![పెంచలకోన క్షేత్రం - Sakshi](/styles/webp/s3/article_images/2023/12/22/21vgr130-410004_mr_0.jpg.webp?itok=rNO_Yin9)
పెంచలకోన క్షేత్రం
రాపూరు: పెంచలకోనలోని పెనుశిల లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శనివారం వైకుంఠ ఏకాదశి వేడుకలను నిర్వహించనున్నట్లు ఈఓ జనార్దన్రెడ్డి తెలిపారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ పెంచలకోన క్షేత్రంలో శ్రీవారిని దర్శించేందుకు ఉత్తర ద్వారం ఉన్నా, వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీవారి నిత్యకల్యాణ మండపంలో ఉత్తర ద్వార దర్శనం కోసం బంగారు రంగుతో కూడిన ద్వారాల ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. అందులో బంగారు గరుడవాహనంపై స్వామివారిని కొలువుతీర్చనున్నట్లు తెలిపారు. ఉదయం 3 గంటలకు అభిషేకం, 5 గంటలకు పూలంగిసేవ, ఉత్తర ద్వార దర్శనం , ఉదయం 8 గంటలకు గోనుపల్లెలో గరుడసేవ, గ్రామోత్సవం, సాయంత్రం 6 గంటలకు బంగారు గరుడ వాహనంపై స్వామివారి క్షేత్రోత్సవం నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment