టెన్త్‌ ఫలితాల్లో భాష్యం విద్యార్థుల ప్రతిభ | Sakshi
Sakshi News home page

టెన్త్‌ ఫలితాల్లో భాష్యం విద్యార్థుల ప్రతిభ

Published Tue, Apr 23 2024 8:25 AM

- - Sakshi

గుంటూరు ఎడ్యుకేషన్‌: పదో తరగతి పరీక్షా ఫలితాల్లో భాష్యం విద్యాసంస్థల విద్యార్థులు అత్యధిక మార్కులు సాధించారని సంస్థ చైర్మన్‌ భాష్యం రామకృష్ణ తెలిపారు. జి. దీపికాశ్రీ 597, కె. వెంకటసాయి భావన 596, ఎండీ యాస్మిన్‌ షరీనా 596, ఎస్‌.గాయత్రి 595, కె.లక్ష్మీ హంసిని 595, ఎస్‌. ఆశ్రిత 595 మార్కులు సాధించారని చెప్పారు. భాష్యంలో పాఠశాల నుంచే అమలు చేస్తున్న షౌండేషన్‌ విధానం ద్వారా విద్యార్థులు ఐఐటీలతో పాటు జాతీయస్థాయి వైద్య విద్యాసంస్థల్లో సీట్లు సాధించే స్థాయిలో బోధన అందిస్తున్నామని తెలిపారు. ఇటీవల విడుదలైన ఇంటర్‌ ఫలితాల్లోనూ తమ విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో అత్యుత్తమ ప్రతిభ చూపారని వివరించారు.

1/1

Advertisement
Advertisement