కర్నూలు(అర్బన్): భారత ప్రభుత్వ ఆదేశాల మేరకు తపాల శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 7 నుంచి 11వ తేదీ వరకు జాతీయ తపాలా వారోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు జిల్లా తపాల పర్యవేక్షకులు డీ జనార్దన్రెడ్డి తెలిపారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ 7వ తేదీన అధిక మొత్తంలో పోస్టల్ మెయిల్ సర్వీసులను ఉపయోగించుకునే వారిని సమావేశ పరిచి సత్కరించడం జరుగుతుందన్నారు. 8న స్కూల్ విద్యార్థులకు స్టాంపుల సేకరణపై అవగాహన కార్యక్రమం, థాయ్ ఆఖర్ లెటర్ రైటింగ్ కాంపిటీషన్స్ నిర్వహించనున్నామన్నారు. 9న ప్రపంచ తపాలా దినోత్సవంలో భాగంగా మారఽథాన్ నడక, మొక్కలు నాటే కార్యక్రమాలను చేపట్టనున్నామని తెలిపారు. 10న అంత్యోదయ దివస్ కార్యక్రమంలో భాగంగా ప్రత్యేక ఆధార్ నమోదు, సవరణ కేంద్రాలను నిర్వహిస్తామని, ఐపీపీబీ ఉత్పత్తుల గురించి అవగాహన, నమోదు కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు వివరించారు. 11న సుకన్య సమృద్ధి ఖాతాలు, పోస్టాఫీసు అందిస్తున్న ఇతర చిన్న మొత్తాల పొదుపు ఖాతాలు, పీఎల్ఐ, ఆర్పీఎల్ఐ మేళాలను అన్ని పోస్టాఫీసుల్లో నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment