అరెస్టయింది ఈ ముగ్గురే.. | - | Sakshi
Sakshi News home page

అరెస్టయింది ఈ ముగ్గురే..

Published Thu, Sep 26 2024 12:12 AM | Last Updated on Thu, Sep 26 2024 12:12 AM

అరెస్టయింది ఈ ముగ్గురే..

అనుమతులు లేకుండా మోసపూరితంగా కొనసాగిస్తున్న యూబిట్‌దందాలో కీలకంగా పనిచేసిన వారిలో ముగ్గురిని మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. వీరి వివరాలు బుధవారం పోలీసులు ఓ ప్రకటనలో వెల్లడించారు.

● దాసరి రమేశ్‌.. ఖానాపూర్‌ పట్టణానికి చెందిన ఈయన కడెం మండలంలోని కన్నాపూర్‌ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు.

● కై రం వెంకటేశ్‌గౌడ్‌.. జిల్లా కేంద్రంలోని వైష్ణవి అపార్ట్‌మెంట్‌(బి–బ్లాక్‌)లో నివాసముంటున్న ఈయన కుభీర్‌ మండలం దావూజీనాయక్‌ తండాలో ప్రభుత్వ ఉపాధ్యాయుడు.

● బొమ్మిడి ధనుంజయ్‌..ఆదిలాబాద్‌ జిల్లా బోథ్‌ మండలం సొనాలకు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు.

ఈ ముగ్గురికి వైద్యపరీక్షలు చేయించి ప్రాథమిక విచారణ అనంతరం జుడీషియల్‌ రిమాండ్‌కు పంపించారు. మరోవైపు ఇప్పటికే రిమాండ్‌లో ఉన్న ఐదుగురిని గురువారం పోలీసు కస్టడీకి తీసుకోనున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement