కళ్యాణదుర్గం రూరల్: పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట గురువారం శ్రీరామరెడ్డి, సత్యసాయి నీటి సరఫరా కార్మికులు అర్ధనగ్న ప్రదర్శనతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 8 నెలలుగా తమకు జీతాలు చెల్లించడం లేదన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే కార్మికుల జీతాలు చెల్లిస్తామని చెప్పిన నాయకులు ఇప్పుడు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమ డిమాండ్లు పరిష్కరించే వరకూ సమ్మె విరమించే ప్రసక్తే లేదన్నారు. కార్యక్రమంలో శ్రీరామరెడ్డి, సత్యసాయి నీటి సరఫరా కార్మికులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment