దరఖాస్తుల పరిశీలన త్వరగా పూర్తిచేయాలి | - | Sakshi
Sakshi News home page

దరఖాస్తుల పరిశీలన త్వరగా పూర్తిచేయాలి

Published Fri, Oct 11 2024 2:04 AM | Last Updated on Fri, Oct 11 2024 2:04 AM

దరఖాస్తుల పరిశీలన త్వరగా పూర్తిచేయాలి

● పురపాలక పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ ప్రధాన కార్యదర్శి దాన కిషోర్‌

నిర్మల్‌చైన్‌గేట్‌: ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తుల పరిశీలన త్వరగా పూర్తి చేయాలని పురపాలక పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ ప్రధాన కార్యదర్శి దాన కిషోర్‌ అధికారులను ఆదేశించారు. గురువారం హైదరాబాద్‌ నుంచి జిల్లాల స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లు, మున్సిపల్‌ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. మహిళా శక్తి క్యాంటీన్ల గ్రౌండింగ్‌కు సంబంధించిన వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తుల ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించేలా సరిపడా సిబ్బందిని సమకూర్చుకోవాలన్నారు. సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ ఫైజాన్‌ అహ్మద్‌, మెప్మా పీడీ సుభాష్‌, నిర్మల్‌, ఖానాపూర్‌, భైంసా మున్సిపల్‌ కమిషనర్లు రాజు, మనోహర్‌, రాజేశ్‌కుమార్‌, ఇతర అధికారులు పాల్గొన్నారు.

పీఏసీఎస్‌ గోదాం ప్రారంభం

ఖానాపూర్‌: మండలంలోని మస్కాపూర్‌ పంచాయతీ పరిధిలోని గంగాయిపేట గ్రామానికి వెళ్లే మార్గంలో ఏర్పాటు చేసిన పీఏసీఎస్‌ గోదాంను గురువారం అడిషనల్‌ కలెక్టర్‌ ఫైజాన్‌ అహ్మద్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా పీఏసీఎస్‌ చైర్మన్‌ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ గోదాంను రూ.48 లక్షల నిధులతో నిర్మించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్‌ అడ్డి భోజారెడ్డి, వైస్‌చైర్మన్‌ రఘునందన్‌, సీఈవో శ్రీధర్‌రెడ్డి, మున్సిపల్‌ చైర్మన్‌ చిన్నం సత్యం, వైస్‌చైర్మన్‌ కరిపె శ్రీనివాస్‌, కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు దయానంద్‌, సత్తన్‌పల్లి పీఏసీఎస్‌ చైర్మన్‌ అమంద శ్రీనివాస్‌, నాయకులు కామోజీ శ్రీనివాస్‌, గాజుల గంగన్న, చిన్న రాజన్న, సూదుల శంకర్‌, విలాస్‌, భీమన్న, గణేశ్‌, సీఈవో ఆశన్న, తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement