గత టీడీపీ హయాంలో కేంద్రం నుంచి వచ్చిన ఎన్ఆర్జీఎస్ సీసీ రోడ్లు తప్పా ఎటువంటి అభివృద్ధి పనులు చేయలేదు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచీ నాలుగున్నరేళ్లలో అభివృద్ధి, సంక్షేమంలో చాలా ఎక్కువగా చేశాం. నియోజకవర్గంలో అన్ని రోడ్లను కొత్తగా వేయించాం. ప్రతీ గ్రామంలో సచివాలయాలు, ఆర్బీకేలు, హెల్త్ సెంటర్లు కట్టించి ప్రభుత్వ సేవలందేలా చేసింది. గిరిజన తండాలకు మంచినీరు అందించాం. ఆస్పత్రులు అభివృద్ధి చేశాం. రూ.1,800 కోట్లతో అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రజలకు అందించిన ఏకై క ప్రభుత్వం మాదే. రానున్న రోజుల్లో మరింత అభివృద్ధి పనులు చేపడతాం.
– కరణం ధర్మశ్రీ,
ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్, చోడవరం