మెదక్జోన్: ఆన్లైన్ టెండర్ల ద్వారా రోడ్డు పనులు చేసిన కాంట్రాక్టర్లకు ఏడాదిగా బిల్లులు రాకపోవడంతో కొత్త పనులు చేయాలంటేనే జంకుతున్నారు. ఏడాది కాలంగా రూ. 100 కోట్ల బిల్లులు పెండింగ్లో ఉన్నట్లు తెలిసింది. ఇందులో పీఆర్ పరిధిలో రూ. 80 కోట్లు ఉండగా ఆర్అండ్బీశాఖ పరిధిలో రూ. 20 కోట్ల బిల్లులు రావాల్సి ఉంది. ఇటీవల నూతన రోడ్ల నిర్మాణాలతో పాటు దెబ్బతిన్న రోడ్ల మరమ్మతుల కోసం మరో రూ. వంద కోట్లు మంజూరయ్యాయి. అయితే పనులు చేసేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు. టెండర్లు పిలిచినా ససేమిరా అంటున్నారు. బిల్లులు సకాలంలో విడుదల కాకపోవడంతో అనేక పనులు అర్ధాంతరంగా నిలిచిపోయాయి. రోడ్లు అధ్వానంగా మారడంతో ప్రయాణాలకు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు.
పాత బకాయిలు రూ. 30 కోట్లు
గత ప్రభుత్వ హయాంలో జిల్లాలో 493 గ్రామ పంచాయతీలలో సర్పంచ్లు వివిధ రకాల పనుల కోసం సమారు రూ. 30 కోట్లు వెచ్చించారు. అయితే వారి పదవీకాలం ఈ ఏడాది ఫిబ్రవరితో ముగిసింది. నాటి నుంచి బిల్లుల కోసం మాజీ సర్పంచ్లు నిత్యం అధికారులు, ప్రజాప్రతినిధుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. చేసిన పనులకు ఏళ్ల తరబడి బిల్లులు మంజూరు కాకపోవడం, అభివృద్ధి కోసం నిధులు మంజూరైన పనులు చేసేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడంతో పల్లెలు అభివృద్ధిలో వెనుకబడ్డాయి. ఇప్పటికై నా పాలకులు స్పందించి నిధులు విడుదల చేయిస్తే తప్ప జిల్లాలో అభివృద్ధి ముందుకు సాగేలా కనిపించడం లేదు.
ఈ ఫొటోలో కనిపిస్తున్న బ్రిడ్జి పాతూరు పంచాయతీ పరిధిలోని కొచ్చెర్వు తండాలోనిది. ఆరునెలల క్రితం ఓ కాంట్రాక్టర్ రూ. 1.60 కోట్లు వెచ్చించి నిర్మించారు. దానికి సంబంధించిన బిల్లులు ఇప్పటివరకు పైసా విడుదల కాలేదు. ఇలా జిల్లాలో పనులు పూర్తయిన వాటికి రూ. 100 కోట్ల మేర కాంట్రాక్టర్లకు బిల్లులు రావాల్సి ఉంది.
పనులు చేయడానికి కాంట్రాక్టర్ల విముఖత
ఏడాదిగా పెండింగ్లో బిల్లులు
జిల్లాలో కుంటుపడుతున్న అభివృద్ధి
Comments
Please login to add a commentAdd a comment