ఒత్తిడి నియంత్రణపై అవగాహన అవసరం
ఆదిలాబాద్: ఒత్తిడి నియంత్రణపై అవగాహన ఉండాలని రిమ్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఓం ప్రకాశ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని డైట్ కళాశాలలో ప్రభు త్వ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులకు నిర్వహిస్తున్న కెరీర్ కౌన్సెలింగ్ అండ్ గైడెన్స్ శిక్షణ శని వారంతో ముగిసింది. రెండో రోజు శిక్షణలో భాగంగా స్ట్రెస్ మేనేజ్మెంట్పై ఉపాధ్యాయులకు అవగా హన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఒత్తిడిని జయించినప్పుడే మానసిక ఆరో గ్యం సాధ్యమవుతుందన్నారు. కార్యక్రమంలో డైట్ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ కిరణ్ కుమార్, రిసోర్స్ పర్సన్ ఏలియా, ప్రమోద్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment