● ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి
ఖిలా వరంగల్/కాళోజీ సెంటర్: వరంగల్, ఖమ్మం, నల్లగొండ ఉపాధ్యాయ నియోజకవర్గ ఉపాధ్యాయ ఓటరుగా నమోదు చేసుకుని, మరోసారి తనను భారీ మెజార్టీతో గెలిపించాలని ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి కోరారు. ఈమేరకు శనివారం వరంగల్ శంభునిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ వరంగల్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరంగల్, ఖమ్మం, నల్లగొండ ఉపాధ్యాయ ఓటరు నమోదు కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. వరంగల్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో శనివారం వరంగల్ రంగశాయిపేటతోపాటు పలు కళాశాలలు, పాఠశాలలను సందర్శించారు. అర్హత కలిగిన ఉపాధ్యాయులు నవంబర్ 6వ తేదీలోపు ఓటరుగా నమోదు చేసుకోవాలని సూచించారు. అధ్యాపకురాలు మైదం రూపారాణి, టీఎస్యూటీఎఫ్ వరంగల్ అధ్యక్షుడు తాటికాయల కుమార్, ప్రధాన కార్యదర్శి సుజన్ ప్రసాదరావు, రఫూఫ్, శ్రీనివాస్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment