ప్రజలను మభ్యపెడుతున్న కాంగ్రెస్‌ | Sakshi
Sakshi News home page

ప్రజలను మభ్యపెడుతున్న కాంగ్రెస్‌

Published Tue, Apr 23 2024 8:25 AM

మాట్లాడుతున్న బోగ శ్రావణి
 - Sakshi

● ఆరు గ్యారంటీలు ఎక్కడ..? ● బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు బోగ శ్రావణి

సారంగాపూర్‌: కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రజలను మభ్యపెడుతోందని, ఇప్పటివరకు ఆరు గ్యారంటీల అమలు ఎక్కడ చేసిందని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు బోగ శ్రావణి అన్నారు. సోమవారం సారంగాపూర్‌ మండలం అర్పపల్లి, లక్ష్మీదేవిపల్లి, పెంబట్లతండాల్లో పర్యటించి స్థానిక మహిళలతో మాట్లాడారు. దేశంమొత్తం ప్రధాని మోదీ పాలన కోరుకుంటోందన్నారు. త్రిపుల్‌ తలాక్‌ రద్దు చేయడం ద్వారా ముస్లిం మహిళలు కూడా ఆత్మవిశ్వాసంతో జీవిస్తున్నారని తెలిపారు. ఎంపీగా ధర్మపురి అర్వింద్‌ గెలుపే ధ్యేయంగా కృషి చేయాలన్నారు. ఆమె వెంట పార్టీ మండల అధ్యక్షుడు వరుణ్‌కుమార్‌, బొమ్మకంటి ప్రసాద్‌, గంగరాజు, జమున, శేఖర్‌, నరేశ్‌ పాల్గొన్నారు.

Advertisement
Advertisement