చింతపల్లి: జిల్లాలో కనిష్ట ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరుగుతున్నాయి. అయితే మంచు ప్రభావం తగ్గడంలేదు. బుధవారం జీకే వీధిలో 12.8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైనట్టు చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ఏడీఆర్, వాతావరణ విభాగం నోడల్ అధికారి డాక్టర్ ఆళ్ల అప్పలస్వామి తెలిపారు.పాడేరుల డివిజన్ పరిధిలో జి.మాడుగులలో 12.9 డిగ్రీలు, అరకులోయలో 12.9 డిగ్రీలు,చింతపల్లిలో 13.5 డిగ్రీలు,డుంబ్రిగుడలో 13.7 డిగ్రీలు,పాడేరులో 14.0 డిగ్రీలు,పెదబయలులో 14.5 డిగ్రీలు,హుకుంపేటలో 14.7 డిగ్రీలు,ముంచంగిపుట్టులో 15.8 డిగ్రీలు,అనంతగిరిలో 19.4 డిగ్రీలు, కొయ్యూరులో 19.7 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదైనట్టు ఏడీఆర్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment