రఘునాథపాలెం/కూసుమంచి: ప్రతీ ఇంటికి వెళ్లి సర్వే చేసి కుటుంబీకుల అందరి పేర్లను ఫ్యామిలీ డిజిటల్ కార్డు కోసం నమోదు చేయాలని జిల్లా ప్రత్యేక అధికారి సురేంద్రమోహన్ సూచించారు. పెళ్లయి అత్తవారింటికి వెళ్లిన యువతులు, చనిపోయిన వారి తొలగింపు పక్కాగా జరగాలని తెలి పారు. రఘునాథపాలెం మండలంలోని రాములుతండాలో సర్వేను అదనపు కలెక్టర్ మధుసూదన్నాయక్, జెడ్పీ డిప్యూటీ సీఈఓ నాగలక్ష్మితో కలిసి ఆయన శుక్రవారం పరిశీలించారు. గతంలో ఉన్న జాబితా, ప్రస్తుతం సర్వేలో కుటుంబ వివరాలు తేడా వస్తున్నాయని చెప్పగా కుటుంబాల్లో కొత్తగా చేరిన సభ్యుల పేర్లు ప్రత్యేకంగానే నమోదు చేయాలని సూచించారు. మైనింగ్ ఏడీ సాయినాథ్, ఎంపీడీఓ ఆశోక్, ఎంపీఓ శ్రీనివాస్రెడ్డి, తహసీల్దార్లు స్వామి, లూథర్ బెన్నీ తదితరులు పాల్గొన్నారు. అలాగే, కూసుమంచి మండలంలోని ధర్మాతండాలో సర్వేను అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ పరిశీలించి సిబ్బందికి సూచనలు చేశారు. కాగా, గ్రామంలో మొత్తం 145 కుటుంబాలను గుర్తించి సర్వే చేయగా.. ఇందులో 45 కొత్త కుటుంబాలు ఉన్నాయని ఎంపీడీఓ వేణుగోపాల్రెడ్డి తెలిపారు. ఈమేరకు సర్వే పూర్తయిందని వెల్లడించారు.
ఫ్యామిలీ డిజిటల్ కార్డు సర్వేపై ప్రత్యేకాధికారి
Comments
Please login to add a commentAdd a comment