బాదేపల్లి మార్కెట్కు పోటెత్తిన వేరుశనగ
జడ్చర్ల/దేవరకద్ర: బాదేపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డుకు మంగళవారం వేరుశనగ పోటెత్తింది. వివిధ ప్రాంతాల నుంచి 4,990 క్వింటాళ్ల యార్డుకు విక్రయానికి వచ్చింది. కాగా.. క్వింటాల్ గరిష్టంగా రూ.6,586, కనిష్టంగా రూ.3,631 ధరలు లభించాయి. కందులకు క్వింటాల్ గరిష్టంగా రూ.7,179, కనిష్టంగా రూ.5,310, రాగులు రూ.2451, పెబ్బర్లు రూ.5069, ధాన్యం ఆర్ఎన్ఆర్ గరిష్టంగా రూ.2,631, కనిష్టంగా రూ.2,056, హంస రూ.1,526 ధరలు పలికాయి. దేవరకద్ర మార్కెట్లో కందులు గరిష్టంగా రూ.7,223, కనిష్టంగా రూ.7,009గా, ఆర్ఎన్ఆర్ ధాన్యం గరిష్టంగా రూ.2,509గా ఒకే ధర లభించింది.
Comments
Please login to add a commentAdd a comment