వీరిపై ఆసుపత్రి అవుట్పోస్టు పోలీసులకు ఫిర్యాదులు చేసిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఇటీవలే డీఎస్పీతో పాటు ఎస్పీకి ఫిర్యాదు చేసినా ఫలితం లేదని కొందరు డాక్టర్లు వాపోతున్నారు. ఇటీవల కాకినాడలో వైద్యుడిపై జరిగిన దాడిని ఖండిస్తూ ఆసుపత్రిలో నిరసన ప్రదర్శన జరిగింది. ఆ కార్యక్రమంలో ‘తమ మచిలీపట్నం ఆసుపత్రిలో రాజకీయ ఒత్తిళ్లు బాగా పెరిగాయని, తాము ఎమ్మెల్యే తాలుకా’ అంటూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని పలువురు డాక్టర్లు అనడం గమనార్హం. ప్రతి రోజూ వందల సంఖ్యలో పేషెంట్లు వస్తుంటారని.. వారందరికీ సిఫారసులు లేకపోయినా చికిత్స చేస్తామంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment