-
కాంగ్రెస్తోనే వికలాంగుల సంక్షేమం..
సాక్షి, నాగర్కర్నూల్: కాంగ్రెస్ పార్టీతోనే రాష్ట్రంలోని వికలాంగుల సంక్షేమం, అభివృద్ధికి బాటలు పడుతాయని రాష్ట్ర వికలాంగ కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్య అన్నారు. మంగళవారం జిల్లాకేంద్రంలో వికలాంగులతో భారీ బైక్ర్యాలీ నిర్వహించిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. వికలాంగులు, వృద్ధులు, వితంతువులు, గీత కార్మికులకు మొదట పెన్షన్లు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీనే అని చెప్పారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో వికలాంగుల సంక్షేమం కోసం ఆరు అంశాలను పొందుపర్చిందని తెలియజేశారు. వికలాంగులపై వివక్ష తొలగించేందుకు ప్రత్యేక చట్టాలను రూపొందిస్తామని, చత్తీస్ఘడ్ తరహాలో స్థానిక సంస్థల్లో వికలాంగులకు రిజర్వేషన్లు అమలుచేస్తామని అన్నారు. ప్రత్యేక శాఖగా ఉన్న వికలాంగుల శాఖను సీ్త్ర, శిశు సంక్షేమ శాఖలో విలీనం చేసిన చరిత్ర మాజీ సీఎం కేసీఆర్దని చెప్పారు. వికలాంగుల నేషనల్ ట్రస్టుకు చైర్మన్, కమిషనర్ను నియమించకుండా బీజేపీ ప్రభుత్వం గత పదేళ్లుగా చేస్తోందని అన్నారు. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి మల్లు రవిని గెలిపించాలని ఆయన కోరారు. రాష్ట్ర వికలాంగ కార్పొరేషన్ చైర్మన్ వీరయ్య -
నేడు కేటీఆర్ రోడ్షో
అచ్చంపేట రూరల్: పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం అచ్చంపేటలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ రోడ్షో నిర్వహించనున్నట్లు బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు తెలిపారు. మంగళవారం పట్టణంలోని ఆయన నివాసంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్కు మద్ధతుగా సాయంత్రం 4 గంటలకు కేటీఆర్ రోడ్షో ప్రారంభమవుతుందని తెలిపారు. నియోజకవర్గంలోని పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. అంతకుముందు మండలంలోని నడింపల్లిలో ఈదురు గాలులకు ఇంటి పైకప్పు రేకులు ధ్వంసమైన బాధిత కుటుంబాలను ఆయన పరామర్శించారు. కాగా, గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు భయభ్రాంతులకు గురిచేస్తున్నారని, ప్రచారాలకు వెళ్తే దాడులకు యత్నిస్తున్నారని ఆరోపించారు. దాడులకు భయపడే ప్రసక్తే లేదన్నారు. సమావేశంలో మున్సిపల్ చైర్మన్ నర్సింహాగౌడ్, అమీనుద్దీన్, రవీందర్రావు, శంకర్, కుత్బుద్దీన్ ఉన్నారు. విధి నిర్వహణలోఅప్రమత్తంగా ఉండాలి ఉప్పునుంతల: విధి నిర్వహణలో వైద్యసిబ్బంది ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఆస్పత్రుల సమన్వయకర్త (డీసీహెచ్ఎస్) డా.ఉమేష్ చంద్ర సూచించారు. మంగళవారం ఉప్పునుంతల సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేశారు. ఈసందర్భంగా ఆస్పత్రిలోని అన్ని విభాగాలను పరిశీలించారు. చికిత్స పొందుతున్న రోగులతో మాట్లాడి వైద్యసేవలపై ఆరాతీశారు. అనంతరం సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. వచ్చేనెల మొదటి వారంలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు ప్రారంభించడానికి కావాల్సిన పరికరాలు, ఇతర వసతులను తెలుసుకున్నారు. ఆస్పత్రిలో సాధారణ కాన్పుల సంఖ్య పెంచాలని చెప్పారు. సీహెచ్సీలో సరిపడా డాక్టర్లు, సిబ్బందిని నియామకానికి సంబంధించి కమిషనర్కు నివేదిక పంపించనున్నట్లు తెలిపారు. ఈఏడాది ఎండలు తీవ్రంగా ఉన్నందున ఆస్పత్రిలో ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలు అందించాలని సూచించారు. సమావేశంలో వైద్యాధికారులు రమాకాంత్, శివలీల, ఫార్మసిస్టు శ్రీనివాసులు, స్టాఫ్ నర్సులు ఉఫత్, వెంకటమ్మ, సిబ్బంది నజీర్ ఉన్నారు. ‘ఇండియా కూటమిదే విజయం’ కొల్లాపూర్: పార్లమెంట్ ఎన్నికల్లో ఇండియా కూట మి విజయం ఖాయమని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. మంగళవారం పట్టణంలోని ఓ ఫంక్షన్హాల్లో సీపీఐ పార్టీ నియోజకవర్గ స్థాయి ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించగా.. మంత్రి జూపల్లితో పాటు సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు ఎం.బాల్నర్సింహ్మ హాజరయ్యారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ కేంద్రంలోని మోదీ సర్కార్ తెలంగాణకు చేసిందేమీ లేదన్నారు. బీజేపీ, బీఆర్ఎస్లు లోపాయికారి ఒప్పందంతో పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మల్లు రవి ప్రజాసమస్యలు తెలిసిన వ్యక్తి అని.. ఆయనను గెలిపించుకుంటే ఇక్కడి సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషిచేస్తారన్నారు. కేంద్రంలో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని.. ఇక్కడ కూడా కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించుకుందామని సీపీఐ నాయకులను కోరారు. కాగా.. కేంద్ర, రాష్ట్ర కమిటీల నిర్ణయం మేరకు పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపునకు పార్టీ శ్రేణులు పనిచేయాలని సీపీఐ నాయకులు బాల్నర్సింహ్మ, ఫయాజ్ సూచించారు. సమావేశంలో ఏసయ్య, కిరణ్కుమార్, ఇందిరమ్మ, వెంకటస్వామి, యూసూఫ్, శ్రీనివాసులు ఉన్నారు. -
బాధిత కుటుంబాలను ఆదుకోవాలని ఆందోళన
● ఆస్పత్రి ఎదుట బందోబస్తు చేపట్టిన పోలీసులు ● ఆదుకుంటామని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే ● పోస్టుమార్టం అనంతరం కుటంబ సభ్యులకు మృతదేహాల అప్పగింత కల్వకుర్తి టౌన్: ఎమ్మెల్యే కారు బైక్ను ఢీకొట్టిన ఘటనలో దుర్మరణం పాలైన మృతుల కుటుంబాలను ఆదుకోవాలని బాధిత కుటుంబ సభ్యులతో పాటుగా వారి బంధువులు పట్టణంలోని పాలమూరు చౌరస్తాలో మంగళవారం ధర్నా చేపట్టారు. ఆస్పత్రి వద్ద జనం భారీగా గుమ్మిగూడటంతో పోలీసులు భద్రత పెంచారు. నరేష్(28) సోమవారం రాత్రి మృతిచెందటంతో అప్పటికే కల్వకుర్తిలోని సీహెచ్సీ మార్చురీకి మృతదేహాన్ని తరలించారు. హైదరాబాద్లోని నిమ్స్లో చికిత్స పొందుతున్న పరశురాములు(35) సోమవారం అర్ధరాత్రి చికిత్స పొందుతూ మృతిచెందగా.. అతడి మృతదేహాన్ని అక్కడే ఉంచారు. ఇద్దరి మృతదేహాలను ఒక దగ్గరికి తీసుకొస్తే శాంతిభద్రతల సమస్య వస్తుందని పరశురాములు మృతదేహానికి ఉస్మానియా ఆస్పత్రిలోనే పోస్టుమార్టం నిర్వహించారు. నరేష్ మృతదేహాన్ని సాధారణంగా మార్చురీలో ఉంచారని, ఫ్రీజర్ లేకపోవటంతో దుర్వాసన వచ్చిందని బంధువులు, కుటుంబ సభ్యులు కొద్దిసేపు ఆందోళన చెప్పారు. వెంటనే కల్వకుర్తి సీఐ నాగార్జున కలుగజేసుకొని వెంటనే ఫ్రీజర్ను తెప్పించి, మృతదేహాన్ని ఫ్రీజర్లో పెట్టించారు. రెండు కుటుంబాలకు చెందిన మృతుల బంధువులు అందరూ ఒక్కసారిగా మధ్యాహ్నం రోడ్డుపైకి వచ్చి ధర్నా చేపట్టారు. పోలీసులు అక్కడకు చేరుకొని సంబంధిత కాంగ్రెస్ నాయకులను పిలిపించి న్యాయం చేస్తామని హామీ ఇవ్వటంతో వారు ధర్నా విరమించారు. ఆదుకుంటాం.. రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన మృతుల కుటుంబాలకు అండగా ఉండటమే గాక వారిని ఆదుకుంటామని ఎమ్మెల్యే నారాయణరెడ్డి హామీ ఇచ్చినట్లు కాంగ్రెస్ నాయకులు మృతుల కుటుంబ సభ్యులకు తెలియజేశారు. ఎమ్మెల్యే తన వ్యక్తిగతంగా నరేష్ కుటుంబానికి రూ.20 లక్షలు, పరశురాములు కుటుంబానికి రూ.30 లక్షలు సాయంగా అందిస్తామని తెలియజేయటంతో పాటుగా, వెంటనే వారి కుటుంబ సభ్యులకు తక్షణ సాయంగా వాటిని కల్వకుర్తి మాజీ సర్పంచ్ ఆనంద్కుమార్ ద్వారా వాటిని అందించారు. మృతుల కుటుంబ సభ్యులకు తక్షణ సాయంతో పాటుగా, వారికి భవిష్యత్లో అండగా ఉంటానని ఎమ్మెల్యే తెలియజేశారు. బాధిత కుటుంబాలను పరామర్శించిన కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి డా.మల్లురవి వారి కుటుంబాలకు అండగా ఉంటామని హామీఇచ్చారు. ఆయన వెంట కల్వకుర్తి అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల ఇన్చార్జ్ ఇందిరాశోభన్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. ప్రమాద కారకులపై చర్యలు తీసుకోవాలి కల్వకుర్తి టౌన్: రెండు కుటుంబాల్లో విషాదాన్ని మిగిల్చిన రోడ్డు ప్రమాద కారకులపై చర్యలు తీసుకోవాలని నాగర్కర్నూల్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి డా.ఆర్ఎస్. ప్రవీణ్కుమార్ డిమాండ్ చేశారు. మంగళవారం పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన నరేష్(28) కుటుంబాన్ని రాష్ట్ర ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ గోలిశ్రీనివాస్ రెడ్డి, స్థానిక బీఆర్ఎస్ నాయకులతో కలిసి పరామర్శించి విచారం వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధిగా ఉంటూ కనీసం వేగాన్ని పాటించాలని తెలియకుండా ఇలాంటి ప్రమాదాలకు కారణమైతే ఎలా అని ఆయన ప్రశ్నించారు. వాహనాన్ని నడిపిన డ్రైవర్తో పాటుగా అందులో ప్రయాణించిన ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రమాదంలో మృతిచెందిన కుటుంబ సభ్యులకు రూ.కోటి తక్షణ సాయంగా అందించటంతో పాటుగా, వారి కుటుంబాలకు ఎప్పటికీ అండగా ఉంటామని హామీ ఇవ్వాలన్నారు. ఆయన వెంట కల్వకుర్తి మున్సిపల్ చైర్మన్ సత్యం, కడ్తాల జెడ్పీటీసీ దశరథ్ నాయక్ తదితరులు ఉన్నారు. -
ఎన్నికల విధులపై అవగాహన అవసరం
నాగర్కర్నూల్: మైక్రో అబ్జర్వర్లకు ఎన్నికల విధులపై పూర్తి అవగాహన ఉండాలని.. అప్పుడే పోలింగ్ తీరుతెన్నులను నిశితంగా పరిశీలిస్తారని నాగర్కర్నూల్ పార్లమెంట్ ఎన్నికల సాధారణ పరిశీలకుడు రుచేస్ జైవన్షీ, రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ ఉదయ్కుమార్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్లో మైక్రో అబ్జర్వర్లకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో వారు పాల్గొని మాట్లాడారు. పోలింగ్ రోజున మాక్ పోల్ అనంతరం చేపట్టే పోలింగ్ ప్రక్రియను నిశితంగా పరిశీలించాలని సూచించారు. ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా పోలింగ్ ప్రక్రియ నిర్వహించేలా చర్యలు చేపట్టడంతో పాటు ఎప్పటికప్పుడు జనరల్ అబ్జర్వర్ దృష్టికి తీసుకెళ్లాలని ఆదేశించారు. పోలింగ్ కేంద్రాల్లో మౌలిక సదుపాయాలపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని.. రహస్య పోలింగ్ కంపార్ట్మెంట్ సరిగ్గా ఏర్పాటు చేశారా లేదా అన్నది పరిశీలించాలని సూచించారు. ఎక్కడైనా సాంకేతిక లోపంతో మొరాయించే ఈవీఎంల స్థానంలో కొత్త ఈవీఎంల ఏర్పాటు.. ప్రిసైడింగ్, సహాయ ప్రిసైడింగ్ ఇతర అధికారుల విధులను గమనించాలని తెలిపారు. టెండర్, చాలెంజ్ ఓటింగ్లు జరిగితే, వాటి వివరాలను నమోదు చేసుకోవాలని సూచించారు. కాగా, పోలింగ్ ప్రక్రియ తీరుతెన్నులను పరిశీలించడం వరకే మైక్రో అబ్జర్వర్ల బాధ్యత అని.. ఎక్కడ కూడా పోలింగ్ విధుల్లో జోక్యం చేసుకోకూడదని తెలిపారు. 18 అంశాలకు సంబంధించిన నివేదికను ఎప్పటికప్పుడు జనరల్ అబ్జర్వర్కు నేరుగా పంపాలన్నారు. ఓటింగ్ గోప్యతను కాపాడే విధంగా మైక్రో అబ్జర్వర్లు బాధ్యతాయుతంగా పనిచేయాలని ఆదేశించారు. 385 మంది మైక్రో అబ్జర్వర్లకు శిక్షణ.. జిల్లాలో రిజర్వు సిబ్బందితో కలిపి మొత్తం 385 మంది మైక్రో అబ్జర్వర్లకు శిక్షణ ఇస్తున్నట్లు రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ ఉదయ్కుమార్ తెలిపారు. పోలింగ్ ప్రక్రియను గమనించడమే మైక్రో అబ్జర్వర్ల పాత్ర అని అన్నారు. ఎక్కడ ఏ చిన్న ఘటన చోటు చేసుకున్నా నిశితంగా పరిశీలించాలని.. ఏదేని ఘట న జరిగితే మైక్రో అబ్జర్వర్ల నివేదికలే కీలకమని అన్నారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు విధులు నిర్వహించాలని సూచించారు. ఉదయం 7గంటలకు పోలింగ్ ప్రారంభమై.. సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతుందన్నారు. పోలింగ్ నిర్వహణలో ప్రతి అంశాన్ని మైక్రో అబ్జర్వర్లు నిశితంగా పరిశీలించాలని తెలిపారు. సమస్యాత్మక కేంద్రాలలో మరింత ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు. పోలింగ్ కేంద్రం వద్ద ఓటర్లను అభ్యర్థులు, పోలింగ్ ఏజెంట్లు ప్రభావితం చేయకుండా నిఘా ఉంచాలన్నారు. ఎన్నికల సంఘం గుర్తింపుకార్డు కలిగిన వారు, ఎన్నికల విధులు నిర్వహించే వారు మినహా.. ఇతరులకు పోలింగ్ కేంద్రాల్లోకి అనుమతి లేదన్నారు. మైక్రో అబ్జర్వర్లకు కేటాయించిన కేంద్రాల్లో విద్యుత్, మంచినీరు, ఫర్నిచర్, వీల్చైర్, ర్యాంప్ వంటి మౌలిక వసతులు ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. 17–ఏ రిజిస్టర్ నిర్వహణ, పోలింగ్ ప్రక్రియపై ఎప్పటికప్పుడు నివేదికలు ఇవ్వాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఎన్ని కల ట్రైనింగ్ జిల్లా అధికారి గోపాల్ పాల్గొన్నారు. నిబంధనలకు అనుగుణంగా పోలింగ్ ప్రక్రియ నిర్వహించాలి ఎన్నికల సాధారణ పరిశీలకుడు రుచేస్ జైవన్షీ, రిటర్నింగ్ అధికారిఉదయ్కుమార్ -
కొలతల ప్రకారం‘ఉపాధి’ పనులు చేపట్టాలి
తెలకపల్లి: ఉపాధిహామీ పథకం కూలీలకు రోజు రూ.300 కూలి వచ్చేందుకుగాను కొలతల ప్రకారం పనులు చేపట్టాలని డీఆర్డీఓ చిన్నఓబులేష్ అన్నా రు. మండలంలోని అనంతసాగర్లో ఉపాధి హామీ పథకంలో చేపట్టిన ఒండ్రుమట్టి తరలింపు పనులను మంగళవారం పరిశీలించారు. ఈసందర్భంగా పని ప్రదేశంలో కూలీలకు కల్పిస్తున్న వసతులపై ఆరా తీశారు. అనంతరం ఓటు హక్కుపై కూలీలకు అవగాహన కల్పించారు. ఈనెల 13న జరిగే పార్లమెంట్ ఎన్నికల పోలింగ్లో అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటుహక్కు వినియోగించుకోవాలని సూచించారు. ఎంపీడీఓ కృష్ణయ్య, ఏపీఓ మల్లేష్, బీఎస్ నారాయణమ్మ, ఈసీ రామస్వామి పాల్గొన్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
టీడీపీ నేతల రౌడీయిజం.. పిన్నెల్లి భార్యకు గాయాలు
Haryana: మైనార్టీలో బీజేపీ! మాజీ సీఎం కీలక వ్యాఖ్యలు
పాక్ను ఓడించగానే రాత్రంతా సంబరాలు: రషీద్ ఖాన్
దాడులకు పబ్లిక్ గా బరితెగించిన లోకేష్
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
తెలంగాణ: మళ్లీ భారీ వర్షం కురిసే ఛాన్స్
శతక్కొట్టిన ఆటపట్టు.. టీ20 వరల్డ్కప్ క్వాలిఫయర్ ఛాంపియన్గా శ్రీలంక
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
ఓటీటీలోకి వచ్చేస్తున్న మరో వివాదాస్పద మూవీ
అట్టర్ ప్లాప్ .. పవన్ కళ్యాణ్ స్పీచ్ పబ్లిక్ జంప్
తప్పక చదవండి
- టీ20 వరల్డ్కప్ 2024 కోసం భారత బి టీమ్.. కెప్టెన్గా కేఎల్ రాహుల్..!
- ఏనుగుల దాడిలో వీడియో జర్నలిస్టు మృతి
- ‘నోరు మెదపరేం రాహుల్జీ?’..ప్రధాని మోదీ విమర్శలు
- తెలుగులో డైరెక్ట్గా ఓటీటీలోకి వస్తున్న మూవీ, స్ట్రీమింగ్ ఎక్కడంటే?
- ఓటు వేద్దాం ఇలా.!
- వెస్ట్ నైలు వైరస్ని తొలిసారిగా అక్కడ గుర్తించారు! ఎవరికి ప్రమాదమంటే..
- SRH vs LSG: ఉప్పల్ మ్యాచ్కు వెళ్తున్న వారికి అలర్ట్! ఇలా అయితే..
- అధికారం శాశ్వతం కాదు.. వడ్డీతో చెల్లించే టైం వస్తుంది:కేటీఆర్
- ధోని ఆల్టైమ్ రికార్డు బద్దలు కొట్టిన సంజూ.. భారత తొలి క్రికెటర్గా..
- Konathala Ramakrishna: మీ సంగతి చూస్తాం
Advertisement