తిమ్మాపూర్: మానసిక దివ్యాంగులకు సహకారం అందించాలని మధ్యప్రదేశ్ పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ పరికిపండ్ల నరహరి సూచించారు. మహాత్మానగర్లో స్వాతంత్య్ర సమరయోధు ల ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మానసిక ది వ్యాంగుల పాఠశాలను శుక్రవారం సందర్శించారు. వాగేశ్వరి ఇంజినీరింగ్ కళాశాల జాయింట్ సెక్రటరీ శ్రీనివాస్రెడ్డి సహకారంతో పాఠశాలకు అవసరమై న సామగ్రి కోసం రూ.30 వేల చెక్కు ప్రిన్సిపాల్ స తీశ్కు అందించారు. అనంతరం నరహరి మాట్లాడు తూ ఉమ్మడి కరీంనగర్ జిల్లాతోపాటుగా ఇతర జి ల్లాల్లోనూ ఆలయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సేవా కా ర్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మానసిక దివ్యాంగులకు సేవలు చేయడమే కాకుండా వారికి విద్యాబుద్ధులు నేర్పిస్తున్న వారికి అభినందనలు తె లిపారు. ఆలయ ఫౌండేషన్ సీఈవో తీట్ల రమేశ్, మిట్టపెల్లి రాజేందర్, న్యాయవాది సుగుర్తి జగదీశ్వరాచారి, బి.కల్యాణ్చంద్ర, శేఖర్, ఉమేశ్వర్, పరికిపండ్ల రాం, తాజొద్దిన్, నాగరాజు పాల్గొన్నారు.
మధ్యప్రదేశ్ హెల్త్ ప్రిన్సిపల్ సెక్రటరీ పి.నరహరి
ఫ్రీడం ఫైటర్స్ దివ్యాంగుల పాఠశాల సందర్శన
Comments
Please login to add a commentAdd a comment