వ్యాన్‌ బోల్తా పడి యువకుడి మృతి | Sakshi
Sakshi News home page

వ్యాన్‌ బోల్తా పడి యువకుడి మృతి

Published Tue, Apr 23 2024 8:40 AM

- - Sakshi

సీఎం జగన్‌మోహన్‌రెడ్డిని కలిసిన మన్యం నేతలు

సాక్షి, పాడేరు: విశాఖలో పర్యటించిన వైఎస్సార్‌సీపీ అధినేత, సీఎం వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డిని ఆదివారం రాత్రి జిల్లాలోని పలువురు నేతలు కలిశారు.జిల్లా పార్టీ అధ్యక్షురాలు, పాడేరు ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి, ఆమె భర్త డాక్టర్‌ తమర్భ నరసింగరావు,అ రకు ఎంపీ అభ్యర్ధి డాక్టర్‌ గుమ్మా తనూజరాణి,ఆమె భర్త చెట్టి వినయ్‌,ఉమ్మడి విశాఖ జడ్పీ చైర్‌పర్సన్‌ జల్లిపల్లి సుభద్ర, పాడేరు అసెంబ్లీ అభ్యర్ధి మత్స్యరాస విశ్వేశ్వరరాజులు వేర్వేరుగా కలిశారు.అరకు పార్లమెంట్‌తో పాటు జిల్లాలోని మూడు అసెంబ్లీ స్థానాల్లో వైఎస్సార్‌సీపీ భారీ విజయంపై అధినేతకు వారు సమగ్రంగా వివరించారు.

మాడుగుల రూరల్‌: మండలంలోని కొండయ్యపాలెం వద్ద సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో పోతనపూడి గ్రామానికి చెందిన వడ్డాది పవన్‌కుమార్‌(24) అనే యువకుడు మృతి చెందాడు. స్థానిక ఎస్‌ఐ పి.దామోదర్‌నాయుడు కథనం ప్రకారం వివరాలు... పోతనపూడిలో గల ఎం.వరహాలుబాబు టెంట్‌ హౌస్‌లో పవన్‌కుమార్‌ పనిచేస్తున్నాడు. రావికమతం మండలం పోన్నవోలులో ఆదివారం జరిగిన వివాహానికి టెంట్‌ హౌస్‌ నుంచి జనరేటర్‌, ఇతర సామగ్రిని తీసుకెళ్లారు. అక్కడ కార్యక్రమం పూర్తయిన తర్వాత సోమవారం ఉదయం సామగ్రి, లైటింగ్‌, జనరేటర్‌ను బొలేరో వాహనంలో పోన్నవోలు నుంచి పోతనపూడి తీసుకొస్తుండగా కొండయ్యపాలెం వద్ద వ్యాన్‌ అదుపుతప్పి పక్కనున్న పంటపొలాల్లో బోల్తాపడింది. వాహనం వెనుక భాగంలో కూర్చున్న పవన్‌కుమార్‌ మీద వాహనం, వాహనంలోని ఉన్న జనరేటర్‌ పడ్డాయి. దీంతో తీవ్రంగా గాయపడిన ఆ యువకుడు అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ దామోదర్‌ నాయుడు తెలిపారు. మృతదేహానికి అనకాపల్లి ఏరియా ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి, అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించినట్టు ఎస్‌ఐ చెప్పారు.

బొల్తా పడిన వ్యాన్‌
1/2

బొల్తా పడిన వ్యాన్‌

పవన్‌కుమార్‌ 
మృతదేహం
2/2

పవన్‌కుమార్‌ మృతదేహం

Advertisement
Advertisement