచారం మేరకు పెద్దదోర్నాల ఎస్సై హరిబాబు సైతం వీరి ఆచూకీ కోసం మండల పరిధిలోని చిన్నారుట్ల, శిఖరం తదితర ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి ఇద్దరు బాలురతో కలిసి తుమ్మలబైలు వద్దకు వచ్చి వెనుదిరిగి వెళ్లినట్లు తమ్మలబైలుకు చెందిన గిరిజనులు పోలీసులకు సమాచారమందించారు. దీంతో తెలంగాణ నుంచి వచ్చిన పోలీసులు కాల్ డేటా ఆదారంతో హరిశంకర్ నాయక్తో పాటు ఇద్దరి కుమారులను మండల పరిధిలోని శిఖరం, చిన్నారుట్ల మధ్యలో అదుపులోనిని తీసుకున్నారు. కుటుంబ కలహాల నేపథ్యంలోనే ఆత్మహత్యకు పాల్పడేందుకు అటవీ ప్రాంతంలోకి వచ్చి ఉంటాడని పోలీసులు పేర్కొంటున్నారు. -
ప్రియుడిపై మోజుతో...!
సాక్షి, ప్రొద్దుటూరు క్రైం : పోలీసులు, కుటుంబ సభ్యుల అనుమానమే నిజమైంది. ప్రియుడితో కలిసి కట్టుకున్న భర్తను భార్య హత్య చేసింది. ఈ కేసుకు సంబంధించిన నిందితులను మంగళవారం రూరల్ పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన మేరకు... ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం సంజీవరాయునిపేటకు చెందిన కడియాల చంద్రశేఖర్ ఆచారి మూడేళ్ల నుంచి ప్రొద్దుటూరులోని అమృతానగర్లో నివాసం ఉంటున్నాడు. అతనికి భార్య మహాలక్ష్మి, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ప్రొద్దుటూరులో కార్పెంటర్ పనికి వెళుతూ భార్యా, పిల్లలను పోషించేవాడు. ఈ క్రమంలో గత ఏడాది అక్టోబర్ 28న చంద్రశేఖర్ ఆచారి చనిపోయాడు. ఈ విషయాన్ని మహాలక్ష్మి తన అత్తా మామలకు తెలిపి మృతదేహాన్ని స్వగ్రామమైన సంజీవరాయునిపేటకు తరలించింది. చంద్రశేఖర్ ఆచారి తల్లిదండ్రులు, మహాలక్ష్మి బంధువులు కలిసి మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. గ్రామ శివారులో శవాన్ని ఖననం చేశారు. రెండు నెలల పాటు గ్రామంలో ఉన్న మహాలక్ష్మి తర్వాత కనిపించలేదు. చంద్రశేఖర్ ఆచారి తల్లిదండ్రులు ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ అని వస్తోంది. దీంతో మహాలక్ష్మి మామ వెంకటసుబ్బయ్య కోడలిని వెతుక్కుంటూ ప్రొద్దుటూరుకు వచ్చాడు. అమృతానగర్లో ఆమె కోసం ఆరా తీయగా ఆచూకీ లభించలేదు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో అతను మైదుకూరు మండలం జీవీ సత్రంకు వెళ్లాడు. అక్కడ మహాలక్ష్మి రామకృష్ణ ఆచారి అనే వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నట్లు వెంకటసుబ్బయ్య గమనించాడు. వారిద్దరిని చూసిన వెంటనే కుమారుడి మరణంపై అతనికి అనుమానం కలిగింది. దీంతో అతను స్వగ్రామానికి వెళ్లి కుటుంబ సభ్యులతో కలిసి జరిగిన విషయాన్ని తెలిపాడు. కొన్ని రోజుల తర్వాత రూరల్ పోలీస్స్టేషన్కు వచ్చి అతను ఫిర్యాదు చేశాడు. తన కుమారుడి మరణంపై అనుమానం ఉందని, కోడలే హతమార్చి ఉంటుందని ఫిర్యాదులో పేర్కొన్నాడు. వారి ఫిర్యాదు మేరకు ఈనెల 3న రూరల్ ఎస్ఐ సునీల్రెడ్డి సంజీవరాయునిపేటకు వెళ్లి చంద్రశేఖర్ ఆచారి శవానికి పంచనామా నిర్వహించారు. ముగ్గురు కలిసి... ఈ సంఘటనకు సంబంధించి కేసు నమోదు చేసిన రూరల్ సీఐ విశ్వనాథరెడ్డి లోతుగా దర్యాప్తు చేశారు. వారు ఉపయోగించిన ఫోన్ నంబర్లు ఆధారంగా ఈ హత్య కేసులో మరొకరి పాత్ర ఉన్నట్లు నిర్ధారించారు. ఈ క్రమంలో మంగళవారం రామకృష్ణ ఆచారి, మహాలక్ష్మిలను రూరల్ పోలీసులు అరెస్టు చేశారు. చంద్రశేఖర్ ఆచారిని అడ్డు తొలగించాలనే ఉద్దేశంతోనే గత ఏడాది అక్టోబర్ 28న అర్ధరాత్రి హతమార్చినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. అతను నిద్రిస్తున్న సమయంలో రామకృష్ణ ఆచారి, మహాలక్ష్మిలు మురళీ అనే వ్యక్తితో కలిసి దిండు మొహంపై పెట్టి చంపేసినట్లు అంగీకరించారు. వారిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచినట్లు సీఐ తెలిపారు. -
వెడ్డింగ్ పార్టీలో డ్యాన్స్ : భార్యను కడతేర్చిన భర్త
పట్నా : వివాహ వేడుకలో అతిధులతో కలిసి డ్యాన్స్ చేయడమే భార్య ప్రాణాల మీదకు తెచ్చింది. బిహార్లోని పట్నా జిల్లా హసది ముషారి ప్రాంతంలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. ఖోరంగ్పూర్ గ్రామానికి చెందిన రంజిత్ మాంఝీ భార్య మునియా దేవి హసదిలోని తన తల్లితండ్రుల వద్దకు పదిరోజుల కిందట పిల్లలతో కలిసి వచ్చారు. ఓ వివాహానికి హాజరయ్యేందుకు ఆమె భర్త కూడా మూడు రోజుల కిందట అత్తగారింటికి చేరుకున్నాడు. సోమవారం రాత్రి పెళ్లి వేడుకలో భర్త, పిల్లలతో కలిసి మునియా కూడా పాల్గొన్నారు. ఇక డీజేకు అనుగుణంగా వెడ్డింగ్ పార్టీలో అతిధులతో కలిసి మునియా డ్యాన్స్ వేయడం భర్త రంజిత్ మాంఝీకి ఆగ్రహం కలిగించింది. అందరి ఎదుటే భార్యను చితకబాదిన మాంఝీ ఆ తర్వాత ఆమెను పశువుల పాకలోకి తీసుకువెళ్లి ఊపిరిఆడకుండా చేసి ప్రాణం తీశాడు. ఘటనా స్ధలంలోనే భార్య మునియా మరణించగా నిందితుడు పరారయ్యాడు. -
నిన్న ప్రేమించి..నేడు చంపేసి!
ప్రకాశం జిల్లా / సింగరాయకొండ: రైలులో కలిశాడు. మాటలతో మైమరిపించాడు. నీవు లేనిదే బతకలేనన్నాడు. చివరకు పెద్దలకు ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత తన భర్తకు తాను రెండో భార్యనని తెలిసి ఆ అభాగ్యురాలు విలపించింది. అయినా భర్త అండగా ఉన్నాడనుకుంది.. కానీ ఆ భర్తే చివరకు డబ్బు కోసం చంపి ఆత్మహత్య చేసుకున్నట్లు నమ్మించే ప్రయత్నం చేసి కటకటాలపాలయ్యాడు. ఈ సంఘటన మండలంలోని సోమరాజుపల్లి పంచాయతీ ఆవులవారిపాలెంలో శనివారం రాత్రి జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలం బండి గ్రామానికి చెందిన అంగూరు మోహన్రావు, సావిత్రి దంపతులు బతుకుదెరువు కోసం 15 ఏళ్ల క్రితం హైదరాబాద్లోని సనత్నగర్ వచ్చి అక్కడే నివాసం ఉంటూ కూరగాయల వ్యాపారం చేసుకుంటూ జీవిస్తున్నారు. వీరికి హేమలత (19)తో పాటు కొడుకు ఉన్నారు. చదువులో రాణిస్తున్న హేమలతను డిగ్రీ వరకు చదివించి కానిస్టేబుల్ ట్రైనింగ్కు కూడా పంపించారు. ప్రేమలో పడిన హేమలత ఏడాది క్రితం హేమలత చెన్నైలోని తన బంధువుల ఇంటికి వెళ్లి తిరుగు ప్రయాణంలో హైదరాబాద్ వస్తోంది. సింగరాయకొండ మండలం పాకల ఆదిఆంధ్ర కాలనీకి చెందిన ఎల్లూరి అనిల్ ఆమెకు తారసపడ్డాడు. అనిల్ హైదరాబాద్లో బేల్దారి మేస్త్రిగా పనిచేస్తున్నాడు. ఇద్దరి మధ్య స్నేహం ఏర్పడి చివరకు ప్రేమగా మారింది. తర్వాత ఒకరోజు హేమలత ఇంట్లో నుంచి పారిపోయి అనిల్ను వివాహం చేసుకుంది. అప్పుడు హేమలత తల్లిదండ్రులు సనత్నగర్ పోలీసుస్టేషన్లో కుమార్తె కనబడటం లేదని ఫిర్యాదు కూడా చేశారు. ఆ తర్వాత పోలీసులు ఆ ఫిర్యాదును పట్టించుకోలేదని హేమలత తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. చివరకు వారిద్దరు మేజర్లు కావడంతో తామేమీ చేయలేమని పోలీసులు తల్లిదండ్రులకు చెప్పి పంపించారు. ఆ తర్వాత వివాహం చేసుకుని వచ్చిన కుమార్తెను ఆదరించి ఇంట్లో ఉంచుకున్నారు. రెండు నెలలు ఇంట్లో ఉన్న తర్వాత భార్యను తన స్వగ్రామం పాకల ఇంటికి తీసుకెళ్లాడు. బయట పడిని మోసం పాకల వచ్చిన హేమలతకు తన భర్త అనిల్ చేసిన మోసం తెలిసేసరికి అప్పటికే సమయం దాటిపోయింది. అప్పటికే ఆమె గర్భిణి. అనిల్ తన బంధువుల అమ్మాయిని మొదట పెళ్లి చేసుకున్నాడని తెలిసి హతాశురాలైంది. చేసేది లేక భర్తనే నమ్ముకుంది. మొదటి భార్య తల్లిదండ్రులు అనిల్ను తమ బిడ్డ సంగతేంటని నిలదీయడంతో మీ అమ్మాయికి విడాకులిస్తానని చెప్పాడు. అనిల్ తల్లి ఎలీసమ్మ తన ఇల్లు తాకట్టు పెట్టి రూ.50 వేలు అప్పు చేసి ఇచ్చి పెద్ద కోడలితో సంబంధాన్ని తెగతెంపులు చేసుకుంది. వారం క్రితం ఆవులవారిపాలెంలో మకాం హేమలత ఇటీవల పండంటి కుమారుడిని ప్రసవించింది. పుట్టిన బిడ్డకు పసికర్లు అని బాక్స్లో పెట్టటంతో ఖర్చుల కోసం హేమలత తన తండ్రిని ప్రాధేయపడగా ఖర్చుల కోసం రూ.14 వేలు పంపించాడు. అంతేగాక తల్లి సావిత్ర కూడా మరో రూ.20 వేలు ఇచ్చింది. వారం క్రితం హేమలత అత్త ఎలీసమ్మ తన కొడుకు, కోడలిని అవులవారిపాలెంలో ఇల్లు తీసుకుని వారితో కాపురం పెట్టించింది. ఆత్మహత్యగా సృష్టించే ప్రయత్నం శనివారం రాత్రి 8 గంటల సమయంలో అనిల్ తన అత్త సావిత్రికి ఫోన్ చేసి 2 లక్షలు కావాలని డిమాండ్ చేశాడు. తర్వాత ఇంటి నుంచి బయటకు వెళ్తూ పక్కింటి వారు ముగ్గు వేస్తున్నారని, నీవు కూడా ముగ్గు వేయమని బయట నుంచి కేకవేసి వెళ్లాడని, ఆ తర్వాత అరగంట ద్వారా తిరిగి వచ్చి తన భార్య చీరెతో దూలానికి ఉరేసుకుని చనిపోయిందని నమ్మించే ప్రయత్నం చేశాడు. హత్యేనంటున్న హేమలత తల్లిదండ్రులు తన అల్లుడు 8 గంటలకు డబ్బు కావాలని ఫోన్ చేశాడని, మళ్లీ 9 గంటలకు ఫోన్ చేసి హేమలత చనిపోయిందని చెప్పాడని, ఇది ముమ్మాటికీ హత్యేనని ఆరోపించారు. తన అల్లుడి కారణంగా మనుమడి భవిష్యత్తు ఏమిటని, కేవలం 15 నెలల పిల్లాడేనని, ఏం చేయాల్లో అర్థం కావటం లేదని హేమలత తల్లిదండ్రులు విలపించటం స్థానికులను కలచివేసింది. ఈ కేసును విచారిస్తున్న సీఐ ఓ.దుర్గాప్రసాద్, ఎస్ఐ వి.నాగమల్లేశ్వరరావు మాత్రం హేమలత మెడపై గాయాలున్నాయని, ఇది ముమ్మాటికి హత్యేనని అనుమానిస్తున్నామన్నారు. -
అక్రమ సంబంధం; నమ్మించి తోసేశాడు
గురుగ్రామ్ : అక్రమ సంబంధానికి అడ్డుగా ఉందని ఓ వ్యక్తి కట్టుకున్న భార్యను మేడపై నుంచి తోసి చంపేశాడు. అనంతరం ప్రమాదవశాత్తు కింద పడిందని పోలీసులతో నమ్మబలికాడు. ముమ్మర దర్యాప్తు చేసిన పోలీసులు ఆమె చావుకు కారణమైన భర్తను, అతని ప్రియురాలిని అరెస్టు చేశారు. ఈ ఘటన గురుగ్రామ్లోని ‘వాలీ వ్యూ ఎస్టేట్’ అపార్ట్మెంట్లో గత అక్టోబర్, 27న చోటుచేసుకుంది. వివరాలు.. దీపికా చౌహన్ (32), విక్రం చౌహన్ (35) భార్యభర్తలు. వీరికి నాలుగేళ్ల పాప, 5 నెలల బాబు ఉన్నారు. అయితే, గత కొంత కాలంగా విక్రం ఎదురు ఫ్లాట్స్లో ఉండే షెఫాలి భాసిన్తో అక్రమ సంబంధం కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలో భార్యభర్తల మధ్య తరచూ గొడవలు జరుగేవి. ఘటన జరిగిన రోజు సాయంత్రం విక్రం దీపికా మరోమారు గొడవపడ్డారు. ‘నీ వ్యవహారాలు నచ్చడం లేదు. నన్నూ.. నా పిల్లల్ని అన్యాయం చేయొద్దు. ఇప్పుడే వెళ్లి భాసిన్ అంతు చూస్తా’ అని దీపిక హెచ్చరించింది. దీంతో తన అక్రమ సంబంధం ‘చెడిపోతుంది’ అని భావించిన విక్రం తన భార్యను హతమార్చాలని పథకం రచించాడు. మంచిగా నటించి ఆ రోజు రాత్రి 9 గంటల ప్రాంతంలో దీపికతో బాల్కనీలో కాసేపు ముచ్చటించాడు. ఆమెను నమ్మించి ఒక్కసారిగా 8 అంతస్తుల ఎత్తు నుంచి కిందకు తోసేశాడు. తీవ్ర గాయాలపాలైన దీపిక ఆస్పత్రికి తరలించేలోపే మరణించిందని పోలీసులు తెలిపారు. కాగా, ఈ హత్యలో విక్రమ్కి సహకరించాడనే అనుమానంతో మరోవ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నట్టు డీఎల్ఎఫ్ ఫేజ్-1 పోలీస్స్టేషన్ ఎస్హెచ్ఓ సంజీవ్ కుమార్ వెల్లడించారు. -
భర్త ఆత్మహత్యతో బయటపడిన భార్య హత్య
హైదరాబాద్: భార్యాభర్తల మధ్య జరిగిన గొడవలతో మనస్తాపం చెందిన ఓ బ్యాంక్ ఉద్యోగి ఏడు నెలల గర్భవతి అయిన భార్యను దారుణంగా హతమార్చాడు. ఆ తరువాత భార్య మృతదేహాన్ని బెడ్రూమ్లోనే ఉంచి, ఇంటికి తాళం వేసి, రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. నల్లగొండ జిల్లా కేతేపల్లికి చెందిన బయ్య లింగమల్లమ్మ, సర్వయ్య దంపతుల కుమార్తె సుమలత(25)కు మిర్యాలగూడకు చెందిన ఎం.మలయాద్రి కుమారుడు మేకల మాధవ్ (30)తో కిందటేడాది అక్టోబర్ 5న వివాహం జరిగింది. ఆ సమయంలో అల్లుడు మాధవ్కు రూ.6 లక్షల నగదు, మూడు తులాల బంగారు ఆభరణాలు కట్నంగా ఇచ్చారు. వివాహం అయిన కొంతకాలం వీరి కాపురం సజావుగా నడిచింది. భార్య మెడ చుట్టూ చున్నీ బిగించి.. నల్లకుంట సిండికేట్ బ్యాంక్లో ఉద్యోగం చేస్తున్న మేకల మాధవ్ శంకరమఠం ఎదురు వీధిలో గల ఆరో విల్లా అపార్ట్మెంట్ మూడో అంతస్తులోని ఫ్లాట్ నంబర్ 303లో అద్దెకు దిగాడు. ఏడు నెలల గర్భవతి అయిన సుమలత గత కొంతకాలంగా పుట్టింట్లోనే ఉంటూ ఈ నెల 16న తల్లితో కలసి భర్త వద్దకు వచ్చింది. తల్లి ఈ నెల 18న సాయంత్రం కుమార్తెను ఇక్కడే వదిలి స్వగ్రామానికి వెళ్లిపోయింది. ఇంట్లో జరిగిన విషయాలకు మనస్తాపం చెందిన మాధవ్ శనివారం మధ్యాహ్నం భార్య సుమలత మెడ చుట్టూ చున్నీతో బిగించి హత్య చేశాడు. ఆ తరువాత ఆమె మృతదేహాన్ని బెడ్రూమ్లోనే ఉంచి, ఇంటికి తాళం వేసి సమీపంలో ఉన్న రైలు పట్టాలపైకి వెళ్లి.. నడుస్తున్న రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుకుని ఘటనా స్థలానికి చేరుకున్న రైల్వే పోలీసులు.. మృతుని ఐడీ కార్డు ఆధారంగా వివరాలు తెలుసుకుని అతని తల్లిదండ్రులకు సమాచారం అందించారు. భర్త ఆత్మహత్యతో బయటపడిన భార్య హత్య మాధవ్ తండ్రి మలయాద్రి శనివారం సాయంత్రం 4.30కి వియ్యంకురాలు లింగమల్లమ్మకు ఫోన్ చేసి తన కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పారు. వెంటనే లింగమల్లమ్మ కుమార్తెకు ఫోన్ చేయగా స్పందన లేదు. దీంతో అనుమానం వచ్చిన లింగమల్లమ్మ బంధువులతో కలసి రాత్రి 8.30 గంటలకు నల్లకుంటలో కుమార్తె నివాసముంటున్న ఇంటి వద్దకు చేరుకుంది. ఇంటికి తాళం వేసి ఉండటంతో.. పోలీసుల సమక్షంలో తాళం పగులగొట్టి చూడగా సుమలత బెడ్రూమ్లో విగత జీవిగా పడి ఉంది. ఆదివారం మధ్యాహ్నం పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. నల్లకుంట సీఐ వి.యాదగిరిరెడ్డి కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
పరాయిగడ్డపై భార్యను కడతేర్చాడు..
లండన్ : బ్రిటన్లో భారత సంతతికి చెందిన వారిద్దరూ ప్రేమించి పెళ్లాడారు..అన్యోన్య దాంపత్యంతో పరాయిగడ్డపైనా పలువురి మన్నన పొందారు. ఇంతలోనే వారి కాపురంలో ఏం కల్లోలం చెలరేగిందో కట్టుకున్న భార్యనే కడతేర్చాడు. లండన్లో ఫార్మసీ దుకాణాన్ని నిర్వహిస్తున్న జెస్సికా పటేల్ను భర్త మితేష్ పటేల్ దారుణంగా హతమార్చినట్టు పోలీసులు అభియోగం నమోదు చేశారు. 34 సంవత్సరాల జెస్సికా పటేల్ను భర్త మితేష్ పటేల్ (36) హతమార్చాడని టెసీడ్ మేజిస్ర్టేట్ కోర్టులో విచారణ చేపట్టారు. జెస్సికా పటేల్ భర్తతో కలిసి మిడిల్స్బోరోలో గత మూడేళ్లుగా తమ ఇంటికి సమీపంలోనే మందుల దుకాణం నడిపిస్తున్నారు. ఇద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉండేవారని స్ధానికులు చెబుతున్నారు. ఇంతలో ఏమైందో గత వారం జెస్సికా తన ఇంటిలోనే విగతజీవిగా పడిఉండటాన్ని పోలీసులు గుర్తించారు. ఘటనా స్థలానికి చేరుకున్న ప్రత్యేక నిపుణులు, ఫోరెన్సిక్ బృందాలు నేర విచారణలో నిమగ్నమయ్యాయి. పోస్ట్మార్టమ్ నివేదిక వివరాలను విచారణ నిబంధనల ప్రకారం వెల్లడించడం లేదని పోలీసులు తెలిపారు. జెస్సికా తమను ఎంతో ప్రేమగా చూసుకునేవారని, కుటుంబానికి అంకితమై సేవలు అందించారని , ఆమె మరణం తమకు కోలుకోలేని విషాదమని కుటుంబ సభ్యులు ప్రకటన విడుదల చేశారని క్లీవ్లాండ్ పోలీసులు తెలిపారు. భార్యతో ఎంతో ప్రేమగా మెలిగే మితేష్ పటేల్ జెస్సికాను ఎందుకు హత్య చేశాడన్నది స్ధానికులకు అంతుపట్టడం లేదు. విచారణలో వాస్తవాలు వెలుగుచూస్తాయని పోలీసులు చెబుతున్నారు. -
ప్రాణం తీసిన ఆస్తి వివాదం
భాగ్యనగర్కాలనీ: ఆస్తి విషయంలో తాను చెప్పినట్లు వినటం లేదని ఓ వ్యక్తి కట్టుకున్న భార్యను గొంతు నులిమి దారుణంగా హత్య చేసిన సంఘటన మూసాపేట రాఘవేంద్ర సొసైటీలో వెలుగు చూసింది. కూకట్పల్లి పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. నల్గొండ జిల్లా, కొక్కిర్యాల తండాకు చెందిన జర్పల శ్రీను, దేవి (27) దంపతులు రాఘవేంద్ర సొసైటీలో నివాసముంటున్నారు. శ్రీను స్థానిక డ్రైక్లీనింగ్ షాపులో పనిచేస్తుండగా, దేవి ఇంటివద్దనే ఉండేది. దేవి తల్లి ఇటీవల గ్రామంలోని భూమిని విక్రయించటంతో భార్యాభర్తల మధ్య గత కొంత కాలంగా ఆస్తి విబేధాలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో గురువారం రాత్రి వారి మధ్య గొడవ జరిగింది. తన మాట వినకపోవడంతో సహనం కోల్పోయిన శ్రీను భార్యను తీవ్రంగా కొట్టడమేగాక, గొంతు నులిమి హత్య చేశాడు. స్థానికుల సమాచారంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాం«ధీ ఆసుపత్రికి తరలించారు. నిందితుడు శ్రీను పోలీసులకు లొంగిపోయినట్లు సమాచారం. -
భార్యను హత్య చేసి భర్త ఆత్మహత్యాయత్నం
సాక్షి, నేలకొండపల్లి: భార్యను హత్య చేసి తాను కూడా ఆత్మహత్యాయత్నం చేశాడో భర్త. ఈ దారుణ సంఘటన ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండల కేంద్రంలో చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. స్థానిక వెంకటేశ్వరస్వామి ఆలయం సమీపంలోని బీడులో మండలంలోని గువ్వలగూడెం గ్రామానికి చెందిన మాతంగి గంగాధర్, నవీన అనే భార్యాభర్తలు తమ ఇద్ద మగ పిల్లలతో నివసిస్తున్నారు. ఈ కుటుంబంలో కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం నవీనను చున్నీతో ఉరిబిగించి గంగాధర్ చంపాడు. అనంతరం అతను కూడా విష గిళికలు తిని ఆత్మహత్యకు యత్నించాడు. నేలకొండపల్లి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని అతడిని ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
భార్యను కిడ్నాప్ చేసి చంపేశాడు
ఇల్లెందు(భద్రాద్రి కొత్తగూడెం): భార్యను కిడ్నాప్ చేసి.. హత్య చేసిన ఉదంతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందులో గురువారం రాత్రి జరిగింది. టేకులపల్లిలో ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న ఇల్లెందుకు చెందిన పుల్లిగండ్ల పద్మ(30), కారేపల్లి మండలం తొడిదలగూడేనికి చెందిన ఆటో డ్రైవర్ బండారు ప్రభాకర్ 12 ఏళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ప్రభాకర్ మరో మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తూ.. తరచూ భార్యను హింసించటం మొదలు పెట్టాడు. భార్యపై అనుమానం పెంచుకున్నాడు. ఆమెకు టేకులపల్లి నుంచి జెడ్పీకి బదిలీ కావడంతో ఖమ్మానికి మకాం మార్చారు. అక్కడ కూడా తరచూ వేధించడంతో పద్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చినా, పెద్దలు పంచాయితీ చేసినా ప్రభాకర్లో మార్పు రాలేదు. వేధింపులు తాళలేక రెండు నెలలుగా పద్మ పిల్లలతో కలిసి ఇల్లెందులోని పుట్టింటిలో ఉంటోంది. అక్కడి నుంచి ఉద్యోగ రీత్యా రోజూ ఖమ్మం నుంచి ఇల్లెందుకు రాకపోకలు సాగిస్తోంది. ఈ క్రమంలో గురువారం రాత్రి 7.30 గంటలకు ఇల్లెందులో బస్సు దిగి ఇంటికి వెళ్తోంది. పద్మ కోసం కాపు కాసిన ప్రభాకర్ మరో ఇద్దరితో కలిసి కిడ్నాప్ చేసి ఆటోలో తీసుకెళ్లారు. కేకలు వేస్తుండటంతో ఆటోలోనే చున్నీని మెడకు చుట్టి చంపేశాడు. మృతదేహాన్ని మొట్లగూడెం వెళ్లే దారిలో రోడ్డు పక్కన పడేశారు. నిందితులు ప్రభాకర్తో పాటు ఈ దారుణానికి ఒడిగట్టిన మరో ఇద్దర్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. నిందితులు పరారీలో ఉన్నారని, త్వరలో పట్టుకుంటామని డీఎస్పీ జి. ప్రకాశరావు తెలిపారు. -
ప్లాన్ చేసి.. క్యాబ్లో రైడ్కు తీసుకెళ్లి!
వాషింగ్టన్: భార్యతో తన వైవాహిక బంధంపై విసుగు చెందిన ఓ భర్త ప్లాన్ ప్రకారం ఆమెను హత్యచేశాడు. ఈ ఘటన ఆమెరికాలోని సీటెల్లో ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది. నిందితుడిని అరెస్ట్ చేసి సోమవారం కోర్టులో హాజరుపరచగా బెయిల్పై విడుదలయ్యాడు. ఆ వివరాలిలా ఉన్నాయి... కామెరాన్ జాన్ ఎస్పీటియా(31), జెన్నిఫర్ ఎస్పీటియా(29) భార్యాభర్తలు స్థానిక సీటెల్లో నివాసం ఉంటున్నారు. కామెరాన్ అమెరికా కోస్ట్ గార్డులో విధులు నిర్వహిస్తున్నాడు. గత కొంతకాలం నుంచి భార్య జెన్నిఫర్తో ఆయనకు విభేదాలున్నాయి. ఆమెతో సంసార బంధం కొనసాగకపోవడంపై తీవ్ర అసంతృప్తితో ఉన్న కామెరాన్ భార్యను అంతమొందించేందుకు ప్లాన్ చేశాడు. ప్లాన్ ప్రకారం.. రైడ్కు వెళ్దామని జెన్నిఫర్ను ఒప్పించి ఉబర్ క్యాబ్ బుక్ చేశాడు. మద్యం మత్తులో ఉన్న కామెరాన్ క్యాబ్ ఎక్కినప్పటినుంచి భార్యతో గొడవపడుతూనే ఉన్నాడు. కొంతసేపయ్యాక క్యాబ్ డ్రైవర్ ఓ పెద్ద శబ్దం విన్నాడు. కారు టైర్ పేలిందేమోనని కంగారుపడి వెనక్కి తిరిగి చూసి షాక్ తిన్నాడు. జెన్నిఫర్ ఆమె సీట్లో నిర్జీవంగా పడి ఉంది. కారు బాగానే ఉన్నా.. తన ప్రాణాలకు ముప్పు ఉందని గమనించిన డ్రైవర్.. ఎక్కడికి వెళ్లాలో చెప్పండి సార్ అని కామెరాన్ను అడిగాడు. అతడు చెప్పిన ప్రాంతంలో క్యాబ్ ఆపగా.. భార్య మృతదేహాన్ని దించి, డ్రైవర్కు డబ్బులు చెల్లించాడు. జరిగిన విషయాన్ని ఉబర్ డ్రైవర్ పోలీసులకు చెప్పాడు. ఆ సమాచారంతో నిందితుడు కామెరాన్ ఇంటికి వెళ్లి పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. జెన్నిఫర్ మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం ఆప్పత్రికి తరలించినట్లు చెప్పారు. భార్యతో శారీరక బంధం కొనసాగడం లేదని, అందువల్లే ఆమెను తుపాకీతో కాల్చి హత్యచేశానని కామెరాన్ అంగీకరించాడు. సోమవారం కామెరాన్ను కోర్టులో ప్రవేశపెట్టగా.. జడ్జి నిర్ణయం ప్రకారం మూడు మిలియన్ల అమెరికన్ డాలర్లు చెల్లించి బెయిల్పై విడుదలయ్యాడు. తదుపరి విచారణ జులై6కు వాయిదా వేశారు. సెకండ్ డిగ్రీ హత్య నేరం కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
అనుమానంతో భార్య.. ముగ్గురు పిల్లల దారుణహత్య
కట్టుకున్న భార్యకు తన తమ్ముడితో వివాహేతర సంబంధం ఉందేమోనన్న అనుమానంతో ఆమెతో పాటు తన ముగ్గురు పిల్లలను కూడా చంపేశాడో వ్యక్తి. ఈ దారుణ ఘటన హరియాణాలోని షెహబజాపూర్ గ్రామంలో చోటుచేసుకుంది. అతడు కూడా ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించాడు. రాధేశ్యామ్ అనే ఈ నిందితుడు ముందుగా తన కూతుళ్లిద్దరినీ, కొడుకును ఒక నీళ్ల ట్యాంకులోకి తోసేసి, దానికి బయట నుంచి మూత పెట్టేశాడు. తర్వాత ఇంట్లో వంట చేస్తున్న భార్య మంజు (33) వద్దకు వెళ్లి, ఆమెను పదునైన ఆయుధంతో పీక నరికి చంపేశాడు. హడావుడిగా ఆమె మృతదేహాన్ని పూడ్చిపెట్టేందుకు ప్రయత్నించాడు. ఆ తర్వాత తాను నూతిలోకి దూకి ఆత్మహత్యాయత్నం చేశాడు. అయితే స్థానికులు అతడిని కాపాడి బయటకు తీయడంతో విషయం మొత్తం బయటపడింది. వివాహేతర సంబంధం ఉందన్న అనుమానమే ఈ హత్యలకు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితుడిని ఆస్పత్రిలో చేర్చామని.. అతడి పరిస్థితి బాగానే ఉందని పోలీసులు చెప్పారు. -
భార్యను హత్యచేసి.. భర్త ఆత్మహత్య
-
భార్యను హత్యచేసి.. భర్త ఆత్మహత్య
వేముల: అనుమానం పెనుభూతమై ఒక కుటుంబాన్ని కాటువేసింది. ఫలితంగా అమాయకుడైన బాలుడు అనాథగా మారాడు. ఈ విషాద ఘటన మంగళవారం తెల్లవారుజామున వైఎస్సార్ జిల్లా వేముల మండలం నల్లచెరువుపల్లి గ్రామంలో జరిగింది. నల్లచెరువుపల్లి ఎస్సీ కాలనీకి చెందిన రామాంజనేయులు, కవిత దంపతులు కూలీపని చేసుకుని జీవించేవారు. కొంతకాలం నుంచి రామాంజనేయులు భార్యపై అనుమానం పెంచుకుని వేధించడం మొదలుపెట్టాడు. దాంతో కుటుంబంలో కలహాలు ఎక్కువయ్యాయి. ఈ నేపథ్యంలో రామాంజనేయులు తాగుడుకు బానిసయ్యాడు. ఈ క్రమంలో తెల్లవారుజామున గొడ్డలితో భార్య కవితను నరికి దారుణంగా హతమార్చాడు. అనంతరం తాను ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తల్లిదండ్రులిద్దరూ చనిపోవడంతో వారి ఒక్కగానొక్క కుమారుడు అనాథగా మారాడు. ఈ సంఘటన స్థానిక ఎస్సీ కాలనీలో కలకలం సృష్టించింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. పంచనామా నిర్వహించి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం వేముల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
మద్యానికి డబ్బులు ఇవ్వలేదని
కుత్భుల్లాపూర్: మద్యం తాగడానికి డబ్బులు ఇవ్వలేదనే కారణంతో ఓ వ్యక్తి కట్టుకున్న భార్యను కడతేర్చాడు. ఈ సంఘటన కుత్భుల్లాపూర్ పరిధిలోని ద్వారకానగర్లో నిన్న(గురువారం) మధ్యాహ్నం చోటు చేసుకుంది. ఆలస్యంగా శుక్రవారం ఉదయం వెలుగులోకి వచ్చింది. వివరాలు.. ద్వారకానగర్లో నివాసముంటున్న పద్మారావు, సుశీల(40) దంపతులు. స్థానికంగా ఉంటూ కూలీ పనిచేసి జీవిస్తున్నారు. పద్మారావు నిత్యం మద్యం తాగుతూ భార్యను డబ్బుల కోసం వేధిస్తుండేవాడు. ఇదే క్రమంలో నిన్న మధ్యాహ్నం పద్మారావు తాగేందుకు డబ్బులు లేకపోవడంతో భార్యను అడిగాడు. మద్యానికైతే డబ్బులు ఇవ్వనని ఆమె తేల్చి చెప్పింది. దీంతో కోపోద్రిక్తుడైన పద్మారావు, సుశీల తలను నేలకేసి బాదాడు. తీవ్రంగా కొట్టడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఆమెను ఉరి వేసి ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నం చేసి విఫలమయ్యాడు. ఆ తర్వాత ఆమె దగ్గర ఉన్న డబ్బులు తీసుకుని అక్కడి నుంచి పరారయ్యాడు. మెదక్ జిల్లా పాపన్నపేట పోలీస్స్టేషన్లో నిన్న రాత్రి లొంగిపోయాడు. దీంతో పోలీసులు రాత్రి 10 గంటలకు జీడిమెట్ల పోలీస్స్టేషన్కు తీసుకువచ్చారు. మద్యం మత్తులో ఉండి పొంతనలేని సమాధానాలు చెప్పాడు. మత్తు దిగిన తర్వాత హత్య ఎక్కడో చేశాడో చెప్పడంతో పోలీసులు సంఘటనాస్థలానికి తీసుకెళ్లారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. wife murdered by husband -
భార్య గొంతు కోసిన సాఫ్ట్వేర్ ఇంజనీర్
తాగుడుకు బానిసైన ఓ సాప్ట్వేర్ ఇంజనీర్ విచక్షణ మరచి భార్యను దారుణంగా గొంతుకోసి హత్యచేసిన ఘటన దమ్మాయిగూడ అయ్యప్ప కాలనీలో చోటుచేసుకుంది. స్ధానికులు, పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. దమ్మాయిుగూడకు చెందిన చక్రపాణికి, సికిందాబాద్ మెట్టుగూడకు చెందిన మాధవి (34)తో 10 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. చక్రపాణి హైటెక్ సిటీలోని బ్యాంక్ ఆఫ్ అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. పెళ్లయిన ఏడాది పాటు వీరి దాంపత్య జీవితంగా సాఫీగా సాగినా, ఆ తర్వాత మద్యానికి బానిసైన చక్రపాణి నిత్యం భార్యను వేధించేవాడు. పలుమార్లు అతని దాడిలో గాయపడిన మాధవి అపస్మారక స్థితిలోకి కూడా వెళ్లినట్లు ఆమె తల్లి చంద్రకళ తెలిపారు.. వారం రోజుల క్రితం చక్రపాణి మాధవిని తీవ్రంగా కొట్టి పిల్లలతో సహా బాలాజీనగర్లోని ఆమె పుట్టింట్లో వదిలి వెళ్లాడు. గురువారం సాయంత్రం అత్తగారింటికి వచ్చిన అతను.. మాధవిని దమ్మాయిగూడలోని తమ ఇంటికి తీసుకొచ్చాడు. అనంతరం కత్తితో దాదాపు 15 సార్లు పొడిచి, పారిపోయాడు. తమ ఇంటికి వచ్చేసరికే మద్యం మత్తులో ఉన్న చక్రపాణిపై అనుమానం వచ్చిన మాధవి కుటుంబసభ్యులు దమ్మాయిగూడలోని వారి ఇంటికి వచ్చి చూసేసరికి ఆమె రక్తపుమడుగులో పడిఉంది. దీంతో జవహర్నగర్ పోలీసులకు సమాచారం అందించగా ఘటనా స్థలానికి చేరుకున్న ఏసీపీ సయ్యద్ రఫిక్, సీఐ అశోక్కుమార్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
భార్యను ముక్కలు చేసి.. ఊరంతా వేశాడు!
సాధారణంగా హత్య జరిగిందంటేనే ఉలిక్కిపడతాం. కానీ రాజస్థాన్లోని అల్వార్ వాసులకు గత వారం రోజులుగా కంటిమీద కునుకు లేకుండా చేసిన ఓ హత్య తాలూకు మిస్టరీ ఎట్టకేలకు వీడింది. దీపావళి రోజు నుంచి వరుసగా నగరంలోని పలు కాలనీలలో ఒక మహిళ శరీర భాగాలు ముక్కలు ముక్కలుగా, కాలిపోయిన స్థితిలో ప్లాస్టిక్ బ్యాగ్లలో కనిపిస్తూ నగరవాసులను ఉలిక్కిపడేలా చేస్తున్నాయి. నాలుగు రోజుల్లో పోలీసులకు ఇలాంటివి ఏడు శరీర భాగాలు దొరికాయి. అన్నింటిలోనూ వాళ్లకు కనిపించిన అంశం ఒక్కటే. వాటిని ముక్కలు ముక్కలుగా చేసి, కాల్చేసి, తర్వాత బ్యాగులలో కుక్కారు. అక్టోబర్ 30వ తేదీ.. దీపావళి రోజున అల్వార్ ఆర్యనగర్ ప్రాంతంలో ఓ మహిళ కుడిపాదం ప్లాస్టిక్ బ్యాగ్లో దొరికింది. తర్వాతిరోజు రెండు వేర్వేరు బ్యాగులలో రెండు చేతులు కనిపించాయి. ఏడో రోజున చిట్టచివరిగా... మహిళ తల మరో బ్యాగ్లో మరో కాలనీలో కనిపించింది. ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లోనే హంతకుడు కూడా నివసిస్తూ ఉండాలని పోలీసులు అనుమానించారు. దాంతో ప్రతి ఇల్లూ గాలించగా.. 35 ఏళ్ల యోగేష్ మల్హోత్రా అనే వ్యక్తిని అనుమానితుడిగా భావించి అదుపులోకి తీసుకున్నారు. దీపావళి రోజు నుంచి అతడి భార్య కనిపించడం లేదు. ఆరోజు వాళ్ల ఇంట్లో ఏదో గొడవ జరిగిందని, అప్పటి నుంచి ఆర్తి కనిపించట్లేదని చుట్టుపక్కల వాళ్లు చెప్పినట్లు అల్వార్ ఎస్పీ రాహుల్ ప్రకాష్ తెలిపారు. దాంతో వెంటనే యోగేష్ మల్హోత్రా మీద నిఘా ఉంచారు. అతడి చేతుల మీద కాలిన గుర్తులున్నాయి. పోలీసులు ఆ ప్రాంతంలో గాలిస్తుండగానే అతడు ఇల్లు వదిలిపెట్టి వెళ్లిపోయాడు. గత కొన్ని రోజలుగా ఇంట్లోంచి ఏవో బ్యాగులు తీసుకుని బయటకు వెళ్తున్నాడని ఇరుగుపొరుగు వారు చెప్పారు. చివరకు హిస్సార్లో దాగున్న అతడిని పోలీసులు అరెస్టుచేశారు. తన భార్య శరీరాన్ని ముక్కలు ముక్కలు చేసింది తానే గానీ, తాను ఆమెను చంపలేదని.. ఆమె ఆత్మహత్య చేసుకుందని పోలీసులకు చెప్పాడు. తనకు ఏదైనా అయితే తన కూతుర్ని ఎవరు చూసుకుంటారన్న బయంతో శరీరాన్ని ముక్కలుగా చేసి పారేయాలనుకున్నానని తెలిపాడు. కానీ పోలీసులు మాత్రం అతడి వాదనను నమ్మడం లేదు. ఆర్తికి వేరే వారితో వివాహేతర సంబంధం ఉందని అతడు అనుమానించడమే హత్యకు కారణం అయి ఉంటుందని భావిస్తున్నారు. -
పరువు కోసం.. నా భార్యను చంపేశారు!
కుటుంబ పరువు కోసం తన భార్యను అత్తమామలే చంపేశారంటూ పాకిస్థాన్లో ఓ వ్యక్తి పోలీసులను ఆశ్రయించాడు. ఈ మేరకు ముఖ్తర్ కజీమ్ అనే ఆ వ్యక్తి పంజాబ్ రాష్ట్రంలోని జీలం పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. తన భార్య సామియా షహీద్ (28) బ్రిటిష్ - పాకిస్థానీ జాతీయురాలని, తాము రెండేళ్ల క్రితం పెళ్లి చేసుకుని దుబాయ్లో ఉంటున్నామని చెప్పాడు. సామియా బ్రాడ్ఫర్డ్ యూనివర్సిటీ నుంచి బ్యుటీషియన్ కోర్సు చేసింది. అయితే.. పెద్దల ఆమోదం లేకుండా పెళ్లి చేసుకున్నామన్న కోపంతో వాళ్లు తన భార్యను చంపేశారని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే ఆమె సహజంగానే మరణించిందని, అందువల్ల విచారణ అక్కర్లేదని ఆమె తల్లిదండ్రులు అంటున్నారు. సామియా మరణించిన వెంటనే అటాప్సీ చేయించామని, ఆ తర్వాత ఆమె మృతదేహాన్ని గ్రామంలో పూడ్చిపెట్టారని స్టేషన్ హౌస్ ఆఫీసర్ మహ్మద్ అఖీల్ అబ్బాస్ తెలిపారు. అయితే ఆమెకు బ్రిటిష్ మూలాలు కూడా ఉండటంతో.. బ్రిటిష్ విదేశాంగ శాఖ కూడా దీనిపై కలగజేసుకుంటోంది. పాకిస్థాన్లో బంధువులకు తీవ్ర అనారోగ్యంగా ఉందని తెలియడంతో కజీమ్, సామియా జూలై 14న ఇస్లామాబాద్ వెళ్లారు. సామియా గత గురువారమే తిరిగి దుబాయ్ రావాల్సి ఉంది. కానీ ఆమె గుండెపోటుతో మరణించినట్లు ఆమె బంధువు ఒకరు ఫోన్ చేసి చెప్పారు. దీంతో పరువు కోసమే ఆమెను చంపించడానికి వాళ్లు అనారోగ్యం నాటకం ఆడారని కజీమ ఆరోపిస్తున్నాడు. -
ప్రేయసితో కలిసి భార్యను చంపేసిన ఎన్నారై!
తెలుగు సినిమా ట్విస్టులకు ఏమాత్రం తీసిపోని ట్రయాంగ్యులర్ లవ్ మర్డర్ కేసులో భారత సంతతికి చెందిన ఇద్దరిని కెనడా కోర్టు దోషులుగా తేల్చింది. గుర్ప్రీత్ రోనాల్డ్ (37), ఆమె ప్రియుడు భూపిందర్ పాల్ గిల్ (41) కలిసి గిల్ భార్యను చంపినట్లు నిర్ధారించింది. 2014 జనవరిలో జగ్తార్ గిల్ (43) తన ఇంట్లో హత్యకు గురై కనిపించారు. దానిపై పోలీసులు సుదీర్ఘంగా దర్యాప్తు జరిపారు. అనంతరం ఒటావాలోని సుపీరియర్ కోర్టులో 9 వారాల పాటు విచారణ జరిగింది. ఆ విచారణ అనంతరం తమ ప్రేమకు అడ్డుగా ఉందని ఆమెను ప్రేయసీ ప్రియులిద్దరూ కలిసి చంపినట్లు తేల్చారు. తమ 17వ పెళ్లిరోజునే జగ్తార్ గిల్ను దారుణంగా పొడిచి చంపారు. హత్యకు ఒకరోజు ముందే ఆమెకు చిన్నపాటి శస్త్రచికిత్స కూడా జరిగింది. ఆమె భర్త భూపీందర్పాల్ గిల్, అతడి ప్రేయసి గుర్ప్రీత్ రోనాల్డ్ ఇద్దూ ఒటావాలోని ఓసీ ట్రాన్స్పోలో బస్సు డ్రైవర్లు. పక్కపక్క ఇళ్లలో ఉండేవారు. వాళ్ల మధ్య ప్రేమ మొదలైంది. దాంతో తామిద్దరం కలిసి ఉండాలంటే భార్య అడ్డు తొలగించుకోవాలని భావించి, ఆమెను హతమార్చినట్లు రుజువైంది. కాగా గిల్ దంపతులకు ముగ్గురు పిల్లలుండగా, రోనాల్డ్కు ఇద్దరు కూతుళ్లున్నారు. గిల్తో తనకు లైంగిక సంబంధం ఉందని అంగీకరించిన గుర్ప్రీత్.. తాను అతడితో సంతృప్తి చెందలేదని, అందుకే అదే సమయంలో మరో డ్రైవర్తో కూడా సంబంధం పెట్టుకున్నానని పోలీసుల విచారనలో తెలిపింది. అయితే.. ఆమెకు కేవలం ఏడ్చేటప్పుడు ముఖం ఆనించడానికి ఒక భుజం మాత్రమే అవసరమైందని, ఆ మద్దతు కోసమే స్నేహం ఏర్పరుచుకుందని ఆమె తరఫు న్యాయవాది కోర్టులో వాదించారు. -
సెల్ఫీ వంకతో.. భార్యను చంపేశాడు!
కట్నం వ్యవహారంలో భార్యతో గొడవపడి.. సెల్ఫీ తీసుకునే వంకతో ఆమెను గంగానదిలోకి తోసేసి చంపేశాడో వ్యక్తి. ఈ దారుణం ఉత్తరప్రదేశ్లోని మీరట్లో జరిగింది. ఆయేషా, ఆఫ్తాబ్లకు రెండేళ్ల క్రితం పెళ్లయింది. వాళ్లకు 8 నెలల కొడుకు కూడా ఉన్నాడు. ఆమను తరచు అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడని, తేకపోవడంతో ఆమెను హతమార్చాడని ఆయేషా కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఆయేషా సోదరుడు నయీమ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ దాఖలు చేసినట్లు మీరట్లోని సర్దానా స్టేషన్ పోలీసు అధికారి రాజేష్ వర్మ తెలిపారు. పోలీసులను తప్పుదోవ పట్టించేందుకు ఆఫ్తాబ్ నేరుగా తన కొడుకుతో కలిసి స్టేషన్కు వెళ్లాడు. ఐదుగురు దుండగులు తమను దోచుకోడానికి ప్రయత్నించారని, ఆయేషా ఎదురు తిరగడంతో ఆమెను గంగానదిలోకి తోసేశారని చెప్పాడు. అయితే పోలీసులు ఆఫ్తాబ్ను ప్రశ్నించినపుడు పొంతనలేని సమాధానాలు చెప్పి, చివరకు దొరికిపోయాడు. ఆమెను గంగా నది దగ్గర వరకు తీసుకెళ్లేందుకు సెల్ఫీని వంకగా తీసుకున్నాడు. ఆఫ్తాబ్తో పాటు అతడి అన్న షెహజాద్ మీద కూడా కేసు పెట్టారు. అతడు ఇంకా పరారీలో ఉన్నాడని వర్మ చెప్పారు. -
వివాహిత దారుణ హత్య
నేరడిగొండ: ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలం కుమారి గ్రామంలో దారుణం జరిగింది. కవిత (26) అనే వివాహిత ఆదివారం తెల్లవారుజామున ఇంట్లోనే రక్తపు మడుగులో విగతజీవిగా కనిపించింది. కవిత, రమణ దంపతులకు ఇద్దరు కమార్తెలు ఉన్నారు. రమణ దుబాయి వెళ్లొచ్చి ప్రస్తుతం స్థానికంగా కూలీ పనులు చేసుకుంటున్నాడు. ఈ క్రమంలో శనివారం అర్ధరాత్రి హత్యకు గురైనట్టు తెలుస్తోంది. ఆదివారం తెల్లవారుజామున స్థానికులకు విషయం తెలియడంతో పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. వంటసామగ్రి మీద పడడంతో కవిత చనిపోయిందని భర్త చెబుతుండగా... భర్తే ఆమెను హత్య చేశాడని కవిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. రమణ చెప్పిన విషయాలు పొంతన లేకపోవడంతో అతడిపైనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
అనంతలో దారుణం...
ధర్మవరం: మద్యం సేవించేందుకు డబ్బులివ్వలేదన్న ఆగ్రహంతో ఓ వ్యక్తి కట్టుకున్న భార్యను అంతమొందించాడు. అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు... ప్రకాష్ అనే వ్యక్తి చేనేత కార్మికుడిగా పనిచేస్తున్నాడు. అతడికి భార్య లక్ష్మీదేవి (37), ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. వీరు ధర్మవరం బస్టాండ్ సమీపంలో నివాసం ఉంటున్నారు. మద్యానికి బానిసైన ప్రకాష్ శనివారం రాత్రి తాగేందుకు డబ్బులు ఇవ్వాలని భార్యతో గొడవ పడ్డాడు. ఆమె ఇవ్వకపోవడంతో రోకలిబండతో తలపై మోదగా తీవ్ర గాయాలపాలై ప్రాణాలు కోల్పోయింది. ఆ సమయంలో పిల్లలు ఇంటి మిద్దెపై పడుకోవడంతో ఆదివారం ఉదయం ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. డీఎప్పీ, సీఐ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. నిందితుడిపై కేసు నమోదుచేసి విచారణ ప్రారంభించినట్లు తెలిపారు. -
అనుమానం పెనుభూతమై..
రామచంద్రపురం : అందరితో ఎంతో మంచిగా ఉండే మనిషి ఒక్కసారిగా విగత జీవిగా మారడంతో చూసిన వారు విలవిలలాడారు. కట్టుకున్నవాడే గొంతు కోసి కడతేర్చాడని తెలియడంతో పట్టణంలోని రాజబాబునగర్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అనుమానమే పెనుభూతం కావడంతో భార్యను గొంతు కోసి హతమార్చిన సంఘటన పట్టణంలో శనివారం రాత్రి సంచలనం రేకెత్తించింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పట్టణంలోని రాజబాబు నగర్కు చెందిన ఖండవిల్లి మరియమ్మ(35)కు కె.గంగవరం మండలం పేకేరుకు చెందిన దొరబాబుతో వివాహమయ్యింది. పట్టణంలోని స్టిల్వెల్ పేటలో వీరు నివాసముంటున్నారు. దొరబాబు కార్పొరెంటర్గా పనిచేస్తుం టాడు. వీరికి ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. కొంత కాలం గా వీరిమధ్య గొడవలు జరుగుతున్నాయి. భార్యపై అనుమానం తో తరచూ మద్యం తాగి వచ్చి కొడుతుండేవాడు. శనివారం రాజ బాబునగర్లో తన అమ్మగారి ఇంటి వద్ద ఉన్న మరియమ్మ వద్దకు వచ్చి గొడవ పడ్డాడు. వీరు గొడవ పడుతుండగా మరియమ్మ తమ్ముడి భార్య ప్రశాంతి మధ్యలోకి రావటంతో గర్భవతిగా ఉన్న ఆమె స్పృహతప్పి పడిపోయింది. దీంతో మరియమ్మ తన తమ్ముడు సహాయంతో ప్రశాంతిని రిక్షాలో ఏరియా ఆస్పత్రికి తరలిస్తుండగా ఆస్పత్రి గేటు వద్ద వెనుకనుంచి వచ్చిన దొరబాబు చాకుతో భార్య గొంతుకోశాడు. ఇది గమనించిన ఆమె తమ్ముడు మరియమ్మను ఆస్పత్రికి తీసుకువెళ్లాడు. అప్పటికే మృతిచెందిన ట్టు వైద్యులు ధ్రువీకరించారు. రామచంద్రపురం డీఎస్పీ మురళీకృష్ణ సంఘటనా స్థలాన్ని పరిశీలించి విచారణ చేశారు. ఎస్సై శ్రీనునాయక్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. మరియమ్మ మృతదేహాన్ని చూసి కుటుంబ సభ్యులు, కాలనీవాసులు కన్నీటి పర్యంతమయ్యారు. -
అనుమానంతో భార్యను కడతేర్చాడు..
తెనాలి రూరల్(గుంటూరు): గుంటూరు జిల్లా తెనాలి మండలం కొలకలూరు గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. కట్టుకున్న భర్తే ఆమె పాలిట కాలయముడయ్యాడు. భార్య గొంతు నులిమి చంపేశాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలివీ.. గ్రామానికి చెందిన గమిడి శ్రీనివాసరావు మొదటి భార్య మృతి చెందగా, రెండో వివాహం చేసుకున్నాడు. ఆమె కూడా వదిలి వెల్లడంతో మూడేళ్ల క్రితం గ్రామానికే చెందిన పూర్ణ(30)ను మూడో వివాహం చేసుకున్నాడు. ఆమెను అనుమానిస్తూ తరచూ వేధిస్తున్నప్పటికీ భరిస్తూ వచ్చింది. గురువారం సాయంత్రం ఇంట్లో ఉన్న భార్య గొంతు నులిమి మంచంపై ఆమె మృతదేహాన్ని పడేసి పరారయ్యాడు. హడావిడిగా వెళ్లిపోతున్న శ్రీనివాసరావును గమనించిన స్థానికులు ఇంట్లోకి వెళ్లి చూడగా, పూర్ణ విగతజీవురాలై పడి ఉంది. దీంతోవారు పోలీసులకు సమాచారం అందించారు. శ్రీనివాసరావు భార్య గొంతు నులిమి హత్య చేశాడని భావిస్తున్నట్టు సీఐ రవిచంద్ర తెలిపారు. మృతురాలికి రెండేళ్ల కుమారుడు ఉన్నాడు. -
భార్యను హత్యచేయించిన భర్త అరెస్ట్
అబిడ్స్ (హైదరాబాద్) : కుటుంబ తగాదాల నేపథ్యంలో భార్యను చంపించిన భర్తతో పాటు ఇద్దరు నిందితులను టప్పాచబుత్ర పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఏసీపీ రాంభూపాల్రావు.. ఇన్స్పెక్టర్ బి.రవీందర్తో కలసి శుక్రవారం టప్పాచబుత్ర పోలీస్స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. గుడిమల్కాపూర్ విశ్వేశ్వర్నగర్లో నివసించే బి.మంజుల(24), రాజేంద్రనగర్ బండ్లగూడకు చెందిన యశ్వంత్కుమార్(30) ఏడేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఆరేళ్ల కుమారుడు ఉన్నాడు. భర్తతో విభేదాలు తలెత్తటంతో ఏడాది నుంచి మంజుల కుమారుడు అభిషేక్తో కలిసి విశ్వేశ్వర్నగర్లోని తల్లి కళావతి వద్ద ఉంటోంది. కాగా కుమారుడిని తనకు అప్పగించాలని యశ్వంత్కుమార్ ఆమెను డిమాండ్ చేస్తున్నాడు. గత డిసెంబర్లో ఇదే విషయమై కోర్టులో కేసు కూడా వేశాడు. కాగా ఈ నెల 6వ తేదీన కోర్టులో కేసు విచారణకు రానుంది. అయితే 20 రోజుల క్రితం అభిషేక్ను తనకు అప్పగించాలని, తనతోపాటు ఉండాలని మంజులను యశ్వంత్కుమార్ డిమాండ్ చేయగా ఆమె నిరాకరించింది. దీంతో ఆమెపై కక్ష పెంచుకుని, అంతం చేయాలనుకున్నాడు. ఇందుకోసం తన స్నేహితుడు అరవింద్యాదవ్(36)ను ఆశ్రయించాడు. రూ.5 లక్షలకు బేరం కుదుర్చుకున్నాడు. అరవింద్ యాదవ్ అతడి మరో స్నేహితుడు హరీష్కుమార్(28)తో కలసి మంజుల హత్యకు కుట్ర పన్నారు. ఈనెల 1వ తేదీన సాయంత్రం విశ్వేశ్వరనగర్లోని మంజుల ఇంటికి అరవింద్యాదవ్, హరీష్కుమార్ వెళ్లారు. ఇద్దరూ కలసి మంజులను, అడ్డువచ్చిన ఆమె తల్లిని కత్తితో గొంతు కోసి చంపారు. దీనిపై విచారణ ప్రారంభించిన పోలీసులు యశ్వంత్కుమార్ను అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో విచారించడంతో కుట్ర వెలుగులోకి వచ్చింది. అరవింద్ యాదవ్, అతడి స్నేహితుడు హరీష్కుమార్లతో కలసి హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. దీంతో శుక్రవారం ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. -
చేతబడి చేయిస్తుందని....
అనంతపురం(కదిరి) : భార్యపై అనుమానంతో కట్టుకున్న భర్తే గొడ్డలితో నరికిచంపిన దారుణ ఘటన సోమవారం తెల్లవారుజామున జరిగింది. వివరాల్లోకి వెళ్తే... అనంతపురం జిల్లా కదిరి మండలం కట్టెల తాండాకు చెందిన బాణీబాయ్, పారేసు నాయక్లు భార్యభర్తలు. వీరికి ముగ్గురు సంతానం. ఇద్దరూ కేరళకు వెళ్లి కూలి పనులు చేసుకునేవారు. అయితే తాను అనారోగ్య పడడానికి, సన్నబడిపోతుండడానికి భార్య తనకు చేతబడి చేయిస్తుందని పారేసు అనుమానం పెంచుకున్నాడు. అదే క్రమంలో ఎలాగైనా భార్యను హతమార్చాలనుకుని ఆమె నిద్రిస్తుండగా సోమవారం తెల్లవారుజామున గొడ్డలితో మెడపై విచక్షణారహితంగా నరికి చంపేశాడు. ఇది చూసిన కుమార్తె భయపడి పెద్దగా కేకలు వేసింది. కేకలు విన్న చుట్టుపక్కల వారు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుణ్ని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. అయితే హత్యకు అసలు కారణం అది కాదని, తన భార్య పరాయి మగాళ్లతో చనువుగా మాట్లాడుతుండడం చూసి వివాహేతర సంబంధాలు ఉన్నాయేమోనని అనుమానపడి ఈ పని చేసిఉంటాడని పలువురు తాండా వాసులు ఆరోపిస్తున్నారు. భార్యాభర్తలు తరచూ గొడవలు పడుతుండేవారని చెబుతున్నారు. గత రాత్రి కూడా డబ్బుల విషయమై తల్లి, తండ్రి గొడవ పడ్డారని కుమార్తె చెపుతోంది. వారం క్రితం కూడా పారేసు నాయక్ గొడవపడి భార్యను కొట్టగా ఆమె తలకు గాయాలయ్యాయి. -
కొడుకును కనలేదని కడతేర్చాడు..!
చిత్రాడ (పిఠాపురం రూరల్) : ‘పురిటి నొప్పులు ఎరుగని పురుషజాతికి తల్లివైతివే..అమ్మ నీకు దండమే.. అర్థాంగి నీకు దండమే’ అంటూ స్త్రీ విశిష్టతను, ఉత్కృష్టతను ఎత్తిచూపాడో కవి. అయితే కాలం మారినా, స్త్రీలు సమాజ పునరుత్పత్తి భారాన్ని మోయడమనే ప్రత్యేక బాధ్యతతో పాటు ప్రతి రంగంలో ప్రతిభాపాటవాలు చాటుకుని, జయకేతనాలు ఎగరేస్తున్నా.. ఆడపుటకను హీనమైందిగా, మగబిడ్డనే వంశోద్ధారకుడిగా భావించే మౌఢ్యం ఇప్పటికీ బలంగానే ఉంది. కొందరు ఆడపిల్లలు, వారికి జన్మనిచ్చిన తల్లులు అన్యాయంగా బలవడానికి కారణమవుతూనే ఉంది. పిఠాపురం మండలం చిత్రాడకు చెందిన లారీ డ్రైవర్ పండు నాగేశ్వరరావు.. రెండో కాన్పులోనూ ఆడపిల్లనే కన్నదన్న ఆగ్రహంతో గురువారం అర్ధరాత్రి భార్యను గొంతు నులిమి చంపేసిన దారుణమే ఇందుకు నిదర్శనం. అత్తింటి వారికి రూ.లక్ష ఇచ్చి, గుట్టుచప్పుడు కాకుండా ఈ ఘాతుకాన్ని కప్పెట్టాలనుకున్నా.. ఎవరో పోలీసులకు ఇచ్చిన సమాచారంతో వెలుగు చూసింది. పోలీసులు, హతురాలి తల్లి బొబ్బరాడ రాఘవ, సోదరుడు సోమరాజు, చిన్నాన్న కృష్ణ చెప్పిన వివరాలిలా ఉన్నాయి. చిత్రాడ ఎస్సీ పేటలో ఎదురెదురు ఇళ్లకు చెందిన నాగేశ్వరరావు, శ్రీలక్ష్మి (28)ని 14 ఏళ్ల క్రితం ప్రేమించి పెళ్లిచేసుకున్నారు. ఆలస్యంగా తల్లి అయిన శ్రీలక్ష్మికి మొదటి కాన్పులో ఆడపిల్లకు పుట్టింది. మళ్లీ మూడు నెలల క్రితం మరో ఆడపిల్లకు జన్మనిచ్చింది. మగబిడ్డ కావాలనుకున్న నాగేశ్వరరావు భార్యను తప్పు పట్టసాగాడు. దీంతో వారి మధ్య గొడవలు జరిగాయి. ఈ క్రమంలోనే నాగేశ్వరరావు శ్రీలక్ష్మిని చంపి, మగబిడ్డ కోసం మరో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడని, అతడి కుటుంబసభ్యులు కూడా ఆ నిర్ణయాన్ని బలపరిచారని శ్రీలక్ష్మి కుటుంబసభ్యులు అంటున్నారు. కాగా గురువారం అర్ధరాత్రి సమయంలో నాగేశ్వరరావు ఇంటి నుంచి కేకలు శ్రీలక్ష్మి పుట్టింటి వారు వెళ్లి చూశారు. అప్పటికే కిందపడి ఉన్న శ్రీలక్ష్మి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుందని నాగేశ్వరరావు వారికి చెప్పాడు. అయితే ఆమె కొన ఊపిరితో ఉన్నట్టు గమనించిన వారు ఆటోలో పిఠాపురంలోని ప్రైవేటు ఆస్పత్రికి తీసుకు వెళ్లారు. దీపావళి పొగకు ఉక్కిరిబిక్కిరై స్పృహ తప్పిందని అక్కడి డాక్టర్కు చెప్పారు. అయితే మెడపై గాయాన్ని గమనించిన డాక్టర్ ఆమెను పరిశీలించి అప్పటికే చనిపోయిందని, ఆమెను హత్య చేసి ఉంటారని చెప్పారు. ప్రాణం ఖరీదు రూ.లక్ష.. జరిగిన దారుణంపై శ్రీలక్ష్మి కుటుంబం ఫిర్యాదు చెయ్యకుండా ఉండేలా పెద్దల సమక్షంలో రాజీ కుదిరింది. అందుకు బదులు ఆమె ఇద్దరు బిడ్డలకు చెరో రూ.50 వేలు, ఇల్లు ఇచ్చేందుకు నాగేశ్వరరావు లిఖితపూర్వకంగా అంగీకరించాడు. ఏ పూటకా పూట కూలికి వెళితే తప్ప కూటికి కటకటపడాల్సి వచ్చే పేదరికంతో ఇద్దరు ఆడపిల్లలను సాకడం కష్టమన్న భావనతో శ్రీలక్ష్మి కుటుంబం రాజీకి అంగీకరించారు. అయితే ఈ వ్యవహారాన్ని ఎవరో 100 నంబర్కి ఫోన్ చేసి చెప్పడంతో శుక్రవారం పోలీసులు చిత్రాడ వచ్చి ఆరా తీశారు. దాంతో విషయం వెలుగు చూసింది. శ్రీలక్ష్మిని ఖననం చేసిన చోటును పోలీసులు సందర్శించారు. మృతదేహాన్ని శనివారం తహశీల్దార్ సమక్షంలో వెలికితీయించి, పోస్టుమార్టం చేయిస్తామని ఎస్సై సన్యాసినాయుడు తెలిపారు. మృతురాలి తండ్రి బొబ్బరాడ ఏసుబాబు ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశామని, పోస్టుమార్టం నివేదికను అనుసరించి సెక్షన్లు మారుస్తామని చెప్పారు. -
భార్యను చంపి.. పీఎస్ లో లొంగుబాటు
హైదరాబాద్: కట్టుకున్న భార్యను కిరాతంగా భర్త హత్య చేసిన ఘటన నగరంలోని కుకట్పల్లి హౌసింగ్ బోర్డు(కేపీహెచ్పీ) పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సమతానగర్ ఈ దారుణ ఘటన జరిగింది. సస్పెన్షన్లో ఉన్న భానుప్రకాష్ అనే ఎస్సై తన భార్యను హత్య చేశాడు. తర్వాత పోలీసుస్టేషన్ లో లొంగిపోయాడు. కుటుంబ కలహాల కారణంగానే అతడీ ఘాతుకానికి పాల్పడినట్టు తెలుస్తోంది. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
భార్యను చంపి ఆత్మహత్య చేసుకున్న భర్త
అనంతపురం జిల్లా బి.హీరేహల్ మండలం పూలకుర్తిలో గత అర్థరాత్రి దారుణం చోటు చేసుకుంది. భార్యను చంపి అనంతరం భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ విషయాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ఆ రెండు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. కుటుంబ కలహాలే నేపథ్యం కారణంగానే ఆ ఘటన చోటు చేసుకుందని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అందులోభాగంగా స్థానికులను పోలీసులు విచారిస్తున్నారు. -
బెయిల్పై వచ్చి.. భార్యను చంపేశాడు!!
బెయిల్ మీద బయటకు వచ్చి, గతంలోనే తన నుంచి విడిపోయిన భార్యను చంపినందుకు న్యూజిలాండ్లో ఓ భారత సంతతి వ్యక్తికి జీవిత ఖైదు పడింది. రాజేశ్వర్ సింగ్ (47) అనే ఈ వ్యక్తి కనీసం 16 ఏళ్ల పాటు పెరోల్ కూడా లేకుండా తప్పనిసరిగా జీవిత ఖైదు అనుభవించాలని వెల్లింగ్టన్ హైకోర్టు తీర్పునిచ్చింది. టాక్సీ డ్రైవర్ అయిన రాజేశ్వర్ సింగ్ మాత్రం తాను తన మాజీ భార్య స్వర్ణలతను చంపలేదని వాదించాడు. కానీ, అతడు వస్తాడేమోనన్న భయంతో ఆమె గుమ్మానికి అడ్డంగా పెట్టిన కుర్చీలు, మంచాలన్నింటినీ తోసేసి, కొత్త తాళాన్ని పగలగొట్టి మరీ పొడిచి చంపినట్లు ప్రాసిక్యూషన్ వాదించింది. గతంలో రక్షణ ఉత్తర్వులను ఉల్లంఘించిన నేరానికి జైల్లో ఉన్న అతడు, నెల రోజుల క్రితమే బెయిల్ మీద విడుదలయ్యాడు. ఆమెను చూడకూడదని, ఆ ఇంటి సమీపంలోకి కూడా వెళ్లకూడదని అతడిని గతంలో కోర్టు నిరోధించింది. కానీ, ఆమెను చంపడానికి కొన్ని వారాల ముందునుంచి అతడు ఆ ఇంటి చుట్టుపక్కలే తిరిగాడు. ఆమెను చంపాలన్న ఉద్దేశంతోనే రాజేశ్వర్ సింగ్ అలా వెళ్లాడని, ఆమె పట్ల, ఆమె కుటుంబం పట్ల తీరని ద్వేషం ఉందని జస్టిస్ యంగ్ వ్యాఖ్యానించారు. వీరిద్దరికీ 1991లో ఫిజీలో పెళ్లయింది. 1998లో న్యూజిలాండ్ వెళ్లారు. వారికి ఒక కొడుకు పుట్టి, కండరాల క్షీణత వ్యాధి (మస్క్యులర్ డిస్ట్రొఫీ)తో 2011లో చనిపోయాడు. భార్యాభర్తల మధ్య తరచు గొడవలు జరిగేవని పోలీసులు తెలిపారు. -
పెళ్లయిన 15 రోజులకే భార్య హత్య!!
పాలమూరులో దారుణం జరిగింది. పెళ్లయిన 15 రోజులకే కట్టుకున్న భార్యను ఓ భర్త హతమార్చాడు. ఎవరికీ తెలియకుండా ఉండేందుకు ఆమే ఉరేసుకున్నట్లు చిత్రీకరించాడు. ఈ ఘోరం మద్దూరు మండలం రెనివట్లలో జరిగింది. రెనివట్ల గ్రామానికి చెందిన గోవిందమ్మ (19)కు అమ్మానాన్నలు లేరు. అన్నయ్యే అన్నీ అయ్యి పదిహేను రోజుల క్రితం పెళ్లి చేశాడు. మద్దూరుకు చెందిన గోపాల్ (25) అనే వ్యక్తికి 31,500 నగదు, 3 తులాల బంగారం కట్నంగా ఇచ్చి ఆమెను కట్టబెట్టారు. వ్యవసాయ పనులు, ఉపాధి హామీ కూలి పనులు చేసుకునే గోపాల్పై గతంలో చిన్న చిన్న దొంగతనాలకు సంబంధించిన కేసులున్నాయి. కాగా, గోవిందమ్మ మంగళవారం నాడు అత్తగారింటి నుంచి పుట్టింటికి వెళ్లింది. సాయంత్రం వరకు బాగానే ఉన్నారు. తెల్లవారేసరికల్లా ఆమె ఉరేసుకున్నట్లు కనిపించింది. దీంతో అనుమానం వచ్చిన గోవిందమ్మ అన్న.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు గోపాల్ను అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ఫేస్బుక్లో భార్య మృతదేహాన్ని గుర్తించిన భర్త
కొన్ని రోజులుగా కనిపించకుండా పోయిన తన భార్య మృతదేహం ఫొటోను ఫేస్బుక్లో చూసి గుర్తుపట్టాడో భర్త. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్లోని మీరట్లో జరిగింది. మీరట్లో ఓ యువతి మృతదేహాన్ని పోలీసులు గత గురువారం రాత్రి కనుగొన్నారు. జింఖానా సమీపంలో ఈ మృతదేహం పడి ఉంది. ఆమెను ఎవరో అత్యంత సమీపం నుంచి పాయింట్ బ్లాంక్ రేంజిలో కాల్చి చంపారు. అయితే ఆమె ఎవరన్న విషయాన్ని గుర్తించడానికి ఎలాంటి ఆధారాలు లభించలేదు. దాంతో పోలీసులు ఏం చేయాలో తెలియక, ఆమె మృతదేహాన్ని ఫొటో తీసి, దాన్ని ఫేస్బుక్లో పెట్టారు. ఆ ఫొటోను ఒకరి తర్వాత ఒకరుగా చాలామంది షేర్ చేశారు. దాంతో ఎట్టకేలకు ఆమె భర్త విపిన్ ఆ ఫొటోను ఫేస్బుక్లో చూశాడు. నోయిడాకు చెందిన తన భార్య నేహ కొన్నాళ్లుగా కనిపించడం లేదని, ఇప్పుడు ఫేస్బుక్లో ఆమె మృతదేహం కనిపించిందని విపిన్ వాపోయాడు. అయితే, ఇంటినుంచి బయటకు వెళ్లిన నేహ అంతదూరం మీరట్ ఎందుకు వెళ్లింది, అక్కడ ఎలాంటి పరిస్థితుల్లో హత్యకు గురైందన్న విషయాలు మాత్రం ఇంకా మిస్టరీగానే మిగిలిపోయాయి. -
రాత్రంతా తల్లి శవం పక్కనే నిద్రించిన చిన్నారి!
ఈ ఫొటోలోని చిన్నారి రాత్రంతా తల్లి మృతదేహం పక్కనే ఆదమరిచి నిద్రపోయాడు. తెల్లారాక ఎంతకీ అమ్మ లేవక పోవడంతో ఏడుస్తూ బయటికి వచ్చాడు. దీంతో బాలుడి తల్లి హత్యకు గురైన విషయం వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్: ఆస్తి విషయంలో భార్యాభర్తల మధ్య తలెత్తిన ఘర్షణ చివరకు భార్య హత్యకు దారితీసింది. ఘటన జరిగిన వెంటనే భర్త ఇంట్లో నుంచి పరారయ్యాడు. ఈఘటన సోమవారం రాత్రి బోయిన్పల్లి పోలీసుస్టేషన్ పరిధిలో జరిగింది. అయితే ఈ దారుణం ఠాణాకు కూతవేటు దూరంలో జరగడం గమనార్హం. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం...మెదక్ జిల్లా రాళ్లబండి గ్రామానికి చెందిన నాగమణి (32)కి పదేళ్ల వయసులోనే వివాహం జరిగింది. కొన్నాళ్ల తర్వాత భర్తతో విడిపోయి బతుకుదెరువుకు కోసం నగరానికి వచ్చి ఓ ఇంట్లో పనిచేస్తోంది. ఇలా ఆ ఇంటి మరమ్మతుల పనులు చేస్తుండగా అశోక్తో పరిచయం ఏర్పడింది. ఇది కాస్తా ప్రేమగా మారి చివరకు నాలుగేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నారు. అయితే అప్పటికే పెళ్లయిన అశోక్ నాగమణిని బోయిన్పల్లి కంసారి బజార్లోని ఓ అద్దెఇంట్లో ఉంచాడు. వీరికి మూడేళ్ల బాబు ఉన్నాడు. ఇటీవల నాగమణి,అశోక్ల వ్యవహారం తెలిసిన అతని మొదటి భార్య గొడవ పెట్టింది. దీంతో నాగమణి-అశోక్ల మధ్య కూడా వివాదాలు మొదలయ్యాయి. వివాహ సమయంలో అశోక్ ఒక ఫ్లాట్, కొంత పొలం కొనిస్తానని నాగమణికి చెప్పాడు. ఈ క్రమంలోనే సోమవారం రాత్రి ఇద్దరి మధ్య జరిగిన గొడవ కారణంగానే నాగమణి మృతిచెందినట్లు పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అశోక్ పరారీలో ఉండటంతో ఈ అనుమానాలకు బలం చేకూరుతోంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీకి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అమ్మ..లే అమ్మా సోమవారం రాత్రి మృతిచెందిన నాగమణి పక్కనే బాబు నిద్రపోయినట్లు తెలుస్తోంది. మంగళవారం ఉదయం అమ్మను లేపేందుకు యత్నించిన బాలుడు, అనంతరం పైఅంతస్తు నుంచి కిందకు రావడంతోనే హత్య విషయం స్థానికులకు తెలిసింది. బాలుడు రాత్రంతా శవం పక్కనే గడిపి ఉంటాడని తెలిసిన పలువురు స్థానికులు చలించిపోయారు. మా అమ్మకు ఏమైందంటూ..అక్కడి వారిని ప్రశ్నించడం పలువురిని కంటతడి పెట్టించింది.