నిర్మల్చైన్గేట్: అర్హులైన దివ్యాంగులకు రిట్రోఫిటెడ్ మోటారైజ్డ్ వాహనాల పంపిణీకి కలెక్టరేట్లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ ఆధ్వర్యంలోని స్క్రీనింగ్ కమిటీ లబ్ధి దారుల ఎంపిక ప్రక్రియ శుక్రవారం చేపట్టింది. అధికారులు దివ్యాంగుల ధ్రువీకరణ పత్రాలు పరిశీలించారు. కార్యక్రమంలో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ రాజేందర్, డీఆ ర్డీవో విజయలక్ష్మి, ప్రాంతీయ రవాణా అధికారి దుర్గాప్రసాద్, అధికారులు పాల్గొన్నారు.
జోనల్ స్థాయి చెస్
పోటీలకు కేజీబీవీ విద్యార్థిని
నర్సాపూర్(జి): మండల కేంద్రంలోని కేజీబీవీలో పదో తరగతి చదువుతున్న కదం ప్రతిభ జోనల్స్థాయి చెస్ పోటీలకు ఎంపకైంది. ఎస్జీఎఫ్ ఆధ్వర్యంలో అండర్–17 విభాగంలో వెంగ్వాపేట్ పాఠశాలలో శుక్రవారం నిర్వహించిన జిల్లాస్థాయి పోటీల్లో ప్రతిభ కనబర్చింది. దీంతో జోనల్ స్థాయి పోటీలకు ఎంపిక చేసినట్లు ఎస్వో వీణ తెలిపారు.
నేడు అండర్–14 జిల్లాస్థాయి ఖోఖో ఎంపిక పోటీలు
లక్ష్మణచాంద: ఖోఖో అండర్–14 జిల్లాస్థాయి జట్ల ఎంపిక పోటీలు శనివారం లక్ష్మణచాంద ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తామని హెచ్ఎం రాజునాయక్ తెలిపారు. జిల్లాస్థాయి బాలుర, బాలికల జట్లను ఎంపిక చేస్తామని పేర్కొన్నారు. జిల్లాలోని అన్ని పాఠశాలల నుంచి విద్యార్థులు హాజరు కావాలని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment