భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి నిత్యకల్యాణ వేడుక గురువారం నయనానందకరంగా సాగింది. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. ఆ తర్వాత స్వామి వారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు.
పెద్దమ్మతల్లికి
సువర్ణ పుష్పార్చన
పాల్వంచరూరల్ : మండల పరిధిలోని కేశవాపురం – జగన్నాథపురం గ్రామాల మధ్య కొలువుదీరిన శ్రీ పెద్దమ్మతల్లి అమ్మవారికి గురువారం 108 సువర్ణ పుష్పాలతో అర్చన నిర్వహించారు. అనంతరం నివేదన, మంత్రపుష్పం, హారతి సమర్పించారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ రజనీకుమారి, వేదపడింతులు పద్మనాభశర్మ, అర్చకులు రవికుమార్శర్మ పాల్గొన్నారు.
నేడు ‘నిధి ఆప్ కే నికట్’
ఖమ్మం సహకారనగర్: ఎంప్లాయీస్ ప్రావిడెండ్ ఫండ్ ఆర్గనైజేషన్(ఈపీఎఫ్ఓ) ఆధ్వర్యాన ఉద్యోగులు, పెన్షనర్ల సమస్యల పరిష్కారం కోసం శుక్రవారం నిధి ఆప్ కే నికట్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఖమ్మం, భద్రాద్రి జిల్లాల ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్లు కె.సునీల్, రబీలాల్దాస్ తెలిపారు. ఖమ్మం జిల్లా ఉద్యోగులు, పెన్షనర్లకు మధిర పంచాయతీ కార్యాలయంలో, భద్రాద్రి జిల్లా వాసులకు లక్ష్మీదేవిపల్లిలోని త్రివేణి హైస్కూల్ యమునా క్యాంపస్లో కార్యక్రమం ఏర్పాటుచేసినట్లు పేర్కొన్నారు. శుక్రవారం ఉదయం 9–15నుంచి సాయంత్రం 4 గంటల వరకు కార్యక్రమం కొనసాగుతుందని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment