సింగరేణికి ఉజ్వల భవిష్యత్‌ | - | Sakshi
Sakshi News home page

సింగరేణికి ఉజ్వల భవిష్యత్‌

Published Sat, Oct 12 2024 12:18 PM | Last Updated on Sat, Oct 12 2024 12:18 PM

సింగరేణికి ఉజ్వల భవిష్యత్‌

● వందేళ్ల ప్రణాళికతో ముందుకెళ్తున్నాం.. ● సంస్థ సీఎండీ బలరాం

సత్తుపల్లి: రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంపూర్ణ సహకారంతో సింగరేణికి ఉజ్వల భవిష్యత్‌ ఉందని సీఎండీ బలరాం వెల్లడించారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం జేవీఆర్‌ ఓసీ కార్యాలయ ప్రాంగణంలో శుక్రవారం రాత్రి ‘ఉజ్వల సింగరేణి–ఉద్యోగుల పాత్ర’పై సదస్సు నిర్వహించారు. ఈ సమావేశంలో సీఎండీ మాట్లాడుతూ చాలా దేశాల్లో బొగ్గు వెలికితీయడాన్ని నిలిపివేస్తున్నారని.. ఇక్కడ బొగ్గు నిల్వలు అడుగంటే అవకాశమున్నందున సింగరేణి సంస్థ బొగ్గుతో పాటు ఇతర మార్గాల్లో విస్తరణపై దృష్టి సారించిందని చెప్పారు. సంస్థ వందేళ్లకు సరిపడా ప్రణాళికతో ముందుకెళ్తోందని.. కార్మికుల సంక్షేమం, అభివృద్ధికి ప్రభుత్వం నుంచి సంపూర్ణ సహకారం లభిస్తోందని తెలిపారు. కార్మికులు, యాజమాన్యం పరస్పర సహకారంతోనే బొగ్గు ఉత్పత్తిలో అగ్రగామిగా ఉన్నామని చెప్పారు. సంస్థ ఎదిగితేనే సింగరేణి కార్మికులకు మనుగడ ఉంటుందని గుర్తించాలన్నారు. సత్తుపల్లిలో లారీలకు సరిపడా బొగ్గు లోడింగ్‌ ఇస్తామని, దుమ్మూధూళితో స్థానికులకు ఇబ్బంది లేకుండా చూస్తూ జీఎం కార్యాలయాన్ని రెండు, మూడు నెలల్లో పూర్తి చేస్తామని సీఎండీ వెల్లడించారు. ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి మాట్లాడుతూ సింగరేణి కార్మికుల సంక్షేమం, అభివృద్ధికి తమ వంతు సహకారం అందిస్తామన్నారు. ఎమ్మెల్యే డాక్టర్‌ మట్టా రాగమయి మాట్లాడుతూ స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే కాక బొగ్గు లోడింగ్‌ పెంచాలని విజ్ఞప్తి చేశారు. జీఎం షాలెంరాజు, పీఓలు ప్రహ్లాద్‌, నర్సింహారావు, నాయకులు రజాక్‌, డాక్టర్‌ మట్టా దయానంద్‌, తోట సుజలరాణి, దోమ ఆనంద్‌ పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement