● ఓటర్ల జాబితా సిద్ధం చేయండి ● ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
కై లాస్నగర్: పంచాయతీ ఎన్నికలకు సర్కారు సన్నద్ధమవుతోంది. ఆ దిశగా మార్పులు, చేర్పులతో కూడిన ఓటర్ల జాబితాలను సిద్ధం చేయాలని శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 2వరకు ఓటర్ల జాబితాను సిద్ధం చేసి 3న ప్రకటించాలని పేర్కొంది. 4న రాజకీయ పార్టీల నాయకులతో సమావేశాలు నిర్వహించి తుది జాబితాలను వెల్లడించాలని స్పష్టం చేసింది. ఈ మేరకు జిల్లా పంచాయతీ అధికారులు కసరత్తు ప్రారంభించారు. గ్రామ పంచాయతీ, వార్డుల వారీగా జాబితాలను సిద్ధం చేసే పనిలో నిమగ్నమయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment