అచ్చంపేట: దుర్గాదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. విజయదశమి వరకు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. వేడుకలకు అచ్చంపేటలోని వాసవీ కన్యకాపరమేశ్వరి ఆలయం, తాలుకా రెడ్డి సేవాసమితి, రక్షిత మహిళా సొసైటీ, వెలమ సంఘం, భక్త మార్కండేయ, భ్రమరాంబ ఆలయం ముస్తాబయ్యాయి. తొమ్మిది రోజుల పాటు అమ్మవారు లక్ష్మీదేవి, గాయత్రీదేవి, అన్నపూర్ణదేవి, లతితా దేవి, సరస్వతీదేవి, బాలత్రిపురసుందరీదేవి, రాజరాజేశ్వరి, దుర్గాదేవి, మహిషాసురమర్దినిగా దర్శనమివ్వనుంది. ఆయా రోజుల్లో అమ్మవారికి భక్షాలు, పూర్ణం, గారెలు, మినప వడలు, పులిహోర, అట్లు, పానకం, చక్కెర పొంగలి, అరిసెలు తదితర వంటకాలతో నైవేద్యాలు సమర్పిస్తారు. వీటిలోని బెల్లం, శనగపప్పు, మినపప్పు, బియ్యం, పెసరపప్పు, గోధుమపిండి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వర్షాకాలంలో రోగాలబారి నుంచి కాపాడే శక్తినిస్తాయి. శరీరంలో ఐరన్, పిల్లల్లో రోగ నిరోధకశక్తిని పెంచి ప్రమాదకర వ్యాధుల నుంచి కాపాడుతాయి.
నేటి నుంచి
ఉత్సవాలు ప్రారంభం
Comments
Please login to add a commentAdd a comment