కర్నూలు: మద్యం రిటైల్ వ్యాపారం తిరిగి ప్రైవేటు వ్యక్తులకు అప్పగించేందుకు దరఖాస్తుల ప్రక్రియ మందకొడిగా సాగుతోంది. టెండర్ల ప్రక్రియ నిర్వహించి త్వరితగతిన దుకాణాలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు షెడ్యూల్ విడుదల చేసిన ఉమ్మడి జిల్లా ఎకై ్సజ్ అధికారులు ప్రభుత్వం నిర్దేశించిన విధివిధానాలను అనుసరించి ప్రణాళిక అమలు చేసేందుకు కసరత్తు ముమ్మరం చేశారు. ఈ నెల 1 నుంచి మద్యం దుకాణాలకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు ఏర్పాట్లు చేసినప్పటికీ గాంధీ జయంతి, బ్యాంకులకు సెలవు, అమావాస్య వంటి కారణాలతో రెండు రోజులుగా ఎలాంటి దరఖాస్తులు రాలేదు. నంద్యాల జిల్లాలో 7 ఎకై ్సజ్ పోలీస్స్టేషన్ల పరిధిలో 105 మద్యం దుకాణాలకు నోటిఫికేషన్ జారీ అయింది. అయితే కేవలం బనగానపల్లె, నంద్యాల పట్టణంలోని మూడు దుకాణాలకు ఆరు దరఖాస్తులు మాత్రమే సమర్పించారు. అలాగే కర్నూలు జిల్లాలో 7 ఎకై ్సజ్ పోలీస్ స్టేషన్ల పరిధిలో 99 దుకాణాలు ఉండగా 23 దుకాణాలకు 76 దరఖాస్తులు ఆఫ్లైన్లో సమర్పించారు. గతంలో మద్యం దుకాణాలు నిర్వహించిన వ్యాపారులు దుకాణాలు దక్కించుకునేందుకు ముందుకొస్తున్నారు. గతంలో ఏళ్ల తరబడి మద్యం దుకాణాలు నిర్వహిస్తూ, వాటిలో పనిచేస్తూ ఉపాధి పొందినవారు కూడా లక్కీడిప్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు పెట్టుబడులు పెడుతుండటం గమనార్హం. అయితే దరఖాస్తుల ప్రక్రియ మందకొడిగా సాగుతుండటంతో గురువారం ఎకై ్సజ్ జిల్లా అధికారులు కలెక్టర్ రంజిత్ బాషా, ఎస్పీ బిందు మాధవ్తో కలసి చర్చించారు.
పారదర్శకంగా టెండర్ల ప్రక్రియ
దరఖాస్తుల స్వీకరణ, టెండర్ల ప్రక్రియ అంతా పారదర్శకంగా ఉంటుంది. కలెక్టర్ సమక్షంలో టెండర్లు తీసి లైసెన్స్దారులను ఖరారు చేస్తాం. ప్రభుత్వం నిర్దేశించిన విధి విధానాలను అనుసరించి అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం.
– శ్రీదేవి, డీసీ
Comments
Please login to add a commentAdd a comment