రైలు కింద పడి భార్యాభర్తలు ఆత్మహత్య | Sakshi
Sakshi News home page

రైలు కింద పడి భార్యాభర్తలు ఆత్మహత్య

Published Mon, May 6 2024 9:15 AM

-

కర్నూలు: కల్లూరు మండలం ముజఫర్‌ నగర్‌లో నివాసముంటున్న బోయ సత్యానంద్‌ అలియాస్‌ బాబు (35), బోయ సుజాత (32) దంపతులు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. గద్వాల జిల్లా ఐజ మండలం మేడికొండ గ్రామానికి చెందిన సుజాతకు ముజఫర్‌నగర్‌కు చెందిన బాబుతో 16 ఏళ్ల క్రితం పెళ్లి అయింది. వీరికి ఇద్దరు కొడుకులు, కూతురు సంతానం. భర్త ఆటోడ్రైవర్‌, భార్య ఆశా వర్కర్‌గా పనిచేస్తూ జీవనం సాగించేవారు. కుటుంబ కలహాలతో కొంతకాలంగా దూరంగా ఉంటున్నారు. ఆదివారం సాయంత్రం సత్యానంద్‌ మద్యం తాగి భార్యకు ఫోన్‌ చేసి తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు చెప్పడంతో తాను కూడా వస్తానని, ఇద్దరూ కలిసి చచ్చిపోదామని డోన్‌ రోడ్డులోని జీవీఆర్‌ కన్వెన్షన్‌ హాల్‌ ఎదురుగా ఉన్న రైలు పట్టాల వద్దకు చేరుకున్నారు. డోన్‌ నుంచి కర్నూలుకు వస్తున్న రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. స్థానికుల సమాచారం మేరకు కర్నూలు రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. విషయం తెలియడంతో బంధువులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుని రోదించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కర్నూలు ప్రభుత్వాసుపత్రిలోని మార్చురీ కేంద్రానికి తరలించి ఆత్మహత్యకు గల కారణాలపై విచారణ జరుపుతున్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు.

Advertisement
Advertisement