-
యూనిఫాం తయారీపై ప్రత్యేక శ్రద్ధ కనబర్చాలి
తాడూరు: ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల యూనిఫాం తయారీని ప్రభుత్వం మహిళా సంఘాలకు అప్పజెప్పిందని, ఇచ్చిన గడువులోగా విద్యార్థుల యూనిఫాంను సిద్ధం చేయాలని డీఆర్డీఓ చిన్నఓబులేష్ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని ఐకేపీ కార్యాలయంలో యంత్రం ద్వారా డ్రస్ కటింగ్ నిర్వహణను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన డ్రస్ను తయారు చేసే ఆయా గ్రామాల మహిళా సంఘాల సభ్యులకు డ్రస్ను విద్యార్థులకు ఎలా తయారు చేయాలి అనే విషయంపై మహిళా సంఘాల సభ్యులకు అవగాహన కల్పించి అందజేయాలన్నారు. ఇచ్చిన గడువులోగా ప్రత్యేక శ్రద్ధ కనబర్చి డ్రస్లను సిద్ధం చేయాలని, ప్రతి రోజూ సీసీలు, ఏపీఎంలు మహిళా సంఘాల సభ్యుల వద్దకు వెళ్లి డ్రస్లు ఎలా కుడుతున్నారు, ఎంత వరకు పూర్తయ్యాయనే వివరాలను ప్రతిరోజూ పరిశీలించారు. కార్యక్రమంలో ఏపీఎం శేఖర్, సీసీ లక్ష్మణ్, పద్మ, పార్వతమ్మ ఉన్నారు. -
జోగుళాంబ సన్నిధిలో ప్రముఖులు
జోగుళాంబ శక్తిపీఠం: రాష్ట్రంలోని ఏకై క శక్తిపీఠమైన అలంపూర్ జోగుళాంబ బాలబ్రహ్మేశ్వర స్వామివారి ఆలయాలను మంగళవారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఉదయం వనపర్తి జిల్లా అడిషనల్ కలెక్టర్ నగేష్ దర్శించుకున్నారు. అదే విధంగా తెలంగాణ అడ్వకేట్ జనరల్ సుదర్శన్రెడ్డి, సౌత్ సెంట్రల్ రైల్వే ఇంజినీరింగ్ అధికారులు జి.కే ద్వివేది, వి.నాగమల్లేశ్వర్ రావు, యూబీఎన్ఎం స్వామి, నీలపావని, కశ్యప్ దర్శించుకున్నారు. వీరికి అర్చకులు ఆలయ మర్యాదలతో సాదర స్వాగతం పలికి బాల్ర హ్మేశ్వర స్వామివారికి ఏకవారరుద్రాభిషేకాలు, జోగుళాంబ అమ్మవారికి ఖడ్గమాల, త్రిశతి అర్చనలు చేశారు. తీర్థ, ప్రసాదాలు అందజేసి వేద ఆశీర్వచనం చేశారు. అదే విధంగా మహారాష్ట్రలోని కొల్హాపూర్ గురుసిద్దేశ్వర శివాచార్య స్వామిజీ కూడా దర్శించుకున్నారు. -
విత్తన ఎంపికలో అధికారుల సూచనలు పాటించాలి
తాడూరు: ప్రస్తుతం వానాకాలం సీజన్ ప్రారంభం కానుందని, విత్తనాల ఎంపికలో, పురుగు మందు వాడకం వంటి అంశాల్లో రైతులు వ్యవసాయ అధికారుల సూచనలు, సలహాలు పాటించాలని ఏడీఏ రమేష్బాబు అన్నారు. మంగళవారం మండల కేంద్రంలో విత్తనాలు, ఎరువులు, పురుగు మందు విక్రయించే డీలర్లు, రైతులతో మండలంలోని ఇంద్రకల్ రైతువేదికలో నిర్వహించిన సమావేశంలో పాల్గొని మాట్లాడారు. రైతుకు ప్రతి అమ్మకం, విత్తనాల బిల్లు డీలర్లు తప్పనిసరి ఇవ్వాలన్నారు. ప్రతిరోజూ స్టాక్, బిల్ బుక్కులు తప్పనిసరి రోజువారీగా క్రమం తప్పకుండా సిద్ధంగా ఉంచాలన్నారు. విత్తనాలు అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. రోజువారీగా ధరల పట్టిక తప్పనిసరిగా సరిచేయాలన్నారు. విక్రయిస్తున్న సీడ్, ఫర్టిలైజర్, పురుగు మందు వివరాలు సంబంధిత వ్యవసాయ అధికారికి తెలియజేయాలన్నారు. వ్యవసాయ అధికారులు ఇచ్చిన సూచనలు, సలహాలను పాటించి రైతులు నాణ్యమైన విత్తనాలు కొనుగోలు చేసిన వెంటనే రసీదు తప్పనిసరి తీసుకోవాలన్నారు. ఫర్టిలైజర్ యాజమానులు జీవితకాలం ముగిసిన విత్తనాలను నిల్వ ఉంచుకుంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఏఓ సాయిరమేష్కుమార్, ఆయా గ్రామాల డీలర్లు, రైతులు పాల్గొన్నారు. -
No Headline
నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణ శివారులోని ఎల్లమ్మకుంటకు చెందిన ఫొటోగ్రాఫర్ రాఘవేంద్రచారి (30), వెంకటేష్(29), మహేష్కుమార్(21) వీడియో గ్రాఫర్గా పనిచేస్తూ జీవనం గడుపుతున్నారు. ఈ క్రమంలో మక్తల్ మండలంలోని కాచ్వార్ గ్రామంలో ఓ ఇంట్లో శుభకార్యంలో ఫొటోలు తీసేందుకు మంగళవారం ఉదయం వెళ్లారు. తర్వాత కొద్దిసేపు విరామం దొరకడంతో మక్తల్కు వచ్చి.. తిరిగి మధ్యాహ్నం సమయంలో ముగ్గురు కలిసి ద్విచక్రవాహనంపై మళ్లీ బయలుదేరారు. ఈ క్రమంలో మక్తల్ మున్సిపాలిటీ పరిధిలోని దండు గ్రామం సమీపంలోని అంతర్రాష్ట్ర రహదారి–167పై మహబూబ్నగర్ నుంచి రాయచూర్ వెళ్తున్న కర్ణాటక బస్సు, బైక్ ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో వెంకటేష్, రాఘవేంద్రచారి అక్కడికక్కడే మృతిచెందగా.. మహేష్ కాలు విరిగి తలకు తీవ్రగాయాలు కావడంతో 108లో మక్తల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మహబూబ్నగర్కు తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతిచెందాడు. -
జిల్లాలో కస్తూర్బా విద్యాలయాలు
అచ్చంపేట: కస్తూర్బా గాంధీ విద్యాలయాల్లో ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమైంది. విద్యార్థుల కోసం సిబ్బంది గ్రామాల బాట పడుతున్నారు. పల్లెల్లో తిరుగుతూ సర్వే నిర్వహిస్తున్నారు. అనాథలు, పేదరకంతో చదువుకు దూరమవుతున్న బాలికలకు వసతితో కూడిన ఉన్నత విద్యనందించేందుకు ప్రభుత్వం కస్తూర్బా గాంధీ విద్యాలయాలను ప్రారంభించగా.. త్వరలో 2024–25 విద్యా సంవత్సరం ప్రారంభానికి సిబ్బంది ప్రవేశాల ప్రక్రియ మొదలుపెట్టారు. కేజీబీవీల ప్రత్యేకాధికారులు, ఉపాధ్యాయులు తమ పరిధిలోని గ్రామాలకు వెళ్లి విద్యార్థులు, తల్లిదండ్రులు, సంరక్షకులకు అవగాహన కల్పిస్తున్నారు. ● జిల్లాలోని 20 మండలాల పరిధిలో 20 కస్తూర్బా విద్యాలయాలు ఉన్నాయి. ఇందులో 6 నుంచి పదో తరగతి వరకు 4,240 మంది విద్యార్థులు చదువుతున్నారు. అలాగే 11 కేజీబీవీల్లో ఇంటర్మీడియట్ తరగతులు నిర్వహిస్తున్నారు. 7 కళాశాలల్లో ఎంపీసీ, బైపీసీ, 4 కళాశాలల్లో సీఈసీ, ఎంపీహెచ్డబ్ల్యూ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఒక్కో కేజీబీవీలో ఒక్కో గ్రూప్లో 40 సీట్ల చొప్పున అందుబాటులో ఉన్నాయి. ఈ లెక్కన ఇంటర్ మొదటి సంవత్సరంలో 880 మంది విద్యార్థులు ప్రవేశం పొందే అవకాశం ఉంది. ప్రస్తుతం ఆరో తరగతి, ఇంటర్ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాల కోసం అర్హులైన విద్యార్థినుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఆరో తరగతి విద్యార్థునుల కోసం కేజీబీవీల సిబ్బంది గ్రామాల్లో ఈ నెల 1 నుంచి సర్వే నిర్వహిస్తున్నారు. విద్యాలయంలో వసతి, బోధన తీరు గురించి వివరిస్తున్నారు. ఈ సర్వే జూన్ 12 వరకు కొనసాగుతుందని అధికారులు వెల్లడించారు. వివరాలు సేకరిస్తున్నాం.. కస్తూర్బా విద్యాలయాల్లో సీట్ల భర్తీ కోసం ఉపాధ్యాయులు సర్వే చేస్తున్నారు. అర్హులైన విద్యార్థుల వద్ద నుంచి ప్రవేశాల కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నాం. మొదట బడిబయట, బడి మానేసిన, తల్లిదండ్రులు ఇద్దరు లేని, సింగిల్ పేరెంట్ విద్యార్థులకు ప్రాధాన్యత ఇస్తాం. కేజీబీవీ ఉన్న ప్రాంతం నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఇతర ఉన్నత పాఠశాల లేని వారికి కూడా సీట్లు కేటాయిస్తాం. ఉచితంగా పాఠ్యపుస్తకాలు, నోట్బుక్స్, దుస్తులు, భోజన వసతి ఉంటుంది. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. వృత్తి విద్య, క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో శిక్షణ ఇస్తున్నాం. అర్హులైన వారు సద్వినియోగం చేసుకోవాలి. – సూర్యచైతన్య, బాలికా శిశు అభివృద్ధి అధికారి, నాగర్కర్నూల్ బాలికల భవితకు భరోసా.. కేజీబీవీలో సీటు లభిస్తే.. బాలికలకు నాణ్యమైన విద్యతో పాటు భోజనం, వసతి సదుపాయం కల్పిస్తారు. ఉచితంగా పాఠ్యపుస్తకాలు, నోట్పుస్తకాలు, దుస్తులు, కాస్మోటిక్ చార్జీలు అందజేస్తారు. పోషకాహార లోపాన్ని అరికట్టేందుకు ప్రతి వారం చికెన్, కోడి గుడ్లతో పాటు అల్పాహారం, కందిపప్పుతో కూడిన భోజనం, పండ్లు అందజేస్తారు. విద్యార్థినులంతా నిరుపేద, అనాథ బాలికలు కావడంతో వారికి ఉపాధి పరంగా భరోసా కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం సమగ్ర శిక్షణ పథకం ద్వారా బ్యూటీ అండ్ వెల్నెస్, ఐటీ–ఐటీఈఎస్(ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఐటీ ఎనేబుల్డ్ సర్వీసెస్, వ్యవసాయం, హెల్త్కేర్, కుట్టు శిక్షణ, దుస్తుల తయారీ) తదితర వృత్తుల్లో శిక్షణ ఇస్తారు. ఎంపికై న విద్యార్థినులు ఆధార్కార్డు, బోనఫైడ్, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రం, విద్యార్హత ధ్రువీకరణ పత్రాలు కేజీబీవీల్లో నేరుగా దరఖాస్తు సమర్పించాల్సి ఉంటుంది. మెరుగైన ఉత్తీర్ణత ఇటీవల విడుదలైన పది, ఇంటర్మీడియట్ ఫలితాల్లో కేజీబీవీ విద్యార్థులు మెరుగైన ఉత్తీర్ణత సాధించారు. పదో తరగతి వార్షిక పరీక్షలకు జిల్లాలో 784 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా 726 మంది పాసయ్యారు. రికార్డు స్థాయిలో 93.08 శాతం ఉత్తీర్ణత నమోదు చేశారు. అమ్రాబాద్, బల్మూర్, పదర ,పెద్దకొత్తపల్లి, పెంట్లవెల్లి, ఉప్పునుంతల కస్తూర్బా విద్యాలయాలు వందశాతం ఫలితాలతో ముందంజలో నిలిచాయి. మిగతా చోట్ల కూడా ఫలితాలు 81.82 శాతం నుంచి 97.37శాతంగా ఉంది. అలాగే ఇంటర్మీడియట్ పరీక్షలకు 582 మంది హాజరు కాగా 396 మంది ఉత్తీర్ణతతో 68.04 శాతంగా నమోదైంది. సెకండియర్ పరీక్షలకు 469 మంది హాజరు కాగా.. 391 మంది ఉత్తీర్ణతతో 83.36 శాతంగా నమోదైంది. జూన్ 12 వరకు సర్వే ఆరో తరగతి, ఇంటర్ మొదటి సంవత్సరానికి దరఖాస్తుల స్వీకరణ చదువుకు దూరమవుతున్న బాలికలకు వసతితో కూడిన ఉన్నత విద్య 20 -
మిన్నంటిన రోదనలు
రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన రాఘవేంద్రచారి, వెంకటేష్, మహేష్ పోస్టుమార్టం నిమిత్తం మక్తల్ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువచ్చారు. ఈ సమాచారం అందుకున్న మృతుల కుటుంబీకులు, బంధువులు, స్నేహితులు తరలిరావడంతో ఆస్పత్రి ప్రాంగణమంతా కిటకిటలాడింది. వారి రోదనలతో ఆస్పత్రి పరిసర ప్రాంతాలు హృదయ విదారకంగా మారాయి. పరామర్శించిన ఎమ్మెల్యే రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు మృతిచెందిన విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ప్రభుత్వ ఆస్పత్రికి చేరుకున్నారు. ఎమ్మెల్యేను చూసి మృతుల తల్లిదండ్రులు కాళ్లమీద పడి బోరున విలపించారు. దీంతో ఎమ్మెల్యే వారిని పరామర్శించి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఈ ఘటనపై కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ చంద్రశేఖర్, ఎస్ఐ భాగ్యలక్ష్మిరెడ్డి తెలిపారు. ఆస్పత్రిలోనే మృతదేహాలకు పోస్టుమార్గం నిర్వహించి బంధువులకు అప్పగించినట్లు ఎస్ఐ చెప్పారు. ప్రమాదానికి అతివేగమే ప్రధాన కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. -
చిన్నపాటి నిర్లక్ష్యం.. భారీ మూల్యం
బస్సు, బైక్ ఢీకొని.. ముగ్గురు యువకుల దుర్మరణం ● ట్రిపుల్ రైడింగ్, హెల్మెట్ లేకపోవడం,అతివేగమే ప్రమాదానికి కారణం ● నారాయణపేట జిల్లా మక్తల్లోవిషాదం నింపిన ఘటన ● శోకసంద్రంలో కుటుంబాలు.. పరామర్శించిన ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ప్రతిరోజు వారు కలిసి తిరుగుతూ.. కష్టసుఖాలను పంచుకునేవారు.. శుభకార్యాల్లో ఫొటోలు, వీడియోలు తీస్తూ జీవనం సాగించారు.. జీవితకాలం ఇలాగే సాఫీగా సాగిపోతుందనుకున్న తరుణంలో.. చిన్నపాటి నిర్లక్ష్యం వారి పాలిట శాపంగా మారి.. కాటికి సాగనంపింది.. నిబంధనలను బేఖాతర్ చేస్తూ.. హెల్మెట్ లేకుండా ముగ్గురు కలిసి ఒకే బైక్పై అతివేగంగా వెళ్లి.. ఎదురుగా వచ్చిన బస్సును అదుపు తప్పి ఢీకొట్టడంతో ముగ్గురు యువకులు దుర్మరణం పాలైన సంఘటన మంగళవారం మక్తల్ పట్టణంలో విషాదం నింపింది. హెల్మెట్ లేకపోవడం, మితిమీరిన వేగంతో వాహనం నడపడం వల్ల ఎంతటి భారీ మూల్యం చెల్లించుకోవాల్సివస్తుందో ఈ సంఘటన మరోసారి నిరూపించింది. – మక్తల్ -
నేడు ‘డయల్ యువర్ డీఎం’
నాగర్కర్నూల్ క్రైం: డయల్ యువర్ డీఎం కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించనున్నట్లు నాగర్కర్నూల్ ఆర్టీసీ డిపో మేనేజర్ దేవరాజ్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని ప్రజలు ఆర్టీసీ సంస్థ అభివృద్ధి కోసం తమ సలహాలు అందించేందుకు, ఏవైనా సమస్యలు ఉంటే వాటిని పరిష్కరించుకునేందుకు డయల్ యువర్ డీఎం కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు. సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు కార్యక్రమం కొనసాగుతుందని, ఫోన్ నంబర్ 9959226288కు ఫోన్ చేయాలని తెలియజేశారు. పద్మశ్రీ పురస్కారాలకు దరఖాస్తులు నాగర్కర్నూల్ క్రైం: సామాజిక సేవా రంగంలో విశిష్ట కృషి చేసిన వ్యక్తుల నుంచి పద్మశ్రీ పురస్కారాలకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి సీతారాం మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆర్ట్, ఎడ్యుకేషన్, లెక్చరర్, స్పోర్ట్స్, మెడిసిన్, సోషల్వర్క్, ఇంజినీరింగ్, పబ్లిక్ ఎఫెయిర్స్, సివిల్ సర్వీసెస్, ట్రేడ్ మరియు ఇండస్ట్రీ రంగాల్లో చేసిన కృషి, సాధించిన లక్ష్యాల గురించి 800 పదాలకు మించకుండా padma awardr.gov.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. దరఖాస్తులను 4 సెట్లను జూన్ 1 లోగా జిల్లా యువజన, క్రీడల శాఖ అధికారి కార్యాలయంలో అందజేయాలన్నారు. వైద్య సిబ్బంది డ్రస్ కోడ్ను అమలు చేయాలి లింగాల: వైద్య ఆరోగ్య శాఖలో వైద్య సిబ్బంది విధుల్లోని సమయంలో డ్రస్ కోడ్ను అమలు చేయాలని జిల్లా కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పెటల్స్ సర్వీసెస్(డీసీహెచ్ఎస్) డాక్టర్ రమేష్చంద్ర అన్నారు. మండల కేంద్రంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్(సీహెచ్సీ)ని మంగళవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. వైద్య సిబ్బంది సక్రమంగా విధులకు హాజరు కాకపోవడం, డ్రస్ కోడ్ను అమలు చేయకపోవడాన్ని గమనించి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆస్పత్రిలో పనిచేసే సిబ్బంది ప్రతిఒక్కరూ విధుల్లోని సమయంలో డ్రస్ కోడ్ను అమలు చేయకుంటే ఇక పేషెంట్లకు సిబ్బందికి తేడా ఏమిటని ప్రశ్నించారు. ఆస్పత్రిలో ఉండే అన్ని విభాగాలను ఆయన పరిశీలించారు. వర్షా కాలంలో వచ్చే సీజన్ వ్యాధులకు సంబంధించిన మందులు ఉన్నాయో లేదో అడిగి తెలుసుకున్నారు. సరిపోను మందులు లేకుంటే వివరాలను పంపి తెచ్చుకోవాలని వైద్యాధికారి శివశంకర్కు సూచించారు. ఆస్పత్రిలో జనరేటర్ పనిచేస్తుందా, విద్యుత్ సౌకర్యం పూర్తి స్థాయిలో ఉందా తదితర విషయాలను పరిశీలించారు. వైద్య సిబ్బంది విధులపై అంకితభావంతో పనిచేయాలని సూచించారు. ఓపి ఎంత మేరకు అవుతుందనే విషయాన్ని పరిశీలించారు. సమస్యల సాధనే లక్ష్యంగా పోరాటం : సీపీఎం పాన్గల్: ప్రతి కార్యకర్త ప్రభుత్వాలు అమలుచేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ ప్రజలను చైతన్యం చేస్తూ సమస్యల సాధనే లక్ష్యంగా పోరాటాలు కొనసాగించాలని సీపీఎం ఉమ్మడి రాష్ట్ర నాయకుడు మీర్యం వెంకటేశ్వర్లు అన్నారు. మండలంలోని రేమద్దులలో నిర్వహించిన పార్టీ శిక్షణ తరగతుల ముగింపు కార్యక్రమం మంగళవారం జరగగా.. ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. తెలంగాణ సాయుధ పోరాటంలో భూమి, భుక్తి, వెట్టిచాకిరి విముక్తి కోసం పోరాడి పేదల పక్షాన నిలిచిన చరిత్ర సీపీఎంకు ఉందని గుర్తు చేశారు. భూస్వాముల నుంచి 10 లక్షల ఎకరాల భూమికి విముక్తి కలిగించి పేదలకు పంచిన ఘనత పార్టీకి ఉందని తెలిపారు. పేదలు, రైతులు, కూలీలు, కార్మికుల హక్కుల కోసం పోరాడుతున్నది ఎర్రజెండా పార్టీ అన్నారు. పార్టీ జిల్లా కార్యదర్శి ఎండి జబ్బార్ మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైతులు, కార్మిక చట్టాలను కాలరాస్తూ కార్పొరేట్ శక్తులకు వంత పాడుతోందని.. కనీస అవసరాలకు నోచుకొని స్థితిలో పేదలు ఉన్నారని తెలిపారు. -
కౌంటింగ్ నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు
నాగర్కర్నూల్: లోక్సభ ఎన్నికల కౌటింగ్కు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి కలెక్టర్ ఉదయ్కుమార్ తెలియజేశారు. మంగళవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్, ఇతర ముఖ్య ఎన్నికల అధికారులు లోక్సభ ఎన్నికల కౌంటింగ్ ఏర్పాట్లపై జిల్లా ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం నిర్వహించారు. నాగర్కర్నూల్ లోక్సభ ఎన్నికల రిటర్నింగ్ అధికారి కలెక్టర్ ఉదయ్ కుమార్, రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ కౌంటింగ్కు తీసుకున్న చర్యలను వివరించారు. జూన్ 4న జరిగే ఓట్ల లెక్కింపును ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా పగడ్బందీగా నిర్వహిస్తున్నామని చెప్పారు. నాగర్కర్నూల్ లోకసభ నియోజకవర్గ పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్ వారీగా నెల్లికొండ వ్యవసాయ మార్కెట్యార్డ్లో నాగర్కర్నూల్, కల్వకుర్తి, అచ్చంపేట, కొల్లాపూర్, వనపర్తి, అలంపూర్, గద్వాల అసెంబ్లీ సెగ్మెంట్ల ఈవీఎం యంత్రాలను స్ట్రాంగ్ రూంలో పలువురు అభ్యర్థుల సమక్షంలో సీల్ వేసి పటిష్ట భద్రతను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. కౌంటింగ్ సిబ్బందికి శిక్షణ పూర్తి చేశామని, కౌంటింగ్ను పారదర్శకంగా, సీసీ టీవీ కెమెరాలు, కేంద్ర బలగాల పహారా మధ్య కౌంటింగ్ నిర్వహించనున్నట్లు వివరించారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు కుమార్ దీపక్, సీతరామారావు, ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ పాల్గొన్నారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ ఉదయ్ కుమార్ -
ఎదిర: బ్యాటరీ పరిశ్రమ వద్దే వద్దు..
మహబూబ్నగర్ శివారులోని దివిటిపల్లి వద్ద గత ప్రభుత్వం ఐటీ కారిడార్ను ఏర్పాటు చేసింది. ఈ మేరకు దివిటిపల్లి, ఎదిర, అంబటిపల్లి, సిద్దాయిపల్లి గ్రామాల్లోని రైతుల నుంచి దాదాపు 380 ఎకరా ల భూసేకరణ చేపట్టింది. ఇందులో అత్యధికంగా ఎదిర గ్రామ రైతులే ఉన్నారు. ఐటీ పరిశ్రమలు వస్తే తమ పిల్లల జీవితాలు బాగుపడతాయని భావించిన రైతులు తమ భూములు అప్పగించారు. తీరా పాలకులు అమరరాజ బ్యాటరీ పరిశ్రమను ఇక్కడ నెలకొల్పేందుకు శ్రీకారం చుట్టారు. ఆ పరిశ్రమకు దాదాపు 260 ఎకరాల స్థలం కేటాయించారు. ప్రజాభిప్రాయ సేకరణ సైతం జరగగా.. ఆయా గ్రామా ల ప్రజలు వ్యతిరేకించారు. ఆ తర్వాత క్రమంలో సదరు కంపెనీ భవన నిర్మాణ పనులను ప్రారంభించింది. ఈ క్రమంలో ఎదిర గ్రామస్తులు ఆందోళన బాటపట్టారు. కాలుష్యం వెదజల్లే ఈ పరిశ్రమతో తమ పంట పొలాలు నాశనం అవుతాయని, అనారోగ్యం బారిన పడతామంటూ సుమారు 70 రోజులుగా నిరాహార దీక్షలు చేపట్టారు. ‘అధికార’ యంత్రాంగం పట్టించుకోకపోవడంతో ఇటీవల పార్లమెంట్ ఎన్నికలను బహిష్కరించిన వారు.. ఈ పరిశ్రమ ఏర్పాటుపై ప్రభుత్వం పునరాలోచన చేయాలని.. లేకుంటే భవిష్యత్లో జరిగే ఏ ఎన్నికల్లోనూ ఓటు వేసేది లేదని గ్రామస్తులు స్పష్టం చేస్తున్నారు. నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, అధికారులు పట్టించుకోవడం లేదంటూ ఆగ్రహంతో ఉన్న వారు వరుస ఆందోళనలకు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. -
నేటినుంచి ఓపెన్ డిగ్రీ మొదటి సెమిస్టర్ పరీక్షలు
కొల్లాపూర్: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో మొదటి సెమిస్టర్ చదువుతున్న విద్యార్థులకు మంగళవారం నుంచి పరీక్షలు ప్రారంభమవుతాయని కొల్లాపూర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ రామరాజుయాదవ్, స్టడీ సెంటర్ కోఆర్డినేటర్ రమేష్కుమార్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. జూన్ 6 వరకు పరీక్షలు కొనసాగుతాయని, విద్యార్థులు హాల్టికెట్, ఐడీ ప్రూఫ్తోపాటు ప్యాడు తెచ్చుకోవాలని సూచించారు. పరీక్షలకు గంట ముందుగానే కేంద్రాలకు చేరుకోవాలన్నారు. అలాగే 4, 6వ సెమిస్టర్ చదువుతున్న విద్యార్థులు ఈ నెల 31లోగా పరీక్ష ఫీజు ఆన్లైన్లో చెల్లించాలని సూచించారు. దరఖాస్తుల స్వీకరణ కొల్లాపూర్: పట్టణంలోని ఎస్సీ గురుకుల కళాశాలలో మిగులు సీట్ల భర్తీ కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ప్రిన్సిపల్ జ్యోత్స్న సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. బైపీసీ మొదటి సంవత్సరంలో సీట్లు ఉన్నాయని, ఆసక్తి గల విధ్యార్థులు ఈ నెల 31లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పూర్తి వివరాల కోసం కళాశాలలో సంప్రదించాలని చెప్పారు. ఫిర్యాదులు త్వరగా పరిష్కరించండి నాగర్కర్నూల్ క్రైం: పోలీస్ ప్రజావాణికి వచ్చే ఫిర్యాదులు త్వరగా పరిష్కరించేందుకు సిబ్బంది కృషి చేయాలని ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ అన్నారు. సోమవారం ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన పోలీస్ ప్రజావాణికి వచ్చిన ఫిర్యాదుదారులతో నేరుగా మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీస్ ప్రజావాణికి 9 ఫిర్యాదులు వచ్చాయని, ఇందులో న్యాయం చేయాలని 7, భూమి పంచాయతీకి సంబంధించి 2 ఫిర్యాదులు ఉన్నాయన్నారు. యూనిఫాంలు పంపిణీ చేయాలి బిజినేపల్లి: ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు పదిరోజుల్లో యూనిఫాంలు పంపిణీ చేయాలని డీఆర్డీఓ ఓబులేష్ అన్నారు. సోమవారం తిమ్మాజిపేటలోని మండల మహిళా సమాఖ్య కార్యాలయంలో విద్యార్థుల కోసం ప్రత్యేకంగా తయారు చేస్తున్న దుస్తులను పరిశీలించారు. పది రోజుల్లో యూనిఫాంలను కుట్టి అధికారులకు అందించాలని సూచించారు. విద్యార్థుల కోసం తయారు చేసిన యూనిఫాం ఒక జతకు రూ.50 చొప్పున పాఠశాల హెచ్ఎం ఖాతాలో జమ అవుతాయన్నారు. ఆయన వెంట డీపీఎం అరుణాదేవి, ఏపీఎం శ్రీహరి, ఏపీఓలు, సీసీలు ఉన్నారు. -
బాధిత కుటుంబాలను ఆదుకుంటాం
పద్మ అవార్డుల కోసం దరఖాస్తుల ఆహ్వానం మహబూబ్నగర్ క్రీడలు: కేంద్ర ప్రభుత్వం వివిధ రంగాల్లో విశేష కృషి చేసిన వారి నుంచి పద్మ పురస్కారాల కోసం దరఖాస్తులను (నామినేషన్లు) ఆహ్వానిస్తున్నట్లు జిల్లా యు వజన, క్రీడల అధికారి ఎస్.శ్రీనివాస్ సోమ వారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆర్ట్, సోషల్ వర్క్, సైన్స్ ఇంజనీరింగ్, టేడ్, ఇండస్ట్రీస్, లిటరేచర్, ఎడ్యుకేషన్, స్పోర్ట్స్, మెడిసిన్, సివిల్ సర్వీసెస్ తదితర అంశాల్లో సాధించిన లక్ష్యాలు, చేసిన కృషిని రెండు పేజీలకు 800 పదాలకు మించకుండా పేర్కొంటూ నిర్ణీత ఫార్మాట్లో వచ్చేనెల 3వ తేదీలోగా జిల్లాకేంద్రం మెయిన్ స్టేడియం జిల్లా యువజన, క్రీడల అధికారి కార్యాలయంలో హార్డ్కాపీ, సాఫ్ట్కాపీలను ఇవ్వాలని కోరారు. మిగతా వివరాల కోసం https://padmaawards. gov.in వెబ్సైట్ను సందర్శించాలని ఆయన సూచించారు. – నాగర్కర్నూల్ క్రైం/ తెలకపల్లి/ తాడూరు/ బిజినేపల్లి 8లో u పరామర్శించిన మంత్రి జూపల్లి, ఎమ్మెల్యేలు, ఎంపీ అభ్యర్థి మల్లు రవి -
ధాన్యం కొనుగోళ్లు వేగిరం చేయాలి
కొల్లాపూర్/ పెంట్లవెల్లి/ కోడేరు: ప్రస్తుత వాతావరణ పరిస్థితులను దృష్టి లో పెట్టుకొని వెంటనే వ రిధాన్యం కొనుగోలు పూ ర్తిచేయాలని రాష్ట్ర ఎకై ్సజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. సోమవారం ఆయన పెంట్లవెల్లిలోని వరి కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వర్షాలకు తడవకుండా భద్రపరిచేందుకు తగిన చర్యలు చేపట్టాలన్నారు. రైతుల నుంచి కొన్న ధాన్యానికి సకాలంలో డబ్బులు చెల్లించాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటుందని రైతుకు ఏ కష్టం రాకుండా చూడటమే లక్ష్యంగా సీఎం రేవంత్రెడ్డి ముందుకెళ్తున్నారన్నారు. త్వరలోనే రుణమాఫీ చేస్తామని, రైతుబంధు సాయం పెంపునకు చర్యలు చేపడతామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి పథకం అర్హులైన ప్రతి ఒక్కరికి అందించేందుకు కార్యకర్తలు కృషిచేయాలన్నారు. రైతులకు మేలు చేయడమే లక్ష్యంగా రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. అలాగే మల్లేశ్వరం వెళ్లే దారిలో ఉన్న వరి కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. అనంతరం ఆయన కోడేరు మండలంలోని నర్సాయిపల్లిలో పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆయా కార్యక్రమాల్లో పార్టీ మండలాధ్యక్షుడు నర్సింహయాదవ్, మాజీ సర్పంచ్లు సువర్ణ, ఆంజనేయులు, నాయకులు భాస్కర్గౌడ్, ఎండీ కబీర్, శ్రీనివాసులు, కుమార్, రవి, వెంకటయ్య, రామకృష్ణ, నారాయణ, నర్సింహ తదితరులు పాల్గొన్నారు. సమ్మర్ క్యాంపు పరిశీలన కొల్లాపూర్లో మంత్రి జూపల్లి కృష్ణారావు మార్నింగ్ వాక్ చేశారు. తన క్యాంపు కార్యాలయం నుంచి మినీ స్టేడియం వరకు నడుచుకుంటూ వెళ్లి.. స్టేడియంలో రత్నగిరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమ్మర్ క్యాంపును సందర్శించారు. చిన్నారులతో కలిసి టేబుల్ టెన్నిస్, ఫుట్బాల్ తదితర ఆటలు ఆడారు. ఆరోగ్య పరిరక్షణకు క్రీడలు దోహదపడతాయని చెప్పారు. అనంతరం క్యాంపు కార్యాలయంలో పట్టణానికి చెందిన నాయకులతో వార్డుల వారీగా సమీక్షించారు. -
No Headline
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్ పాలకులు, అధికారుల నిర్లక్ష్యం ఆ గ్రామాల ప్రజలకు శాపంగా మారింది. నిబంధనలకు విరుద్ధంగా ఇచ్చిన మైనింగ్ అనుమతులు.. కాలుష్య కారక పరిశ్రమ ఏర్పాటు ఆ పల్లెల్లోని ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. తమ సమస్యల పరిష్కారం కోసం వివిధ రూపాల్లో నిరసనలు తెలిపినా ఏ ఒక్కరూ పట్టించుకోకపోవడంతో ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికలను బహిష్కరించారు. ప్రజాస్వామ్యంలో వజ్రాయుధమైన ఓటింగ్కు ఆ రెండు గ్రామాల ఓటర్లందరూ దూరంగా ఉండడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అయినా పాలక యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండడంతో న్యాయ పోరాటం కొనసాగుతుందని, వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో సైతం పాల్గొనేది లేదంటూ తేల్చి చెబుతున్నారు. అంతేకాదు వివిధ ప్రజా సంఘాలు, మేధావి వర్గాల మద్దతు కూడగట్టి.. ఉద్యమం ఉధృతం చేసేలా పోరుబాట కార్యాచరణకు సన్నాహాలు ముమ్మరం చేస్తున్నారు. మైలారం: గుట్ట ముద్దు.. మైనింగ్ వద్దు నాగర్కర్నూల్ జిల్లా బల్మూర్ మండలం మైలారం గ్రామానికి ఆనుకుని గుట్ట ఉంది. ఈ గ్రామం మొత్తం ఆ గుట్టను అనుసరించే ఉంది. ఈ ఊరిలో 300 వరకు కుటుంబాలు ఉండగా.. 1,500 వరకు జనాభా ఉన్నట్లు అంచనా. గుట్టపైనే 50కి పైగా నివాస గృహాలతో పాటు నర్సింహస్వామి, వెంకటేశ్వర స్వామి, శివాలయం, మారెమ్మ, పోచమ్మ, ఈదమ్మ ఆలయాలు ఉన్నాయి. నల్లమల అడవీ ప్రాంతానికి సమీపంలో ఈ గ్రామం ఉండడంతో గుట్టపై నెమళ్లతో పాటు ఇతర వన్యప్రాణులు సంచరిస్తూ ఉన్నాయి. ఈ గుట్టపై విలువైన క్వార్ట్జ్, పాల్స్పర్ రాళ్లు ఉండగా.. మైనింగ్ వ్యాపారులు, ఇతర పెద్దలు ఆరేళ్ల క్రితం కన్నేశారు. గుట్టపై సర్వే నంబర్ 120/1లో 98 ఎకరాలకు ఖనిజ తవ్వకాలకు మైనింగ్ శాఖ 2017లో అనుమతి ఇచ్చింది. 2022 వరకు స్తబ్దుగా ఉన్న కాంట్రాక్టర్ తవ్వకాల క్రమంలో గతేడాది సర్వే చేపట్టడంతో విషయం వెలుగులోకి వచ్చింది. గ్రామస్తులు మూకుమ్మడిగా వ్యతిరేకించడంతో తవ్వకాలు నిలిపివేశారు. ఆ తర్వాత ఆర్టీఐ ద్వారా గ్రామసభ తీర్మానం కాపీ వెలుగుచూడగా.. పలువురి సంతకాలను ఫోర్జరీ చేసినట్లు.. 2041 అక్టోబర్ పదోతేదీ వరకు తవ్వకాలు చేసుకునేందుకు మైనింగ్శాఖ అనుమతులు ఇచ్చినట్లు తేలడంతో గ్రామస్తులు ఆందోళన బాట పట్టారు. -
అమ్మ ఆదర్శ కమిటీలకు పాఠశాలల బాధ్యత
నాగర్కర్నూల్: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను పెంచి నాణ్యమైన, గణాత్మకమైన విద్యను అందించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా అమ్మ ఆదర్శ కమిటీలను ఏర్పాటు చేసేలా కార్యాచరణ రూపొందించింది. ఇందులో భాగంగా మహిళా స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో కమిటీలను ఏర్పాటు చేసింది. గతంలో ఉన్న స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలను రద్దు చేసి వాటి స్థానంలో అమ్మ ఆదర్శ కమిటీలను తీసుకువచ్చింది. గ్రామీణ ప్రాంతాల్లో గ్రామ సమాఖ్య అధ్యక్షురాలు, పట్టణ ప్రాంతాల్లో ఏరియా సమాఖ్య అధ్యక్షురాలు కమిటీ చైర్మన్గా, హెచ్ఎంలు కన్వీనర్గా వ్యవహరించనున్నారు. ప్రతి తరగతి గదిలో ముగ్గురు విద్యార్థుల తల్లులను కమిటీలో సభ్యులుగా ఎన్నుకోవాల్సి ఉంటుంది. చైర్మన్, కన్వీనర్కు చెక్ పవర్ ఇస్తూ కమిటీ పేరిట బ్యాంకులో ఖాతా తీసి ప్రభుత్వం నిధులను జమ చేసి వినియోగించనున్నారు. ఈ కమిటీల ద్వారా పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో కమిటీకి రూ.25 వేల చొప్పున నిధులు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లా పరిధిలో ఇలా.. జిల్లాలో మొత్తం 825 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా.. ఇందులో 131 ఉన్నత, 128 ప్రాథమికోన్నత, 566 ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి. ఒక్కో పాఠశాలకు రూ.25 వేల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నిధులు మంజూరు చేసింది. ఈ నిధులతోనే పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ప్రధానంగా తాగునీటి సౌకర్యం, విద్యుత్, ఫ్యాన్ల ఏర్పాటు, లైట్లు, తలుపులు, కిటికీలు, పారిశుద్ధ్య నిర్వహణకు సంబంధించి మరమ్మతు చేసేందుకు ఈ నిధులు వినియోగించనున్నా రు. నూతన నిర్మాణాలకు సంబంధించి కేవలం మరుగుదొడ్లు, మూత్రశాలలు మాత్రమే చేపట్టే ఉంది. ఈ అత్యవసర పనులు మొత్తం రూ.25 వేల నిధులతోనే.. పాఠశాలలు తెరిచేలోగా పూర్తి చేయాల్సి ఉంటుంది. కమిటీల ద్వారానే.. విద్యార్థులకు అవసరమైన పాఠ్య పుస్తకాలు ఇప్పటికే జిల్లాకు చేరగా పంపిణీ కార్యక్రమాన్ని సైతం అమ్మ ఆదర్శ కమిటీల ద్వారా చేపట్టనున్నారు. విద్యార్థులకు యూనిఫాం తయారీ, పాఠ్యపుస్తకాలు, నోట్బుక్కుల పంపిణీ సైతం కమిటీలతోనే ఇప్పించనున్నారు. ఇకపై పాఠశాలల్లో ఏయే పనులు చేపట్టాలనేది అమ్మ ఆదర్శ కమిటీల ద్వారానే నిర్ణయిస్తారు. మహిళా సమాఖ్యల ద్వారా ఏర్పాటు చేసిన కమిటీలతో పాఠశాలల నిర్వహణ, కమిటీల్లో విద్యార్థుల తల్లులు సభ్యులుగా ఉండడం వల్ల రానున్న విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లో బాలికల నమోదు శాతం పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. మహిళా సంఘాల ద్వారా కమిటీల ఏర్పాటు సభ్యులుగా విద్యార్థుల తల్లుల నియామకం జూన్ 12 వరకు మౌలిక వసతులు పూర్తయ్యేలా ప్రణాళిక అనుమతి తప్పనిసరి పాఠశాలల్లో విద్యార్థులకు అవసరమైన మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యంగా అమ్మ ఆదర్శ కమిటీలను ఏర్పాటు చేయడం జరిగింది. ఏ పనులు చేయాలన్న ఈ కమిటీల అనుమతి తప్పనిసరి. ఇప్పటికే కమిటీలను ఏర్పాటు చేసి మౌలిక వసతుల కల్పన కోసం రూ.25 వేల నిధులు మంజూరు చేశారు. పాఠశాలలు తెరిచే నాటికి మౌలిక వసతుల పనులు పూర్తి చేస్తాం. – గోవిందరాజులు, డీఈఓ -
‘ప్రజా పోరాటాలకు సిద్ధం కావాలి’
పాన్గల్: రైతులు, కార్మికుల హక్కుల సాధనే లక్ష్యంగా ప్రజా పోరాటాలకు సిద్ధం కావాలని సీపీఎం జిల్లా కార్యదర్శి ఎండి జబ్బార్ పార్టీ కార్యకర్తలకు సూచించారు. సోమవారం మండలంలోని రేమద్దులలో పార్టీ రాజకీయ శిక్షణ తరగతులను ఆయన ప్రారంభించి మాట్లాడారు. దేశం, రాష్ట్రంలో కొనసాగుతున్న పరిస్థితులపై పార్టీ పాత్ర ఏ విధంగా ఉండాలనే అంశంపై కార్యకర్తలకు శిక్షణ ఇస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న మతోన్మాదం, ప్రజా, కార్మిక, రైతు, నిరుద్యోగ వ్యతిరేక విధానాలను ఎండగడుతూ ఉద్యోగుల భద్రత కాపాడుకోవడం వంటి అంశాలపై పలు సూచనలు చేశారు. కార్పొరేట్ శక్తులకు కొమ్ము కాస్తూ కార్మిక చట్టాలను కాలరాస్తున్న బీజేపీ ప్రభుత్వ విధానాలపై పోరాటాలు నిర్వహించాలని, పార్టీ బలోపేతానికి నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. సమావేశంలో పార్టీ జిల్లా నాయకుడు బాల్యానాయక్, మండల కమిటీ సభ్యులు భగత్, వెంకటయ్య, భాస్కర్, నిరంజన్, బాలరాజ్గౌడ్, జంబులయ్య తదితరులు పాల్గొన్నారు. -
పునరావాసంలో సదుపాయాలు కల్పించాలి
నాగర్కర్నూల్: నల్లమల్ల టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాలోని గ్రామాల తరలింపునకు పునరావాసం కల్పించే గ్రామాల్లో కుటుంబాలకు కావాల్సిన అన్ని సదుపాయాలు కల్పించాలని కలెక్టర్ ఉదయ్కుమార్ అన్నారు. సోమవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో కలెక్టర్ అధ్యక్షతన జిల్లాస్థాయి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్లోని సార్లపల్లి, కుడిచింతల బైలు, కొల్లంపెంట, కొమ్మన్పెంట గ్రామాలను పెద్దకొత్తపల్లి సమీపంలోకి తరలించడానికి ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఆయా గ్రామాల ప్రజలు స్వచ్ఛందంగా జాతీయ పులుల సంరక్షణ అథారిటీ వారికి అప్పగించడం, పునరావాసం కోసం ప్రభుత్వం నుంచి వారికి రావాల్సిన నష్టపరిహారం డబ్బు రూపకంలో, భూమి రూపకంలో అందజేయడానికి ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో రెవెన్యూ భూమి అందుబాటులో లేకపోవడంతో బాచారం అటవీ ప్రాంతంలో అప్పగించడానికి చర్యలు చేపట్టామని, కుటుంబాన్ని ఒక యూనిట్గా తీసుకొని.. రూ.15 లక్షల నష్టపరిహారం ఇస్తామని, భూమి కావాలనుకున్న వారికి భూమి ఇస్తామని చెప్పారు. పునరావాస కేంద్రం కోసం కేటాయించిన ప్రాంత అభివృద్ధికి సంబంధిత అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. అనంతరం ఆయా గ్రామాల ప్రజలతో కలెక్టర్ మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన స్పందిస్తూ వాటిని తక్షణమే పరిష్కరించాలని ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. పునరావాస కేంద్రంలో వసతులపై సంతృప్తి వ్యక్తం చేసి అక్కడికి వెళ్లేందుకు అంగీకరించారు. జిల్లా అటవీ అధికారి రోహిత్ గోపిడి స్వచ్ఛందంగా తమ గ్రామాలను అప్పజెప్పిన ప్రజలకు, వాళ్లకు అవసరమైన ఇళ్లను, భూములను ఏర్పాటు చేయడానికి ప్రణాళిక రూపొందించి కలెక్టర్కు వివరించారు. అదనపు కలెక్టర్లు కుమార్ దీపక్, సీతారామారావు, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు. కౌంటింగ్కు పకడ్బందీగా ఏర్పాట్లు.. జూన్ 4న చేపట్టే పార్లమెంట్ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు పకడ్బందీగా ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ చెప్పారు. సోమవారం ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రధాన ఎన్నికల అధికారులు, జిల్లా ఎన్నికల అధికారులు, రిటర్నింగ్ అధికారులతో కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ రాజీవ్కుమార్ కౌంటింగ్ కసరత్తు కోసం జరుగుతున్న ఏర్పాట్లను సమీక్షించారు. కలెక్టరేట్ నుంచి ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ ఉదయ్కుమార్, అదనపు కలెక్టర్ కుమార్ ్డ దీపక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర ఎన్నికల కమిషనర్ పలు సూచనలు చేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ కౌంటింగ్లో ప్రతి అంశంలోనూ నిబంధనలను నిశితంగా పాటించాలని, కౌంటింగ్ హాల్లో అన్ని చర్యలు పారదర్శకంగా ఉండాలని ఇప్పటికే ఆర్ఓలను ఆదేశించినట్లు వివరించారు. -
పుర చైర్మన్పై అవిశ్వాస అస్త్రం
● అచ్చంపేట మున్సిపాలిటీపై కాంగ్రెస్ గురి ● కలెక్టర్కు నోటీస్ ఇచ్చిన అసమ్మతి కౌన్సిలర్లు ● మద్దతు కూడగడుతున్న అధికార పార్టీ నాయకులు అచ్చంపేట: బీఆర్ఎస్కు చెందిన అచ్చంపేట మున్సిపల్ చైర్మన్ ఎడ్ల నర్సింహాగౌడ్పై ఆవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టే దిశగా అడుగులు పడుతున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో స్థానిక రాజకీయాల్లో కూడా మార్పులు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇతర పార్టీలకు చెందిన కౌన్సిలర్ల సహకారంతో చైర్మన్పై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు ఈనెల 25న కలెక్టర్ను కలిసి నోటీస్ అందజేసినట్లు విశ్వనీయ వర్గాల ద్వారా తెలిసింది. బీఆర్ఎస్ నుంచి చైర్మన్ పీఠం కై వసం చేసుకునే దిశగా కాంగ్రెస్ నాయకులు అడుగులు వేస్తున్నారు. ప్రస్తుతం మారిన రాజకీయ పరిణామాలతో అవిశ్వాసం తెరపైకి వచ్చింది. నెగ్గాలంటే 15 మంది బలం కావాలి.. మున్సిపల్ చైర్మన్పై అవిశ్వాసం పెట్టడానికి 12 మంది కౌన్సిలర్ల మద్దతు ఉంటే సరిపోతుంది. 13 మంది సభ్యులు సంతకాలు చేసి కలెక్టర్కు నోటీస్ అందజేసినట్లు తెలిసింది. అయితే అవిశ్వాసం నెగ్గాలంటే మాత్రం 15 మంది సభ్యులు చేతులు పైకి ఎత్తాల్సి ఉంటుంది. 2021 ఏప్రిల్ 30న జరిగిన ఎన్నికల్లో 20 వార్డులకు గాను బీఆర్ఎస్ 13, కాంగ్రెస్ 6, బీజేపీ 1 స్థానంలో గెలుపొందింది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్కు చెందిన కౌన్సిలర్ అకుల లావణ్య కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్యేగా వంశీకృష్ణ గెలిచిన తర్వాత బీఆర్ఎస్కు చెందిన మున్సిపల్ వైస్ చైర్మన్ పోరెడ్డి శైలజా విష్ణువర్ధన్రెడ్డి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ప్రస్తుతం బీఆర్ఎస్కు సంఖ్యాపరంగా 11 మంది ఉన్నా.. చైర్మన్ పదవి ఆశిస్తున్న కాంగ్రెస్ ఆశావహులు ఇప్పటికే వారితో మంతనాలు సాగించడంతో మెజార్టీ సభ్యులు కాంగ్రెస్ టచ్లోకి వెళ్లారు. ప్రస్తుతం సంఖ్యాపరంగా 8 మంది బలం ఉన్న కాంగ్రెస్ సభ్యులు.. మరో ఐదుగురు బీఆర్ఎస్ కౌన్సిలర్లతో కలిసి అవిశ్వాసానికి నోటీస్ ఇవ్వడంతో వీరి బలం 13కు చేరింది. మరో బీజేపీ సభ్యురాలి మద్దతు కూడగట్టే పనిలో కాంగ్రెస్ నాయకులు నిమగ్నమయ్యారు. కాగా, కాంగ్రెస్కు మద్దతుగా అవిశ్వాస తీర్మానం నోటీస్లో సంతకం చేసిన ఓ బీఆర్ఎస్ కౌన్సిలర్ తిరిగి బీఆర్ఎస్ వైపే ఉంటానని చెప్పడం చర్చనీయాంశమైంది. ఇదే జరిగితే కాంగ్రెస్కు మద్దతుగా 12మంది, బీఆర్ఎస్కు ఏడుగురు, బీజేపీ తరఫున ఒకరు ఉంటారు. కలెక్టర్కు ఇచ్చిన నోటీస్ ప్రకారం జూన్ 12న అవిశ్వాసం తీర్మానం ప్రవేశపెట్టే అవకాశం ఉంది. క్యాంపు రాజకీయాలు? మున్సిపల్ చైర్మన్పై అవిశ్వాస తీర్మానం నోటీస్ అందజేసిన కాంగ్రెస్, బీజేపీ కౌన్సిలర్లు హైదరాబాద్ నుంచి క్యాంపు రాజకీయాలు చేస్తున్నారు. రెండు రోజుల్లో మరింత మంది కౌన్సిలర్లు క్యాంపునకు వెళ్లే అవకాశం ఉన్నట్లు తెలిసింది. బీఆర్ఎస్కు చెందిన కౌన్సిలర్లు కాంగ్రెస్ కండువాలు కప్పుకోవడంతో పాటు పార్టీ మారినందుకు కొంత మొత్తంలో ముట్టినట్లు విశ్వసనీయ సమాచారం. కీలకం కానున్న బీజేపీ.. మున్సిపల్ చైర్మన్పై అవిశ్వాస తీర్మానంలో బీజేపీ సభ్యురాలు కీలకమయ్యే అవకాశం ఉంది. 9వ వార్డు నుంచి గెలుపొందిన కౌన్సిలర్ సుగుణమ్మ మద్దతు కూడగట్టేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ప్రయత్నాలు కొనసాగిస్తున్నాయి. బీజేపీతో పాటు మరికొందరు బీఆర్ఎస్కు చెందిన వారు కలిసి వస్తేనే అవిశ్వాసం నెగ్గే అవకాశం ఉంటుంది. కానీ జాతీయ రాజకీయాల దృష్ట్యా బీజేపీ ఏమేరకు కలిసి వస్తుందనేది వేచి చూడాల్సిందే. కలెక్టర్కు అందజేసిన అవిశ్వాస నోటీస్లో 13 మంది సభ్యుల సంతకాలు ఉండగా.. ఒకరు అటు, ఇటుగా ఉండటంతో 12 సభ్యులు మాత్రమే కాంగ్రెస్ వైపు ఉన్నట్లు భావిస్తున్నారు. ఎక్స్ అఫీషియో సభ్యుడిగా నోటీస్లో ఎమ్మెల్యే సంతకం కూడా ఉండటంతో సంఖ్యాబలం 13కు చేరుతుంది. మరో ఇద్దరి సభ్యుల మద్దతు కూడగట్టే పనిలో కాంగ్రెస్ నాయకులు ఉన్నారు. బీజేపీ మద్దతు లేదా ఎంపీ, ఎమ్మెల్సీ ఫలితాల వెల్లడి తర్వాత వారి మద్దతుపై కాంగ్రెస్ అశలు పెట్టుకుంది. -
టీచర్లపై అడ్మిషన్ల ఒత్తిడి
● ప్రైవేటు విద్యాసంస్థల్లో బోధన, బోధనేతర సిబ్బందికి టార్గెట్ ● పిల్లలను చేర్పిస్తేనే కొనసాగింపు.. జీతం పెంపు ● వేసవి సెలవుల్లో ఇంటింటికీ తిరుగుతున్న ఉపాధ్యాయులు అచ్చంపేట: వారంతా విద్యావంతులు.. భావిభారత పౌరులను తీర్చిదిద్దుతున్న ఉపాధ్యాయులు. కానీ వారి భవిష్యత్ మాత్రం అగమ్యగోచరం. ఆదివారం అయినా.. వేసవి సెలవులు అయినా తమ స్కూల్ పని చేయాల్సిందే. ఇక కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమవుతుందంటే, వారి గుండెల్లో రైళ్లు పరుగెడుతుంటాయి. యాజమాన్యం చెప్పినన్ని అడ్మిషన్లు చేయించకుంటే ఉద్యోగం ఉంటుందో.. ఊడుతుందో తెలియని పరిస్థితి. అందుకే వేసవి సెలవుల్లోనూ ఇంటింటికీ తిరుగుతూ, పిల్లలను తమ విద్యాసంస్థల్లో చేర్పించాలని తల్లిదండ్రులను బతిమాలుకుంటున్నారు. స్కూల్లో పిల్లల చేరికకు సంబంధించి రిజర్వు చేసుకుంటే ఫీజులో రాయితీ ఇస్తామని పేర్కొంటూ.. అడ్మిషన్ ఫారంలో సంతకం చేసేవరకు ఆ ఇంటిని వదలడం లేదు. తీవ్ర స్థాయిలో ఒత్తిడి.. ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలలు, కళాశాలల్లో పనిచేస్తున్న బోధన, బోధనేతర సిబ్బంది మెడపై అడ్మిషన్ల అనే కత్తి వేలాడుతోంది. 2024–25 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు భారీగా చేయాలటూ యాజమాన్యాలు తీవ్రస్థాయిలో ఒత్తిడి చేస్తున్నాయి. అడ్మిషన్ల సంఖ్య మేరకు వచ్చే విద్యా సంవత్సరంలో జీతాల చెల్లింపు.. ఇంక్రిమెంట్లు, ఉద్యోగ భద్రత ఉంటుండటం ప్రైవేటు టీచర్లకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. యాజమాన్యాలు విధించే నిబంధనలు భరించలేక, అలాగని బయటకు రాలేక సతమతమవుతున్నారు. పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తిని యాచక వృత్తి కంటే హీనంగా దిగజారుస్తున్నారంటూ పలువురు వాపోతున్నారు. జిల్లాలోని ప్రైవేటు స్కూళ్లు, కళాశాలల్లో సుమారు 5వేలకు పైగా బోధన, బోధనేతర సిబ్బంది పనిచేస్తుండగా.. దాదాపుగా అందరిదీ అదే పరిస్థితి. 5నుంచి 40 వరకు టార్గెట్.. ప్రైవేటు స్కూళ్లు, కాలేజీల్లో పనిచేస్తున్న టీచర్లు ఇతర ఉద్యోగులు 5నుంచి 10 అడ్మిషన్లు చేయాలని టార్గెట్ విధిస్తున్నారు. అదే కార్పొరేట్ స్కూళ్లు, కాలేజీ అయితే 30–40 అడ్మిషన్లు చేయాల్సిందే. దీంతో ఎండ, గాలివానను సైతం లెక్కచేయకుండా ఇంటింటికీ తిరుగుతున్నారు. తమ పాఠశాల, కళాశాలల్లో మెరుగైన బోధన ఉంటుందని.. ఫలితాలు చూడాలంటూ పిల్లల తల్లిదండ్రులకు పేపర్లు చూపుతున్నారు. వారి ఫోన్ నంబర్ తీసుకుని రోజూ నాలుగైదు సార్లు ఫోన్లు చేస్తున్నారు. ఉద్యోగులతో వెట్టిచాకిరి.. యాజమాన్యాలు తమకు అడ్మిషన్ల టార్గెట్ విధించడమే కాకుండా, వెట్టిచాకిరి చేయించుకుంటున్నాయని బోధన, బోధనేతర సిబ్బంది ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. రోజూ 10–12 గంటలు పనిచేయాలని.. సెలవు రోజు, పండుగ దినాల్లో సైతం స్కూళ్లకు వెళ్లాల్సిందేనని.. పనికి తగ్గ వేతనం మాత్రం ఇవ్వడం లేదని వాపోతున్నారు. టీటీసీ, బీఈడీ, పీజీ, ఎంబీఏ తదితర కోర్సులు చేసి, జీవనోపాఽధి కోసం ప్రైవేటులో పనిచేస్తున్నామని పేర్కొంటున్నారు. ఇక్కడ ఉద్యోగ భద్రత లేకపోగా.. పని ఒత్తిడితో తీవ్ర మానసిక క్షోభకు గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నాఉ. కాగా, చాలా స్కూళ్లు, కాలేజీల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు ఈఎస్ఐ, పీఎఫ్ సదుపాయం కూడా లేకపోవడం గమనార్హం. -
నాగర్ కర్నూల్: ఈదురుగాలుల బీభత్సం.. గోడ కూలి నలుగురు మృతి
సాక్షి, నాగర్ కర్నూల్ జిల్లా: తాడూరు మండలం ఇంద్రకల్లో విషాదం చోటుచేసుకుంది. అకాల వర్షం కూలీ కుటుంబాల బతుకులను చేసింది. ఈ విషాద సంఘటనతో గ్రామంలో విషాదం అలుముకుంది. ఆదివారం సాయంత్రం అకాలంగా ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈదురు గాలుల తాకిడికి గ్రామంలో నిర్మాణంలో ఉన్న కోళ్ల షెడ్డు కూలి నలుగురు మృత్యువాత పడగా మరో ఇద్దరి కూలీలు తీవ్రంగా గాయపడ్డారు.ఇంద్రకల్ గ్రామంలో కోళ్ల ఫారం నిర్మాణానికి 6 మంది కూలీలు వెళ్లారు. గోడలు కడుతుండగా ఈదురుగాలతో కూడిన వర్షం కురిసింది పని ముగించుకొని నిర్మాణంలో ఉన్న గోడ పక్కనే కూర్చున్నారు. తీవ్రమైన ఈదురుగాలులతో ఒక్కసారిగా గోడకూలి కూలీలపై పడింది. దీంతో ఇద్దరు మహిళలు, ఇద్దరు పురుషులు అక్కడికక్కడే మృత్యువాత పడగా మరో ఇద్దరు కూలీలకు తీవ్రంగా గాయాలయ్యాయి. ఈ సంఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. -
బీసీజీ వ్యాక్సినేషన్కు ప్రణాళిక
నాగర్కర్నూల్ క్రైం: జిల్లాలో వందశాతం బీసీజీ వ్యాక్సినేషన్కు పక్కా ప్రణాళిక రూపొందిస్తున్నట్లు డీఎంహెచ్ఓ డా.సుధాకర్లాల్ అన్నారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో శనివారం జిల్లా వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో బీసీజీ వ్యాక్సినేషన్పై ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులు, పర్యవేక్షణ అధికారులు, ఆశా నోడల్ పర్సన్స్, టీబీ నోడల్ పర్సన్స్కు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా డీఎంహెచ్ఓ మాట్లాడుతూ అన్ని గ్రామపంచాయతీల్లో పెద్దలకు బీసీజీ వ్యాక్సిన్ అందించేందుకు అవసరమైన కార్యాచరణ చురుకుగా సాగుతోందన్నారు. ఇప్పటికే వివిధ స్దాయిల్లో శిక్షణ కార్యక్రమాలు నిర్వహించినట్లు చెప్పారు. పీహెచ్సీలు, వెల్నెస్, వ్యాక్సినేషన్ కేంద్రాల్లో బీసీజీ వ్యాక్సిన్ ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. వ్యాక్సిన్ తీసుకోవాల్సిన వారిని ఇంటింటి సర్వేతో గుర్తిస్తామన్నారు. హెచ్ఐవీ బాధితులు, అవయవ మార్పిడి చేసుకున్నవారు, గర్భిణులు, బాలింతలు ఇతర వ్యాక్సిన్ల రియాక్షన్ ఉన్న వారు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు బీసీజీ వ్యాక్సిన్ ఇవ్వమని తెలిపారు. 60 ఏళ్లు పైబడిన వారందరితో పాటు మద్యం, దూమపానం తాగే వారు, గతంలో పొగ తాగిన వారికి, క్షయ వ్యాధిగ్రస్తులతో సన్నిహితంగా ఉన్నవారికి, ఐదేళ్లుగా క్షయ వ్యాధిగ్రస్తులు ఉన్న ఇంట్లోని ఇతర కుటుంబ సభ్యులకు వ్యాక్సిన్ ఇస్తామని తెలిపారు. సమావేశంలో డిప్యూటీ డీఎంహెచ్ డా.వెంకటదాసు, డా.భీమానాయక్, ప్రోగ్రాం అధికారులు డా.రవికుమార్ నాయక్, డా.కృష్ణ్ణమోహన్, డా.లక్ష్మణ్, డా.సాయినాథ్రెడ్డి, డా.రాజశేఖర్, డా.ప్రదీప్, రేణయ్య పాల్గొన్నారు. -
రికవరీకి ప్రత్యేక బృందాలు..
జిల్లా ఎస్పీగా గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత చోరీల కట్టడి కోసం పోలీసు సిబ్బందిని అప్రమత్తం చేశారు. చోరీ కేసులను త్వరగా ఛేదించడం.. సొమ్మును రికవరీ చేసేందుకు గాను ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేశారు. చోరీ కేసుల దర్యాప్తులో సాంకేతిక పరిజ్ఞానాన్ని పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకుంటున్నారు. దొంగలకు న్యాయస్థానాల్లో శిక్ష పడేలా చర్యలు తీసుకుంటున్నారు. సీసీ కెమెరాల ఆవశ్యకతపై అవగాహన.. జిల్లాలో చోరీల నియంత్రణకు పోలీసులు తీసుకుంటున్న చర్యల్లో భాగంగా సీసీ కెమెరాల ఆవశ్యకతపై ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పట్టణ, గ్రామాల్లోని అన్ని కాలనీలతో పాటు దుకాణాల వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని సూచిస్తున్నారు. సీసీ కెమెరాలతో నేరాలు, చోరీలను నియంత్రించడంతో పాటు అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడే వ్యక్తులను త్వరగా గుర్తించేందుకు వీలుంటుందని పేర్కొంటున్నారు. -
No Headline
నాగర్కర్నూల్ క్రైం: జిల్లాలో కొన్ని రోజులుగా ఎక్కడో ఒకచోట నిత్యం చోరీలు చోటు చేసుకుంటున్నాయి. ప్రస్తుతం వేసవి సెలవులు కావడంతో కుటుంబ సమేతంగా విహార యాత్రలు, పట్టణాల నుంచి స్వగ్రామాలకు వెళ్తున్న వారి ఇళ్లను దొంగలు టార్గెట్ చేసుకొని తమ చేతివాటం ప్రదర్శిస్తున్నారు. పలు ప్రాంతాల్లో వరుస చోరీలతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఇంటికి తాళంవేసి ఎక్కడికయినా వెళ్లాలంటే జంకే పరిస్థితి నెలకొంది. ఈక్రమంలో నాగర్కర్నూల్, కల్వకుర్తి, కొల్లాపూర్, అచ్చంపేట ప్రాంతాలలో చోరీలకు అడ్డుకట్ట వేసేందుకు పోలీసు శాఖ పటిష్ట చర్యలు చేపట్టింది. పట్టణ శివారు ప్రాంతాల్లోని ఇళ్లలో చోరీలను అరికట్టేందుకు రాత్రివేళ పోలీసు గస్తీని పెంచింది. పట్టణాల్లోని కాలనీలు, గ్రామాల్లో అనుమానిత వ్యక్తుల కదలికలపై ప్రత్యేక నిఘా పెడుతున్నారు. చోరీల నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. -
కార్మిక హక్కులపై అవగాహన ఉండాలి
నాగర్కర్నూల్ క్రైం: అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కార్మికులకు తమ హక్కులపై అవగాహన ఉండాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్జడ్జి జి.సబిత అన్నారు. నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో శనివారం మున్సిపాలిటీలోని ఎండబెట్లలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈసందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ అసంఘటిత రంగంలో పనిచేసే కార్మికులు తప్పనిసరిగా ఈ శ్రమ్ పోర్టల్లో తమ పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు. ఎవరైనా కార్మికుల హక్కులకు భంగం కలిగిస్తే చట్టపరమైన చర్యలు తప్పవన్నారు. బాధిత కార్మికులకు ఉచితంగా న్యాయ సలహాలు, సేవలు అందించేందుకు జిల్లా, మండల స్థాయిలో న్యాయ సేవాధికార సంస్థ పనిచేస్తోందని అన్నారు. గతంలో నేరస్తుడికి తగిన శిక్ష పడాలని ప్రాధాన్యం ఇచ్చేవారని.. ఇప్పుడు నేరస్తులకు శిక్షతో పాటు బాధితులకు సత్వర న్యాయం అందించేందుకు చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. అనంతరం జిల్లా కేంద్రంలోని సబ్ జైలును తనిఖీ చేశారు. జైల్లో ఉన్న 23 ఖైదీలకు అందిస్తున్న సదుపాయాలను జైలర్ నాగరాజుతో తెలుసుకున్నారు. కార్యక్రమంలో రెండవ అదనపు జూనియర్ సివిల్జడ్జి శ్రీనిధి, న్యాయవాదులు పాల్గొన్నారు. -
చదువుతోపాటు క్రీడలు అవసరం
నాగర్కర్నూల్ క్రైం: విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలు అవసరమని జిల్లా యువజన క్రీడల శాఖ అఽధికారి సీతారాం అన్నారు. జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్న కరాటే శిక్షణ శిబిరాన్ని శనివారం పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలతో శారీరక దారుఢ్యం, చురుకుదనం పెంపొందుతుందన్నారు. ఆత్మరక్షణకు కరాటే ఎంతో ఉపయోగపడుతుందని.. ప్రస్తుత సమాజంలో బాలబాలికలు కరాటే నేర్చుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. కార్యక్రమంలో మాస్టర్లు రవికుమార్, స్వాతి ఉన్నారు. విత్తనాల కొనుగోలులో జాగ్రత్తలు పాటించాలి నాగర్కర్నూల్రూరల్: వానాకాలం పంటసాగుకు సంబంధించి విత్తనాల కొనుగోలులో రైతులు జాగ్రత్తలు పాటించాలని డీఏఓ ఎం.చంద్రశేఖర్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. వ్యవసాయాధికారుల సూచనల మేరకు లైసెన్స్ కలిగిన డీలర్ వద్దనే విత్తనాలను కొనుగోలుచేసి, తప్పనిసరిగా రసీదు పొందాలని సూచించారు. రసీదులో విత్తనం రకం, లాట్ నంబర్, కంపెనీ నంబర్ను, గడువు తేదీ, డీలర్ సంతకం ఉండేవిధంగా చూసుకోవాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ లూజ్ విత్తనాలు, పగిలిన ప్యాకెట్, డబ్బాల విత్తనాలను కొనుగోలు చేయకూడదని తెలిపారు. ప్యాకెట్లపై ముద్రించిన సమాచారం, బిల్లులో సమాచారాన్ని సరిచూసుకోవాలని సూచించారు. బీటీ కాటన్ విత్తన ప్యాకెట్లపై జీఈఏసి అప్రూవల్ నంబర్ తదితర సమాచారంతో పాటు మన ప్రాంతంలో సాగుకు అనువైనదో కాదో తెలుసుకోవాలని తెలిపారు. రైతులు నాణ్యమైన విత్తనాలను ఎంచుకోవాలన్నారు. బీటీ–3 పిలువబడే రకాలైన విత్తనాలకు ప్రభుత్వ అనుమతి లేదని.. ఈ విత్తనాల తయారీ, అమ్మకాలను నిషేధించినట్లు తెలిపారు. విత్తనాల కొనుగోలుపై ఈనెల 31వ తేదీ వరకు వ్యవసాయ శాఖ ఆద్వర్యంలో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామని.. రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రామన్పాడుకు కొనసాగుతున్న వరద మదనాపురం: మండలంలోని రామన్పాడు జలాశయానికి వరద స్వల్పంగా కొనసాగుతోంది. శనివారం జలాశయంలో 1,012 అడుగుల నీటిమట్టం ఉన్నట్లు ఏఈ సింగిరెడ్డి రనీల్రెడ్డి తెలిపారు. జూరాల ఎడమ కాల్వ ద్వారా నీటి సరఫరా లేదని.. సమాంతర కాల్వ ద్వారా 27 క్యూసెక్కుల వరద వస్తున్నట్లు వివరించారు. తాగునీటి అవసరాలకు నిత్యం 20 క్కూసెక్కులు వినియోగిస్తున్నామని చెప్పారు.
Pagination
కూటమి ఓటమి.. ఆర్కే నోట ఊహించని పలుకు!
మే 31న సిట్ విచారణకు హాజరవుతా: ప్రజ్వల్ రేవర్ణ
టార్గెట్ పిన్నెల్లి
గ్యాంగ్స్టర్తో పార్టీ? స్పందించిన కంగనా రనౌత్
ఈడీ కోర్టును ధిక్కరించింది.. లిక్కర్ కేసులో కవిత లాయర్ వాదనలు
Anant-Radhika Pre Wedding : ఇటలీకి పయనమైన సెలబ్రిటీలు, ఫోటోలు వైరల్
Kavya Maran: మంచి మనసు.. కానీ ఒంటరితనం? పర్సనల్ లైఫ్లో..
రిజిస్ట్రేషన్ల జోరు
ముంపు ప్రాంతాలపై అప్రమత్తంగా ఉండాలి
కౌంటింగ్కు కట్టుదిట్టమైన ఏర్పాట్లు
యూనిఫాం స్టిచింగ్ వేగవంతం చేయాలి
ఇరిగేషన్ ఎస్ఈ ఎవరు?
జీపీని తనిఖీ చేసిన డీపీఓ
పెట్టుబడి తగ్గి.. దిగుబడి పెరిగి
మార్పుతో మంచి ఫలితాలు..
పెదనందిపాడులో నాట్స్ మెగా కంటి ఉచిత వైద్య శిబిరం!
బ్రిజ్భూషణ్ కుమారుడు కరణ్ కాన్వాయ్ బీభత్సం.. ఇద్దరు మృతి
తప్పక చదవండి
- అదుపుతప్పి లోయలో పడిన బస్సు.. 28 మంది మృతి
- నీటి వృథాపై ఢిల్లీ జల్బోర్డు కీలక నిర్ణయం
- నీటి వృథాపై ఢిల్లీ జల్బోర్డు కీలక నిర్ణయం
- సుధీర్ బాబు సినిమా.. మిస్డ్ కాల్తో ఐఫోన్, జీప్ గెలుచుకోండి
- అమీర్ ఖాన్ కుమారుడి ఫస్ట్ సినిమా.. నేరుగా ఓటీటీలోనే విడుదల
- T20 World Cup 2024: సూపర్-8లో టీమిండియా ప్రత్యర్థులు వీరే..!
- 16కు తగ్గదు.. 30కి పెరగదు.. ఏసీతో ఎందుకలా?
- పెరుగుతున్న బంగారం ధరలు.. రూ.లక్ష మార్కు చేరిన వెండి
- కేజ్రీవాల్కు బిగ్ షాక్
- చైల్డ్ ట్రాఫికింగ్ కేసులో నిందితులుగా పేరెంట్స్!
Advertisement