పోలీసు లాంఛనాలతో మూర్తి అంత్యక్రియలు
కె.గంగవరం: తణుకులో తన తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఎస్సై ఆదుర్తి గంగ సత్యనారాయణమూర్తి పార్ధీవదేహాన్ని శుక్రవారం రాత్రి ఆయన స్వగ్రామం కె.గంగవరం తీసుకువచ్చారు. శనివారం ఆ గ్రామానికి జిల్లా అదనపు ఎస్పీ ప్రసాద్ వచ్చి నివాళి అర్పించారు. గ్రామస్తులు, బంధువులు, సహచరులతో మాట్లాడారు. ఇదిలా ఉంటే కోటిపల్లి గ్రామ గోదావరి ఒడ్డున మూర్తి అంత్యక్రియలు నిర్వహించారు. అక్కడ రామచంద్రపురం సీఐ వెంకట నారాయణ, పామర్రు ఎస్సై ఎస్కే జానీబాషా ఆధ్వర్యంలో పోలీసు లాంఛనాలను పూర్తి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment