విద్యానగర్: శ్రీదుర్గాభవానీ శరన్నవరాత్రోత్సవాలు అక్టోబర్ 2 నుంచి 13 వరకు కరీంనగర్ మండలం నగునూర్లోని పరివార సమేత శ్రీదుర్గాభవానీ దేవాలయంలో నిర్వహిస్తున్నట్లు ఆలయ ధర్మాధికా రి, వేదపండితుడు పురాణం మహేశ్వర శర్మ తెలి పారు. గురువారం ఉత్సవాలకు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. నవరాత్రుల్లో భాగంగా 2న ఉదయం 5.30 గంటలకు అమ్మవారికి విశేష ద్రవ్య ఫలపంచామృత మహాభిషేకం, 3న ఉదయం 6.30 గంటలకు గురు వందనం, గోపూజ, చండీహోమం తదితర పూజలు జరుగుతాయని తెలిపా రు. అమ్మవారు బ్రహ్మీ అలంకరణలో హంస వాహనంపై భక్తులకు దర్శనమిస్తారని సాయంత్రం బతుకమ్మ, పల్లకి సేవ జరుగుతాయన్నారు. 4 నుంచి 13వ తేదీ వరకు వివిధ అలంకరణల్లో అమ్మవారు దర్శనమిస్తారని పేర్కొన్నారు. చివరి రోజు ఉద యం 11 గంటలకు దుర్గాభవానీ సందరేశ్వరుల పట్టాభిషేకం, రథోత్సవం జరుగుతాయని తెలిపా రు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై, ఉత్సవాలను విజయవంతం చేయాలని కోరారు. ఆలయ వ్యవస్థాపక అధ్యక్షుడు వంగళ లక్ష్మణ్, ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి వేములవాడ ద్రోణాచారి, అన్నపూర్ణ సేవా సమితి బాధ్యులు రాచమల్ల ప్రసాద్, పల్లెర్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు,
Comments
Please login to add a commentAdd a comment