వరంగల్: తెలంగాణ ప్రభుత్వం క్రీడలకు పెద్ద పీట వేస్తోందని, ఉద్యోగాల్లో 20శాతం క్రీడాకారులకు రిజర్వేషన్లు అమలు చేస్తున్నారని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్.నాగరాజు అన్నారు. నగరంలోని 14వ డివిజన్ రెడ్డిపురంలోని ఇన్ఫాంట్ జీసస్ పాఠశాలలో శనివారం 9వ తెలంగాణ రాష్ట్ర సబ్ జూనియర్స్ ఇంటర్ డిస్ట్రిక్ట్ సాఫ్ట్బాల్ టోర్నమెంట్ 2024–25ను కలెక్టర్ సత్యశారదతో కలసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ.. ప్రభుత్వం క్రీడాభివృద్ధికి నిధులు కేటాయింపుతోపాటు ప్రతీ జిల్లాలో స్పోర్ట్స్ హాస్టళ్లను ఏర్పాటు చేసిందన్నారు. ఇంటర్ డిస్ట్రిక్ట్ సాఫ్ట్బాల్ టోర్నమెంట్ను వరంగల్లో నిర్వహిస్తున్న అసోసియేషన్ అధ్యక్షుడు వీరగోని రాజ్కుమార్, కార్యదర్శి పూజారి అశోక్బాబును ఆయన అభినందించారు. కలెక్టర్ సత్యశారద మాట్లాడుతూ.. విద్యతోపాటు క్రీడలు సామాజిక అభివృద్ధి, దేహధారుడ్యం, మానసిక వికాసానికి తోడ్పడతాయన్నారు. క్రీడలు నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయన్నారు. రాష్ట్ర సాఫ్ట్బాల్ అసోసియేషన్ అబ్జర్వర్ ఎండీ.అజీజ్ఖాన్, ఇన్ఫాంట్ జీసస్ హెచ్ఎం మరియమ్మ మథూర్, టి.రాజేందర్, డీవైఎస్ఓ సత్యవాణి, కై లాష్యాదవ్, హాసిని చిట్ఫండ్ ఎండీ లింగం కిరణ్, కార్పొరేటర్ తూర్పాటి సులోచన సారయ్య, జన్ను అనిల్, వెంకటేశ్వర్లు, రఘువీర్, యాదగిరి, ఇంతియాజ్, స్వప్న తదితరులు పాల్గొన్నారు.
వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్.నాగరాజు
రాష్ట్ర స్థాయి జూనియర్ సాఫ్ట్బాల్ టోర్నమెంట్ ప్రారంభం
Comments
Please login to add a commentAdd a comment