యువకుడు, బాలిక ఆత్మహత్య
చింతామణి వద్ద ఘోరం
చింతామణి: ఓ యువకుని దాష్టీకానికి ముక్కుపచ్చలారని బాలిక నిండుప్రాణం బలైంది. ప్రేమ పేరుతో బాలికను మభ్యపెట్టాడు. చివరకు ఇద్దరూ ఉరివేసుకుని ప్రాణాలు విడిచారు. మృతులు చింతామణి తాలుకా బట్లపల్లి పోలీసుస్టేషన్ పరిధిలోని సీతారామపుర గ్రామానికి చెందినవారు. శిడ్లఘట్ట తాలూకాలోని బీరప్పనహళ్లి గ్రామ శివార్లో శనివారం జరిగింది.
వివరాలు..
వివరాలు.. నవీన్ (22) లారీడ్రైవర్గా పనిచేస్తున్నాడు. అదే ఊరికి చెందిన బాలిక (16)కు మాయమాటలు చెప్పి ప్రేమాయణం సాగిస్తున్నాడు. ఇది తెలిసి బాలిక తండ్రి మార్చి ఆఖరులో స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయగా, నవీన్పై పోక్సో కింద కేసు నమోదు చేసి బాలికకు కౌన్సిలింగ్ ఇచ్చారు.
తరువాత నిందితుడు విడుదలై బాలికను చాటుగా కలిసేవారు. ఇక మనం కలిసి జీవించలేము కాబట్టి ఆత్మహత్య చేసుకుందామని బాలికకు నూరిపోశాడు. బాలిక పాఠశాలకని చెప్పి ఇంట్లో నుంచి బయల్దేరింది. ఇద్దరూ కలిసి మామిడి చెట్టు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకొన్నారు. ఆ దారిలో వెళ్లేవారు చూసి పోలీసులకు, తల్లిదండ్రులకు సమాచారమిచ్చారు. మృతదేహాలకు ఆస్పత్రిలో పోస్టుమార్టం జరిపి బంధువులకు అప్పగించారు. ఈ దుర్ఘటనతో గ్రామంలో విషాదం తాండవించింది.
Comments
Please login to add a commentAdd a comment