మిర్యాలగూడ టౌన్ : ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికుల ఆరోగ్యమే.. సంస్థకు మహాభాగ్యమని నల్లగొండ ఆర్టీసీ రీజినల్ మేనేజర్ శ్రీదేవి అన్నారు. బుధవారం మిర్యాలగూడ ఆర్టీసీ డిపోలో సంస్థ ఆధ్వర్యంలో చేపట్టిన ‘గ్రాండ్ హెల్త్ చాలెంజ్’ కార్యక్రమంలో భాగంగా రెండవ విడత వైద్య పరీక్షల శిబిరాన్ని ఆమె సందర్శించారు. ఉద్యోగుల ఆరోగ్య పరిిస్థితిని తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆరోగ్య సమస్యలు ఉంటే ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. ఆర్టీసీ సంస్థ ద్వారా వైద్యుల ద్వారా పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. సిబ్బంది ఎండ నుంచి ఉపశమనం పొందేందుకు అన్ని డిపోల్లో మజ్జిగ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఆమె వెంట డిప్యూటీ ఆర్ఎంలు మాధవి, శివశంకర్, డిపో మేనేజర్ బొల్లెద్దు పాల్, సీఐ భారతీబాయి, ఎంఎఫ్ పుప్పాల యాదగిరి తదితరులు ఉన్నారు.
ఫ ఆర్టీసీ రీజినల్ మేనేజర్ శ్రీదేవి