లోపం ఇక్కడి నుంచే... | - | Sakshi
Sakshi News home page

లోపం ఇక్కడి నుంచే...

Published Fri, Oct 18 2024 3:06 AM | Last Updated on Fri, Oct 18 2024 3:06 AM

-

మందుగుండు సామగ్రి అనధికార తయారీపై నిఘా ఉండడం లేదు. అధికారుల పర్యవేక్షణ లేక అనేక ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో గతంలో పలు బాణసంచా కేంద్రాల్లో పెను ప్రమాదాలు, ప్రాణ, ఆస్తి నష్టాల గురించి తలుచుకుని నిఘా లోపాలపై ఇప్పుడు ప్రజలు చర్చించుకుంటున్నారు. ఇందులో అధికారుల నిఘా లోపం ఓ కారణమైతే, తయారీదారుల మానవ తప్పిదం మరో కారణం.

ఇవీ చేదు అనుభవాలు

● మండపేటలో నాలుగేళ్ల కిందట ఓ బాణసంచా తయారీ కేంద్రంలో సంభవించిన విస్ఫోటంలో తల్లి, కుమారుడు, ఓ సహాయకుడు మొత్తం ముగ్గురు మృత్యువాత పడ్డారు.

● కొత్తపేటలో తొమ్మిదేళ్ల కిందట బాణసంచా కేంద్రంలో జరిగిన ప్రమాదంలో నలుగురు మృతి చెందారు.

● మండపేటలో దాదాపు 15 ఏళ్ల కిందట ఓ బాణసంచా తయారీ కేంద్రంలో జరిగిన భారీ విస్ఫోటంలో పది మంది వరకూ మృత్యువాత పడ్డారు.

● రామచంద్రపురం నియోజకవర్గం కె.గంగవరంలో రెండేళ్ల కిందట బాణసంచా కేంద్రంలో జరిగిన ప్రమాదంలో ఇద్దరు మరణించారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement