నాగర్కర్నూల్ క్రైం: భారతదేశ స్వాతంత్య్రం కోసం గాంధీజీ అహింసా మార్గాన్ని అనుసరించారని.. ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ కోరారు. బుధవారం జిల్లా పోలీసు కార్యాలయంలో గాంధీజయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. ప్రపంచ దేశాలు గాంధీని ఆదర్శంగా తీసుకొని స్వాతంత్య్రలు సాధించాయని గుర్తు చేశారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ రామేశ్వర్, డీఎస్పీ శ్రీనివాస్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment