-
తొమ్మిది మోడల్ పోలింగ్ కేంద్రాలు
మహబూబ్నగర్ మున్సిపాలిటీ: లోక్సభ ఎన్నికల్లో భాగంగా స్థానిక మున్సిపాలిటీ పరిధిలో 197 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇందులో తొమ్మిదింటిని మోడల్ పోలింగ్ కేంద్రాలుగా అధికారులు గుర్తించారు. వీటిలో బండమీదిపల్లిలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, క్రిస్టియన్పల్లిలోని ప్రభుత్వ ఎంవీఎస్ డిగ్రీ కళాశాల, వన్టౌన్లోని మహాత్మాగాంధీ రోడ్ హైస్కూల్, గాంధీనగర్లోని మోడల్ బేసిక్ హైస్కూల్, టీడీగుట్టలోని కమ్యూనిటీ హాలు, చిన్నదర్పల్లిలోని జెడ్పీహెచ్ఎస్, ఎనుగొండలోని హనుమాన్ భజన మండలి భవనం, మహిళా ఓటర్లకు కేటాయించిన మర్లులోని బ్రైట్ గ్రామర్ స్కూల్, వెంకటేశ్వరకాలనీలోని గెలాక్సీ హైస్కూల్ ఉన్నాయి. కాగా, బుధవారం మహబూబ్నగర్ మున్సిపల్ కమిషనర్ డి.మహేశ్వర్రెడ్డి స్థానిక మోడల్ బేసిక్ హైస్కూల్, బ్రైట్ గ్రామర్ స్కూల్, గ్యాలాక్సీ హైస్కూల్ను తనిఖీ చేశారు. అక్కడ జరుగుతున్న ఏర్పాట్లను క్షుణ్ణంగా పరిశీలించి సిబ్బందికి తగు సూచనలిచ్చారు. కార్యక్రమంలో ఎంఈ యు.బస్వరాజ్, డిప్యూటీ ఈఈ బెంజిమన్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రత్యర్థుల విమర్శలు అర్థరహితం..
పాలమూరు సమస్యలపై నేను లోక్సభలో నోరు విప్పలేదని ప్రత్యర్థులు విమర్శించడం అర్థరహితం. పార్లమెంట్ సమావేశాలకు 68 శాతం హాజరవడమే కాకుండా.. లోక్సభలో ఎక్కువ ప్రశ్నలు సంధించిన మూడో వ్యక్తిని నేనే. 356 ప్రశ్నలను లేవనెత్తా. స్వయంగా కేంద్రమంత్రులను కలిసి పాలమూరు సమస్యలను పరిష్కరించాలని విన్నవించా. వికారాబాద్–కృష్ణా రైల్వే లైన్ గురించి పలుమార్లు లోక్సభలో ప్రస్తావించా. ప్రస్తుతం ఆ లైన్కు సర్వే జరుగుతోంది. కాచిగూడ నుంచి మహబూబ్నగర్ వరకు డబ్లింగ్ పనులు పూర్తి చేయడంతోపాటు మహబూబ్నగర్, జడ్చర్ల, దేవరకద్ర, గద్వాల, శ్రీరాంనగర్, కృష్ణా రైల్వే స్టేషన్ల సుందరీకరణ, అభివృద్ధి, వైఫై సౌకర్యాల కల్పన వెనుక నా కృషి ఉంది. పత్తి రైతుల ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకుని పాలమూరులో సీసీఐ రీజినల్ కార్యాలయం ఏర్పాటుపై పార్లమెంట్లో గళమెత్తి విజయం సాధించా. పాలమూరు యూనివర్సిటీ అభివృద్ధికి రూ.100 కోట్లు మంజూరు చేయించడంలో సఫలీకృతమయ్యా. -
కాంగ్రెస్, బీజేపీవి కుయుక్తులు..
రూ.12.30 లక్షల ఎకరాలను సస్యశ్యామలం చేసే పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని కాంగ్రెస్, బీజేపీ కేవలం రాజకీయాలకే వాడుకుంటోంది. తెలంగాణ రాకముందు ఉమ్మడి ఏపీలో దశాబ్దాలుగా పాలించిన కాంగ్రెస్ పాలమూరు రైతాంగం బాధలను పట్టించుకోలేదు. అదేవిధంగా పదేళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం పాలమూరుకు జాతీయ హోదా ఇవ్వలేదు. దీనిపై పార్లమెంట్లో ప్రస్తావించడంతోపాటు పలు పర్యాయాలు కేంద్ర మంత్రులను కలిసినా.. స్పందించలేదు. ఈ ప్రాజెక్ట్పై ఆ రెండు పార్టీలు కుయుక్తులతో విమర్శిస్తూ గెలవాలని చూస్తున్నారు. అంతేకాదు నారాయణపేటలో సైనిక్ ప్కూల్, గోకుల్ ప్రాజెక్ట్ల ఏర్పాటుపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం. ఏర్పాటు చేస్తామని చెబుతూ దాటవేసింది. అయినా ఏం చేయలేదంటూ కాంగ్రెస్, బీజేపీ నాపై విమర్శలు చేయడం ఎంతవరకు సమంజసం?. ఎవరెన్ని కుట్రలు చేసినా నేనే గెలుస్తా. -
‘ఉచిత కానుకలపై గట్టి నిఘా ఉంచాలి’
మహబూబ్నగర్ మున్సిపాలిటీ: లోక్సభ ఎన్నికల సందర్భంగా డబ్బు, మద్యం, ఉచిత కానుకల పంపిణీపై గట్టి నిఘా ఉంచాలని కేంద్ర ఎన్నికల సాధారణ పరిశీలకులు షెవాంగ్ గ్యాచో భూటియా, ఎన్నికల వ్యయ పరిశీలకులు వరుణ్ రంగస్వామి ఆదేశించారు. బుధవారం రాత్రి కలెక్టరేట్లో ఆయా శాఖల అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆయా చెక్పోస్టుల వద్ద అన్ని వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేయాలన్నారు. బ్యాంకులలో అనుమానిత లావాదేవీలు, ముఖ్యంగా గూగుల్పే, యూపీఐ, ఫోన్పే ద్వారా జరిగిన లావాదేవీలను లీడ్ బ్యాంక్ మేనేజర్ పరిశీలించారు. డబ్బు, మద్యం రవాణాపై ప్రత్యేక నిఘా పెట్టాలన్నారు. క్యూఆర్ కోడ్ కూపన్స్ ద్వారా చెల్లింపులపై దృష్టి సారించి తగు చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం జిల్లా రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ జి.రవినాయక్ మాట్లాడుతూ అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. -
వందలాది కోట్లతో అభివృద్ధి పనులు..
నేను ఎంపీగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం గ్రామీణ ప్రాంతాల రహదారుల అభివృద్ధికి పెద్దపీట వేశా. మెటల్ రోడ్లను తారు రోడ్లగా మార్చేందుకు రూ.778 కోట్లు మంజూరు చేయించాను. దేవరకద్ర–కృష్ణా లైన్ పనులు మూడు దశాబ్దాలుగా నత్తనడకన సాగాయి. ఇది అందరికీ తెలిసిందే. ఈ మేరకు ప్రత్యేక దృష్టి సారించి పనుల్లో వేగం పెంచి పూర్తి చేశాం. దేవరకద్ర, మహబూబ్నగర్ ఓవర్ బ్రిడ్జిల నిర్మాణం పూర్తిచేయించాం. మహబూబ్నగర్–చించోళి జాతీయ రహదారి మంజూరుకు నావంతు కృషి చేశా. జాతీయ రహదారుల డివిజన్ కార్యాలయాన్ని పాలమూరుకు తీసుకొచ్చాం. ఐదేళ్లలో ఎంపీ ల్యాడ్స్ కింద రూ.25 కోట్లు వచ్చాయి. రెండేళ్లు కరోనా కాలం కాగా.. రూ.10 కోట్లు కోవిడ్ కట్టడికి కేంద్రమే వినియోగించింది. ఇవి పోనూ రూ.15 కోట్లతో లోక్సభ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో రోడ్లు, పాఠశాలల భవనాలతో పాటు సామాజిక కార్యక్రమాలకు వెచ్చించాం. -
సీఎం రేవంత్రెడ్డి నాయకత్వాన్ని బలపరుద్దాం
స్టేషన్ మహబూబ్నగర్: మహబూబ్నగర్ పార్లమెంట్ స్థానంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వంశీచంద్రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించి, సీఎం రేవంత్రెడ్డి నాయకత్వాన్ని బలపరుద్దామని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలో బుధవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్లమెంట్ ఎన్నికలు మహబూబ్నగర్ ప్రజలకు అగ్నిపరీక్ష లాంటివన్నారు. ప్రజలు విజ్ఞతతో ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు. మహబూబ్నగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో సీఎం రేవంత్రెడ్డి అనేక అభివృద్ధి పనులకు పునాదులు వేశారని.. అనేక విద్యాసంస్థలను మంజూరు చేశారని వివరించారు. రూ. 4 వేల కోట్లతో లక్ష 30వేల ఎకరాలకు నీళ్లు ఇచ్చే ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. మహబూబ్నగర్ పట్టణానికి డ్రెయినేజీ వ్యవస్థను మెరుగు పరచడానికి రూ.268 కోట్లు మంజూరు చేశారన్నారు. పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో రూ. 50 వేల కోట్లతో అభివృద్ధి పనులు చేపడుతున్నారని.. ప్రజలు కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలవాలని కోరారు. సమావేశంలో రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్, సంజీవ్ ముదిరాజ్, ఎన్పీ వెంకటేశ్, చంద్రకుమార్గౌడ్, సిరాజ్ఖాద్రీ, గంజి ఆంజనేయులు, లక్ష్మణ్యాదవ్, అజ్మత్అలీ, కృష్ణయ్య పాల్గొన్నారు. -
కాంగ్రెస్తోనే అన్ని రంగాల్లో అభివృద్ధి
అడ్డాకుల: కాంగ్రెస్ పార్టీతోనే దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తుందని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి అన్నారు. మూసాపేట మండలం మహ్మదుస్సేన్పల్లిలో బుధవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో 5 గ్యారంటీలను ఇప్పటికే అమలుచేశామని గుర్తుచేశారు. రాహుల్గాంధీ ప్రధానమంత్రి అయితే రాష్ట్రానికి అత్యధిక నిధులు వస్తాయన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటువేసి, మల్లు రవిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. మహ్మదుస్సేన్పల్లి గ్రామాన్ని మూసాపేట మండలం నుంచి ఖిల్లాఘనపురం మండలానికి మారుస్తామని హామీ ఇచ్చారు. కాగా, గ్రామానికి చెందిన పలువురు బీఆర్ఎస్ నాయకులు చిన్నారెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. కార్యక్రమంలో జిల్లెల ఆధిత్యారెడ్డి, జిల్లా అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్, ఎంపీటీసీ గోవర్ధన్సాగర్, సోషల్ మీడియా కన్వీనర్ దేవన్నయాదవ్, విజయ్కుమార్, కిరణ్కుమార్, ఐ.సత్యారెడ్డి, యాదయ్య పాల్గొన్నారు. రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి -
జిల్లా జైలు తనిఖీ
పాలమూరు: జిల్లా జైలును బుధవారం న్యాయ సేవాధికర సంస్థ జిల్లా కార్యదర్శి ఇందిర తని ఖీ చేశారు. రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ జిల్లా చైర్మన్, ప్రధాన న్యాయమూర్తి బి.పాపిరెడ్డి ఆదేశాల మేరకు జిల్లా జైలును సందర్శించి, వంటగది, నీటి వసతి, భోజనాలు ఇతర సౌకర్యాలను పరిశీలించారు. ఖైదీలకు అందిస్తున్న వసతులను జైలర్ను అడిగి తెలుసుకున్నారు. దరఖాస్తుల ఆహ్వానం బాలానగర్: ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని బాలానగర్, కల్వకుర్తి ఏకలవ్య ఆదర్శ బాలుర గురుకుల కళాశాలల్లో ఇంటర్ మొదటి సంవత్సరం ప్రవేశానికిగాను గిరిజన విద్యార్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు బాలానగర్ గురుకుల కళాశాల ప్రిన్సిపాల్ లక్ష్మారెడ్డి బుధవారం ప్రకటనలో తెలిపారు. పదో తరగతి ఉత్తీర్ణత సాధించిన గిరిజన విద్యార్థులు ఎంపీసీ, బైపీసీ, సీఈసీ కోర్సులలో చేరడానికి అవకాశం కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తిగల విద్యార్థులు ఈనెల 20వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తుతో పాటు పదో తరగతి మెమో, ఆధార్, కుల, ఆదాయ ధ్రువపత్రాలు, ఫొటోలు జతపర్చాలని సూచించారు. పూర్తి వివరాలకు 92931 29393 నంబర్ను సంప్రదించాలని సూచించారు. 31లోపు పరీక్ష ఫీజు చెల్లించండి మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ సెమిస్టర్–4, 6 ఫీజులను చెల్లించాలని రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణగౌడ్ బుధవారం ప్రకటనలో తెలిపారు. ఈ నెల 31లోగా ఆన్లైన్లో చెల్లించాలని, బీఏ, బీకాం వారు పేపర్కు రూ.150, బీఎస్సీ వారు పేపర్కు రూ.150తో పాటు ప్రాక్టికల్స్ రూ.150 చెల్లించాలని, మరింత సమాచారం కోసం 7382929609 నంబర్కు ఫోన్ చేయాలని సూచించారు. సామాజిక సేవ.. అందరి బాధ్యత పాలమూరు/మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: సా మాజిక సేవా కార్యక్రమాల్లో భాగస్వాములు కావాల్సిన బాధ్యత అందరిపై ఉందని రెడ్క్రాస్ సొసైటీ జిల్లా చైర్మన్ నటరాజ్ అన్నారు. నోబెల్ పురస్కార గ్రహీత, అంతర్జాతీయ రెడ్క్రాస్ సొసైటీ వ్యవస్థాపకుడు జాన్ హెన్రీడూన్హంట్ జయంతిని పురస్కరించుకొని బుధవారం స్థానిక ఎన్టీఆర్ డిగ్రీ కళాశాలలో అంతర్జాతీయ తలసేమియా, రెడ్క్రాస్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ముందుగా జాన్ హెన్రీడూన్హంట్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం ఏనుగొండ సన్నిధానం అనాథాశ్రమానికి ఎన్టీఆర్ మహిళా డిగ్రీ కళాశాల వృక్షశాస్త్రం విభాగం ఆధ్వర్యంలో బియ్యం అందజేశారు. విద్యార్థులకు పలు అంశాలపై పోటీలు నిర్వహించి, విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు. ఎన్టీఆర్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ విజయ్కుమార్, బాబుల్రెడ్డి, చంద్రశేఖర్, అశోక్ కుమార్, స్వాతి, శ్రీనివాసులు, హిమనీల పాల్గొన్నారు. పోస్టల్ బ్యాలెట్ గడువు పెంపు జడ్చర్ల టౌన్: పార్లమెంట్ ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసేందుకు మరో రెండు రోజుల గడువు పెంచుతూ ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. జడ్చర్లలోని బీఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని ఒకటో సెంటర్లో బుధవారం 796 ఓట్లకుగాను 649 ఓట్లు పోలయ్యాయి. రెండవ కేంద్రంలో 443 ఓట్లకు గాను 283 ఓట్లు పోలైనట్లు అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి తెలిపారు. -
అవినీతి రహిత పాలన మోదీతోనే సాధ్యం
నారాయణపేట: ప్రధాని నరేంద్రమోదీ పదేళ్ల పాలనలో అవినీతి రహిత, అభివృద్ధి, సుస్థిర పాలన సాగిందని బీజేపీ మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్రావు అన్నారు. బుధవారం పట్టణానికి వచ్చిన ఆయన 10న నిర్వహించే ప్రధాని నరేంద్ర మోదీ సభ ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. అరవై ఏళ్ల కాంగ్రెస్ పాలనలో అవినీతి, ప్రజల మధ్య విభజన విద్వేషాలు, కుటుంబ పాలన సాగిందని విమర్శించారు. కుటుంబ పాలన సాగించి అవినీతికి పాల్పడి దేశాన్ని అధోగతి పాలు చేసిన ఘనత కాంగ్రెస్దే అన్నారు. పదేళ్ల పాటు రిజర్వేషన్లు పుష్కలంగా ఉన్నాయని రాబోయే రోజుల్లో అదేవిధంగా ఉంటాయన్నారు. ఈశాన్య రాష్ట్రాలో ఒకప్పుడు ఉగ్రవాదం ఉండేదని, ప్రస్తుతం ఉగ్రవాద రహిత భారతదేశం ముందుకు సాగుతుందన్నారు. ప్రధాని దేశ ఆర్థిక పరిస్థితిని చక్కదిద్ది నేడు ప్రపంచంలో 5వ స్థానంలో నిలబెట్టారని తెలిపారు. పదేళ్లుగా దేశంలోనే కాదు ప్రపంచంలోనూ అతిపెద్ద రాజకీయ పార్టీగా బీజేపీ అవతరించిందన్నారు. సొంత మెజార్టీతో రెండు పర్యాయాలు మోదీ ప్రధానమంత్రి అయ్యారన్నారు. మూడోసారి ప్రధానమంత్రి చేయడమే లక్ష్యమన్నారు. ఇండియా కూటమి అవినీతి పార్టీలకు సారథ్యం వహిస్తుంటే, ఎన్డీఏ కూటమి దేశ హితం, అభివృద్ధి కోసం సారథ్యం వహిస్తున్నన్నారు. చరిత్రాత్మమైన సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో ఎమ్మెల్సీ ఈవీఎన్ రెడ్డి, నాగురావు నామాజీ, రతంగ్ పాండురెడ్డి, బంగారు శృతి, పవన్ కుమార్, శ్రీనివాసులు పాల్గొన్నారు. ఉగ్రవాదం, నక్సలిజం నిర్మూలన ఘనత బీజేపీదే 10న పేటకు ప్రధాని రాక బీజేపీ మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్రావు -
అదుపులోకి తీసుకున్న పోలీసులు
రోడ్డుపై రైతుల బైఠాయింపు విషయం తెలుసుకున్న ఎస్ఐ బాల్రాజు తమ సిబ్బందితో అక్కడికి చేరుకొని సీతారాంరెడ్డిని అదుపులోకి తీసుకొని పోలీస్స్టేషన్కు తరలించారు. దీంతో కోపోద్రిక్తులైన రైతులు మూకుమ్మడిగా పోలీస్స్టేషన్ను ముట్టడించి తమ నాయకుడిని విడుదల చేయాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఎస్ఐ రైతులతో మాట్లాడారు. ఎన్నికల కోడ్ దృష్ట్యా రోడ్డుపై బైఠాయింపునకు అనుమతులు తప్పని సరని, నిరసనలకు బైఠాయింపులకు అనుమతులు లేవని తెలియజేశారు. మరోసారి అనుమతులు లేకుండా ఇలాంటి కార్యక్రమాలు చేపట్టవద్దని సూచించి, సీతారాంరెడ్డిని వదిలివేయడంతో రైతులు శాంతించి వెళ్లిపోయారు. -
మద్యం, నగదు సీజ్
ఖిల్లాఘనపురం: మండల కేంద్రం నుంచి అనుమతి లేకుండా తరలిస్తున్న రూ.30 వేల విలువ చేసే 98.85 లీటర్ల మద్యం సీజ్ చేసినట్లు ఎస్ఐ శ్రీహరి బుధవారం తెలిపారు. తనిఖీల్లో భాగంగా గ్రామాల్లో తిరుగుతున్న తమకు మండలం నుంచి అక్రమంగా మద్యం తరలిస్తున్నట్లు సమాచారం రావడంతో తిర్మలాయపల్లి, వెంకటాంపల్లి పరిసర ప్రాంతాల్లో తనిఖీ చేస్తున్న సమయంలో కరివెనకు చెందిన విజయ్కుమార్ మద్యం తరలిస్తుండటంతో పట్టుకున్నట్లు తెలిపారు. బాలానగర్: బాలానగర్ పోలీస్ చెక్పోస్టులో బుధవారం రూ.50,010 నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ నుంచి కర్ణాటక రాష్ట్రం చిక్బల్లాపూర్కు వాహనంలో వెళ్తుండగా పోలీసులు తనిఖీ చేశారు. ఈ క్రమంలో నగదు పట్టుబడినట్లు ఎస్ఐ తిరుపాజీ తెలిపారు. -
‘నిబద్ధత ఉన్నవారికి ఓటువేయాలి’
కల్వకుర్తి టౌన్: ఎన్నికల్లో నిబద్ధత కలిగిన అభ్యర్థులకు మాత్రమే ఓటు వేయాలని రిటైర్డ్ ఐఏఎస్ అకునూరి మురళీ అన్నారు. పట్టణంలోని పాలమూరు చౌరస్తాలో జాగో తెలంగాణ పేరుతో బస్సుయాత్రలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఆదిలాబాద్ నుంచి ప్రారంభమైన బస్సు యాత్ర బుధవారం రాత్రి కల్వకుర్తి పట్టణానికి చేరుకుంది. రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే రాజకీయ పార్టీలకు ఓటువేయవద్దని పిలుపునిచ్చారు. రాజకీయాలంటే ప్రజల స్థితిగతులను మార్చేలా ఉండాలే తప్పా.. భయపెట్టి రాజకీయాలు చేసేవారిని, ఓటు ద్వారా వారికి బుద్ధి చెప్పాలన్నారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో మన ప్రాంతానికి అభివృద్ధి జరిగేలా, ప్రాంతానికి న్యాయం చేసే అభ్యర్థులను గెలిపించాలని కోరారు. విద్వేష విభజనతో నియంతృత్వ రాజకీయాలు చేసే వారిని ఓడించాలన్నారు. గడీల పాలన కూలగొడతానని రాజకీయాల్లోకి వచ్చిన ఆర్ఎస్ ప్రవీణ్కుమార్, నేడు బీఆర్ఎస్లో చేరి ఎంపీ అభ్యర్థిగా పోటీచేయటం సిగ్గుచేటన్నారు. అతను తన ఉద్యోగానికి రాజీనామా చేసిన తర్వాత, విలువలు కలిగిన రాజకీయం చేస్తాడని అనుకున్నా.. ఇలా విలువలు లేని పార్టీలో ఎంపీగా పోటీచేస్తాడని అనుకోలేదన్నారు. బస్సుయాత్ర ద్వారా ఓటర్లలో చైతన్యం కలిగించి, నిజంగా ప్రజలకు సేవచేసే వారిని ఎన్నుకోవాలని ఓటర్లను కోరారు. కల్వకుర్తి నుంచి బయలుదేరిన బస్సుయాత్ర రాత్రికి నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలో బసచేస్తారని తెలియజేశారు. కార్యక్రమంలో హెచ్సీయూ ప్రొ.లక్ష్మీనారాయణ, అగ్రికల్చర్ యూనివర్సిటీ ప్రొ.వినయ్, రిటైర్డ్ ప్రొ.పద్మజ, స్వచ్ఛంద సభ్యులు మహేష్, రాయ్, సౌజన్య, కల్పన పాల్గొన్నారు. -
చిరుత పులుల కోసం బోన్లు, కెమెరాలు
మద్దూరు: ఇటీవల ఉమ్మడి మద్దూరు మండలంలో మల్కిజాదరావ్పల్లి రెవెన్యూ శివారులో చిరుత పులి చనిపోవడం, నందిగామ శివారులో చిరుత పులి బోనులో చిక్కడంతో అటవీశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. బుధవారం అమ్రబాద్ రేంజ్కు చెందిన బయాలజిస్టు మహేందర్రెడ్డి, మద్దూరు అటవీశాఖ సెక్షన్ అధికారి లక్ష్మణ్నాయక్, వారి సిబ్బంది మద్దూరు, దామరగిద్ద మండలాల్లోని మోమినాపూర్, చెన్నారెడ్డిపల్లి, పెదిరిపాడ్, కోతులగుట్ట, కంసాన్పల్లి, ఓత్తుగుండ్లలో చిరుత పులుల నుంచి ఏ విధంగా తమనుతాము కాపాడుకోవాలో వివరించారు. అలాగే అటవి జంతువులను గుర్తిండం, వాటి పాదముద్రలపై ప్రజలకు అవగాహన కల్పించారు. మోమినాపూర్ గుర్రంగుట్ట ప్రాంతంలో చిరుత పులి కోసం ట్రాకింగ్ కెమెరాలను, బోను ఏర్పాటు చేశారు. నందిగామ గుట్టలో, తుఫాకితండా దగ్గర గుట్టలో మరో రెండు బోన్లు, ట్రాకింగ్ కెమోరాలను ఏర్పాటు చేసినట్లు వారు పేర్కొన్నారు. గ్రామస్తులకు అవగాహన కల్పించిన అటవీశాఖ మద్దూరు ఉమ్మడి మండలంలో మూడు చోట్ల బోన్ల ఏర్పాటు -
స్థానిక నాయకుల తీరుపై మంత్రిని నిలదీత
కొల్లాపూర్: పట్టణంలో స్థానిక నాయకుల తీరు ఏమీ బాగోలేదని కాలనీవాసులు మంత్రి జూపల్లికృష్ణారావు నిలదీశారు. దీనిపై ఆయన సమీక్షిస్తామని హామీ ఇచ్చారు. బుధవారం పట్టణంలోని పలు వార్డుల్లో ఎన్నికల ప్రచారం చేశారు. 11వ వార్డు ఇందిరాకాలనీ మహిళలు హామీల అమలుతీరుతో పాటు, స్థానిక నాయకుల వ్యవహార శైలిపై మంత్రిని ప్రశ్నించారు. నాయకుల పనితీరును సమీక్షిస్తానని, ఇచ్చిన హామీలన్నీ వరుసక్రమంలో అమల్లోకి వస్తాయని వివరించారు. ఎన్నికల్లో మల్లురవికి ఓటేయాలని ఆయన కోరారు. కాంగ్రెస్ ద్వారానే ప్రజా సంక్షేమం సాధ్యమన్నారు. బీఆర్ఎస్, బీజేపీలు రెండో స్థానం కోసం పోటీపడుతున్నాయన్నారు. జగదీశ్వరుడు, రహీంపాష, బోరెల్లి మహేష్, బిజ్జ రమేష్, గౌస్ తదితరులున్నారు. సమీక్షించి, హామీలు అమలు చేస్తానని హామీ -
మార్మోగిన గోవింద నామస్మరణ
చిన్నచింతకుంట: తెలంగాణ ప్రజల ఆరాధ్య దైవమైన అమ్మాపురం కురుమూర్తి స్వామి దర్శనానికి అమావాస్యను పురస్కరించుకొని బుధవారం భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఆలయ అర్చకులు ఆలయాన్ని శుద్ధి చేసి సుప్రభాత సేవ నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు. ఉమ్మడి పాలమూరు జిల్లా నలుమూలల నుంచి భక్తులు ఉదయం నుంచే తరలివచ్చి క్యూ లైన్లో నిల్చున్నారు. మెట్లపై దీపాలు వెలిగిస్తూ.. గోవింద నామస్మరణలతో స్వామి చెంతకు చేరి కొబ్బరికాయలు కొట్టి దర్శించుకున్నారు. కొందరు భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. కొండ దిగువన మట్టికుండలో పచ్చిపులుసు అన్నం నైవేద్యంగా తయారు చేసి స్వామికి సమర్పించారు. అనంతరం కొండపైన అలివేలు మంగమ్మ, చెన్నకేశవస్వామి, ఆంజనేయ స్వామి, ఉద్దాల మండపం వద్ద భక్తులు దర్శించుకున్నారు. దీంతో ఆలయ ప్రాంగణమంత భక్తుల రద్దీతో కనిపించింది. జాతర మైదానంలో ఏర్పాటు చేసిన దుకాణాల్లో స్వీట్లు, తదితర వస్తువులను కొనుగోలు చేశారు. నీడ లేక భక్తుల ఇబ్బందులు... కురుమూర్తి స్వామి ఆలయ ప్రాంగణంలో నీడ టెంట్లు లేక భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. రాజగోపురం వద్ద భక్తులు గంటల తరబడి ఎండలో నిల్చొని స్వామి వారికి దీపాలు వెలిగించారు. ఆలయ ప్రాంగణంలో సేద తీరేందుకు నీడ లేక చెట్లను ఆశ్రయించారు. అమావాస్యను పురస్కరించుకొని కురుమూర్తి గుట్టకు భక్తుల రద్దీ -
అకాల వర్షం.. తడిసిన వరి ధాన్యం
మహమ్మదాబాద్: మండలంలోని గాధిర్యాల్, చౌదర్పల్లి, పెద్దతండా, మంగంపేట, మహమ్మదాబాద్, మొకర్లాబాద్లో బుధవారం సాయంత్రం కురిసిన వడగండ్ల వర్షానికి కొనుగోలు కేంద్రాల్లోని వరి ధాన్యం తడిసిపోయింది. యాసంగిలో సాగుచేసిన పంటలకు సాగునీరు అందక దాదాపు 60 శాతం పంటలు ఎండిపోగా మిగిలిన కొద్దిపాటి చేతికొచ్చిన పంట కూడా అమ్ముకునే సమయానికి తడిపోయిందని రైతులు ఆవేదన వ్య క్తం చేశారు. మరోవైపు కోతకొచ్చిన వరిపంట వడ గండ్ల వర్షానికి చేతికందే పరిస్థితి లేదని తెలిపారు. ట్రాక్టర్ బోల్తాపడి విద్యార్థి మృతి ● మరొకరికి తీవ్ర గాయాలు మద్దూరు/కోస్గి: రోడ్డు ప్రమాదంలో ఇంటర్ విద్యార్థి మృతి చెందగా, మరోకరికి తీవ్ర గాయాలైన ఘటన కొత్తపల్లి మండల కేంద్రం శివారులోని దొంగకల్వర్టు వద్ద బుధవారం సాయంత్రం చోటు చేసుకుంది. బాధితులు, పోలీసుల కథనం మేరకు.. గుండుమాల్ చెందిన ముదిరెడిపల్లి శివకుమార్(20) ఇదే గ్రామానికి చెందిన స్నేహితుడు కేశపోళ్ల కృష్ణ(20) కలిసి శివకుమార్ పొలంలో ఉన్న ట్రాక్టర్ నేర్చుకుందామని తీశారు. కేశపోళ్ల కృష్ణ కారు డ్రైవర్ కావడంతో ట్రాక్టర్ను నడిపాడు. ఈ క్రమంలో శివకుమార్ కొత్తపల్లి మీదుగా గుండుమాల్కు వెళ్లే క్రమంలో కొత్తపల్లి శివారులోని దొంగ కల్వర్టు వద్ద ట్రాక్టర్ అదుపుతప్పి పడిపోవడంతో ముదిరెడ్డిపల్లి శివకుమార్ అక్కడికక్కడే మృతి చెందగా కృష్ణకు తీవ్రగాయాలు అయ్యాయి. మృతుడి తండ్రి ముదిరెడ్డిపల్లి వెంకటయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ రాంలాల్ తెలిపారు. మృతుడు ఇటీవలే ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో ఉత్తీర్ణత సాఽధించారు. వీధికుక్కల దాడిలో బాలుడికి గాయాలు గట్టు: వీధి కుక్కల దాడిలో ఓ బాలుడు గాయపడిన ఘటన మండలంలోని తప్పెట్లమొర్సులో బుధవారం చోటు చేసుకుంది. గ్రామస్తుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన హరి ఒంటరిగా కిరాణ దుకాణానికి వెళ్లి తిరిగి వస్తుండగా వీధి కుక్కలు దాడి చేశాయి. అటుగా వెళ్తున్న కొందరు గుర్తించి కుక్కలను తరిమివేశారు. గ్రామంలో వీధి కుక్కల బెడద ఎక్కువైందని.. వీటి బారినపడి చాలామంది గాయపడినట్లు గ్రామస్తులు వివరించారు. -
హన్వాడను దత్తత తీసుకుంటా..
హన్వాడ: హన్వాడపై బలంగా నమ్ముకముంది. ఈ మండలం నుంచి అత్యధికంగా 8వేల మెజార్టీకి తగ్గకుండా వస్తాయి. ఎంపీగా గెలిచి న వెంటనే మండలాన్ని దత్తత తీసుకుని, ప్రతి ఇంటికీ ఉద్యోగం, ఉపాధి అవకాశాలు కల్పిస్తా అంటూ మహబూబ్నగర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి చల్లా వంశీచంద్రెడ్డి చెప్పారు. బుధవారం మండల కేంద్రంలో బహిరంగ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మండలంలోని ప్రతి పల్లె నుంచి నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా ఎంపీ అభ్యర్థి మాట్లాడారు. కేంద్రంలో పదేళ్ల పాటు అధికారంలో ఉన్న బీజేపీ సామాన్యుల నడ్డివిరిచి నిత్యావసర ధరలను రెండింతలు చేసిందన్నారు. రూ.400 ఉన్న సిలిండర్ ధర నేడు రూ.1200 చేశారన్నారు. పెట్రోల్, డీజిల్, నిత్యావసర ధరలు సామాన్యులకు అందనంత దూరం చేశారని మండి పడ్డారు. అభివృద్ధి కోసం కాంగ్రెస్కు ఓటు వేయండి పాలమూరు బిడ్డ సీఎం రేవంత్రెడ్డి గౌరవాన్ని నిలుపుతూ ప్రతి ఒక్కరు పార్టీలకతీతంగా కాంగ్రేస్కు ఓటు వేయాలని మహబూబ్నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి పిలుపునిచ్చారు. గతంలో కేసీఆర్కు రాజకీయ బిక్షపెట్టిన మన పాలమూరు ప్రజలను తెలంగాణ ఏర్పడ్డాక ఇక్కడి ప్రజలను, ప్రాంతాన్ని తుంగలో తొక్కిన కేసీఆర్కు తగిన బుద్ధి చెప్పాలన్నారు. అంతకుముందు జిల్లా కేంద్రంలోని ఎర్రసత్యం చౌరస్తాలో చల్లావంశీచంద్రెడ్డితో కలిసి కార్నర్మీటింగ్లోనూ మాట్లాడారు. కార్యక్రమంలో సురేందర్రెడ్డి, ఎన్పీ వెంకటేష్, మిథున్కుమార్రెడ్డి, సిరాజ్ఖాద్రి, ఎండీ తఖీ, రాజునాయక్, కృష్ణయ్యయాదవ్, మహేందర్, సుధాకర్రెడ్డి, యాదవరెడ్డి, కృష్ణయ్య, సుధాకర్, రాములు, పెంటయ్య తదితరులు పాల్గొన్నారు. ఎంపీ అభ్యర్థి చల్లా వంశీచంద్రెడ్డి -
రిజర్వాయర్ వద్దని రైతుల నిరసన
బల్మూర్: మండల కేంద్రం సమీపంలో నిర్మించనున్న ఉమామహేశ్వర రిజర్వాయర్ నిర్మాణ అనుమతులను రద్దు చేయాలని, బుధవారం రిజర్వాయర్ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో రైతులు నిరసన తెలిపారు. ఆంజనేయస్వామి దేవాలయం నుంచి ప్రధాన రహదారి వరకు ర్యాలీ నిర్వహించి రోడ్డుపై బైఠాయించారు. ఈ సందర్భంగా రిజర్వాయర్ వ్యతిరేక పోరాట సమితి అధ్యక్షుడు అనంత సీతారాంరెడ్డి మాట్లాడారు. రైతుల ప్రయోజనాలను కాపాడలేని ప్రభుత్వం ఎవరికి మేలు చేస్తుందని ప్రశ్నించారు. వెంటనే అనుమతులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. దీనిపై అధికారులకు మొరపెట్టుకుంటున్నా.. స్పందించడం లేదని ఆరోపించారు. అనుమతులు రద్దు చేస్తేనే నిర్వాసిత గ్రామాలైన బల్మూర్, అనంతవరం, మైలారం గ్రామాల ప్రజలం పార్లమెంట్ ఎన్నికల్లో ఓటింగ్లో పాల్గొంటామని చెప్పారు. రైతు నాయకుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు పోలీస్స్టేషన్ ముట్టడించిన రైతులు -
స్థానికేతరులకు పట్టం కట్టిన అలంపూర్ వాసులు
అలంపూర్ నియోజకవర్గంలోనూ స్థానికులతోపాటు స్థానికేతరులు అసెంబ్లీ బరిలో నిలిచి తమ రాజకీయ భవిష్యత్కు పునాదులు వేసుకున్నారు. 1952లో అసెంబ్లీగా అవిర్భవిస్తే ఇప్పటి వరకు 17 సార్లు ఎన్నికలు జరిగాయి. ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే ఈ ప్రాంతానికి కర్నూల్, ఇతర ప్రాంతాలకు చెందిన వ్యక్తులు సైతం ఆయా ప్రధాన పార్టీల నుంచి టికెట్ దక్కించుకుని విజయం సాధించారు. 2004 వరకు వలసవాదులకు అవకాశం కల్పించిన ఇక్కడి ప్రజలు ఆ తర్వాత స్థానికులనే ఆదరిస్తున్నారు. స్థానిక నినాదం బలపడటంతో ఇక్కడ స్థానికేతరులు రావడానికి వెనకడుగు వేస్తున్నారు. -
బీజేపీతోనే అభివృద్ధి సాధ్యం
వనపర్తిటౌన్: తనను గెలిపిస్తే నాగర్కర్నూల్ పార్లమెంట్ పరిధిలోని అన్ని నియోజకవర్గాలను అభివృద్ధి చేస్తానని బీజేపీ ఎంపీ అభ్యర్థి భరత్ ప్రసాద్ తెలిపారు. బుధవారం జిల్లాకేంద్రంలోని కన్యకాపరమేశ్వరి అమ్మవారి ఆలయంలో నిర్వహించిన ఆర్యవైశ్యుల ఆత్మీయ సమ్మేళనంలో ఆయనతో పాటు వాసవి సేవాసమితి జాతీయ అధ్యక్షుడు పూరి సురేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా భరత్ ప్రసాద్ మాట్లాడుతూ.. 50 ఏళ్లు అఽధికారంలో ఉన్న కాంగ్రెస్పార్టీ చేయని అభివృద్ధిని కేవలం రెండుసార్లు గెలిచి ప్రధాని మోదీ చేసి చూపించారన్నారు. బీజేపీతోనే ప్రగతి సాధ్యమని ప్రజలు గుర్తించి ఓటేయాలని కోరారు. అనంతరం పూరి సురేష్ మాట్లాడుతూ.. గతంలో అధికారంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు ఆర్యవైశ్యుల సంక్షేమాన్ని విస్మరించాయని, మోదీ పాలనలోనే సముచిత స్థానం లభిస్తుందని తెలిపారు. ఈ నెల 13న జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో ఆర్యవైశ్యుల మద్దతు బీజేపీ అభ్యర్థి భరత్ ప్రసాద్కే ఉంటుందన్నారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ లోక్నాథ్రెడ్డి, ఆర్యవైశ్య సంఘం నాయకులు ఆకుతోట దేవరాజు, లక్ష్మీనారాయణ, గోనూరు యాదగిరి, బచ్చు వెంకటేష్, బాసెట్టి శ్రీనివాసులు, బచ్చు రాము, కొండా కిషోర్, మారం గోవిందు, నవీన్, సుమన్, భాగ్యలక్ష్మి, వసంత, అయ్యగారి ప్రభాకర్రెడ్డి, పురుషోత్తంరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
వేలికి సిరా.. తప్పిదాలకు తెర
పాలమూరు: ఈనెల 13న పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల్లో దొంగ ఓట్లను నిరోధించేందుకు ఎన్నికల సంఘం సిరాను వినియోగిస్తుంది. పోలింగ్ బూత్లో ఓటు వేయగానే ఓటర్ల ఎడమ చేతి చూపుడు వేలిపై సిరా రాస్తారు. చర్మంపై పూసి ఈ సిరాను త్వరగా తొలగించడానికి సాధ్యపడదు. వేలుపై పూసిన సిరా కాంతికి గురై 15–30సెకన్లలో పొడి బారుతుంది. చర్మాన్ని శుభ్రం చేసినప్పుడు కొద్దికొద్దిగా చెదిరిపోతుంది. కొంత కాలం వరకు వేలికి సిరా ఉంటుంది. ఎన్నికలకు వినియోగించే సిరా 10శాతం, 14–18 శాతం సిల్వర్ నైట్రేట్ ద్రావణం మిలితమై ఉంటుంది. సిరాలోని సిల్వర్ నైట్రేట్తో సూర్యరశ్మి తగలగానే చర్మంపై స్పష్టమైన గుర్తు ఏర్పడుతుంది. కర్ణాటక ప్రభుత్వ రంగంలోని మైసూర్ పెయింట్స్ అండ్ వార్నిష్, హైదరాబాద్ లోని ఓ ల్యాబ్లో ఈ సిరాను తయారు చేస్తున్నారు. భారత ఎన్నికల సంఘం వద్ద ఈ సిరా ఉత్పత్తికి 1962లోనే ఆయా సంస్థలు హక్కులు పొందాయి. 1976నుంచి మరో 28 దేశాలకు ఈ సంస్థ సిరాను సరఫరా చేస్తోంది. ఒకరు ఓటు వేసిన తర్వాత తిరిగి పోలింగ్ బూత్కు వచ్చే పరిస్థితి ఏర్పడదు. -
హామీలు అమలు చేయకుంటే ఉరేసుకుంటా..
బిజినేపల్లి: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీలు అమలు చేయలేకపోతే ఇక్కడే చెట్టుకు ఉరేసుకుంటానని నాగర్కర్నూల్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి డా.మల్లురవి అన్నారు. బుధవారం తిమ్మాజిపేట మండలంలోని ఆవంచలో ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేష్రెడ్డితో కలిసి ప్రచారం నిర్వహించారు. ఈ ఎన్నికలలో తనను భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు. ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200యూనిట్ల ఉచిత విద్యుత్ అమలు చేస్తున్నారని వివరించారు. తెల్లరేషన్ కార్డుదారులున్న వారిలో ఇళ్లు లేని వారికి నిర్మిస్తామన్నారు. కేంద్రంలో కూడా రాహుల్ గాంధీ ప్రధాని అయితే మరిన్ని పథకాలు అమలు చేస్తామన్నారు. కార్యక్రమంలో శ్రీనివాస్ బహదూర్, వెంకట్రాంరెడ్డి, బాలరాజ్, భాస్కర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
అలంపూర్కు దక్కిన మంత్రి పదవి
వలస రాజకీయాలతో ప్రత్యేకత చాటుకున్న చల్లా రాంభూపాల్రెడ్డి స్థానికంగా పోటీ చేసి మంత్రి పదవిని దక్కించుకున్నారు. ఈ నియోజకవర్గం నుంచి ప్రభుత్వ కేబినెట్లో పని చేసిన ఏకై క వ్యక్తిగా గుర్తింపు పొందారు. 45 ఏళ్ల నుంచి మళ్లీ ఆ అవకాశం ఎవరికి దక్కకపోవడం విచారకరం. ఉండవెల్లి మండలం పుల్లూరు చెందిన చల్లా రాంభూపాల్రెడ్డి రాజకీయ జీవితం స్థానికేతర నియోజకవర్గాల నుంచే ఆరంభించారు. 1962లో రాజకీయాల్లో అడుగు పెట్టిన ఆయన 1964లో కర్నూలు జిల్లా డోన్ నియోజకవర్గ నుంచి అసెంబ్లీకి పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. అనంతరం 1967లో కర్నూలు జిల్లాలోని నందికోట్కూరు నియోజకవర్గం నుంచి పోటీచేసి విజయం సాధించారు. 1978లో సొంత నియోజకవర్గమైన అలంపూర్ నుంచి పోటీచేసి గెలిచిన ఆయనకు కేబినెట్ హోదా దక్కింది. మంత్రిగా కొనసాగారు. -
కాంగ్రెస్వి సాధ్యం కానీ హామీలు..
హన్వాడ: కాంగ్రెస్ అమలు సాధ్యం కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని, తర్వాత ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలేసిందని బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి మన్నెశ్రీనివాస్రెడ్డి అన్నారు. బుధవారం ఆయన మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్తో కలిసి మండలంలోని వేపూర్, మునిమోక్షం, తదితర గ్రామాల్లో పార్లమెంట్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. గ్రామాల్లో ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్లో బీజేపీ, కాంగ్రెస్లపై విమర్శలు గుప్పించారు. మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ మాట్లాడుతూ.. పార్లమెంట్ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం కూలడం ఖాయమని, మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే కరెంట్ కోతలు, తాగునీటి సమస్య అధికమైందని, సమస్య పరిష్కారానికి ప్రభుత్వం చొరవ తీసుకోవడం లేదన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో గెలిపిస్తే ప్రజల పక్షాన పోరాడి సమస్యలు పరిష్కరిస్తారన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ బాల్రాజు, రమణారెడ్డి, చెన్నయ్య, నరేందర్, బాలయ్య, కృష్ణయ్యగౌడ్, నాగయ్య, బసిరెడ్డి పాల్గొన్నారు. నేను మీ మన్నెని.. మీలో ఒకడిని... నవాబుపేట: ‘నేను మీ మన్నెని.. ఓట్ల కోసం వచ్చిన వ్యక్తిని కాను.. మీలో ఒకడిని.. మీతో నిరంతరం ఉండే వ్యక్తిని.. ఎంపీగా మరోసారి అవకాశమిస్తే సేవ చేసుకునే భాగ్యం కలుగుతుంది.’ అంటూ మహబూబ్నగర్ ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి నవాబ్పేటలో ప్రసంగించారు. బుధవారం మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు నర్సింహులు ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ రోడ్షోలో ఆయనతో పాటు పార్టీ జిల్లా అధ్యక్షుడు లక్ష్మారెడ్డితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిరంతరం ప్రజల మధ్యఉండే నాయకుడినని.. రెండోసారి ఎంపీగా గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ నాయకుల మాయమాటలు అసెంబ్లీ ఎన్నికల్లో పట్టం కట్టిన ప్రజలు చాలా తప్పు చేశామని బాధపడుతున్నారని, పార్లమెంట్ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేసి తప్పు సరిద్దిదుకోవాలని కోరారు. బీజేపీ సైతం పదేళ్లు మాటలతో పబ్బం గడిపిందని ఆరోపించారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్కు ఈ ఎన్నికల్లో బుద్ది చెప్పాలన్నారు. పార్టీ జిల్లా నాయకులు రవీందర్రెడ్డి, మాజీ మార్కెట్ చైర్మన్ లక్ష్మయ్య, ఎంపీపీ అనంతయ్య, ప్రతాప్, సంతోష్రెడ్డి, మధుసూదన్రెడ్డి, గోపాల్గౌడ్, మాజీ ఎంపీపీ శ్రీనివాస్, కృష్ణగౌడ్, యూత్ అధ్యక్షుడు శ్రీనివాస్ యాదవ్, అంజయ్య, నర్సింహులు, శ్రీశైలం పాల్గొన్నారు. బీఆర్ఎస్ మహబూబ్నగర్ ఎంపీ అభ్యర్థి మన్నె శ్రీనివాస్రెడ్డి -
నకిలీ పైపులు పట్టివేత
గద్వాల క్రైం: రైతులను చవకగా మోసం చేయొచ్చనే భావనలో నాసిరకం వ్యవసాయేతర పరికరాలను గుట్టుగా విక్రయాలు చేస్తున్నారు. విషయం గుర్తించిన కంపెనీ అధికారులు పోలీసుల సాయంతో సామగ్రిని బుధవారం జిల్లా కేంద్రంలో పట్టుకున్నారు. టెక్స్మో కంపెనీ లీగల్ అధికారులు ఆఫ్తాబ్ సలీం, నాగరాజు తెలిపిన వివరాల మేరకు.. జోగుళాంబ గద్వాల జిల్లాకు చెందిన లక్ష్మీనారాయణ ఇంజినీరింగ్ దుకాణ యాజమాని విజయ్కుమార్రెడ్డి టెక్స్మో కంపెనీకి సంబంధించిన పీవీసీ, యూ పీవీసీ, డ్రిప్ సామగ్రి తదితర పైపులను నాసిరకంగా టెక్స్మో గోల్డ్ పేరుతో విక్రయాలు చేస్తున్నారు. కొన్ని రోజులుగా జిల్లాలోని వివిధ గ్రామాల రైతులకు కంపెనీ నిర్ణయించిన ధరల కంటే తక్కువ ధరకు అమ్ముతున్నారు. అసలు కంపెనీ పైపులకు ఏ మాత్రం తీసిపోలేనిదిగా ఉండడం, ఆ కంపెనీ సిబ్బంది గుర్తించి నాసిరకం సామగ్రిని కొనుగోలు చేసిన రైతులను ఆరాతీశారు. వ్యాపారి విజయ్కుమార్రెడ్డి గోదాంను బుధవారం ఉదయం రూరల్ పోలీసుల సాయంతో సోదాలు చేశారు. గోదాంలో రూ. 10లక్షల విలుగల వ్యవసాయేతర డ్రిప్ పైపులు, ఇతరరాత్ర పైపులను గుర్తించారు. టెక్స్మో కంపెనీ పేరుతో నాసిరకం పైపులను రైతులకు విక్రయాలు చేయడంతో పాటు వారిని మోసం చేస్తున్నట్లు తెలిపారు. లక్ష్మీనారాయణ ఇంజినీరింగ్ కో లిమిటెడ్ నిర్వాహకుడిపై చీటింగ్ కేసు కేసు నమోదు చేయాల్సిందిగా రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై ఎస్ఐ పర్వతాలను వివరణ కోరగా.. నాసిరకం పైపులను అసలు కంపెనీ పేరుతో విక్రయాలు చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టి సంబంధిత వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. రైతులకు ఎవరైనా నాసిరకం వ్యవసాయేతర పరికరాలు విక్రయాలు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ హెచ్చరించారు. రూ. 10లక్షల విలువ ఉన్న సామగ్రి గుర్తింపు పోలీసులకు ఫిర్యాదు చేసిన కంపెని అధికారులు
Pagination
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
బాహుబలి పట్టాభిషేకం సీన్ తలపించిన సీఎం జగన్ సభ
చంద్రబాబు పై గాడిద సామెత
"నాకు ఫుల్ క్లారిటీ వచ్చింది.." ఫుల్ జోష్ లో వంగా గీత
వంటల ఘుమఘుమలతో కూడా కాలుష్యానికి ముప్పేనట
బుల్లితెర నటి పర్సనల్ వీడియో లీక్
బేర్ పంజా..భారీ నష్టాలతో ముగిసిన స్టాక్మార్కెట్ సూచీలు
వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే
బఠానీల ఉచిత దిగుమతి గడువు పెంపు
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
టీడీపీ, బీజేపీ, జనసేన కుట్రతో పేదలకు నష్టం: సీఎం జగన్
తప్పక చదవండి
- వంటల ఘుమఘుమలతో కూడా కాలుష్యానికి ముప్పేనట
- రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఫిట్నెస్ సీక్రెట్ ఇదే..!
- బాబు, లోకేష్కు కొడాలి నాని స్ట్రాంగ్ కౌంటర్
- ముస్లింలకు రిజర్వేషన్లు ఉండాల్సిందే: సీఎం జగన్
- జనసేనకు గాజుగ్లాసు గుర్తుపై వెనక్కితగ్గిన టీడీపీ
- SRH: కాస్త ఓపిక పట్టు.. నీకూ టైమ్ వస్తుంది: యువీ పోస్ట్ వైరల్
- PK: 'పులుసు కారుతోంది'..!
- కేఎల్ రాహుల్పై లక్నో ఓనర్ ఫైర్.. చెప్పేది విను! వీడియో
- ప్రచారంలో సీనియర్ హీరో స్టెప్పులు!
- సీఎం నితీష్కు షాకిచ్చి.. లాలూ చెంతకు బడా నేత!
Advertisement