కల్యాణ వైభోగమే.. | Sakshi
Sakshi News home page

కల్యాణ వైభోగమే..

Published Thu, Apr 18 2024 10:30 AM

-

బాజా భజంత్రీలు, భక్తజన హర్షధ్వానాలు, బ్రహ్మణోత్తముల మంత్రోచ్ఛరణల మధ్య సీతారాముల కల్యాణం బుధవారం అంగరంగ వైభవంగా జరిగింది. శ్రీరామనవమి పర్వదిన వేళ మెదక్‌లోని కోదండ రామాలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్‌రావు దంపతులు హాజరై పట్టువస్త్రాలు సమర్పించారు. మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి దంపతులు సైతం కల్యాణ మహోత్సవంలో భాగస్వాములయ్యారు. పలువురు దాతలు అన్నదాన కార్యక్రమం నిర్వహించగా.. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ఆలయ కమిటీ సభ్యులు ఏర్పాట్లు చేశారు.

– మెదక్‌మున్సిపాలిటీ

Advertisement
Advertisement