పరిసరాల పరిశుభ్రత అందరి బాధ్యత | - | Sakshi
Sakshi News home page

పరిసరాల పరిశుభ్రత అందరి బాధ్యత

Published Wed, Oct 2 2024 3:12 AM | Last Updated on Wed, Oct 2 2024 3:12 AM

పరిసరాల పరిశుభ్రత  అందరి బాధ్యత

మంత్రి కొల్లు రవీంద్ర

మచిలీపట్నంటౌన్‌: మొక్కలు నాటడం, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం అందరి బాధ్యత అని మంత్రి కొల్లు రవీంద్ర పిలుపునిచ్చారు. స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా స్థానిక మాచవరం రైస్‌మిల్‌ సమీపంలో రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పరిసరాల పరిశుభ్రత, మొక్కలు నాటే కార్యక్రమంలో మంత్రి రవీంద్ర, ఎంపీ బాలశౌరి, పెడన ఎమ్మెల్యే కృష్ణప్రసాద్‌తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి, ఎంపీ, అధికారులు సైకిల్‌ ర్యాలీ ద్వారా ఈ కార్యక్రమం వల్ల కలిగే ప్రయోజనాలను వివరిస్తూ ముందుకు సాగారు. అనంతరం జరిగిన సభలో మంత్రి రవీంద్ర మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోదీ పిలుపుతో జిల్లా వ్యాప్తంగా స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాన్ని కొద్ది రోజులుగా నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో భాగంగా మచిలీపట్నం, పెడన నియోజకవర్గాల సరిహద్దు ప్రాంతంలో మొక్కలు నాటి సుందరీకరణ పనులను ప్రారంభించటం హర్షణీయమన్నారు. స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచన, చిత్రలేఖనం, వ్యర్థాల నుంచి కళాకృతుల తయారీ పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు నగదు బహుమతి, ప్రశంసాపత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో రహదారుల మంత్రిత్వశాఖ చీఫ్‌ ఇంజినీర్‌ రాకేష్‌కుమార్‌, మునిసిపల్‌ మాజీ చైర్మన్‌ ఎం.వి.బాబాప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement