శ్రీనివాసపురం : పట్టణంలోని కెంపేగౌడ 514వ జయంతి వేడుకలను గురువారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఎవమ్మెల్యే జీకే వెంకటశివారెడ్డి కెంపేగౌడ పల్లకీల ఊరేగింపును ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ కెంపేగౌడ ఎంతో దూరదృష్టితో అన్ని సముదాయాలను దృష్టిలో ఉంచుకుని బెంగళూరు నగరాన్ని నిర్మించారన్నారు. చెరువులను తవ్వించి నీటి సమస్య రాకుండా చూశారన్నారు. కేంద్ర మంత్రి హెచ్డీ కుమారస్వామి, ఎంపీ మల్లేష్బాబు సహకారంతో నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహిస్తానన్నారు. యువతకు ఉద్యోగాలిప్పిస్తానన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ సుధీంద్ర, ఈఓ ఏఎన్ రవి, బీఈఓ బీసీ మునిలక్ష్మయ్య, పురసభ ముఖ్యాధికారి వైఎన్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment