● అదనపు కరెంట్ పనుల కోసం రూ.62 కోట్లు మంజూరు
● ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేశ్రెడ్డి
నాగర్కర్నూల్/ నాగర్కర్నూల్ (బిజినేపల్లి): వట్టెం రిజర్వాయర్లో నీటి తోడివేత పూర్తయిందని నాగర్కర్నూల్ ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేశ్రెడ్డి తెలిపారు. గురువారం ఆయన వట్టెం పంపుహౌజ్ను సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరద జలాలు రావడం వల్ల రెండు వారాల క్రితం వట్టెం పంప్హౌజ్ మునిగిపోయిందన్నారు. సీఎం రేవంత్రెడ్డి, రాష్ట్ర మంత్రుల సహకారంతో ఇంజినీర్లు వేగంగా చర్యలు తీసుకోవడం వల్ల కొద్ది రోజుల్లోనే పంప్హౌజ్లో 30 ఫీట్లకుపైగా నీటిని తొలగించామన్నారు. ప్రస్తుతం పంప్హౌజ్లో మోటార్లు, ఇతర పరికరాలను శుభ్రం చేయించే పనులు జరుగుతున్నాయరిచ ఇవి ఏడా 15 రోజుల్లో పూర్తవుతాయని వెల్లడించారు. ఆ తర్వాత తరువాత మోటార్లు డ్రై, వెట్ రన్కు సిద్ధంగా ఉంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు. నీళ్లలో మునిగిపోవడం వల్ల మోటార్లు ఇతర పరికరాలకు ఎలాంటి నష్టం కలగలేదన్నారు. ప్రతిపక్షాలు పంప్హౌజ్ మునకను రాజకీయం చేసేందుకు ప్రయత్నించాయని విమర్శించారు. రెండు వారాల వ్యవధిలోని నీటి తోడివేతను పూర్తిచేసిన ఇంజినీర్లు ఇతర సిబ్బందిని ఆయన అభినందించారు. పంప్హౌజ్ రన్నింగ్కు కావాల్సిన విద్యుత్ కోసం సీఎం రేవంత్రెడ్డి సహకారంతో రూ.62 కోట్లు మంజూరయ్యాయని చెప్పారు. వీలైనంత త్వరలో వట్టెం రిజర్వాయర్ రైతులు, ప్రజలకు అందుబాటులోకి వస్తుందని, ఎవరూ తప్పుదోవ పట్టించే మాటలను నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. ఆయన వెంట ఈఈ పార్థసారథి, ఇంజినీర్లు, కాంగ్రెస్ నాయకులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment