కడెం: కొత్త మద్దిపడగ గ్రామ సమీపంలోని పునరావాస కాలనీని బుధవారం ఎఫ్డీపీటీ శాంతారాం సందర్శించారు. ఈ సందర్భంగా గ్రామస్తులతో సమావేశమై వారి సమస్యలను తెలుసుకున్నారు. పునరావాసంలో భాగంగా రాంపూర్, మైసంపేట్ గ్రామస్తులకు అందించిన భూములను సాగుకు యోగ్యంగా చేయిస్తామన్నారు. అట్టి భూములకు రెవెన్యూ పట్టాలిస్తామన్నారు. సమావేశంలో డీఎఫ్వో నాగిణిభాను, ఎఫ్డీవో భవాని శంకర్, ఎఫ్ఆర్వో గీతారాణి, హైటికాస్ ఎన్జీవో ఉమ్మడి జిల్లా ప్రతినిధి వెంకట్, తదితరులు పాల్గొన్నారు.
అటవీశాఖ కార్యాలయం సందర్శన
ఖానాపూర్: పట్టణంలోని అటవీశాఖ కార్యాలయాన్ని బుధవారం ఎఫ్డీపీటీ శాంతారాం సందర్శించారు. ఖానాపూర్, కడెం మండలాల పర్యటనలో భాగంగా ఖానాపూర్ ఎఫ్డీవో కార్యాలయానికి వచ్చిన ఎఫ్డీపీటీకి సిబ్బంది మొక్కను అందించి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో నిర్మల్ డీఎఫ్వో నాగిని భాను, ఖానాపూర్ ఎఫ్డీవో భవానీ శేఖర్, ఎఫ్ఆర్వోలు కిరణ్, అనిత, గీతారాణి, రమేశ్రావు, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment