రైతులకు ఇబ్బంది కలగనీయం | - | Sakshi
Sakshi News home page

రైతులకు ఇబ్బంది కలగనీయం

Published Sat, Oct 19 2024 3:06 AM | Last Updated on Sat, Oct 19 2024 3:06 AM

రైతులకు ఇబ్బంది కలగనీయం

మిర్యాలగూడ : రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ధాన్యానికి మద్దతు ధర అందించేందుకు ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందని కలెక్టర్‌ నారాయణరెడ్డి తెలిపారు. శుక్రవారం మిర్యాలగూడ మండలం అవంతీపురం మార్కెట్‌ యార్డ్‌లో పీఏసీఎస్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డితో కలిసి ప్రారంభించి మాట్లాడారు. రాష్ట్రంలోనే అత్యధికంగా నల్లగొండ జిల్లాలో ధాన్యం సేకరణ జరుగుతుందని, దీన్ని దృష్టిలో ఉంచుకుని ఈ సంవత్సరం జిల్లాలో 375 కొనుగోలు కేంద్రాల ఏర్పాటు చేస్తున్నామని.. ఇప్పటివరకు 185 కేంద్రాలను ప్రారంభించామని తెలిపారు. రైతుల సందేహాల నివృత్తికి నల్లగొండలో కంట్రోల్‌ రూం ఏర్పాటు చేశామని 9963407064 నంబర్‌కు ఫోన్‌ చేసి సమస్యలు తెలియజేయవచ్చని తెలిపారు. సన్నరకం, దొడ్డురకం ధాన్యం కొనుగోలు కేంద్రాలను వేర్వేరుగా ఏర్పాటు చేశామన్నారు. ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం, మిల్లర్లు, అధికారులు సమన్వయంతో ధాన్యం సేకరణను పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో సబ్‌ కలెక్టర్‌ అమిత్‌ నారాయణ్‌, డీఎస్‌ఓ వెంకటేశ్వర్లు, మేనేజర్‌ హరీష్‌, డీపీఓ పత్యానాయక్‌, తహసీల్దార్‌ హరిబాబు, ఏడీఏ దేవ్‌సింగ్‌, ఎంపీడీఓ శేషగిరిశర్మ, రైస్‌ మిల్లర్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కర్నాటి రమేష్‌, మిర్యాలగూడ అధ్యక్షుడు గౌరు శ్రీనివాస్‌, వెంకటరమణచౌదరి, మాజీ సర్పంచ్‌ నరేందర్‌, పీఏసీఎస్‌ చైర్మన్‌ రామకృష్ణ, మధుబాబు తదితరులు పాల్గొన్నారు.

రుణ లక్ష్యాన్ని పూర్తిచేయాలి

నల్లగొండ : బ్యాంకర్లు పంట రుణాల లక్ష్యాలను నవంబర్‌ 5 నాటికి నూరుశాతం పూర్తి చేయాలని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి కోరారు. కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో నిర్వహించిన జిల్లా బ్యాంకర్ల కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రాధాన్యత రంగంలోకి వచ్చే గృహ నిర్మాణం, విద్యా రుణాల గ్రౌండింగ్‌ లక్ష్యాలను 50 శాతం పూర్తి చేయాలన్నారు. ఎస్సీ, ఎస్టీ తదితర యూనిట్లను వచ్చే సమావేశంలో నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ సారి సమావేశాలకు బ్యాంకుల నియంత్రణ అధికారులు మాత్రమే హాజరుకావాలన్నారు. సమావేశంలో మిర్యాలగూడ సబ్‌ కలెక్టర్‌ నారాయణ్‌అమిత్‌, డీఎఫ్‌ఓ రాజశేఖర్‌, ఎల్‌డీఎం శ్రామిక్‌, ఆర్‌బీఐ ఏజీఎం పృథ్వీ, నాబార్డ్‌ డీడీఎం సత్యనారాయణ, ఏపీజీవీబీ ఏజీఎం విజయభాస్కర్‌, జిల్లా పరిశ్రమల శాఖ జేడీ జి.కోటేశ్వరరావు, డీఏఓ శ్రవణ్‌, ఇన్‌చార్జి డీటీడీఓ రాజ్‌కుమార్‌ పాల్గొన్నారు.

ఫ కలెక్టర్‌ నారాయణరెడ్డి

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement