దళిత యువకుని హత్య
సాక్షి,బళ్లారి: కొప్పళ జిల్లాలో దారుణం జరిగింది. దళిత యువకునికి క్షవరం చేసే విషయంలో బార్బర్ షాపులో గొడవ హత్యకు దారి తీసింది. కొప్పళ జిల్లా యలబుర్గా తాలూకా సంగనహాలదళ్లిలో ముత్తణ్ణ అనే క్షురకుడు దళిత యువకుడు యమనూరుస్వామికి కటింగ్ చేయడానికి నిరాకరించారు.
దీంతో అతడు ప్రశ్నించడంతో గొడవ మొదలైంది. ముత్తణ్ణ కోపం పట్టలేక కత్తితో పొడిచి హత్య చేశాడు. యలబుర్గి పోలీసులు కేసు నమోదు చేసి నిందితున్ని అరెస్టు చేశారు. హత్యను హోంమంత్రి పరమేశ్వర్ తీవ్రంగా ఖండించారు. స్వాతంత్య్రం వచ్చి 78 సంవత్సరాలు దాటుతున్నా ఇలాంటి దురాగతాలు జరగడం సహించరానిదని అన్నారు. బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని, నిందితునిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment